బ్రహ్మోత్సవాలలో  మొక్కులు తీర్చుకున్న భక్తులు, బ్రహ్మ పుష్కరిణిలో... కోనేటి రాయుని జలవిహారం

On
బ్రహ్మోత్సవాలలో  మొక్కులు తీర్చుకున్న భక్తులు,  బ్రహ్మ పుష్కరిణిలో... కోనేటి రాయుని జలవిహారం

హోమశాలలో ప్రత్యేక పూజలు - 40 లక్షలకు పైగా ఆదాయం

అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
 (రామ కిష్టయ్య సంగన భట్ల)

  బ్రహ్మోత్సవాలలో అంతర్భాగంగా ఆది వారం నిర్వహించిన శ్రీవేంకటేశ్వర డోలోత్సవ సందర్భంగా, వంశపారం పర్య ఆచార ఆచరణ నేపథ్యంలో రాష్ట్రం నలుమూలలనుం కాక, మహారాష్ట్ర తదితర సుదూర ప్రాంతాలనుండి ఏతెంచిన భక్తజనం దేవస్థానంలో మొక్కులు తీర్చుకున్నారు. పిల్లా పాపలతో గోదావరి నదికి మూటా ముళ్ళే నెత్తిన పెట్టుకు వచ్చిన భక్తులు, మంగళ స్నానాలను ఆచరించి, గోదావరి మాతను అర్చించి, దానధర్మాదులను ఆచరించి, వివిధ ఆలయాలలో దైవ దర్శనాలు చేసుకున్నారు. శ్రీవేంకటేశ్వర మందిరంలో చిరకాల వాంఛలు ఈడేర్చాలని ప్రార్ధిస్తూ మొక్కులు చెల్లించుకున్నారు.

హోమశాలలో ప్రత్యేక పూజలు

 శ్రీ వేంకటేశ్వర తెప్పోత్సవ, డోలోత్సవ నిర్వ హణదినమైన ఆది వారం దేవస్థానంలో ప్రత్యేక బ్రహ్మోత్సవ పూజలు నిర్వహించారు. దేవస్థాన వంశపారంపర్య యాజ్ఞికులు, దేవతా పౌరోహితులు కండాలై పురుషోత్తమా చార్య, ఆస్థాన వేదపండితులు రమేశ శర్మల ఆధ్వర్యంలో, అర్చకులు నేరేళ్ళ శ్రీనివాసా చార్య, మోహనా చార్య, కిరణ్, వంశీ, విజయ్ ఉదయం నుండి యాగశాలకు స్వాముల ఉత్సవ మూర్తులను వేంచేపుచేసి, బ్రహ్మకలశ పూజ, ధ్వజారోహణము, తిరుక్కళ్యాణం, నిత్య హోమ పంటపంలో కలశ, విశ్వక్సేన, కర్మణః, పుణ్యావాచనం, అగ్నిద్యానం, వాసుదేవ, నారాయణ మంత్ర హవనం, సమిద్ద హోమం, పంచసూక్త హవనాలు, ద్వాదశ దేవతా హోమాలు, సప్తావరణ హోమాలు, అష్టమంగళ, మూర్తి, సుదర్శన, విశ్సక్సేన, సర్వదేవతా, గరుడ హవనాలు, మూల మంత్ర హోమాలు, స్థాపిత దేవతా హవనములు, దోష పరి హారార్ధం నవగ్రహ, నక్షత్ర హోమాలు నిర్వహించారు. మద్యాహ్నం బలి ప్రదానం, అష్ట దిక్పాలకుల ధ్వజారో హణం, గరుడ బ్రహ్మలకు బలిప్రదానం గావించగా, భక్తులు పాల్గొన్నారు. భక్తి శ్రద్ధలతో కార్యక్రమాలలో పాల్గొని, కానుకలు, ముడుపులు, మొక్కులు చెల్లించు కున్నారు. దేవస్థానం పక్షాన భక్తులందరికీ ఉచిత అన్నదానం గావించారు. స్థానిక ఆర్యవైశ్యులు, విద్యార్థులు స్వచ్చంద సేవకులుగా సేవలందించి, భక్తుల, యాత్రికుల ప్రశంసాపాత్మలైనారు. దేవస్థానం ఈ శ్రీనివాస్,  చైర్మన్ జక్కు రవీందర్, సభ్యులు, సూపరింటెండెంట్ కిరణ్, పాలెపు గణేశ్, 
 సిబ్బంది, స్వచ్చంద సంఘాల బాధ్యులు కార్యక్రమాలను పర్యవేక్షించారు.

అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు

బ్రహ్మోత్సవాలలో భాగంగా శేషప్ప కళా వేదికపై సంగీత రత్న కొరిడే నరహరి శర్మ ఆద్వర్యంలో దేవస్థానం పక్షాన నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ప్రధానంగా శేషప్ప భక్త మండలి ఆధ్వర్యంలో ఎన్నం బాపురెడ్డి నిర్వహణలో సభ్యులు శేషప్ప విరచిత నరసింహ శతక పద్య గానం చేశారు. ట్రస్టు బోర్డు చైర్మన్ జక్కు రవీందర్, ధర్మ కర్తలు గాయకులను సత్కరించారు. 

 దేవస్థానానికి గణనీయ ఆదాయం

బ్రహ్మోత్సవాలు సందర్భంగా దేవస్థానానికి 10వ తేదీ నుండి 15 వరకు ఆరు రోజులకు గాను 
గణనీయ ఆదాయం లభిస్తున్నది. వివిధ టికెట్ల ద్వారా 17,33,886 రూపాయలు, లడ్డూ, పులిహోర ప్రసాదం ద్వారా 19,34,010 రూపాయలు, 
 అన్నదానం ద్వారా 4,26,388 రూపాయలు, మొత్తం 40,94,284 రూపాయల ఆదాయం లభించినట్లు ఈఓ శ్రీనివాస్ తెలిపారు.

ప్రశంసా పాత్రం... అన్నపూర్ణ సమితి సేవాభావం

స్థానిక అన్నపూర్ణ సేవా సమితి బ్రహ్మోత్సవాలలో చేస్తున్న సేవలు ప్రశంసాపా త్రాలు అవుతున్నాయి. సామాజిక సేవే పరమావధిగా పట్టణ వాసులకు ఎన్నో ప్రజాహిత సేవలు అందిస్తున్న సేవాసమితి, ఈ సారి బ్రహ్మోత్సవాలలో అనుదినం దేవస్థాన
నం ...గోదావరి మార్గంలో భక్తుల దాహార్తి తీర్చేందుకు శీతల పానీయాలు, త్రాగునీరు అందిస్తున్నారు. ప్రధానంగా తెప్పోత్సవం, డోలోత్సవాల సందర్భంగా లస్సీ మజ్జిగ అందించి ప్రశంసలను పొందుతున్నారు. పెద్దంభట్ల నరేందర్ శర్మ నేతృత్వంలో , కొరిడే శంకర్, గుండి రామనాథం, కోరిడే దత్తాత్రేయ, 
పెండ్యాల బాల కృష్ణ, రవీందర్, మధు శంకర్, కషోజ్జల రాజేశ్వర శర్మ, అలువాల దత్తాత్రి, సంగన భట్ల నరేందర్, లక్ష్మీకాంత్, బావి మురళి తదితర సేవా సమితి బాధ్యులు స్వచ్ఛంద సేవలు అందించి ప్రశంసలను అందుకుంటున్నారు.

IMG-20250316-WA0010
 బ్రహ్మ పుష్కరిణిలో...
కోనేటి రాయుని జలవిహారం

రామ కిష్టయ్య సంగన భట్ల...
      
 ధర్మపురి క్షేత్రంలో నిర్వహిస్తున్న స్వామివారల బ్రహ్మోత్సవాలలో అంతర్భాగంగా, ఆది వారం కలియుగ దైవమైన శ్రీవేంకటేశ్వరుని తెప్పోత్సవ, డోలోత్సవ కార్యక్రమాలు కన్నుల పండువగా జరిగాయి. సాయంత్రం ఐదు గంటలకు ముందుగా ప్రధానాలయంనుండి శ్రీవేంకటేశ్వరుని ఉత్సవ మూర్తులను, ఆలయం చుట్టూ ప్రదక్షిణలు గావించి, మంగళవాద్యాలు, వేదమంత్రాల యుక్తంగా కోనేరుకు ఊరేగింపుగా వెళ్ళి ఉత్తర ద్వారం గుండా ప్రవేశించగా భక్తులు ఆనందోత్సాహాలతో జయజయ ధ్వనాలతో స్వాగతించారు. ప్రత్యేక నూతన నిర్మిత హంస వాహనంపై స్వామిని ఆసీనుల గావించి, కోనేరు నీటిపై ఐదు ప్రదక్షిణలు చేయగా, ముకుళిత హస్తాలతో భక్తులు స్వామిని అనుసరించారు. పుష్కరిణి మధ్యభాగాన గల భోగమంట పంలోని ఊయలలో స్వామిని ఆసీనులచేసి నిర్వహించిన డోలోత్సవాన్ని కన్నులారాగాంచి భక్తులు తరించారు. ఆధ్యాత్మిక ప్రసంగాలు, వేదఘోషలు, ఆశీర్వచనాలు, తదితర కార్యక్రమాలను దేవస్థానం అర్చకులు నేరేళ్ళ శ్రీనివా సాచార్య, విజయ్, వంశీ, మోహనాచార్య, కిరణ్ తదితరులు నిర్వహించారు. దేవస్థానం ఈఓ శ్రీనివాస్, కమిటీ చైర్మన్ రవీందర్, సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమాలలో ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్, తదితరులు కార్యక్రమాలకు హాజరైనారు.

అవధులు దాటిన ఆనందం..

 బ్రహ్మోత్సవాలలో భాగంగా, యోగానంద, ఉగ్ర నరసింహుల దక్షిథ దిగ్యాత్రలో అంతర్భాగంగా, మంగళ వారం సాయంత్రం నుండి రాత్రి వరకు నిర్వహించిన కార్యక్రమాలలో పోలీసులు ఆనందం అవధులు దాటింది. సాయంత్రం ఇరువురు స్వాములను తమ స్టేషన్ కు ఆహ్వానించడానికి డీఎస్పీ రఘు చందర్,  సిఐ రాం నరసింహా రెడ్డి, ఎస్ ఐ ఉదయ్ కుమార్,
పలువురు ఎస్ ఐలు దేవస్థానంలో ఉత్సవ మూర్తుల పూజలో పాల్గొన్న అనంతరం సాంప్రదాయ ఊరేగింపు ప్రారంభమైంది. నంది 
 విగ్రహ కూడలి ద్వారా ఊరేగింపులో పోలీసులు ఆనందంలో నృత్యాలు ప్రారంభించారు. సాంప్రదాయ బాజా బజంత్రీలు, బ్యాండు మేళాలు, డీజే ధ్వనులు, ఒగ్గుడోలు వాద్యాలతో కళాకారుల విన్యాసాలతో సాగిన ఊరేగింపులో స్థానిక అధికారులు, పోలీసులు వీరావేశాలతో నేపథ్య సంగీతంతో స్టెప్పులు వేశారు. ఈ క్రమంలో ఊరేగింపు సేవలు స్టేషన్ ఆవరణకు చేరడానికి చాలా సమయం పట్టింది.


రక్షకభట కార్యాలయంలో లక్ష్మీనారసింహుడు


నేరస్తులో, నేర చరితులో, ఫిర్యాదుదారులో, పైరవీకారులో, వివిధ పార్టీల నేతలో, పోలీసుల కుటుంబ సభ్యులో... రక్షకభట కార్యాలయ ప్రాంగణంలో తిరుగాడడం సర్వసాధారణమే అయినా... సాక్షాత్తూ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీలక్ష్మీనృసింహుడే స్వయంగా పోలీసు రాణా వెళ్ళడం అరుదైన, అపురూప సంఘటన రాష్ట్రంలో వేరెక్కడాలేని, మరెచ్చటనూ కానరాని విధంగా ధర్మపురి క్షేత్రంలో లక్ష్మీనారసింహుడు బ్రహ్మో త్సవాలలో అంతర్భాగంగా, దక్షిణ దిగాత్రలో భాగంగా స్థానిక పోలీసు స్టేషనుకు వెళ్ళి విశేష పూజలందు కోవడం ధర్మపురి క్షేత్రానికి మాత్రమే పరిమితమైన ప్రత్యేకత. ఈ కార్యక్ర మంలో భాగంగా సాయంత్రం దేవస్థానం నుండి మున్సిపల్ కార్యాలయం, కూరగాయల మార్కెట్, ఆర్టీసీ బస్ స్టేషన్, చైతన్య భారతి ప్రధాన రహదారి మీదుగా, బాజా భజంత్రీలు, వేదమంత్రాలతో, భక్తులు తోడురాగా యోగ, ఉగ్ర స్వాముల ఉత్సవ మూర్తులను బ్యాండు మేళాలతో, సాంప్రదాయ నృత్యంతో కళాకారుల విన్యాసాలతో, ఊరేగించి దక్షిణ దిగ్యాత్ర నిర్వహించారు. 


 జగిత్యాల డీఎస్సీ రఘు చందర్, ధర్మ పురి సిఐ రాం నరసింహా రెడ్డి, సిఐలు వేణు, రవి, 
ధర్మపురి ఎస్ ఐ ఉదయ్ కుమార్ దంపతులు, ఇతర ఎస్ ఐ లు శ్రీధర్ రెడ్డి, సాగర్, సతీష్, ఎఎస్ఐలు, సిబ్బంది ఊరేగింపులో పాల్గొని నడిచి వెళ్ళి, స్టేషన్ వద్దకు రాగానే ఆవరణ లోనికి స్వామివారిని ఆహ్వానించారు. పోలీస్ అధికారులు  సేవలను భుజాలపై పెట్టుకుని నడిచారు. తమ వద్దకు అపురూపంగా ఏతెంచిన స్థానిక ఇష్ట దైవాన్ని సిఐలు, ఎస్ఐలే కాక, భక్తులు, పోలీసులు కుటుంబీకులు సాదరంగా, భక్తి శ్రద్ధలతో స్వాగతించారు.
స్టేషన్ ప్రాంగణాన ప్రత్యేక నిర్మిత వేదికపై ఉత్సవ మూర్తులను ఆసీనుల జేసి ప్రత్యేక పూజలొ నరించారు. దేవస్థాన పౌరోహితులు పురుషోత్తమా చార్య, ఆస్థాన వేదపండితులు, పురోహి తులు సంతోష్ శర్మ, సంపత్ కుమార్ శర్మ, రాజగోపాల్ శర్మ , అర్చకులు మూర్తి, అరుణ్, ప్రవీణ్, వంశీ, అశ్విన్, 
, తదితరులు పూజాదికాలు గావించారు. వేద పండితులు వేద మంత్రాలతో విధివిధాన సాంప్రదాయ పూజాదికాలు గావించారు. హారతు లిచ్చారు. స్వామి, అమ్మ వారలకు పట్టు వస్త్రాలు సమర్పించారు. పోలీసులు కుటుంబ సభ్యులేగాక, ఆ పరిసర ప్రాంత ప్రజలు ఘనంగా పూజించి, వేదమూర్తుల ఆశీస్సుల నందు కున్నారు. పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్ర మాలలో  ఈఓ శ్రీనివాస్, చైర్మన్ రవీందర్, సభ్యులు, ప్రజా ప్రతినిధులు నాయకులు, 
పోలీసుల కుటుంబాలు, ప్రత్యేక విధినిర్వహణలో గల ఉద్యోగులు, పరిసర ప్రాంత వాసులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలీసులు స్వామిని దర్శించిన వారందరికీ స్వామి ప్రసాదంగా పులిహోర, మిఠాయిలు పెంచారు.

Tags

More News...

Local News 

డిఎం అండ్ హెచ్ఓ చొరవతో జీలుగుల ఆరోగ్య ఉప కేంద్రానికి కరెంటు మీటర్ మంజూరు

డిఎం అండ్ హెచ్ఓ చొరవతో జీలుగుల ఆరోగ్య ఉప కేంద్రానికి కరెంటు మీటర్ మంజూరు భీమదేవరపల్లి మే 8 (ప్రజామంటలు) : గోపాల్పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని జీలుగుల గ్రామ ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రానికి ఎట్టకేలకు విద్యుత్ మీటర్ మంజూరు అయింది. గత 14 సంవత్సరాలుగా విద్యుత్ సరఫరా లేకపోవడంతో సిబ్బంది కష్టాలపాలవుతుండగా, డిఎం అండ్ హెచ్ఓ డా. అల్లేo అప్పయ్య చొరవతో సమస్యకు పరిష్కారం లభించింది. తాజాగా...
Read More...
Local News 

కొంత్తకొండలో ఘనంగా మంత్రి పొన్నం జన్మదిన వేడుకలు

కొంత్తకొండలో ఘనంగా మంత్రి పొన్నం జన్మదిన వేడుకలు క్షేత్ర స్థాయిలో ఈ పధకం అర్హులకు చేరాలి... మంత్రి పొన్నం ప్రభాకర్. 
Read More...
Local News 

మంత్రి పుట్టినరోజు సందర్భంగా రక్తదానం చేసిన యువజన కాంగ్రెస్ నాయకులు*

మంత్రి పుట్టినరోజు సందర్భంగా రక్తదానం చేసిన యువజన కాంగ్రెస్ నాయకులు*   భీమదేవరపల్లి మే 9 (ప్రజామంటలు) : హుస్నాబాద్ నియోజకవర్గానికి చెందిన రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పుట్టినరోజు సందర్భంగా, యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు జక్కుల అనిల్ యాదవ్, ఉపాధ్యక్షులు చిట్కూరి అనిల్ రక్తదానము చేశారు. ఈ కార్యక్రమం ద్వారా సామాజిక సేవా దృక్పథాన్ని ప్రతిబింబిస్తూ, సమాజానికి సేవ...
Read More...
Local News 

గొల్లపల్లి మండల కేంద్రంలో సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల భవనం

గొల్లపల్లి మండల కేంద్రంలో సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల భవనం శంకుస్థాపన చేసిన ప్రభుత్వ విప్పు అడ్లూరు లక్ష్మణ్ కుమార్   గొల్లపల్లి మే 08 (ప్రజా మంటలు): గొల్లపెల్లి మండల కేంద్రంలో 17 కోట్ల నిధులతో నిర్మించబోయే సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలని కొబ్బరికాయ కొట్టి  శంకుస్థాపన చేసిన ప్రభుత్వ విప్ ధర్మపురి శాసనసభ్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అనంతరం  మాట్లాడుతూ పనులని త్వరగా ప్రారంభించి,పూర్తి చేసి...
Read More...
Local News 

పాకిస్తాన్ పై భారత దాడి - బన్సీలాల్ పేట లో బీజేపీ సంబరాలు..

పాకిస్తాన్ పై భారత దాడి - బన్సీలాల్ పేట లో బీజేపీ సంబరాలు.. సికింద్రాబాద్, మే 08 (ప్రజామంటలు): పాకిస్తాన్ లోని ఉగ్రవాదుల స్థావరాలపై భారత ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతం అవడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ బన్సీలాల్ పేట డివిజన్ లో బీజేపీ నాయకులు సంబరాలు నిర్వహించారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో భారత ఆర్మీ ఎంత పటిష్టంగా ఉందో ఈ ఆపరేషన్ తో...
Read More...
Local News 

క్రీడా మైదానం కొరకు ప్రభుత్వ భూమిని పరిశీలించిన ఆర్డీవో మధుసూదన్  

క్రీడా మైదానం కొరకు ప్రభుత్వ భూమిని పరిశీలించిన ఆర్డీవో మధుసూదన్   గొల్లపల్లి మే 08 (ప్రజా మంటలు): గొల్లపెల్లి మండల కేంద్రంలోని 735 సర్వే ప్రభుత్వ భూమిని కొంత భూమిని క్రీడా మైదానానికి ( మినీ స్టేడియం) కేటాయించాలని కొన్ని రోజుల క్రితం ప్రభుత్వ విప్ ను  మండలానికి చెందిన క్రీడాకారులు కోరగా,గురువారము ఆర్డీవో మదు సుదన్, తాసిల్దార్ వరందన్, ఆర్ఐ అనూష,సర్వేయర్ మోకా పైకి వచ్చి...
Read More...
Local News 

సింధూరం తో పులకరించిన పెహల్గాం పుడమి 

సింధూరం తో పులకరించిన పెహల్గాం పుడమి                            సిరిసిల్ల. రాజేంద్ర శర్మ జగిత్యాల మే 7 (ప్రజా మంటలు)  ఉగ్రమూకల ఉన్మాదచర్య తో  ఊపిరి విడిచిన ముద్దుబిడ్డల *"గని" *  అంతులేని వేదన తో  ఉలుకుపలుకు లేక నిస్తేజంగా నిలిచిన పెహల్గాం పుడమితల్లి....   తీరని దుఃఖం తో ఎరుపెక్కిన కళ్లతో సమైక్య బలం చాటిన భారతీయుల భావోద్వేగాలుముష్కరుల పాలిట యమపాశాలు కాగా ఉగ్రవాద...
Read More...
Local News 

సైలెన్సర్లు మార్పడి చేసి ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే   చట్టపరమైన చర్యలు: జిల్లా ఎస్పి అశోక్ కుమార్ 

సైలెన్సర్లు మార్పడి చేసి ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే   చట్టపరమైన చర్యలు: జిల్లా ఎస్పి అశోక్ కుమార్                                                    సిరిసిల్ల. రాజేంద్ర శర్మ జగిత్యాల మే 7 ( ప్రజా మంటలు)    అధిక శబ్దం కలిగించే 130  ద్విచక్ర వాహనాల మాడిఫైడ్ సైలెన్సర్స్ ద్వంసం     రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ నియమాలు పాటించి జిల్లా పోలీసులకు సహకరించండి    శబ్ద కాలుష్యాన్ని నిరోధించేందుకు చేపట్టిన ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా, అధిక శబ్దం కలిగించే మాడిఫైడ్ సైలెన్సర్లను గత...
Read More...
Local News 

వాసవి మాత జయంతిని పురస్కరించుకుని మాతలచే సామూహిక కుంకుమార్చన ,పల్లకి సేవ  శోభ యాత్ర 

వాసవి మాత జయంతిని పురస్కరించుకుని మాతలచే సామూహిక కుంకుమార్చన ,పల్లకి సేవ  శోభ యాత్ర                                  సిరిసిల్ల. రాజేంద్ర శర్మ  జగిత్యాల మే 7 (ప్రజా మంటలు)  జిల్లా కేంద్రంలోని రామ్ బజార్ లో గల వాసవి మాత ఆలయంలో వాసవి మాత జయంతి సందర్భంగా ఉదయం సుప్రభాత సేవ, ఉత్సవమూర్తికి పల్లకి సేవ, ఫల పంచామృత అభిషేకం, వసంత రుతువులో లభ్యమయ్యే, ఆమ్ర, పలరసాభిషేకం నిర్వహించారు. మాతలు విశేష సంఖ్యలో  సామూహిక...
Read More...
Local News 

విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఉచిత కుట్టు శిక్షణ శిబిరం ప్రారంభం

విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఉచిత కుట్టు శిక్షణ శిబిరం ప్రారంభం జగిత్యాల మే 7, ప్రజా మంటలు  విశ్వహిందూ పరిషత్  ఆధ్వర్యంలో జగిత్యాల నగర సేవా ప్రముఖ ఎలగందుల రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లా కార్యాలయంలో ఉచిత కుట్టు మిషన్ శిక్షణ శిబిరం ప్రారంభించారు. ఈ కుట్టుమిషన్ శిక్షణ కేంద్రంలో మహిళలు మూడు నెలలు ట్రైనింగ్ పొందుతారు.ఆ తర్వాత సర్టిఫికెట్స్ ఇవ్వబడుతుంది.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు...
Read More...
Local News 

ఘనంగా వాసవి మాత జయంతి ఉత్సవాలు*🚩🚩🚩🚩

ఘనంగా వాసవి మాత జయంతి ఉత్సవాలు*🚩🚩🚩🚩 భీమదేవరపల్లి మే 8 (ప్రజామంటలు) : వాసవి మాత జయంతి సందర్భంగా అంచురీస్ కన్వెన్షన్ హాల్లో ఆర్యవైశ్యులందరు, వాసవి మాతకు కుంకుమ పూజలు నిర్వహించారు. మన దేశం శాంతియుతంగా, సుభిక్షంగా ఉండాలని వాసవి మాతను ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు అంచూరి వెంకట్రాజము, గౌరవ అధ్యక్షులు పెద్ది సూర్య ప్రకాశం, కార్యవర్గ సభ్యులు...
Read More...
Local News 

వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డ ఉగాండా యువతి

వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డ ఉగాండా యువతి సికింద్రాబాద్ మే 07 (ప్రజామంటలు) : ఉగాండా కు చెందిన యువతి వ్యభిచారం చేస్తూ బోయిన్ పల్లి పోలీసులకు పట్టుబడింది. బోయిన్ పల్లి ఇన్స్పెక్టర్ ఎన్.తిరుపతి రాజు తెలిపిన వివరాలు...మబ్జి షరాన్(23)అనే యువతి ఉగాండా దేశంలోని కోకో మేర్ ప్రాంతం నుంచి గత ఏడాది ఫిబ్రవరి21న టూరిస్ట్ వీసాపై ముంబై కి వచ్చింది. అక్కడి నుంచి...
Read More...