వికసిత కృషి సంకల్ప్ అభియాన్
గొల్లపల్లి జూన్ 09 (ప్రజా మంటలు):
గొల్లపల్లి మండలం, రాపల్లి గ్రామంలో "వికసిత కృషి సంకల్ప్ అభియాన్ - రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు" కార్యక్రమం నిర్వహించారు. ఉత్సాహంగా సుస్థిరమైన వ్యవసాయ పద్ధతులు, నేల ఆరోగ్య నిర్వహణ, పంట మార్పిడి, యూరియా సరైన వినియోగం,వ్యవసాయంలో నీటి యాజమాన్యం వంటి కీలక అంశాలపై రైతులకు అవగాహన కల్పించి, వారి సందేహాలను నివృత్తి చేశారు.
ఈ సందర్భంగా అగ్రికల్చర్ కాలేజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డా" జి. వేణుగోపాల్ మాట్లాడుతూ, యూరియా వాడకాన్ని మోతాదుకు మించి వాడకూడదని రైతులకు సూచించారు. నేల పరీక్షల ఆవశ్యకతను మరియు సమగ్ర పోషక యాజమాన్యం గురించి ఆయన వివరించారు. సహాయ అధ్యాపకులు డా" వి. రత్నాకర్ మాట్లాడుతూ, సమగ్ర సస్యరక్షణ ఆవశ్యకతను తెలియజేశారు. రైతులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు.
ఈ కార్యక్రమంలో రైతులు తమ అనుభవాలను, సమస్యలను శాస్త్రవేత్తలతో పంచుకున్నారు. 'రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు' కార్యక్రమం ఎంతో ఉపయోగకరంగా ఉందని, దీని ద్వారా నూతన వ్యవసాయ పద్ధతులు తెలుసుకొని తమ దిగుబడులను పెంచుకోవడానికి అవకాశం ఉంటుందని రైతులు అభిప్రాయం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో బుర్ర భూమయ్య గౌడ్, గండ్ర రామారావు తదితరులు పాల్గొన్నారు
More News...
<%- node_title %>
<%- node_title %>
ఘనంగా ముగిసిన శిరిడి సాయి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు

లోక్ అదాలత్ ద్వారా శాశ్వత న్యాయ పరిష్కారాలు – వేలేరు పోలీస్

శ్రీ మడేలేశ్వర స్వామి ఆలయంలో వెండి బంగారు వస్తువుల చోరీ

విద్యార్థుల బస్ పాస్ ఛార్జీల పెంపు సరికాదు - ఏబీవీపీ ఆందోళన

క్రమశిక్షణ గల చదువుతోనే ఉజ్వల భవిష్యత్

గాంధీ ఆసుపత్రిని సందర్శించిన డీఎంఈ

ఎట్టకేలకు తీరిన గాంధీ ఆసుపత్రి టాయిలెట్స్ సమస్య.

మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను గజమాలతో సత్కరించిన ఎమ్మెల్యే డా.సంజయ్

వినియోగదారుల సమస్యల సత్వర పరిష్కారానికి సీజీఆర్ఎఫ్ లోకల్ కోర్టులు

ప్రతి పేదింటి వారి సొంత ఇంటి కలను నెరవేర్చాలన్నదే ప్రభుత్వం లక్ష్యం

మండల విద్యాశాఖ ఆధ్వర్యంలో వివిధ శిక్షణలు

ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను కలిసిన టీఈజేఏసీ నేతలు.
