మంత్రి గా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం జగిత్యాలకు వచ్చిన అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు కాంగ్రెస్ శ్రేణులచే ఘన స్వాగతం

On
మంత్రి గా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం జగిత్యాలకు వచ్చిన అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు కాంగ్రెస్ శ్రేణులచే ఘన స్వాగతం


జగిత్యాల జూన్ 11 ( ప్రజా మంటలు)

తెలంగాణ రాష్ట్ర కేబినెట్ మంత్రివర్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం మొట్టమొదటిసారిగా జగిత్యాలకు వచ్చిన అడ్లూరీ లక్ష్మణ్ కుమార్ కి మాజీ మంత్రివర్యులు తాటిపర్తి జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు భారీగా ఘన స్వాగతం పలికాయి. 

 ఈ సందర్భంగా జిల్లాలోని నలుమూలల నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. 

జగిత్యాల పట్టణంలో కాంగ్రెస్ పార్టీ జెండాల ఏర్పాటు తో పండుగ వాతావరణం నెలకొంది.

బైక్ ర్యాలీ

స్థానిక ఇందిరా భవన్ నుండీ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు జెండాలు పట్టుకొని బైక్ ర్యాలీ నిర్వహిస్తూ రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద మంత్రివర్యులు లక్ష్మణ్ కుమార్ కు ఘన స్వాగతం పలికారు. బైక్ ర్యాలీతో పట్టణంలోని టౌన్ హాల్ వరకు ర్యాలీ నిర్వహించారు. 

కార్యకర్తలు టపాసులు  పేల్చి, సంబురాలు నిర్వహించారు.

డీజె పాటలు. కార్యకర్తల నినాదాలు. వందలాది బైక్ లతో భారీ ర్యాలీ నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి ఆడ్లూరీ లక్ష్మణ్ కుమార్ రాజీవ్ గాంధీ విగ్రహానికి, పాత బస్టాండ్ లోని ఇంద్రమ్మ విగ్రహానికి ,తహశీల్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. 

 ఓపెన్ టాప్ జీప్ లో జీవన్ రెడ్డి, జువ్వాడి నర్సింగ్ రావుపాటు కాంగ్రెస్ నాయకులతో కలిసి, ప్రజలకు అభివాదం చేస్తూ, ర్యాలీ లో పాల్గొన్నారు.

అనంతరం టౌన్ హాల్ లో మాజీ మంత్రి వర్యులు తాటిపర్తి జీవన్ రెడ్డి ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమానికి వందలాది మంది తరలివచ్చి, లక్ష్మణ కుమార్ ను శాలువాలతో సన్మానించారు.

మొదటి సరిగా జగిత్యాలకు వచ్చిన కేబినెట్ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను సన్మానించేందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పోటీ పడ్డారు.

పదేళ్ల నుండి పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికి గుర్తింపు ఇవ్వాలని నాయకులు కోరారు.

ఈ సందర్భంగా మాజీ మంత్రి  జీవన్ రెడ్డి మాట్లాడుతూ..

కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా లక్ష్మణ్ కుమార్ సమర్ధవంతముగా పని చేశారని, మంత్రిగా రాష్ట్ర ప్రజలకు మరిన్ని మెరుగైన సేవలు అందిస్తారని అన్నారు.

సామాజిక న్యాయం పాటించడంలో 
దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తోందన్నారు.

42 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం  తీర్మానం చేసిందని గుర్తు చేశారు.

రిజర్వేషన్ ఫలాలు అందరికీ అందించాలని అన్నారు.

ఏ రాజకీయ పార్టీ అయినా కార్యకర్తల మనోభావాలు గౌరవించాలని కోరారు.

కాంగ్రెస్ క్రమ శిక్షణ గల కార్యకర్తగా అంచెలంచెలుగా ఎదిగిన లక్ష్మణ్ కుమార్ కార్యకర్తలకు ఆదర్శం అన్నారు.

రాబోయే స్థానిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కృషి చేస్తామన్నారు.

రాష్ట్ర కేబినెట్ మంత్రి వర్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ..

అందరి కృషి ఆశీర్వాదం తో మంత్రి పదవి దక్కిందన్నారు.

పనిలో నిజాయితీ గా ఉండాలి..పార్టీ కోసం పనిచేయాలి.
రాహుల్ గాంధీ ఆలోచన విధానం తో  సీఎం రేవంత్ రెడ్డి బీసీ కులగణన  చేసి, 42 శాతం రిజర్వేషన్ కల్పనకు కృషి చేస్తున్నారు.

కష్టాల్లో తోడుగా నిలిచిన జీవన్ రెడ్డి సహకారం తో ముందుకు సాగుతానని,జీవన్ రెడ్డి కి అండగా నిలుస్తామని అన్నారు.

ధర్మపురి, జగిత్యాల, వేములవాడ, కోరుట్ల, చొప్పదండి నియోజక వర్గాల కార్యకర్తలు, నాయకుల సలహాలు తీసుకుంటూ, అందరి సమస్యలు పరిష్కరిస్తారని లక్ష్మణ కుమార్ హామీ ఇచ్చారు.

కార్యక్రమంలో జువ్వాడి నర్సింగ్ రావు,  ఆకుల లింగా రెడ్డి, కరం చాంద్,
బండ శంకర్, షాకీర్, గాజంగి నందయ్య, జున్ను రాజేందర్, తాటిపర్తి విజయలక్ష్మి దేవేందర్ రెడ్డి, కళ్లేపల్లి దుర్గయ్య, రమేష్ రావు,జలపతి రెడ్డి,
మసర్తి రమేష్,  చాంద్ పాషా, కొయ్యడ మహిపాల్, మ్యకల రమేష్, మన్సూర్, నిశాంత్ రెడ్డి, శైలేంద్ర రెడ్డి నేహాల్, భూక్యా సరళ, గోపి మాధవి,ధర రమేష్ బాబు, గోపి రాజిరెడ్డి, బీరం రాజేష్, నల్లా స్వామి రెడ్డి, బో గ సందీప్ పాల్గొన్నారు.

Tags

More News...

Local News 

కొత్తకొండ గౌడ సంఘం ఎన్నికలు ప్రశాంతంగా ముగింపు

కొత్తకొండ గౌడ సంఘం ఎన్నికలు ప్రశాంతంగా ముగింపు భీమదేవరపల్లి జూన్ 13 (ప్రజామంటలు) : కొత్తకొండ గౌడ సంఘం డైరెక్టర్‌గా ముస్తఫాపూర్ గౌడ సంఘం చిట్టి అధ్యక్షుడు భైరీ అశోక్ ఎన్నికయ్యారు. అదే విధంగా సంఘం అధ్యక్ష పదవికి ఓగులబోయిన కృష్ణమూర్తి ఏకగ్రీవంగా ఎన్నికై బాధ్యతలు చేపట్టారు. అసిస్టెంట్ రిజిస్టర్ రవీంద్ర నేతృత్వంలో ఈ సంఘ ఎన్నికలు సజావుగా, శాంతియుతంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా...
Read More...
Local News 

డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన వ్యక్తికి నాలుగు రోజుల జైలు శిక్ష విధించిన సెకండ్ అడిషనల్ స్పెషల్  జ్యుడీషియల్ మెజిస్ట్రేట్

డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన వ్యక్తికి నాలుగు రోజుల జైలు శిక్ష విధించిన సెకండ్ అడిషనల్ స్పెషల్  జ్యుడీషియల్ మెజిస్ట్రేట్    జగిత్యాల జూన్ 13(ప్రజా మంటలు) పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో వాహన తనిఖీల్లో భాగంగా డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన బోరగాళ్ల శేఖర్ వయస్సు 40 సంవత్సరాలు,  జగిత్యాల పట్టణం చెందిన బోరగాళ్ల శేఖర్ నుహెడ్ కానిస్టేబుల్ రాజేశ్వరరావు కోర్టులో ప్రవేశపెట్టగా శుక్రవారం రోజున సెకండ్ అడిషనల్ స్పెషల్  జ్యుడీషియల్  మెజిస్ట్రేట్ మద్యం...
Read More...
Local News 

జిల్లా వైద్య శాఖ ఆధ్వర్యంలో మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు ఆరోగ్య పరీక్షలు 

జిల్లా వైద్య శాఖ ఆధ్వర్యంలో మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు ఆరోగ్య పరీక్షలు  జగిత్యాల జూన్ 13(ప్రజా మంటలు) జిల్లా వైద్య శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని మెప్మా హాల్లో మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు వైద్య పరీక్షలు నిర్వహించారు .ఈ సందర్భంగా బ్రెస్ట్ క్యాన్సర్ సర్వికల్ క్యాన్సర్ మహిళల సమస్యలకు తగు పరీక్షలు నిర్వహించబడునని మున్సిపల్ కమిషనర్ స్పందన తెలిపారు . 100 రోజుల ప్రణాళికలో భాగంగా మెప్మా సహకారంతో...
Read More...
Local News  State News 

తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపు.

తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపు. (సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113). హైదరాబాద్‌ 13 జూన్ (ప్రజా మంటలు) :  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు గుడ్‌ న్యూస్‌ చెప్పింది. ఉద్యోగులకు 3.64 శాతం డీఏ పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. పెంచిన డీఏ 2023 జనవరి 1 నుంచి వర్తిస్తుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.
Read More...
Local News 

భూమి వివాదంలో కోడలు పై మామ దాడి 

భూమి వివాదంలో కోడలు పై మామ దాడి  గొల్లపల్లి జూన్ 13  (ప్రజా మంటలు): గొల్లపల్లి మండలం లోని గుంజపడుగు గ్రామ శివారులో భూ వివాదంలో అగ్గిమల్ల గ్రామానికి చెందిన సట్ట లత  చిన్న మామ సట్ట నారాయణ  దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. దాడిలో గాయాలు, రక్తం కారుతుండగా,ఆమెను ఆస్పత్రిలో చేర్చారు.   ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సట్ట లత, ఫిర్యాదు చేయగా
Read More...
Local News 

శ్రీ సూర్య ధన్వంతరి దేవాలయంలో,ఘనంగా  కుంకుమ పూజలు

శ్రీ సూర్య ధన్వంతరి దేవాలయంలో,ఘనంగా  కుంకుమ పూజలు .   జగిత్యాల జూన్ 13(ప్రజా మంటలు) పట్టణములోని చింతకుంట లోని శ్రీ సూర్య ధన్వంతరి దేవాలయం లో  శ్రీ ధనలక్ష్మి సేవా సమితి  అధ్వర్యంలో పదవ  శుక్రవారం  పురస్కరించుకొని,అమ్మవారికి కుంకుమార్చన,లలితా సహస్ర నామాల స్థోత్ర పారాయణం చేసారు.మాతలు  అమ్మ వారికి ఒడి బియ్యం సమర్పించారు. కుంకుమ పూజ అనంతరం లక్కీ డిప్ ద్వారా ఒక్కరిని ఎంపిక...
Read More...
Local News 

నేరాల నివారణే లక్ష్యంగా పని చేయండి:జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్ 

నేరాల నివారణే లక్ష్యంగా పని చేయండి:జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్     వార్షిక తనిఖీల్లో భాగంగా సారంగాపూర్  పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ      గ్రామాల్లో విజిబుల్ పోలీసింగ్ పై ప్రత్యేక దృష్టి సారించాలి సారంగాపూర్ పోలీస్ స్టేషన్ అధికారులు , సిబ్బంది పనితీరు భేష్ సారంగాపూర్ జూన్ 13 (ప్రజా మంటలు) ప్రజలకు మరింత చేరువ అయ్యేలా పోలీస్ విధులు ఉండాలని జిల్లా ఎస్పీ...
Read More...
Local News 

జీలుగుల ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్‌ను సందర్శించిన రాష్ట్ర టిబి పరిశీలనా బృందం

జీలుగుల ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్‌ను సందర్శించిన రాష్ట్ర టిబి పరిశీలనా బృందం ఎల్కతుర్తి జూన్ 13 (ప్రజామంటలు) : "టిబి ముక్త్ భారత్" అభియాన్‌లో భాగంగా జూన్ 13న జీలుగుల గ్రామంలోని ఆయుష్మాన్ ఆరోగ్య మందిరంలో ప్రత్యేక ఆరోగ్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో మొత్తం 243 మందికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించగా, 19 మందికి తెమడ (CBNAAT) పరీక్షలు, 12 మందికి ఎక్స్‌రే పరీక్షలు చేశారు. ఈ...
Read More...
Local News 

అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్

అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్    జగిత్యాల జూన్ 13 ( ప్రజా మంటలు) పట్టణ 9వ వార్డు లో 11 లక్షలతో సీసీ డ్రైన్ నిర్మాణ పనులకు భూమిపూజ చేసిన జగిత్యాల శాసనసభ్యులు డా సంజయ్ కుమార్ మాట్లాడుతూ  జగిత్యాల పట్టణం లో నాణ్యతతో కూడిన పనులు జరుగుతున్నాయనీ  20 ఏండ్ల నుండి నిరుపయోగంగా ఉన్న ధరూర్ క్యాంప్ వాటర్ ట్యాంక్...
Read More...
Local News 

తమ పిల్లలకు కార్పొరేట్ చదువులు – ఇతరులపై ఆంక్షలు!"*

తమ పిల్లలకు కార్పొరేట్ చదువులు – ఇతరులపై ఆంక్షలు! ప్రభుత్వ టీచర్ vs ప్రైవేట్ స్కూల్: ఎర్రబెల్లిలో వివాదం"
Read More...
National  International  

ఇరాన్ పై ఇజ్రాయి క్షిపణి దాడులు రివల్యూషనరి గార్డ్స్ చీఫ్, ఇద్దరు న్యూక్లియర్ శాస్త్రవేత్తల మృతి

ఇరాన్ పై ఇజ్రాయి క్షిపణి దాడులు రివల్యూషనరి గార్డ్స్ చీఫ్, ఇద్దరు న్యూక్లియర్ శాస్త్రవేత్తల మృతి న్యూఢిల్లీ జూన్ 13: ఇజ్రాయెల్ ఇరాన్ అణు మరియు క్షిపణి స్థావరాలపై దాడి చేసి అగ్ర సైనిక అధికారులను చంపింది.ఇరాన్ సుప్రీం నాయకుడు ఆయతుల్లా అలీ ఖమేనీ ప్రభుత్వ వార్తా సంస్థలో మాట్లాడుతూ, దాడిలో అగ్ర సైనిక అధికారులు మరియు శాస్త్రవేత్తలు మరణించారని ధృవీకరిస్తున్నారు. శుక్రవారం (జూన్ 13, 2025) తెల్లవారుజామున ఇజ్రాయెల్ ఇరాన్...
Read More...
Local News 

మైనర్ బాలిక పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన నిందితుడికి 3సం జైలు శిక్ష 

మైనర్ బాలిక పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన నిందితుడికి 3సం జైలు శిక్ష  గొల్లపల్లి జూన్ 13 (ప్రజా మంటలు): గొల్లపల్లి మండలంలోని అబ్బాపూర్ గ్రామానికి చెందిన నిందితుడు రెడపాక శ్రీనివాస్ (26), ఒక మైనర్ బాలిక ఇంట్లోకి ప్రవేశించి అసభ్యకరంగా ప్రవర్తించిన  ఘటనలో నిందితుని జైలు శిక్ష విధించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడిపై 2021 గొల్లపల్లి పోలీస్ స్టేషన్ లో అప్పటి ఎస్.ఐ జీవన్  కేసు నమోదు...
Read More...