గాంధీ ఆసుపత్రిని 3 వేల పడకలకు అప్ గ్రేట్ చేయాలి
సమస్యలను తీర్చాలని ప్రభుత్వానికి వినతి
- గాంధీ ఆసుపత్రిలో పీవైఎల్ ప్రతినిధుల పర్యటన
సికింద్రాబాద్, సెప్టెంబర్ 01 (ప్రజామంటలు) :
రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆసుపత్రుల్లో ఒకటైన గాంధీ ఆసుపత్రి మూడు వేల పడకలతో, అన్ని సౌకర్యాలతో ఆప్ గ్రేట్ చేయాలని ప్రోగ్రెసివ్ యూత్ లీగ్ (పీ.వై.ఎల్) నాయకులు డిమాండ్ చేశారు. వేల పడకల పరిమితిని కలిగి ఉన్నా, రోజూ దాదాపు రెండున్నర వేల మంది రోగుల ఇన్ పేషెంట్లు రావడంతో ఆసుపత్రిలో అనేక సౌకర్యాలతో రోగులు అవస్థ పడుతున్నారన్నారు. పి.వై.ఎల్ గ్రేటర్ హైదరాబాద్ నగర కమిటీ ఆధ్వర్యంలో సోమవారం ఆసుపత్రిని సందర్శించారు. రోగులతో, వారి సహాయకులతో మాట్లాడారు ఎమర్జెన్సీ బ్లాక్ ఇతర ఓ.పి బ్లాకులను సందర్శించారు. వారి దృష్టికి వచ్చిన సమస్యలను ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. రాజకుమారి దృష్టికి తీసుకెళ్లారు. ఎమర్జెన్సీ వార్డులో నీళ్లు పై నుంచి లీకవుతున్నాయని, టాయిలెట్స్ వద్ద డబ్బులు వసూలు చేస్తున్నారని, స్కానింగ్ మెషిన్లు ఒకటే పని చేయడంతో పేషెంట్లు 10, 15 రోజులు డేట్లు ఇస్తున్నారని, ఓపికౌంటర్లు సరిపోక గంటల తరబడి వేచి ఉండాల్సిన అవసరం ఏర్పడిందని పేర్కొన్నారు. సమస్యలను పరిష్కరించి ఇబ్బందులు తొలగించాలని లేనియెడల ఆసుపత్రి ముందు ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు.పీ.వై.ఎల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం . రవికుమార్, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్ష కార్యదర్శులు బి.ఎస్. కృష్ణ కొల్లూరు భీమేష్, హైదరాబాద్ ఉపాధ్యక్షులు కుంబోజి కిరణ్, కే. మల్లేష్, సహాయ కార్యదర్శిలు బంగారు శ్రీనివాస్, బాలు, నగర కోశాధికారి ప్రకాష్, నగర నాయకులు రాజు, సాయి, అంజి, రాము, అశోక్,టీయూసీఐ నాయకులు తలారి వెంకటేష్ పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
బహుళ అంతస్తుల భవనాలు,ఇతర నిర్మాణాల అనుమతులలో జాప్యం కూడదు సి ఎం రేవంత్ రెడ్డి

ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్లో ప్రకంపనలు
-overlay.jpeg-overlay.png)
ప్రజావాణి అర్జీలను సత్వరమే పరిష్కరించాలి జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్

సంప్రదాయ రీతిలో భాగవత సప్తాహాలు ప్రారంభం

నిబద్ధత క్రమశిక్షణతో పనిచేస్తేనే ప్రజల్లో మంచి పేరు వస్తుంది.. డిఈ దురిశెట్టి మనోహర్ అంకితభావంతో పని చేశారు.. మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.. విద్యుత్ శాఖకే వన్నె తెచ్చారు.. జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్

ముత్తారం వినాయక మండపంలో ఘనంగా కుంకుమార్చనలు - ప్రత్యేక పూజలతో భక్తి పారవశ్యంలో భక్తులు

మా కామాఖ్య హాస్పిటల్ వారిచే ప్రెస్ క్లబ్ గణపతి వద్ద అన్నప్రసాద వితరణ

ముత్తారం వినాయక మండపంలో ఘనంగా కుంకుమార్చనలు - ప్రత్యేక పూజలతో

పాత పెన్షన్ స్కీం అమలు చేయాలి

గౌడ సంఘ ఆధ్వర్యంలో ఘనంగా వినాయక నిమజ్జనం

కాంగ్రెస్ ప్రభుత్వం అనుక్షణం కేసీఆర్ జపం చేస్తోంది - ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు

పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత -పర్యావరణ పరిరక్షణకై మక్తాల దంపతులు
