గాంధీ ఆసుపత్రి కి  స్పెషల్ ఆఫీసర్ ను నియమిస్తాం...వైద్య ఆరోగ్య శాఖ మంత్రి

On
గాంధీ ఆసుపత్రి కి  స్పెషల్ ఆఫీసర్ ను నియమిస్తాం...వైద్య ఆరోగ్య శాఖ మంత్రి

ఓపీ విభాగాల్లో పర్యటించిన మంత్రి
  వైద్యాధికారులతో కలసి రివ్యూ మీటింగ్

సికింద్రాబాద్, ఆగస్ట్ 19 (ప్రజామంటలు) :

రాష్ర్టంలోనే పెద్ద ఆసుపత్రిగా పేరుగాంచిన గాంధీ ఆసుపత్రిలో ఎప్పటి కప్పుడు సమస్యల పరిష్కారానికి, అడ్మినిస్ర్టేషన్ లో లోపాలు లేకుండా ఓ స్పెషల్ ఆఫీసర్ ను నియమించాలనే ఆలోచన ఉన్నట్లు రాష్ర్ట వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహా అన్నారు. మంగళవారం వైద్య శాఖ ఉన్నతాధికారులతో కలసి మంత్రి గాంధీ ఆసుపత్రిని సందర్శించారు. ఇటీవల పత్రికల్లో గాంధీ ఆసుపత్రి గురించి చాలా వార్తలు వస్తున్నాయని, అసలు గాంధీలో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ఈ రోజు గాంధీకి వచ్చినట్లు మంత్రి  అన్నారు.

ఈసందర్బంగా ఓపీ బ్లాక్ లోని పలు వైద్య విభాగాలను పరిశీలించారు. అక్కడ రోగులకు అందుతున్న వైద్యం గురించి, వైద్య పరికరాల పనితీరు గురించి వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఆయా వైద్య విభాగాల వద్ద ఉన్న ఔట్ పేషంట్లతో  వారి ఆరోగ్య పరిస్థితి, తదితర అంశాల గురించి మాట్లాడారు.  ఎంసీహెచ్ బిల్డింగ్ కు వెళ్ళి ఐవీఎఫ్ సెంటర్ సందర్శించి, కేసుల పురోగతి గురించి డాక్టర్లను అడిగారు. అనంతరం గాంధీ ఆసుపత్రి మెయిన్ బిల్డింగ్ లోని కాన్ఫరెన్స్ హాల్ లో డీఎంఈ డాక్టర్ నరేంద్రకుమార్, గాంధీ లోని వైద్య విభాగాల హెచ్ఓడీలతో కలసి సమావేశమై, రివ్యూ నిర్వహించారు. సమావేశంలో గాంధీలోని సమస్యలు, వైద్య పరికరాల కొరత, పేషంట్ల కు అందుతున్న వైద్యం,డ్రైనేజీ,తదితర అంశాలపై మంత్రి సుదీర్షంగా చర్చించారు.

అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. పేషంట్లకు ఎలాంటి ఇబ్బంది లేకుండా, సిబ్బంది సమస్యల పరిష్కారంపై అధికారులతో ఈ రోజు చర్చించినట్లు తెలిపారు. ఆసుపత్రిలోని డ్రైనేజీ వ్యవస్త ప్రక్షాళన, ఎలక్ర్టిసిటీ రిపేర్లు, ఫైర్ ఎక్విప్ మెంట్, ఎస్టీపీలు, నర్సింగ్ సిబ్బంది కొరత తీరుస్తామన్నారు. మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్స్ ఒకే ప్లోర్ లో ఉండాలనే ఆలోచన ఉందని, ఈమేరకు వీటిలోని సాధకబాధకాలు పరిశీలించడానికి ఒక కమిటీని ఏర్పాటుచేస్తామన్నారు. తెలంగాణ లో ఆసుపత్రులు, మెడికల్ కాలేజీల సంఖ్య పెరిగిందన్నారు. మానవ వనరులతో పాటు మెడికల్ ఎక్విప్ మెంట్ పై దృష్టి పెట్టాల్సి ఉందన్నారు.  12 మంది బయోమెడికల్ ఇంజనీర్ లు అవసరం ఉందని, ఈ పోస్టులను క్రియేట్ చేస్తామన్నారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్) కింద గాంధీలో వివిద పనులు చేయడానికి ఐసీఐసీఐ, పవర్ గ్రిడ్,ఎన్టీపీసీ సంస్థలు ముందుకు వచ్చాయన్నారు. పేషంట్ల అటెండర్ల కోసం పర్మినెంట్ స్ర్టక్చర్ ఏర్పాటు చెయ్యాలని, దీనిపై త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు. రూ.ఐదు కోట్లతో ఎస్టీపీ ప్లాంట్ లను ఏర్పాటు చేస్తామన్నారు. రాష్ర్టంలోనే మొదటి ప్రభుత్వ ఐవీఎఫ్ సెంటర్ గాంధీ ఎంసీహెచ్ లో చక్కగా పనిచేస్తుందని, ఇప్పటివరకు 23 కేసులను ఎంపిక చేశామని, ఇందులో రెండు పాజిటివ్ రిజల్ట్ వచ్చాయన్నారు. ఈ సంఖ్యను మరింత పెంచేందుకు కృషి చేస్తామన్నారు. ప్రైవేట్ ఐవీఎఫ్ సెంటర్లకు ధీటుగా ప్రభుత్వ ఐవీఎఫ్ సెంటర్ల సేవలను పెంచడానికి వైద్య సిబ్బంది కృషి చేయాలన్నారు. ఐయూఐ కింద ఆరు కేసులు పాజిటివ్ వచ్చాయన్నారు. గాంధీ మెడికల్ కాలేజీ మెడికల్ స్టూడెంట్స్ హాస్టల్ బిల్డింగ్ ల పనులు చురుగ్గా కొనసాగుతున్నాయన్నారు.

గాంధీ లో ప్రస్తుతం 2016 బెడ్లు ఉన్నాయని, ఈ సంఖ్యకు అనుగుణంగా వసతులు, సిబ్బంది ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. గాంధీలోనే కాకుండా ప్లేట్ల బురుజు లో కూడ ఐవీఎఫ్ సేవలు అందుబాటులో ఉన్నాయని, త్వరలో కొండాపూర్ లో ఏర్పాటు చేస్తామన్నారు. రాష్ర్టంలో మొత్తం 379 ఐవీఎఫ్ సెంటర్లు ఉంటే ఇందులో 150 కి పైగా ఒక్క హైదరాబాద్ లోనే ఉన్నాయని, ప్రభుత్వ నిబంధనాలకు విరుద్దంగా సెంటర్లు పనిచేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు.  గాంధీ లోని ఔట్ సోర్సింగ్ సిబ్బంది నాలుగు నెలల పెండింగ్ జీతాలను ఇస్తామన్నారు. డీఎంఈ డా.నరేంద్రకుమార్, రాష్ర్ట వైద్య, విధాన పరిషత్ కమిషనర్ డా.అజయ్ కుమార్, ఫ్యామిలీ ఆండ్ వెల్ఫేర్ డైరెక్టర్ ఎస్.సంగీతా, డీఎంహెచ్వో డా.వెంకటి, సూపరింటెండెంట్ డా.రాజకుమారి, డిప్యూటీ సూపరింటెండెంట్ డా.సునీల్ పాల్గొన్నారు.

Tags

More News...

Local News 

ఓట్ల కుంభకోణంపై SIT ద్వారా విచారణ చేపట్టాలని సుప్రీంకోర్టులో పిటిషన్

ఓట్ల కుంభకోణంపై SIT ద్వారా విచారణ చేపట్టాలని సుప్రీంకోర్టులో పిటిషన్ న్యూ డిల్లీ ఆగస్ట్ 20: బెంగళూరు సెంట్రల్ నియోజకవర్గంలో రాహుల్ గాంధీ ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగాయని చేసిన ఆరోపణలపై సిట్ విచారణ కోరుతూ సుప్రీంకోర్టులో పిఐఎల్ దాఖలైంది 2024 లోక్‌సభ ఎన్నికల సమయంలో బెంగళూరు సెంట్రల్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగాయని ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ లేవనెత్తిన ఆరోపణలపై...
Read More...
Local News 

ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తి చేయాలి - ఎంపీడీవో మహమ్మద్ సలీం

ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తి చేయాలి - ఎంపీడీవో మహమ్మద్ సలీం ఇబ్రహీంపట్నం ఆగస్టు 20 (ప్రజా మంటలు):   ఇబ్రహీంపట్నం మండలంలోని వేములకుర్తి గ్రామాన్ని ఎంపీడీఓ సలీం బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామంలోని ఇందిరమ్మ ఇళ్ళను పరిశీలించి, నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్ళు మంజూరైనవారు ఇప్పటికీ ఇంకా ఇళ్ళ నిర్మాణాలు ప్రారంభించని లబ్ధిదారులు వెంటనే ఇళ్ళ నిర్మాణాలు ప్రారంభించి, నిర్ణిత సమయంలో...
Read More...
Local News 

ఇబ్రహీంపట్నం తాసిల్దార్ కార్యాలయ తనిఖీ.

ఇబ్రహీంపట్నం తాసిల్దార్ కార్యాలయ తనిఖీ. ఇబ్రహీంపట్నం ఆగస్టు 20 (ప్రజా మంటలు దగ్గుల అశోక్): ఇబ్రహీంపట్నం మండల్ తాసిల్దార్ కార్యాలయంనుఅదనపు కలెక్టర్  మరియు ఆర్డీవో మెట్పల్లి  తనిఖీ చేశారు, భూ భారత్ కి సంబంధించిన ఫైల్ వెరిఫై చేసి, త్వరగా పూర్తి చేయుటకు ఆదేశాలు జారీ చేసిసారు. కార్యాలయ సిబ్బందికి తగు సూచనలు జారీ చేసి,  గోదుర్ గ్రామంలో గల రాజరాజేశ్వర...
Read More...
Local News  State News 

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి  వేడుకల్లో డాక్టర్ కోట నీలిమ

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి  వేడుకల్లో డాక్టర్ కోట నీలిమ సికింద్రాబాద్, ఆగస్ట్ 20 (ప్రజామంటలు) : ఆధునిక భారత రూపకర్త, ఐటీ విప్లవ పితామహుడు, మాజీ ప్రధానమంత్రి భారతరత్న ,దివంగత రాజీవ్ గాంధీ 81వ జయంతి వేడుకలను బన్సీలాల్ పేట్, బేగంపేట్, అమీర్ పేట్, సనత్ నగర్ డివిజన్లలో పీసీసీ వైస్ ప్రెసిడెంట్, సనత్ నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి డాక్టర్ కోట నీలిమ...
Read More...
Local News  Crime  State News 

ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో దంపతుల అదృశ్యం

ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో దంపతుల అదృశ్యం ఇబ్రహీంపట్నం ఆగస్టు 20( ప్రజా మంటలు దగ్గుల అశోక్): ఇబ్రహీంపట్నం గ్రామానికి చెందిన బోడ రవి - బోడ ప్రమీల దంపతులిద్దరూ శనివారం 16వ తేదీన ఇంట్లో నుండి వెళ్లి, ఇప్పటివరకు ఇంటికి తిరిగి రాలేదని పోలీసులకు కూతురు ఫిర్యాదు చేసింది. అదృశ్యం అయిన వారి కూతురు అంబటి మీనాక్షి, ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు...
Read More...
Local News 

ఘనంగా రాజీవ్ గాంధీ గారి జయంతి వేడుక

ఘనంగా రాజీవ్ గాంధీ గారి జయంతి వేడుక (అంకం భూమయ్య)  గొల్లపల్లి ఆగస్టు 20 (ప్రజా మంటలు):  గొల్లపెల్లి మండల కేంద్రంలో స్థానిక ఎంపిడిఓ కార్యాలయం వద్ద మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారతదేశ మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు జరుపుకొన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముస్కు...
Read More...
National  Opinion  State News 

130వ సవరణ రాజకీయ శుద్ధికా లేక రాజ్యాంగ మౌలికాంశాలనే మార్చడానికా? 

130వ సవరణ రాజకీయ శుద్ధికా లేక రాజ్యాంగ మౌలికాంశాలనే మార్చడానికా?  130వ రాజ్యాంగ సవరణ బిల్లు ప్రతిపక్షాల ప్రభుత్వాలను కూల్చడానికేనా?  రాష్ట్ర ప్రభుత్వాలు ఇక గవర్నర్ చేతిలో కీలుబొమ్మలేనా? న్యూ ఢిల్లీ ఆగస్ట్ 20:130వ సవరణ బిల్లు ఆర్టికల్ 75 (కేంద్ర మంత్రులకు సంబంధించిన నిబంధనలు), ఆర్టికల్ 164 (రాష్ట్ర మంత్రులకు సంబంధించిన నిబంధనలు), మరియు ఆర్టికల్ 239AA (దిల్లీ కేంద్రపాలిత ప్రాంతానికి సంబంధించిన నిబంధనలు)లలో...
Read More...
Local News 

ముల్కనూర్ నూతన ఎస్సైగా రాజు

ముల్కనూర్ నూతన ఎస్సైగా రాజు భీమదేవరపల్లి, ఆగస్టు 20 ప్రజామంటలు :  ముల్కనూర్ నూతన ఎస్సైగా గీసుకొండ పోలీస్ సషన్లో విధులు నిర్వర్తిస్తున్న ఎస్ఐ రాజు రానున్నారు.భీమదేవరపల్లి మండలంలో గత రెండున్నర సంవత్సరాలుగా సబ్‌ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న నండ్రు సాయిబాబును వర్ధన్నపేట పోలీస్ స్టేషన్ కు సాధారణ బదిలీలలో  భాగంగా బదిలీ అయ్యారు. బుధవారం వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని వివిధ...
Read More...
Local News 

వరల్డ్ మస్కిటో డే సందర్భంగా ర్యాలీ

వరల్డ్ మస్కిటో డే సందర్భంగా ర్యాలీ సికింద్రాబాద్, ఆగస్టు 20 (ప్రజామంటలు): ప్రపంచ దోమల దినోత్సవం సందర్భంగా జిహెచ్ఎంసి ఎంటమాలజీ సిబ్బంది బన్సీలాల్ పేట డివిజన్ బోయిగూడ ఐడిహెచ్ కాలనీ లో దోమల అవగాహన ర్యాలీ నిర్వహించారు.  దోమలతో కలుగు వ్యాధులు,  వాటి వ్యాప్తి, నివారణ పై స్థానికులకు అవగాహన కల్పించారు . ర్యాలీలో గాంధీ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్  డాక్టర్...
Read More...
National  Filmi News  State News 

సినిమాల్లో మహిళలకు సమానత్వం - పురుష-స్త్రీ బైనరీని దాటి వెళ్ళాలి, అంతర సంబంధితిత వాస్తవికతలను పరిష్కరించాలి: కేరళ హైకోర్టు

సినిమాల్లో మహిళలకు సమానత్వం - పురుష-స్త్రీ బైనరీని దాటి వెళ్ళాలి, అంతర సంబంధితిత  వాస్తవికతలను పరిష్కరించాలి: కేరళ హైకోర్టు పబ్లిక్ పాలసీ ముసాయిదాను సమర్పించండి - కోర్ట్ ఆదేశాలు  సినిమాల్లో మహిళలకు సమానత్వ చట్టం పురుష-స్త్రీ బైనరీని దాటి వెళ్ళాలి, అంతర సంబంధితిత (intersectional) వాస్తవికతలను పరిష్కరించాలి: కేరళ హైకోర్టు లో న్యాయమూర్తులు మౌఖిక సూచన చేశారు వినోద పరిశ్రమలో మహిళల రక్షణ కోసం సమానత్వ చట్టాన్ని రూపొందించేటప్పుడు సంబంధితిత" అంశాలను కూడా...
Read More...
Local News  State News 

దేశ యువతకు స్ఫూర్తి రాజీవ్ గాంధీ - సీఎం రేవంత్ రెడ్డి 

దేశ యువతకు స్ఫూర్తి రాజీవ్ గాంధీ - సీఎం రేవంత్ రెడ్డి  మాజీ ప్రధాని రాజీవ్ గాంధీకి ఘన నివాళులు  దేశ సమగ్రతను కాపాడేందుకు ఆయన ప్రాణాలర్పించారు - రేవంత్ రెడ్డి  హైదరాబాద్ ఆగస్ట్ 20 (ప్రజా మంటలు): పారదర్శక పరిపాలన అందించడానికి సాంకేతికతను జోడించాలని ఆనాడు రాజీవ్ గాంధీ ఆలోచన చేశారని,18 ఏండ్లు నిండిన వారికి ఓటు హక్కును కల్పించి దేశ భవిష్యత్ ను నిర్ణయించే అవకాశం...
Read More...
Local News 

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీకి మంత్రి అడ్లూరి లక్ష్మణ్,మాజీ మంత్రి జీవన్ రెడ్డి

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీకి మంత్రి అడ్లూరి లక్ష్మణ్,మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఇందిరా భవన్ లో ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి ఉత్సవాలు జగిత్యాల ఆగస్ట్ 20 ( ప్రజా మంటలు): జగిత్యాల జిల్లా కేంద్రంలో ఇందిరా భవన్ లో రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా రాజీవ్ గాంధీ చిత్రపటానికి, తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ మైనార్టీ వికలాంగుల శాఖ మంత్రి వర్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు...
Read More...