గణేశ్ నిమజ్జనోత్సవానికి ఏర్పాట్లు పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్  గణేష్ నిమజ్జనోత్సవానికి పటిష్ట బందోబస్తు: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ 

On
గణేశ్ నిమజ్జనోత్సవానికి ఏర్పాట్లు పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్  గణేష్ నిమజ్జనోత్సవానికి పటిష్ట బందోబస్తు: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ 

గణేశ్ నిమజ్జన ప్రాంతాలను ప్రత్యక్షంగా పరిశీలించిన జిల్లా కలెక్టర్,ఎస్పీ

జగిత్యాల /మెట్పల్లి సెప్టెంబర్ 2 (ప్రజా మంటలు)
 

గణేశ్ నిమజ్జనO శాంతియుతంగా, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా సజావుగా జరిగేలా అన్ని విభాగాలు సమన్వయంతో కట్టుదిట్టమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్  సత్య ప్రసాద్  అన్నారు.  జిల్లా ఎస్పి  అశోక్ కుమార్  తో కలిసి గణేష్ నిమజ్జన ప్రాంతాలైన జగిత్యాలలో చింతకుంట చెరువు, కోరుట్లలో  పెద్దవాగు, మెట్పల్లిలోని వట్టి వాగు, రాయపట్నం బ్రిడ్జి  ప్రాంతాలను ప్రత్యక్షంగా పరిశీలించారు.  

ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్  మాట్లాడుతూ.... నిమజ్జన ఘాట్‌ల వద్ద ప్రజలకు తాగునీరు, లైటింగ్, శానిటేషన్ వంటి సౌకర్యాలు కల్పించాలని అన్నారు.  నిమజ్జనo కు  పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చే అవకాశం ఉన్నందున   ప్రమాదాలు జరగకుండా ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేయాలని అదికారులను  ఆదేశించారు. విగ్రహాల తరలింపు సమయంలో ఎక్కడ విద్యుత్ షాక్ గురికాకుండా  తగిన చర్యలు తీసుకోవాలని విద్యుత్ శాఖ వారికి సూచించారు.
మున్సిపల్,విద్యుత్, రెవెన్యూ అధికారులు, పోలీస్ శాఖ సమన్వయంతో నిమజ్జన కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేయాలని సూచించారు. 

ఈ సందర్బంగా జిల్లా ఎస్పి మాట్లాడుతూ.... వినాయక నిమజ్జన కార్యక్రమాలు శాంతియుతంగా, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సజావుగా పూర్తి కావడానికి పోలీస్ శాఖ తరఫున అన్ని రకాల భద్రతా చర్యలు చేపట్టడం జరుగుతుందని అన్నారు.

నిమజ్జనం అంతయు ప్రశాంత వాతావరణం లో పూర్తి అయ్యేలా అవసరమైన ప్రాంతాలలో సిసి కెమెరాలను, వీడియోగ్రఫీ ఏర్పాటు చేశామని, స్థానిక గజ ఈతగాళ్లు ను నిమర్జన ప్రాంతములో అందుబాటులో ఉంచమని, శోభాయాత్ర వెళ్ళేమార్గం లో  ఇతర శాఖ ల యొక్క సమన్వయము తో ఎటువంటి అవాంతరములు తలెత్తకుండా పటిష్టమైన  చర్యలను తీసుకుంటున్నామని తెలిపారు.

నిమజ్జనం సందర్భంగా డీజే లు, సౌండ్ సిస్టంలు,బాణాసంచా కాల్చడం వంటివి చేయరాదని తెలిపారు. చట్టాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించాలని, చట్టానికి లోబడి నడుచుకోవాలని తెలిపారు.  చట్టానికి విరుద్ధంగా ఎవరైనా ప్రవర్తించిన వారి పై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వినాయక నిమజ్జను శాంతియుతంగా, సామరస్యంగా జరుపుకోవాలని అందుకు ప్రజలు పూర్తిగా పోలీసు వారికి సహకారం అందించాలని కోరారు.

ఈ యొక్క కార్యక్రమమం లో ఆర్డీవోలు మధుసూదన్, శ్రీనివాస్, జీవాకర్ రెడ్డి, డీఎస్పీలు రఘు చందర్, రాములు, పోలీస్, రెవిన్యూ ,మున్సిపల్, విద్యుత్ శాఖ అధికారులు పాల్గొన్నారు.

Tags

More News...

National  State News 

అమిత్ షా హైదరాబాద్ పర్యటన రద్దు

అమిత్ షా హైదరాబాద్ పర్యటన రద్దు హైదరాబాద్ సెప్టెంబర్ 04 (ప్రజా మంటలు): గణేష్ నిమజ్జనలో పాల్గొనడానికి వస్తారనుకొన్న, అమిత్ షా హైదరాబాద్ పర్యటన రద్దయినట్లు తెలుస్తుంది. ఈనెల 9వ తేదీన జరుగనున్న ఉప రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో, అమిత్ షా బిజీగా ఉండడం వల్ల, పోటీలో ఉన్న ప్రతిపక్షాల అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి NDA మద్దతుదారుల ఓట్లకు గండి కొడతామోనని...
Read More...
National  International   Current Affairs  

2026 కల్లా 1.50. లక్షలకు చేరువగా 10 గ్రామ్ ల బంగారం ధర

2026 కల్లా 1.50. లక్షలకు చేరువగా 10 గ్రామ్ ల బంగారం ధర మెరుపువేగంతో బంగారం ధరలు పెరగవచ్చు?అమెరికా ఫెడరల్ బ్యాంక్ గందరగోళం, టారిఫ్ గడవలే కారణమా,? న్యూ ఢిల్లీ సెప్టెంబర్ 04: బంగారం నిప్పులు చెరుగుతోంది: $5,000 ధర కూడా ఇప్పుడు అందుబాటులోనే ఉందని నిపుణులు ఎందుకు అంటున్నారు. రికార్డు గరిష్టాలు, US ఫెడ్ గందరగోళం, సెంట్రల్ బ్యాంక్ నిల్వలు  బంగారం ధరలు కొనుగోలుదారులను వణికిస్తున్నాయి. అమెరికా...
Read More...
Local News 

విద్యుత్ గణేష మంటపం వద్ద అన్న ప్రసాద వితరణ

విద్యుత్ గణేష మంటపం వద్ద అన్న ప్రసాద వితరణ జగిత్యాల సెప్టెంబర్ 4 ( ప్రజా మంటలు) జిల్లా కేంద్రంలోని విద్యుత్ గణేష్ మండపం వద్ద గత తొమ్మిది రోజులుగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఒక్కో రోజు వివిధ రకాల నివేదనాలను గణేశునికి నివేదిస్తున్నారు .విద్యుత్ అధికారులు, సిబ్బంది తమ కుటుంబాలతో మంటపం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.   గురువారం గణేష్...
Read More...
Local News 

గీత భవన్ లో కొనసాగుతున్న అష్టాదశ పురాణ ప్రవచనం

గీత భవన్ లో కొనసాగుతున్న అష్టాదశ పురాణ ప్రవచనం   జగిత్యాల సెప్టెంబర్ 4 ( ప్రజా మంటలు) జిల్లా కేంద్రంలోని గీత భవన్ లో ఆగస్టు 30వ తేదీ నుండి ప్రారంభమైన అష్టాదశ పురాణ ప్రవచనం సెప్టెంబర్ 16 వరకు కొనసాగనుంది. ప్రతిరోజు ఒక పురాణంపై ప్రవచనాన్ని బుర్ర భాస్కర్ శర్మ కొనసాగిస్తున్నారు. ఆధ్యంతం ఎన్నో ఉపమానాలతో పురాణ ప్రవచనము కొనసాగుతుంది. పురాణ ప్రవచనాన్ని వినడానికి...
Read More...
Local News 

కొడిమ్యాల పోలీసుల ఆధ్వర్యంలో గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు

కొడిమ్యాల పోలీసుల ఆధ్వర్యంలో గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు కొడిమెల సెప్టెంబర్ 4 (ప్రజా మంటలు) కమ్యూనిటీ పోలీసింగ్ లో భాగంగా కొడిమ్యాల పోలీస్ స్టేషన్ పరిధిలోని కొడిమ్యాల, నాచుపల్లి, పూడూర్, చెప్యాల్, రామకిష్టాపూర్ గ్రామాలలో  ఏర్పాటుచేసిన గణేష్ మండపాల నిర్వాహకుల సహకారంతో  25 సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం జరిగింది.  ఈ సందర్భంగా మల్యాల సీ.ఐ రవి మాట్లాడుతూ...గ్రామాల్లో ప్రజల భద్రత కోసం ఈ...
Read More...
National  Current Affairs   State News 

బీహార్ లో తేజస్విని సీఎం చేయడంపై కాంగ్రెస్ సందేహాలు?

బీహార్ లో తేజస్విని సీఎం చేయడంపై కాంగ్రెస్ సందేహాలు? కాంగ్రెస్ అగ్రకులాల,ఎస్సీల ఓట్ల లెక్కలలో చిక్కుకుంది సీట్ల పంపకం గురించి ఆర్జేడీ ఆందోళనలు పాట్నా సెప్టెంబర్ 04: మహాకూటమిలో ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్‌ను ముఖ్యమంత్రి ముఖంగా చూపించడంలో కాంగ్రెస్ విముఖత చూపడానికి కారణం ఓటు లెక్కలు. కాంగ్రెస్ అగ్ర కులాలు, షెడ్యూల్డ్ కులాలను ఆకర్షించాలని చూస్తోంది. తేజస్వి పేరును ప్రకటించడం ద్వారా అగ్ర కులాలు,...
Read More...
National  International  

సోషల్ మీడియా అప్ లను నిషేధించిన నేపాల్ ప్రభుత్వం

సోషల్ మీడియా అప్ లను నిషేధించిన నేపాల్ ప్రభుత్వం ప్రభుత్వ వ్యతిరేకతను నియంత్రించే దిశలో నేపాల్ ప్రభుత్వం  న్యూ ఢిల్లీ సెప్టెంబర్ 04: నేపాల్‌లో ఫేస్‌బుక్, ఎక్స్, యూట్యూబ్, మరో 23 సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లను నిషేధించింది ప్రభుత్వం రిజిస్ట్రేషన్ నియమాలను పాటించలేదని పేర్కొంది; అసమ్మతిని నిశ్శబ్దం చేయడం మరియు ఆన్‌లైన్ ప్రసంగంపై నియంత్రణను కఠినతరం చేయడం ఈ చర్య యొక్క లక్ష్యం అని విమర్శకులు...
Read More...
Local News 

కిడ్నీ వ్యాధుల పట్ల అవగాహన పై గాంధీలో ర్యాలీ

కిడ్నీ వ్యాధుల పట్ల అవగాహన పై గాంధీలో ర్యాలీ సికింద్రాబాద్, సెప్టెంబర్ 04 (ప్రజామంటలు) :   కిడ్నీ వ్యాధుల వల్ల కలిగే అనర్ధాలపై గాంధీ మెడికల్ కళాశాలలో నెఫ్రాలజీ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో గురువారం ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని గాంధీ వైద్య  కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఇందిర జండా ఊపి ర్యాలీ ని  ప్రారంభించిన అనంతరం ఆమె మాట్లాడుతూ... పాలిసిస్టిక్ కిడ్నీ వ్యాధుల పట్ల
Read More...
Local News 

నల్లగుట్ట స్కూల్ లో ఘనంగా టీచర్స్ డే సెలబ్రేషన్స్...

నల్లగుట్ట స్కూల్ లో ఘనంగా టీచర్స్ డే సెలబ్రేషన్స్... సికింద్రాబాద్, సెప్టెంబర్ 04 (ప్రజామంటలు): ఉపాధ్యాయ దినోత్సవాన్ని ముందస్తుగా నల్లగుట్ట ఓల్డ్ ప్రభుత్వ ప్రైమరీ స్కూల్ లో గురువారం ఘనంగా  నిర్వహించారు.డా.సర్వేపల్లి రాధాకృష్ణన్  జయంతి సందర్భంగా ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. హెడ్మాస్టర్చిన్నాబత్తిని శౌరి మాట్లాడుతూ..సర్వేపల్లి రాధాకృష్ణన్ జీవితం అందరికీ ఆదర్శమన్నారు. ఆయన ఆచరణ, ఆలోచనలు ఉపాధ్యాయ వృత్తికి మార్గదర్శకం అన్నారు. ఉపాద్యాయులు  జాకీరా సుల్తానా, శైలజ,...
Read More...
Local News 

గాంధీ ఆసుపత్రిలో పెయిన్ క్లినిక్ ప్రొసీజర్ రూమ్ ప్రారంభం

గాంధీ ఆసుపత్రిలో పెయిన్ క్లినిక్ ప్రొసీజర్ రూమ్ ప్రారంభం ₹20 లక్షల విలువైన పరికరాలు దానం చేసిన ప్రొఫెసర్ పద్మావతి రాఘువేంద్రరావు   సికింద్రాబాద్, సెప్టెంబర్ 04 ( ప్రజామంటలు) : గాంధీ ఆసుపత్రిలో పెయిన్ క్లినిక్ ప్రొసీజర్ రూమ్‌ను గురువారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో దాతగా ముందుకు వచ్చిన ప్రొఫెసర్ పద్మావతి రఘువేంద్రరావు  రూ.20 లక్షల విలువైన మెడికల్ ఎక్విప్ మెంట్ను అందించారు. వీటిలో  సీ–ఏఆర్ఎమ్,...
Read More...
Local News 

ఎల్‌ఐసి ఆఫ్‌ ఇండియా పోటీలలో విద్యార్థుల ప్రతిభ

ఎల్‌ఐసి ఆఫ్‌ ఇండియా పోటీలలో విద్యార్థుల ప్రతిభ సికింద్రాబాద్, సెప్టెంబర్ 04 (ప్రజామంటలు) :   ఎల్‌ఐసి ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో జరిగిన డ్రాయింగ్, వ్యాసరచనా రైటింగ్ పోటీలలో భోలక్ పూర్ కృష్ణవేణి టాలెంట్ స్కూల్ విద్యార్థులు తమ  ప్రతిభ కనబరిచారు. ఈ పోటీల్లో గాయత్రి డ్రాయింగ్‌లో మొదటి బహుమతి సాధించగా,శివం కన్సోలేషన్ బహుమతులు గెలుచుకున్నారు. మణితేజ్ గౌడ్ ఎస్సే రైటింగ్‌లో సెకండ్ ప్రైజ్
Read More...
Local News 

బైకుల దొంగ దంపతులను పట్టించిన సీసీ టీవీ ఫుటేజీ

బైకుల దొంగ దంపతులను పట్టించిన సీసీ టీవీ ఫుటేజీ మద్యం, సిగరేట్లకు అలవాటై...బైక్ దొంతనాలు..    రూ.5లక్షల విలువ చేసే ఆరు బైకుల స్వాధీనం సికింద్రాబాద్, సెప్టెంబర్ 04 (ప్రజామంటలు) : ప్రభుత్వ ఆసుపత్రులను టార్గెట్‌చేసుకుంటూ వరుసగా బైక్ దొంగతనాలు చేస్తున్న ఇద్దరు దొంగ దంపతులను చిలకలగూడ పోలీసులు పట్టుకున్నారు. వీరి వద్ద నుంచి రూ.ఐదు లక్షల విలువ చేసే ఆరు ద్వి చక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు....
Read More...