మంత్రి గా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం జగిత్యాలకు వచ్చిన అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు కాంగ్రెస్ శ్రేణులచే ఘన స్వాగతం

On
మంత్రి గా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం జగిత్యాలకు వచ్చిన అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు కాంగ్రెస్ శ్రేణులచే ఘన స్వాగతం


జగిత్యాల జూన్ 11 ( ప్రజా మంటలు)

తెలంగాణ రాష్ట్ర కేబినెట్ మంత్రివర్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం మొట్టమొదటిసారిగా జగిత్యాలకు వచ్చిన అడ్లూరీ లక్ష్మణ్ కుమార్ కి మాజీ మంత్రివర్యులు తాటిపర్తి జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు భారీగా ఘన స్వాగతం పలికాయి. 

 ఈ సందర్భంగా జిల్లాలోని నలుమూలల నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. 

జగిత్యాల పట్టణంలో కాంగ్రెస్ పార్టీ జెండాల ఏర్పాటు తో పండుగ వాతావరణం నెలకొంది.

బైక్ ర్యాలీ

స్థానిక ఇందిరా భవన్ నుండీ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు జెండాలు పట్టుకొని బైక్ ర్యాలీ నిర్వహిస్తూ రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద మంత్రివర్యులు లక్ష్మణ్ కుమార్ కు ఘన స్వాగతం పలికారు. బైక్ ర్యాలీతో పట్టణంలోని టౌన్ హాల్ వరకు ర్యాలీ నిర్వహించారు. 

కార్యకర్తలు టపాసులు  పేల్చి, సంబురాలు నిర్వహించారు.

డీజె పాటలు. కార్యకర్తల నినాదాలు. వందలాది బైక్ లతో భారీ ర్యాలీ నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి ఆడ్లూరీ లక్ష్మణ్ కుమార్ రాజీవ్ గాంధీ విగ్రహానికి, పాత బస్టాండ్ లోని ఇంద్రమ్మ విగ్రహానికి ,తహశీల్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. 

 ఓపెన్ టాప్ జీప్ లో జీవన్ రెడ్డి, జువ్వాడి నర్సింగ్ రావుపాటు కాంగ్రెస్ నాయకులతో కలిసి, ప్రజలకు అభివాదం చేస్తూ, ర్యాలీ లో పాల్గొన్నారు.

అనంతరం టౌన్ హాల్ లో మాజీ మంత్రి వర్యులు తాటిపర్తి జీవన్ రెడ్డి ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమానికి వందలాది మంది తరలివచ్చి, లక్ష్మణ కుమార్ ను శాలువాలతో సన్మానించారు.

మొదటి సరిగా జగిత్యాలకు వచ్చిన కేబినెట్ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను సన్మానించేందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పోటీ పడ్డారు.

పదేళ్ల నుండి పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికి గుర్తింపు ఇవ్వాలని నాయకులు కోరారు.

ఈ సందర్భంగా మాజీ మంత్రి  జీవన్ రెడ్డి మాట్లాడుతూ..

కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా లక్ష్మణ్ కుమార్ సమర్ధవంతముగా పని చేశారని, మంత్రిగా రాష్ట్ర ప్రజలకు మరిన్ని మెరుగైన సేవలు అందిస్తారని అన్నారు.

సామాజిక న్యాయం పాటించడంలో 
దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తోందన్నారు.

42 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం  తీర్మానం చేసిందని గుర్తు చేశారు.

రిజర్వేషన్ ఫలాలు అందరికీ అందించాలని అన్నారు.

ఏ రాజకీయ పార్టీ అయినా కార్యకర్తల మనోభావాలు గౌరవించాలని కోరారు.

కాంగ్రెస్ క్రమ శిక్షణ గల కార్యకర్తగా అంచెలంచెలుగా ఎదిగిన లక్ష్మణ్ కుమార్ కార్యకర్తలకు ఆదర్శం అన్నారు.

రాబోయే స్థానిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కృషి చేస్తామన్నారు.

రాష్ట్ర కేబినెట్ మంత్రి వర్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ..

అందరి కృషి ఆశీర్వాదం తో మంత్రి పదవి దక్కిందన్నారు.

పనిలో నిజాయితీ గా ఉండాలి..పార్టీ కోసం పనిచేయాలి.
రాహుల్ గాంధీ ఆలోచన విధానం తో  సీఎం రేవంత్ రెడ్డి బీసీ కులగణన  చేసి, 42 శాతం రిజర్వేషన్ కల్పనకు కృషి చేస్తున్నారు.

కష్టాల్లో తోడుగా నిలిచిన జీవన్ రెడ్డి సహకారం తో ముందుకు సాగుతానని,జీవన్ రెడ్డి కి అండగా నిలుస్తామని అన్నారు.

ధర్మపురి, జగిత్యాల, వేములవాడ, కోరుట్ల, చొప్పదండి నియోజక వర్గాల కార్యకర్తలు, నాయకుల సలహాలు తీసుకుంటూ, అందరి సమస్యలు పరిష్కరిస్తారని లక్ష్మణ కుమార్ హామీ ఇచ్చారు.

కార్యక్రమంలో జువ్వాడి నర్సింగ్ రావు,  ఆకుల లింగా రెడ్డి, కరం చాంద్,
బండ శంకర్, షాకీర్, గాజంగి నందయ్య, జున్ను రాజేందర్, తాటిపర్తి విజయలక్ష్మి దేవేందర్ రెడ్డి, కళ్లేపల్లి దుర్గయ్య, రమేష్ రావు,జలపతి రెడ్డి,
మసర్తి రమేష్,  చాంద్ పాషా, కొయ్యడ మహిపాల్, మ్యకల రమేష్, మన్సూర్, నిశాంత్ రెడ్డి, శైలేంద్ర రెడ్డి నేహాల్, భూక్యా సరళ, గోపి మాధవి,ధర రమేష్ బాబు, గోపి రాజిరెడ్డి, బీరం రాజేష్, నల్లా స్వామి రెడ్డి, బో గ సందీప్ పాల్గొన్నారు.

Tags

More News...

Local News  Spiritual  

ఆషాడ జాతర ఉజ్జయిని టెంపుల్ హుండీల లెక్కింపు

ఆషాడ జాతర ఉజ్జయిని టెంపుల్ హుండీల లెక్కింపు 34 రోజులకు రూ62,44,500 ఆదాయం సికింద్రాబాద్, జూలై 31 (ప్రజామంటలు) : సికింద్రాబాద్ ఉజ్జయిని శ్రీమహాకాళి దేవస్థాన హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఆషాడ మాస బోనాల జాతర 34 రోజులకు సంబందించి హుండీలను తెరిచి లెక్కించగా రూ 58,84,066 నగదు కరెన్సీ నోట్లు,రూ3,36,816 కాయిన్స్ తో పాటు 320 అమెరికా డాలర్స్,ఐదు కెనడా...
Read More...
Local News  State News 

పుప్పాల గూడ భూములపై  విచారణకు లోకాయుక్త ఆదేశం

పుప్పాల గూడ భూములపై  విచారణకు లోకాయుక్త ఆదేశం ఐఏఎస్ అరవింద్ కుమార్ తోపాటు మరో ఇద్దరిని విచారించండి..    - న్యాయవాది రామారావు పిర్యాదును స్వీకరించిన లోకాయుక్త సికింద్రాబాద్, జూలై 31 (ప్రజామంటలు) : పుప్పాల గూడ లోని సర్వేనెంబర్ 277,280,281 సంబందించి భారీ కుంభకోణం జరిగిందని, ఈవిషయంలో  విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని ప్రముఖ న్యాయవాది ఇమ్మానేని రామారావు లోకాయుక్త లో ఫిర్యాదు...
Read More...
Local News  State News 

రోడ్డు ప్రమాద బాధితుడికి 1.52 లక్షలు సాయం.

రోడ్డు ప్రమాద బాధితుడికి 1.52 లక్షలు సాయం. (రామ కిష్టయ్య సంగన భట్ల) ధర్మపురి జూలై 31: రోడ్డు ప్రమాదానికి గురై బ్రెయిన్ సర్జరీ కోసం ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న ఓ నిరుపేద యువకుడికి ఫేస్ బుక్ మిత్రులు రూ. 1.52 లక్షలు సాయం అందించి అండగా నిలిచారు.    ధర్మపురికి చెందిన అక్కనపల్లి రాజు అనే యువకుడు 5 ఏళ్ల క్రితం రోడ్డురాజు...
Read More...
Local News 

రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి ఆరోగ్య కేంద్రాలలో అవసరమైన మందులు అందుబాటులో ఉంచుకోవాలి జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్

రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి  ఆరోగ్య కేంద్రాలలో అవసరమైన మందులు అందుబాటులో ఉంచుకోవాలి  జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్    జగిత్యాల రూరల్ జూలై 31 (ప్రజా మంటలు) రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ సూచించారు.   గురువారం రోజున  జగిత్యాల జిల్లా. జగిత్యాల రూరల్ మండల  కల్లెడ గ్రామం  లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని  ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ...
Read More...
State News 

కొడంగల్ ‌- నారాయణపేట లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు భూనిర్వాసితులతో ఎమ్మెల్సీ కవిత

కొడంగల్ ‌- నారాయణపేట లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు భూనిర్వాసితులతో  ఎమ్మెల్సీ కవిత భూనిర్వాసితులతో ప్రభుత్వం చర్చలు జరపాలి తమ సమస్యలను ఎమ్మెల్సీ కవితకు వివరించిన భూనిర్వాసితులు కొడంగల్ జూలై 31 (ప్రజా మంటలు): కానుకుర్తి గ్రామంలో కొడంగల్ ‌- నారాయణపేట లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు భూనిర్వాసితులతో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సమావేశం అయ్యారు.భూనిర్వాసితుల డిమాండ్లకు  ఎమ్మెల్సీ కవిత సంపూర్ణ మద్ధతు ఇస్తున్నట్లు...
Read More...
Local News 

పదవీ విరమణ పొందిన పోలీస్ అధికారుల సేవలు స్ఫూర్తివంతం. జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

పదవీ విరమణ పొందిన పోలీస్ అధికారుల సేవలు స్ఫూర్తివంతం. జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ జగిత్యాల జులై 31 (ప్రజా మంటలు) పదవి విరమణ అనంతరం కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపాలని ఆకాంక్ష   విధి నిర్వహణలో అందరి మన్ననలు అందుకొని పదవీ విరమణ పొందుతున్న  ఏ.ఎస్.ఐ  చంద్రయ్య, హెడ్ కానిస్టేబుల్ ఎండి అహ్మద్ పాషా గార్లను  శాలువా,పులమాలలతో ఘనంగా సత్కరించి జ్ఞాపికను అందజేసారు  ఎస్పీ     జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో విజయవంతంగా...
Read More...
Local News 

పట్టదారుల వివరాలను పారదర్శకంగా ఎంక్వయిరీ చేయాలి.. రాష్ట్ర సిసిఎల్ఎ..కమిషనర్ లోకేష్  కుమార్ సర్వే సెటిల్మెంట్ కమిషనర్ రాజీవ్ గాంధీ  హనుమంతు 

పట్టదారుల వివరాలను పారదర్శకంగా ఎంక్వయిరీ చేయాలి..  రాష్ట్ర సిసిఎల్ఎ..కమిషనర్ లోకేష్  కుమార్ సర్వే సెటిల్మెంట్ కమిషనర్ రాజీవ్ గాంధీ  హనుమంతు     జగిత్యాల జూలై 31(ప్రజా మంటలు) రీ సర్వే చేసిన పట్టాదారుల వివరాలు.. పహానీలోని వివరాలపై పారదర్శకంగా ఎంక్వయిరీ చేయాలని రాష్ట్ర సిసిఎల్ఎ.. కమిషనర్ లోకేష్ కుమార్ సర్వే సెటిల్మెంట్ కమిషనర్ రాజీవ్  గాంధీ హనుమంతు లు ఆయా జిల్లా కలెక్టర్ లను ను ఆదేశించారు.   జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం కొమనపల్లి గ్రామాన్ని పైలట్ ఈ...
Read More...
National  State News  Crime 

సృష్టి కేసులో ఐదు రోజుల కస్టడీకి డాక్టర్ నమ్రత

సృష్టి కేసులో ఐదు రోజుల కస్టడీకి డాక్టర్ నమ్రత సికింద్రాబాద్ కోర్టు తీర్పు.. సికింద్రాబాద్, జూలై 31 (ప్రజామంటలు) : సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్ అక్రమ సరోగసి,ఐవీఎఫ్, శిశువుల అక్రమ రవాణా తదితర కేసుల్లో  ప్రధాన నిందితురాలు డాక్టర్ నమ్రత కు పోలీసు కస్టడీ కోసం సికింద్రాబాద్ సివిల్ కోర్టు గురువారం అనుమతినిచ్చింది. సికింద్రాబాద్ సివిల్ కోర్టు పదవ అదనపు చీఫ్ మెజిస్ట్రేట్ ఐదు...
Read More...
National  International  

న్యూ ఢిల్లీలో  లండన్ వెళ్లాల్సిన విమానం నిలిపివేత - ఆందోళనలో ప్రయాణికులు

న్యూ ఢిల్లీలో  లండన్ వెళ్లాల్సిన విమానం నిలిపివేత - ఆందోళనలో ప్రయాణికులు న్యూ ఢిల్లీ జూలై 31: ఢిల్లీ విమానాశ్రయంలో సాంకేతిక సమస్య కారణంగా ఎయిర్ ఇండియా లండన్‌కు వెళ్లాల్సిన బోయింగ్ 787-9 విమానం టేకాఫ్‌ను నిలిపివేసిందికాక్‌పిట్ సిబ్బంది ప్రామాణిక ఆపరేటింగ్ విధానాలను అనుసరించి టేకాఫ్ రన్‌ని నిలిపివేయాలని నిర్ణయించారు మరియు ముందు జాగ్రత్త తనిఖీల కోసం విమానాన్ని తిరిగి తీసుకువచ్చారు.న్యూఢిల్లీ: లండన్‌కు వెళ్లాల్సిన ఎయిర్...
Read More...
Local News 

పలు గ్రామాలకు నూతన ఆర్టీసీ బస్సును ప్రారంభించిన మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్

పలు గ్రామాలకు నూతన ఆర్టీసీ బస్సును ప్రారంభించిన మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్ (అంకం భూమయ్య)  గొల్లపల్లి జూలై 31 (ప్రజా మంటలు):    గొల్లపల్లి మండలం లోని మల్లన్న పేట్ శ్రీ మల్లికార్జున  స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు  అనంతరం మల్లన్న పేట - శంకర్రావుపేట్ - నంది పల్లె - వెంగలాపూర్ గ్రామాలకు ఆర్టీసీ  బస్సును జండా ఊపి ప్రారంభించారు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో  మార్కెట్ చైర్మన్...
Read More...
Local News 

అర్హులైన పేద ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించేందుకు కృషి -: మంత్రి లక్ష్మణ్ కుమార్

అర్హులైన పేద ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించేందుకు కృషి -: మంత్రి లక్ష్మణ్ కుమార్ పదేళ్లుగా ఎదురు చూస్తున్న రేషన్ కార్డుల కల నెరవేరింది. (అంకం భూమయ్య)  గొల్లపల్లి జూలై 31 (ప్రజా మంటలు):  గొల్లపల్లి మండల కేంద్రంలోని స్థానిక  ఫంక్షన్ హాల్లో గురువారం రోజున నిర్వహించిన నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర ఎస్సీ,ఎస్టీ,మైనారిటీ మరియు వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్,జిల్లా...
Read More...
Local News 

జర్నలిస్టు సంఘ నాయకులను సన్మానించిన ఐఎంఏ వైద్యులు

జర్నలిస్టు సంఘ నాయకులను సన్మానించిన ఐఎంఏ వైద్యులు . జగిత్యాల జులై 30 ( ప్రజా మంటలు) ఇటీవల నూతనంగా ఎన్నికైన  జర్నలిస్టు యూనియన్ జిల్లా కార్యవర్గాన్ని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా సన్మానించారు. జర్నలిస్టు యూనియన్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చీటీ శ్రీనివాసరావు, సంపూర్ణ చారి, కోశాధికారి వేణుగోపాల్, ఉపాధ్యక్షులు హరికృష్ణ, హైదర్, సహ కార్యదర్శులు చంద్రశేఖర్, రాజకుమార్,...
Read More...