క్రమపద్ధతిలో హైదరాబాద్ నగరాభివృద్ధికి ప్రణాళికలు - సిఎం రేవంత్ రెడ్డి 

ప్రజాపాలన – ప్రజా విజయోత్సవాలు

On
క్రమపద్ధతిలో హైదరాబాద్ నగరాభివృద్ధికి ప్రణాళికలు - సిఎం రేవంత్ రెడ్డి 

క్రమపద్ధతిలో హైదరాబాద్ నగరాభివృద్ధికి ప్రణాళికలు - సిఎం రేవంత్ రెడ్డి 

ప్రజాపాలన – ప్రజా విజయోత్సవాలు

హైదరాబాద్ డిసెంబర్ 03:

దేశంలో ముఖ్య నగరాలైన ఢిల్లీ, ముంబయ్, చెన్నై, బెంగుళూరు, కోల్‌కతా నగరాలు వాయు, భూమి, నీటి కాలుష్యాలతో అతలాకుతలమవుతున్న అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకుని అలాంటి ప్రమాదాలు హైదరాబాద్ నగరానికి రాకుండా అభివృద్ధికి ఒక క్రమపద్ధతిలో బాటలు వేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు.

హైదరాబాద్‌ను అంతర్జాతీయ స్థాయి నగరంగా తీర్చిదిద్దాలని సంకల్పంతో అడుగులు వేస్తున్న ప్రజా ప్రభుత్వం అందుకు అవసరమైన మౌలిక సదుపాయాల అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. రూ. 5,827 కోట్లతో వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు.

♦️ప్రజాపాలన – ప్రజా విజయోత్సవాలు కార్యక్రమంలో భాగంగా Hyderabad Rising ఉత్సవాలను హెచ్ఎండీఏ మైదానంలో మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నగరంలో పలు అభివృద్ధి పనులకు వర్చువల్ గా ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేశారు.

♦️ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క గారు, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు, పొన్నం ప్రభాకర్ గారు, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి గారు, స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ గారితో పాటు పాటు పలువురు ప్రజాప్రతినిధులు, ఆయా శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

➡️ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ...

♦️దేశంలోని ప్రధాన నగరాలు ఎదుర్కొంటున్న ప్రమాదకర పరిస్థితులను గమనించే మూసీ నదిని ప్రక్షాళన చేయాలని, నదికి పునరుజ్జీవం చేయాలని సంకల్పించాం. వరదలొస్తే నగరంలో ఎక్కడికక్కడ నీళ్లు నిలిచే పరిస్థితి వచ్చింది. అందుకే నగరంలో 141 ప్రాంతాల్లో వాటర్ హార్వెస్టింగ్ వెల్స్ కడుతున్నాం.

♦️భవిష్యత్తరాలకు ఒక అద్భుతమైన హైదరాబాద్ నగరాన్ని అందించాలి. అప్పుడే నగరం ప్రపంచ పెట్టుబడులకు వేదిక అవుతుంది. ప్రపంచ పటంలో ఒక అద్భుతమైన నగరంగా నిలబడుతుంది.

♦️మనం బాగుపడటానికి ఎవరో వస్తారని చూసుకుంటూ కూర్చుంటే ఈ నగరం వరదలతో ముంచెత్తుతుంది. కాలుష్యం కోరల్లో చిక్కుకుంటుంది. నాలాల ఆక్రమణలను తొలగించాలి. మూసీని ప్రక్షాళన చేయాలి. పారిశ్రామిక కాలుష్యాలు మూసీలో కలవకుండా నియంత్రించాలి.

♦️చెరువులు, కుంటలు, నాలాలను ఆక్రమించుకున్న చోట ఆక్రమణలను తొలగించడానికి హైడ్రా పనిచేస్తుంది.

♦️రాష్ట్ర సమగ్రాభివృద్ధిని కాంక్షించే తెలంగాణకు మణిహారంగా 35 వేల కోట్ల రూపాయలను వెచ్చించి 360 కిలోమీటర్ల పొడవున రీజినల్ రింగ్ రోడ్డును చేపట్టాం. కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు సాధించి రీజినల్ రింగ్ రోడ్డును పూర్తి చేయడానికి ప్రయత్నిస్తున్నాం.

♦️రీజినల్ రింగ్ రోడ్డు నుంచి అవుటర్ రింగ్ రోడ్డు వరకు మధ్యన రేడియల్ రోడ్లు వేయడానికి 15 వేల కోట్ల రూపాయల వ్యయం చేయగలిగితే తద్వారా 60 శాతం తెలంగాణను అభివృద్ధి బాటన పడుతుంది.

♦️ఇబ్రహీంపట్నంలో 250 ఎకరాల్లో అంతర్జాతీయ స్థాయిలో మార్కెట్ ఏర్పాటు చేస్తున్నాం. అందులో కూరగాయలు,   ఫ్రూట్ మార్కెట్, డెయిరీ, పౌల్టీ, మీట్ ప్రాడక్ట్స్ సదుపాయాలు ఉంటాయి. వీటికి అనుబంధంగా కోల్డ్ స్టోరేజీలను నిర్మిస్తాం.

♦️ముచ్చర్ల ప్రాంతంలో 40 నుంచి 50 వేల ఎకరాల్లో అంతర్జాతీయ స్థాయి ఫ్యూచర్ సిటీని ప్రతిపాదించాం. 1 ఏప్రిల్ - 30 నవంబర్ 2023 ఆరు నెల్లతో పోల్చితే 1 ఏప్రిల్ - 30 నవంబర్ 2024 కాలంలో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ 29 శాతం పెరిగింది.

♦️రాజధాని హైదరాబాద్ నగరానికి పెట్టుబడులు, ప్రపంచ పర్యాటకులను ఆకర్షించాలంటే మెట్రో విస్తరణ, రీజినల్ రింగ్ రోడ్డు, రేడియల్ రోడ్ల నిర్మాణం, గోదావరి నుంచి నీటిని తరలింపు, మూసీ ప్రక్షాళన చేయకతప్పదు. ఈ ప్రాజెక్టులన్నింటికీ రాబోయే 4 సంవత్సరాల్లో లక్షన్నర కోట్ల రూపాయలు కావాలి.

♦️హైదరాబాద్ నగరమే మన ఆదాయం. ఆత్మగౌరవం. నగర సమగ్రాభివృద్ధికి ప్రణాళికలు చేస్తున్నాం. ఆ ప్రణాళికల ద్వారా అంతర్జాతీయ పెట్టుబడులు తీసుకొచ్చి నగరాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పారు.

✅ Hyderabada Rising ఉత్సవంలో భాగంగా నెక్లెస్ రోడ్డు HMDA మైదానంలో నిర్వహించిన కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ గారితో కలిసి ఆయా అభివృద్ధి ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి వర్చువల్ గా ప్రారంభించారు.

✅ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) పరిధిలో H-CITI ఫేజ్-1 లో ఇప్పటికే పరిపాలనా అనుమతులను మంజూరు చేసిన రూ. 3446 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన.

✅ నగరంలో రహదారులు, వివిధ జంక్షన్ల సుందరీకరణకు రూ. 150 కోట్లతో వివిధ పనులకు శంకుస్థాపన చేశారు.

✅ నగరంలో వరదనీరు నిలవకుండా వర్షపు నీటి సంరక్షణ, వరద నీటిని నియంత్రించే పనులకు రూ. 17 కోట్ల అంచనాలతో చేపట్టే పనుల ప్రారంభించారు. 

✅ రూ. 669 కోట్ల అంచనాలతో హైదరాబాద్ జల మండలి (HMWSSB) అధ్వర్యంలో నిర్మించిన మురుగు నీటిని శుద్ధి చేసే ప్లాంట్లు (సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు) ప్రారంభించారు. 

✅ తాగునీటి సరఫరాకు అవుటర్ రింగ్ రోడ్డు ORR చుట్టూ వివిధ ప్రాంతాల్లో రూ. 45 కోట్లతో చేపట్టిన 19 రిజర్వాయర్లను ప్రారంభించారు.

✅ హైదరాబాద్ రోడ్స్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (HRDCL) అధ్వర్యంలో గ్రేటర్ సిటీలో రూ. 1500 కోట్లతో రోడ్లను అభివృద్ధి చేసే ప్యాకేజీతో పాటు గతంలో పెండింగ్‌లో ఉన్న పనులకు శంకుస్థాపన చేశారు.

✅ అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనుసంధానంతో కొత్త ఆన్‌లైన్‌లో బిల్డింగ్ అప్రూవల్, లేఅవుట్ అప్రూవల్ సాఫ్ట్‌వేర్‌ను  సీఎంగారు లాంఛనంగా ప్రారంభించారు. 2025 ఫిబ్రవరి నుంచి ఈ విధానం అమలులోకి రానుంది.

Tags

More News...

National  International   State News 

మ్యూనిచ్ లో రేవంత్ రెడ్డి బృందానికి ఘన స్వాగతం

మ్యూనిచ్ లో రేవంత్ రెడ్డి బృందానికి ఘన స్వాగతం మ్యూనిచ్ లో రేవంత్ రెడ్డి బృందానికి ఘన స్వాగతం మ్యూనిచ్ జనవరి 20: దావోస్ వరల్డ్ ఎకనమిక్ ఫోరం (World Economic Forum) సదస్సులో పాల్గొనడానికి జ్యూరిచ్ చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందానికి విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది.  ముఖ్యమంత్రి, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఉన్నతాధికారుల ప్రతినిధి బృందం జ్యూరిచ్ విమానాశ్రయం చేరుకోగానే అక్కడ...
Read More...
Local News 

ముదిరాజ్​లను బీసీ 'డీ' నుంచి బీసీ 'ఏ' లోకి మార్చాలి

ముదిరాజ్​లను బీసీ 'డీ' నుంచి బీసీ 'ఏ' లోకి మార్చాలి ముదిరాజ్​లను బీసీ 'డీ' నుంచి బీసీ 'ఏ' లోకి మార్చాలి- అఖిల భారతీయ కోలి ముదిరాజ్ జాతీయ కార్యవర్గ తీర్మానం సికింద్రాబాద్​, జనవరి 20 ( ప్రజామంటలు): దీర్ఘకాలికంగా పెండింగ్​ లో ఉన్న ముదిరాజ్​ కమ్యూనిటీని బీసీ డీ నుంచి బీసీ ఏ లోకి మార్చే ప్రతిపాదనను వెంటనే అమలు చేయాలని పలువురు వక్తలు...
Read More...
Local News 

పిల్లల భద్రతే  మాకు ముఖ్యం, రోడ్డు ప్రమాద నివారణలో అందరూ భాగస్వాములు కావాలి: జిల్లా ఎస్పి శ్రీ అశోక్ కుమార్

పిల్లల భద్రతే  మాకు ముఖ్యం, రోడ్డు ప్రమాద నివారణలో అందరూ భాగస్వాములు కావాలి: జిల్లా ఎస్పి శ్రీ అశోక్ కుమార్ పిల్లల భద్రతే  మాకు ముఖ్యం, రోడ్డు ప్రమాద నివారణలో అందరూ భాగస్వాములు కావాలి: జిల్లా ఎస్పి శ్రీ అశోక్ కుమార్    జగిత్యాల జనవరి 20  (ప్రజా మంటలు):స్కూల్ వాహనాలకు ఎలాంటి చిన్న ప్రమాదం జరిగిన సంబంధిత డ్రైవరు, యాజమాన్యం పై  కఠినంగా వ్యవహరిస్తాం.విద్యాసంస్థల ప్రతి వాహనానికి తప్పనిసరిగా రోడ్  ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వారి చే...
Read More...
Local News 

ప్రవేట్ స్కూల్ బస్సులను తనిఖీ చేసిన ఎస్ఐ సిహెచ్.సతీష్ 

ప్రవేట్ స్కూల్ బస్సులను తనిఖీ చేసిన ఎస్ఐ సిహెచ్.సతీష్  ప్రవేట్ స్కూల్ బస్సులను తనిఖీ చేసిన ఎస్ఐ సిహెచ్.సతీష్  గొల్లపల్లి జనవరి 20 (ప్రజా మంటలు): జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకురోడ్డు మరియు రహదారి భద్రత  మాసవోత్సవం   సందర్భంగా  గొల్లపల్లి మండల లోని ప్రైవేట్ స్కూల్ బస్సులను  ఎస్ఐ,సతీష్ తనిఖీలు చేశారు. ఆయన మాట్లాడుతూ, మాట్లాడుతూ పిల్లల్ని స్కూలుకు ఇంటికి వరకు...
Read More...
Local News 

భార్య చనిపోగా భర్త మానసిక వేదనతో  ఆత్మహత్య

భార్య చనిపోగా భర్త మానసిక వేదనతో  ఆత్మహత్య భార్య చనిపోగా భర్త మానసిక వేదనతో ఆత్మహత్య ఇబ్రహీంపట్నం జనవరి 20( ప్రజా మంటలు): ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని  గోదురు గ్రామానికి చెందిన రెబ్బసి శాంత మూడు నెలల క్రితం మరణించగా తన భర్త రెబ్బసి ఆశన్న, భార్య గురించి తలుచుకుంటూ మానసిక వేదనకు గురవుతూ ప్రతిరోజు బాధపడుతుండెవాడని  సోమవారం  ఇటలీ ఎవరు లేని సమయంలో...
Read More...
Local News 

మధ్యాహ్న భోజన పథకం లో పెరిగిన ధరలకు అనుగుణంగా బిల్లులు ఇవ్వాలి - వర్కర్స్ యూనియన్ వినతి పత్రం

మధ్యాహ్న భోజన పథకం లో పెరిగిన ధరలకు అనుగుణంగా బిల్లులు ఇవ్వాలి - వర్కర్స్ యూనియన్ వినతి పత్రం   మధ్యాహ్న భోజన పథకం లో పెరిగిన ధరలకు అనుగుణంగా బిల్లులు ఇవ్వాలి - వర్కర్స్ యూనియన్ వినతి పత్రం మెట్టుపల్లి జనవరి 20( ప్రజా మంటలు) తెలంగాణ రాష్ట్ర ఏఐటీయూసీ అనుబంధ మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో  పెరిగిన ధరలకు అనుగుణంగా బిల్లులు ఇవ్వాలని మెట్పల్లిలోని మండల విద్యాశాఖ అధికారికి మధ్యాహ్న భోజన...
Read More...
Local News 

మీత అయ్య వార్ల అధ్యక్షునిగా తిరు కోవేల నరసయ్య, 

మీత అయ్య వార్ల అధ్యక్షునిగా తిరు కోవేల నరసయ్య,  మీత అయ్య వార్ల అధ్యక్షునిగా తిరు కోవేల నరసయ్య,  మెట్టుపల్లి జనవరి 26 (ప్రజా మంటలు) మెట్టుపల్లి  డివిజన్ మిత అయ్యవారు అధ్యక్షుని గా తిరు కోవెల  నరసయ్య, ఉపాధ్యక్షులుగా సాత్పడిఅశోక్, ప్రధాన కార్యదర్శిగా గడ్డల కాంతయ్య, కోశాధికారి గా ధర్మపురి పురుషోత్తం ను ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డారు మెట్టుపల్లి లో సోమవారం జరిగిన మిత అయ్యవార్ల...
Read More...
Local News 

ధర్మపురి క్షేత్రాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి  ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ 

ధర్మపురి క్షేత్రాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి  ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్  ధర్మపురి క్షేత్రాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి  ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్  ధర్మపురి జనవరి 20:   దక్షిణ కాశీగా, హరిహర క్షేత్రంగా, గోదావరి తీరాన వెలసి, మున్సిపాలిటీ, మండల, నియోజక వర్గ కేంద్రంగా, నిత్య భక్త జన సందడితో అలరారే ధర్మపురి క్షేత్రం సమగ్రాభివృద్ధికి కృషి సల్పగనని ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరిలక్ష్మణ్ కుమార్...
Read More...
Local News 

కాంగ్రెస్​ నేతలు కంటి పరీక్షలు  చేయించుకోవాలి  * బీఆర్​ఎస్​ హాయంలో చేసిన పనులు కనిపించడం లేదా..?

కాంగ్రెస్​ నేతలు కంటి పరీక్షలు  చేయించుకోవాలి  * బీఆర్​ఎస్​ హాయంలో చేసిన పనులు కనిపించడం లేదా..? కాంగ్రెస్​ నేతలు కంటి పరీక్షలు  చేయించుకోవాలి  * బీఆర్​ఎస్​ హాయంలో చేసిన పనులు కనిపించడం లేదా..? సికింద్రాబాద్, జనవరి 20 (ప్రజామంటలు): బీఆర్​ఎస్​ ప్రభుత్వం చేసిన అభివృద్ది పనులు కాంగ్రెస్​ నాయకులకు కనింపించకపోతే, కంటి పరీక్షలు చేయించుకోవాలని బన్సీలాల్​ పేట డివిజన్​ బీఆర్​ఎస్​ ప్రెసిడెంట్​ ఎల్​.వెంకటేశన్​ రాజు పేర్కొన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ...మాజీ మంత్రి,...
Read More...
Local News 

ప్రతి బ్యాంక్ ఏటీఎం వద్ద తప్పనిసరిగా  సెక్యూరిటీ గార్డు, సిసి కెమెరాలు, అలారం సిస్టం ఏర్పాటు చేయాలి

ప్రతి బ్యాంక్ ఏటీఎం వద్ద తప్పనిసరిగా  సెక్యూరిటీ గార్డు, సిసి కెమెరాలు, అలారం సిస్టం ఏర్పాటు చేయాలి ఎస్పీ అశోక్   జగిత్యాల జనవరి 20(  ప్రజా మంటలు  )జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా  వ్యాప్తంగా  ఉన్న  వివిధ బ్యాంకుల్లో పని చేస్తున్న బ్యాంకు అధికారులతో  బ్యాంకుల, ఏటీఎంల  వద్ద భద్రతా ప్రమాణాలు, సిసి కెమెరాల ఏర్పాటు, ఆర్థిక నేరాలు, గతంలో   జరిగిన బ్యాంకు మరియు ఏటీఎం సంబందించిన నేరాల గురించి, భవిష్యత్తు లో...
Read More...
Local News 

మాదిగల మహా ప్రదర్శనకు బీసీలుగా మద్దతిద్దాం బీసీ నేత దరువు అంజన్న

మాదిగల మహా ప్రదర్శనకు బీసీలుగా మద్దతిద్దాం  బీసీ నేత దరువు అంజన్న   జగిత్యాల జనవరి 20(ప్రజా మంటలు   )      ఫిబ్రవరి ఏడవ తారీఖున హైదరాబాద్ మహానగరంలో మందకృష్ణ మాదిగ జరపతల పెట్టిన లక్ష డప్పులు వేల గొంతుల మహాప్రదర్శనకు బీసీలుగా తరలిరావాలని బీసీ కవులు కళాకారులు మేధావుల ఐక్యవేదిక కన్వీనర్  దరువు అంజన్న పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలో విలేకరుల సమావేశం లో   ఉద్యమకారులు,కవి మోహన్ బైరాగి మాట్లాడుతూ ,...
Read More...