త‌ల్లీబిడ్డల ఆరోగ్యానికి పెద్దపీట వేయాలి - గ‌ర్భంలో ఉండ‌గానే శిశువుల‌నూ ప‌రీక్షించాలి

On
త‌ల్లీబిడ్డల ఆరోగ్యానికి పెద్దపీట వేయాలి  - గ‌ర్భంలో ఉండ‌గానే శిశువుల‌నూ ప‌రీక్షించాలి

 ఇద్దరిలో ఏ ఒక్కరికి స‌మ‌స్య ఉన్నా ప‌రిష్కరించాలి
* ఇందుకు అన్ని విభాగాల వైద్యుల సేవ‌లు అవ‌స‌రం
* గైన‌కాల‌జిస్టు- ఇత‌రుల స‌మ‌న్వయంతోనే స‌త్ఫలితాలు
* కిమ్స్ క‌డ‌ల్స్ లో నిర్వహించిన హోప్ స‌ద‌స్సులో వైద్యులు

సికింద్రాబాద్, సెప్టెంబర్ 21 (ప్రజామంటలు):

 గ‌ర్భవ‌తులు ప‌రీక్షల కోసం వ‌చ్చిన‌ప్పుడు త‌ల్లీబిడ్డలు ఇద్దరి ఆరోగ్య ప‌రిస్థితిని స‌మ‌గ్రంగా అంచ‌నా వేయాల‌ని, ఇద్దరిలో ఏ ఒక్కరికి ఎలాంటి స‌మ‌స్య ఉన్నా.. ఇత‌ర విభాగాల వైద్యుల‌తో స‌మ‌న్వయం చేసుకుని ముందుగానే త‌గిన చికిత్సలు అందించ‌డం ద్వారా వారి ఆరోగ్యాన్ని కాపాడాల‌ని సీనియ‌ర్ వైద్యులు సూచించారు. సికింద్రాబాద్‌లోని కిమ్స్ క‌డ‌ల్స్ ఆస్పత్రిలో ఆదివారం నిర్వహించిన హైరిస్క్ ఆబ్స్టెట్రిక్స్ అండ్ పెరినాటాల‌జీ - హోప్ అనే స‌ద‌స్సులో ఈ విష‌యాలు వివ‌రించారు.

తెలంగాణ‌, ఆంధ్రప్రదేశ్‌, క‌ర్ణాట‌క‌, మ‌హారాష్ట్ర త‌దిత‌ర ప్రాంతాల నుంచి 250 మందికి పైగా వైద్యులు, ప్రధానంగా గైన‌కాల‌జిస్టులు, పిల్లల వైద్యనిపుణులు దీనికి హాజ‌ర‌య్యారు. దేశం న‌లుమూల‌ల నుంచి కార్డియాల‌జిస్టులు, న్యూరోస‌ర్జన్లు, గ్యాస్ట్రో ఎంట‌రాల‌జిస్టులు, నెఫ్రాల‌జీ-యూరాల‌జీ విభాగాల నిపుణులు.. ఇలా ప‌లు విభాగాల‌కు చెందిన 60 మంది అత్యంత సీనియ‌ర్ వైద్యులు వ‌చ్చి త‌మ త‌మ విభాగాల‌లో త‌ల్లీబిడ్డల‌కు ఎలాంటి స‌మ‌స్యలు ఉండే అవ‌కాశాలుంటాయో, వాటిని ఎలా గుర్తించి చికిత్సలు అందించాలో వైద్యుల‌కు వివ‌రించారు. కిమ్స్ క‌డ‌ల్స్ క్లినిక‌ల్ డైరెక్టర్ డాక్టర్ బాబు ఎస్ మ‌దార్కర్, గైన‌కాల‌జీ విభాగాధిప‌తి డాక్టర్ త్రిపుర‌సుంద‌రి, సీనియ‌ర్ క‌న్సల్టెంట్ డాక్టర్ వేమ ప‌ద్మావ‌తి, నేతృత్వంలో ఈ స‌ద‌స్సు జ‌రిగింది. దీనికి శాస్త్రీయ క‌మిటీ స‌భ్యులుగా డాక్టర్ చీపురుప‌ల్లి వ‌సుంధ‌ర‌, డాక్టర్ జి.ఉమాదేవి, డాక్టర్ ఎం. మాధ‌వి, డాక్టర్ శ‌శిక‌ళా జైన్, డాక్టర్ ఎన్. బిందుప్రియ‌, డాక్టర్ సింధూర వ‌డ్డమాని వ్యవ‌హ‌రించారు.

స‌ద‌స్సులో కిమ్స్ క‌డ‌ల్స్ క్లినిక‌ల్ డైరెక్టర్ డాక్టర్ బాబు ఎస్ మ‌దార్కర్ మాట్లాడుతూ, “గ‌ర్భిణులు ఆస్పత్రికి వ‌చ్చిన‌ప్పుడు ప‌రీక్షలు చేస్తే ఆమెకు, లోప‌లి శిశువుకు ర‌క‌ర‌కాల స‌మ‌స్యలు ఉండొచ్చు. వాట‌న్నింటినీ న‌యం చేయ‌డానికి అన్ని విభాగాల వైద్యులు ఒకేచోట ఉండ‌డం చాలా ముఖ్యం. ఉదాహ‌ర‌ణ‌కు త‌ల్లికి గానీ, శిశువుకు గానీ గుండె స‌మ‌స్య ఉంటే కార్డియాల‌జిస్టు అవ‌స‌రం ఉంటుంది. వాళ్లకు, గైన‌కాల‌జిస్టుకు మ‌ధ్య స‌రైన స‌మ‌న్వయం ఉండాలి. అప్పుడే త‌ల్లీబిడ్డల‌ను స‌రిగా కాపాడ‌గ‌లం. అలాగే శ‌రీరంలో వివిధ‌భాగాల్లో స‌మ‌స్యలుండొచ్చు. రోగ‌నిరోధ‌క శ‌క్తి అస‌లు లేక‌పోవ‌డం, బాగా ఎక్కువ ఉండ‌డం, మెద‌డులో స‌మ‌స్యలు, ఉద‌రం, లివ‌ర్, కిడ్నీల్లో స‌మ‌స్యలు, ర‌క్తసంబంధిత స‌మ‌స్యలు, గ‌ర్భిణికి క్యాన్సర్ ఉండొచ్చు.. ఇలాంటి ఏ స‌మ‌స్య ఉన్నా కూడా అత్యాధునిక ప‌రిశోధ‌న‌ల ఆధారంగా చికిత్సలు ఎలా చేయాల‌న్న విష‌య‌మై ఇక్కడ చ‌ర్చించిన విష‌యాలు అంద‌రికీ ఎంతో ఉప‌యుక్తంగా ఉన్నాయి.  ఇది రోగుల ఆరోగ్యంపై మంచిప్రభావం చూపించింది. త‌ల్లీబిడ్డల ఇద్దరి ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఇలాంటి స‌ద‌స్సులు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయి అని తెలిపారు.
కిమ్స్ క‌డ‌ల్స్ లో గైన‌కాల‌జీ విభాగాధిప‌తి డాక్టర్ త్రిపుర‌సుంద‌రి మాట్లాడుతూ, “గ‌ర్భవ‌తులు ఎప్పటిక‌ప్పుడు త‌గిన వైద్య ప‌రీక్షలు చేయించుకుంటూ ఉండాలి. దానివ‌ల్ల వాళ్ల ఆరోగ్యంతో పాటు, గ‌ర్భస్థ శిశువు ఆరోగ్యం ఎలా ఉంద‌న్నది కూడా ఇప్పుడు వ‌స్తున్న అత్యాధునిక ప‌రీక్షల ద్వారా తెలుస్తుంది. ముందుగానే తెలుసుకుంటే చాలా స‌మ‌స్యల‌కు మంచి చికిత్సలు ఉంటాయి. వీటి గురించి గ‌ర్భవ‌తుల‌కు అవ‌గాహ‌న క‌ల్పించాల్సిన బాధ్యత ప్రధానంగా గైన‌కాల‌జిస్టుల మీదే ఉంటుంది. స్కానింగ్ అంటే కొంత‌మందిలో అపోహ‌లు ఉంటాయి. అలాంటివాటిని దూరం చేసి, స‌మ‌గ్ర వైద్య ప‌రీక్షల ఆవ‌శ్యక‌త‌ను వారికి వివ‌రించాలి. త‌ద్వారా త‌ల్లీ బిడ్డల ఆరోగ్యాన్ని కాపాడాలి అని సూచించారు.

Tags
Join WhatsApp

More News...

Spiritual   State News 

వేద పరిరక్షణలో ప్రభుత్వ సహకారం ఉంటుంది – మంత్రి శ్రీధర్ బాబు

వేద పరిరక్షణలో ప్రభుత్వ సహకారం ఉంటుంది – మంత్రి శ్రీధర్ బాబు జనార్ధన సరస్వతి సంస్మృతి ట్రస్ట్ ఆధ్వర్యంలో వేద విద్వన్ మహాసభలు సికింద్రాబాద్,అక్టోబర్ 11 (ప్రజామంటలు): శ్రీ జనార్ధన సరస్వతి సంస్మృతి ట్రస్ట్ ఆధ్వర్యంలో జరుగుతున్న తెలంగాణ వేద విద్వన్ మహాసభలు నాలుగవ రోజు విజయవంతంగా పూర్తయ్యాయి. ఉదయం విద్యార్థులకు వేద పరీక్షలు నిర్వహించగా, సాయంత్రం సభలో పలువురు పండితులు, విశిష్టులు పాల్గొన్నారు. చీఫ్ గెస్ట్ గా...
Read More...
National  International  

అమెరికాలోని హిందూ అమెరికన్ ఫౌండేషన్ (HAF) వివాదం — పాలక మండలి, ప్రభుత్వ అనుబంధాలపై ప్రశ్నలు

అమెరికాలోని హిందూ అమెరికన్ ఫౌండేషన్ (HAF) వివాదం — పాలక మండలి, ప్రభుత్వ అనుబంధాలపై ప్రశ్నలు శశి థరూర్ వ్యాసం - సుహాగ్ శుక్ల ట్వీట్ రేపిన కలకలం విశ్వహిందూ పరిషత్ - మనువాద ఆలోచనల వేదికగా ఆరోపణ  వాషింగ్టన్ డీసీ, అక్టోబర్ 11:అమెరికాలో ఉన్న హిందూ వర్గాల హక్కులను కాపాడేందుకు స్థాపించబడిన హిందూ అమెరికన్ ఫౌండేషన్ (HAF) ఇటీవల అమెరికా న్యాయశాఖ (DOJ) దృష్టికి వచ్చింది. ఈ సంస్థ కార్యకలాపాలు...
Read More...
State News 

ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల నియామకం కోసం రాష్ట్ర ప్రభుత్వమే కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి - జి. చిన్నారెడ్డి

ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల నియామకం కోసం రాష్ట్ర ప్రభుత్వమే కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి - జి. చిన్నారెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాసిన రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జీ. చిన్నారెడ్డి  హైదరాబాద్ అక్టోబర్ 11 (ప్రజా మంటలు): ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల నియామకం కోసం ప్రభుత్వమే ప్రత్యేకంగా కార్పొరేషన్ ను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జీ. చిన్నారెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి...
Read More...
Local News  Spiritual   State News 

ధర్మపురి సార్థక నామం_ ధర్మము తెలియడం కాదు ఆచరించడమే ధర్మము ప్రవచనకారుడు చాగంటి

ధర్మపురి సార్థక నామం_ ధర్మము తెలియడం కాదు ఆచరించడమే ధర్మము ప్రవచనకారుడు చాగంటి ధర్మపురి అక్టోబర్ 11(ప్రజా మంటలు): ధర్మము అంటే తెలియడం కాదు మనము ఆచారించాల్సింది ఆచరించడమే ధర్మము అని ప్రవచన చక్రవర్తి చాగంటి కోటేశ్వరరావు అన్నారు . ధర్మపురి  శ్రీ శ్రీ సచ్చిదానంద సరస్వతి మహా స్వామి శ్రీ మఠం వారి స్థలం బ్రాహ్మణ సంఘం ప్రక్కన  రెండు రోజుల పాటు ఆధ్యాత్మిక ప్రవచనం శనివారం తొలి...
Read More...
State News 

టీ-స్క్వేర్ నగరంలోనే ఒక ఐకానిక్ భవనం- సీఎం రేవంత్ రెడ్డి లా ఉండాలని

టీ-స్క్వేర్ నగరంలోనే ఒక ఐకానిక్ భవనం- సీఎం రేవంత్ రెడ్డి లా ఉండాలని AI (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటుపై చర్చలో మంత్రి శ్రీధర్ బాబు  హైదరాబాద్ అక్టోబర్ 11 (ప్రజా మంటలు): హైదరాబాద్ నగరంలో ఐటీ కంపెనీలకు కేంద్రమైన రాయదుర్గం ప్రాంతంలో అత్యంత ఆకర్షణీయంగా టీ-స్క్వేర్ నిర్మాణం జరగాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆధునిక సాంకేతికతకు అనుగుణంగా ఒక ఆకర్షణీయమైన కేంద్రంగా ఉండాలని,...
Read More...
Local News 

వృద్దుల్లో మనోనిబ్బరం నింపేందుకు అవగాహన సదస్సు  

వృద్దుల్లో మనోనిబ్బరం నింపేందుకు అవగాహన సదస్సు   జగిత్యాల అక్టోబర్ 11 (ప్రజా మంటలు): వృద్ధుల్లో మనో నిబ్బరం నింపేందుకు ప్రత్యేక  అవగాహన సదస్సులు  నిర్వహిస్తున్నట్లు  తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజెన్స్ అసో సియేషన్ రాష్ట్ర కార్యదర్శి హరి అశోక్ కుమార్  అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలో సీనియర్ సిటిజెన్స్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో  వృద్ధుల్లో ఆత్మహత్య ల నివారణ-పిల్లల  భాద్యత అనే అంశం...
Read More...
Local News 

బన్సీలాల్‌పేట కురుమ స్మశాన వాటిక పరిరక్షణకు లీగల్ గా పోరాటం 

బన్సీలాల్‌పేట కురుమ స్మశాన వాటిక పరిరక్షణకు లీగల్ గా పోరాటం  కురుమ స్మశాన వాటికను కాపాడుతాం   -రాష్ర్ట కురుమ సంఘ ప్రెసిడెంట్ యెగ్గె మల్లేశం సికింద్రాబాద్‌, అక్టోబర్‌ 11(ప్రజామంటలు): బన్సీలాల్‌పేటలోని 1965 గజాల విస్తీర్ణంలో ఉన్న కురుమల స్మశానం వాటిక స్థలాన్ని భూబకాసులు కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారని స్థానిక కురుమ సంఘం నాయకులు ఆరోపించారు. కోట్ల రూపాయల విలువైన ఈ స్థలం కురుమల హక్కుగా పూర్వం నుండి...
Read More...
Local News 

సిఎం సహాయ నిధి నిరుపేదల పాలిట వరం... బీద మధ్యతరగతి ప్రజలకు ఆర్థిక భరోసా సీఎం సహాయ నిధి....ఎమ్మేల్యే డా సంజయ్ కుమార్

సిఎం సహాయ నిధి నిరుపేదల పాలిట వరం... బీద మధ్యతరగతి ప్రజలకు ఆర్థిక భరోసా సీఎం సహాయ నిధి....ఎమ్మేల్యే డా సంజయ్ కుమార్    జగిత్యాల అక్టోబర్ 11( ప్రజా మంటలు)  పట్టణములోని మోతే రోడ్డు పార్టీ కార్యాలయం లో  పట్టణానికి చెందిన 55 మంది లబ్ధిదారులకు సిఎం సహాయ నిధి ద్వారా మంజూరైన 15 లక్షల రూపాయల విలువగల చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేసిన జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్  ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో విద్య వైద్యనికి అధిక...
Read More...
Local News 

ఉమ్మడి జిల్లా వాలీబాల్ పోటీల జట్టుకు ఎంపికైన చలిగల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన  విద్యార్థి గమ్య

ఉమ్మడి జిల్లా వాలీబాల్ పోటీల జట్టుకు ఎంపికైన చలిగల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన  విద్యార్థి గమ్య    జగిత్యాల అక్టోబర్ 11 (ప్రజా మంటలు) రూరల్ మండలం చలిగల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థి గమ్య అండర్ 17 బాలికల జగిత్యాల జిల్లా వాలీబాల్ జట్టుకు ఎంపికైనది మరియు గౌతమ్ బాలుర వాలీబాల్ జట్టుకు స్టాండ్ బై గా ఎంపికైనాడని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు లతా దేవి శనివారం తెలిపారు. ఎంపికైన క్రీడాకారులు...
Read More...
National 

డిజిటల్ యుగంలో బాలికలపై శోషణ పెరిగింది - సీజేఐ బి ఆర్ గవాయి

డిజిటల్ యుగంలో బాలికలపై శోషణ పెరిగింది - సీజేఐ బి ఆర్ గవాయి 👮‍♂️ పోలీసులకు ప్రత్యేక శిక్షణ అవసరం న్యూ ఢిల్లీ అక్టోబర్ 11: భారతదేశం ప్రధాన న్యాయమూర్తి (CJI) భూషణ్ రామకృష్ణ గవాయి గారు, డిజిటల్ యుగంలో బాలికల భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన ప్రకారం, టెక్నాలజీ అనేక ప్రయోజనాలు కలిగించినప్పటికీ, బాలికలపై దాడులు, లైంగిక వేధింపులు, ఆన్‌లైన్ శోషణ వంటి అనేక ప్రమాదాలకు కారణమవుతోంది....
Read More...
Local News 

సేంద్రీయ ఎరువులకు కూడా సబ్సిడీ ఇవ్వాలి - మాజీ మంత్రి జీవన్ రెడ్డి

సేంద్రీయ ఎరువులకు కూడా సబ్సిడీ ఇవ్వాలి - మాజీ మంత్రి జీవన్ రెడ్డి కోతుల బెడద నివారణ పై దృష్టి కేంద్రీకరించాలి..
Read More...
National  International  

ఆఫ్ఘన్ మంత్రి పాత్రికేయుల సమావేశంతో మాకు సంబంధంలేదు - భారత విదేశాంగ శాఖ

ఆఫ్ఘన్ మంత్రి పాత్రికేయుల సమావేశంతో మాకు సంబంధంలేదు - భారత విదేశాంగ శాఖ న్యూ ఢిల్లీ అక్టోబర్ 11: మహిళా జర్నలిస్టులను మినహాయించిన ఆఫ్ఘన్ విదేశాంగ మంత్రి ముత్తాకి పత్రికాసమవేశంలో ప్రమేయం లేదని MEA ఖండించింది ఈ సంఘటనను "భారతదేశంలోని అత్యంత సమర్థులైన కొంతమంది మహిళలకు అవమానం"గా కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా అభివర్ణించారు భారత్ ను సందర్శిస్తున్న ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకి శుక్రవారం...
Read More...