క్రమపద్ధతిలో హైదరాబాద్ నగరాభివృద్ధికి ప్రణాళికలు - సిఎం రేవంత్ రెడ్డి 

ప్రజాపాలన – ప్రజా విజయోత్సవాలు

On
క్రమపద్ధతిలో హైదరాబాద్ నగరాభివృద్ధికి ప్రణాళికలు - సిఎం రేవంత్ రెడ్డి 

క్రమపద్ధతిలో హైదరాబాద్ నగరాభివృద్ధికి ప్రణాళికలు - సిఎం రేవంత్ రెడ్డి 

ప్రజాపాలన – ప్రజా విజయోత్సవాలు

హైదరాబాద్ డిసెంబర్ 03:

దేశంలో ముఖ్య నగరాలైన ఢిల్లీ, ముంబయ్, చెన్నై, బెంగుళూరు, కోల్‌కతా నగరాలు వాయు, భూమి, నీటి కాలుష్యాలతో అతలాకుతలమవుతున్న అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకుని అలాంటి ప్రమాదాలు హైదరాబాద్ నగరానికి రాకుండా అభివృద్ధికి ఒక క్రమపద్ధతిలో బాటలు వేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు.

హైదరాబాద్‌ను అంతర్జాతీయ స్థాయి నగరంగా తీర్చిదిద్దాలని సంకల్పంతో అడుగులు వేస్తున్న ప్రజా ప్రభుత్వం అందుకు అవసరమైన మౌలిక సదుపాయాల అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. రూ. 5,827 కోట్లతో వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు.

♦️ప్రజాపాలన – ప్రజా విజయోత్సవాలు కార్యక్రమంలో భాగంగా Hyderabad Rising ఉత్సవాలను హెచ్ఎండీఏ మైదానంలో మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నగరంలో పలు అభివృద్ధి పనులకు వర్చువల్ గా ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేశారు.

♦️ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క గారు, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు, పొన్నం ప్రభాకర్ గారు, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి గారు, స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ గారితో పాటు పాటు పలువురు ప్రజాప్రతినిధులు, ఆయా శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

➡️ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ...

♦️దేశంలోని ప్రధాన నగరాలు ఎదుర్కొంటున్న ప్రమాదకర పరిస్థితులను గమనించే మూసీ నదిని ప్రక్షాళన చేయాలని, నదికి పునరుజ్జీవం చేయాలని సంకల్పించాం. వరదలొస్తే నగరంలో ఎక్కడికక్కడ నీళ్లు నిలిచే పరిస్థితి వచ్చింది. అందుకే నగరంలో 141 ప్రాంతాల్లో వాటర్ హార్వెస్టింగ్ వెల్స్ కడుతున్నాం.

♦️భవిష్యత్తరాలకు ఒక అద్భుతమైన హైదరాబాద్ నగరాన్ని అందించాలి. అప్పుడే నగరం ప్రపంచ పెట్టుబడులకు వేదిక అవుతుంది. ప్రపంచ పటంలో ఒక అద్భుతమైన నగరంగా నిలబడుతుంది.

♦️మనం బాగుపడటానికి ఎవరో వస్తారని చూసుకుంటూ కూర్చుంటే ఈ నగరం వరదలతో ముంచెత్తుతుంది. కాలుష్యం కోరల్లో చిక్కుకుంటుంది. నాలాల ఆక్రమణలను తొలగించాలి. మూసీని ప్రక్షాళన చేయాలి. పారిశ్రామిక కాలుష్యాలు మూసీలో కలవకుండా నియంత్రించాలి.

♦️చెరువులు, కుంటలు, నాలాలను ఆక్రమించుకున్న చోట ఆక్రమణలను తొలగించడానికి హైడ్రా పనిచేస్తుంది.

♦️రాష్ట్ర సమగ్రాభివృద్ధిని కాంక్షించే తెలంగాణకు మణిహారంగా 35 వేల కోట్ల రూపాయలను వెచ్చించి 360 కిలోమీటర్ల పొడవున రీజినల్ రింగ్ రోడ్డును చేపట్టాం. కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు సాధించి రీజినల్ రింగ్ రోడ్డును పూర్తి చేయడానికి ప్రయత్నిస్తున్నాం.

♦️రీజినల్ రింగ్ రోడ్డు నుంచి అవుటర్ రింగ్ రోడ్డు వరకు మధ్యన రేడియల్ రోడ్లు వేయడానికి 15 వేల కోట్ల రూపాయల వ్యయం చేయగలిగితే తద్వారా 60 శాతం తెలంగాణను అభివృద్ధి బాటన పడుతుంది.

♦️ఇబ్రహీంపట్నంలో 250 ఎకరాల్లో అంతర్జాతీయ స్థాయిలో మార్కెట్ ఏర్పాటు చేస్తున్నాం. అందులో కూరగాయలు,   ఫ్రూట్ మార్కెట్, డెయిరీ, పౌల్టీ, మీట్ ప్రాడక్ట్స్ సదుపాయాలు ఉంటాయి. వీటికి అనుబంధంగా కోల్డ్ స్టోరేజీలను నిర్మిస్తాం.

♦️ముచ్చర్ల ప్రాంతంలో 40 నుంచి 50 వేల ఎకరాల్లో అంతర్జాతీయ స్థాయి ఫ్యూచర్ సిటీని ప్రతిపాదించాం. 1 ఏప్రిల్ - 30 నవంబర్ 2023 ఆరు నెల్లతో పోల్చితే 1 ఏప్రిల్ - 30 నవంబర్ 2024 కాలంలో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ 29 శాతం పెరిగింది.

♦️రాజధాని హైదరాబాద్ నగరానికి పెట్టుబడులు, ప్రపంచ పర్యాటకులను ఆకర్షించాలంటే మెట్రో విస్తరణ, రీజినల్ రింగ్ రోడ్డు, రేడియల్ రోడ్ల నిర్మాణం, గోదావరి నుంచి నీటిని తరలింపు, మూసీ ప్రక్షాళన చేయకతప్పదు. ఈ ప్రాజెక్టులన్నింటికీ రాబోయే 4 సంవత్సరాల్లో లక్షన్నర కోట్ల రూపాయలు కావాలి.

♦️హైదరాబాద్ నగరమే మన ఆదాయం. ఆత్మగౌరవం. నగర సమగ్రాభివృద్ధికి ప్రణాళికలు చేస్తున్నాం. ఆ ప్రణాళికల ద్వారా అంతర్జాతీయ పెట్టుబడులు తీసుకొచ్చి నగరాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పారు.

✅ Hyderabada Rising ఉత్సవంలో భాగంగా నెక్లెస్ రోడ్డు HMDA మైదానంలో నిర్వహించిన కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ గారితో కలిసి ఆయా అభివృద్ధి ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి వర్చువల్ గా ప్రారంభించారు.

✅ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) పరిధిలో H-CITI ఫేజ్-1 లో ఇప్పటికే పరిపాలనా అనుమతులను మంజూరు చేసిన రూ. 3446 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన.

✅ నగరంలో రహదారులు, వివిధ జంక్షన్ల సుందరీకరణకు రూ. 150 కోట్లతో వివిధ పనులకు శంకుస్థాపన చేశారు.

✅ నగరంలో వరదనీరు నిలవకుండా వర్షపు నీటి సంరక్షణ, వరద నీటిని నియంత్రించే పనులకు రూ. 17 కోట్ల అంచనాలతో చేపట్టే పనుల ప్రారంభించారు. 

✅ రూ. 669 కోట్ల అంచనాలతో హైదరాబాద్ జల మండలి (HMWSSB) అధ్వర్యంలో నిర్మించిన మురుగు నీటిని శుద్ధి చేసే ప్లాంట్లు (సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు) ప్రారంభించారు. 

✅ తాగునీటి సరఫరాకు అవుటర్ రింగ్ రోడ్డు ORR చుట్టూ వివిధ ప్రాంతాల్లో రూ. 45 కోట్లతో చేపట్టిన 19 రిజర్వాయర్లను ప్రారంభించారు.

✅ హైదరాబాద్ రోడ్స్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (HRDCL) అధ్వర్యంలో గ్రేటర్ సిటీలో రూ. 1500 కోట్లతో రోడ్లను అభివృద్ధి చేసే ప్యాకేజీతో పాటు గతంలో పెండింగ్‌లో ఉన్న పనులకు శంకుస్థాపన చేశారు.

✅ అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనుసంధానంతో కొత్త ఆన్‌లైన్‌లో బిల్డింగ్ అప్రూవల్, లేఅవుట్ అప్రూవల్ సాఫ్ట్‌వేర్‌ను  సీఎంగారు లాంఛనంగా ప్రారంభించారు. 2025 ఫిబ్రవరి నుంచి ఈ విధానం అమలులోకి రానుంది.

Tags

More News...

Local News 

రూ.303 కోట్లను తేవడంలో  కిషన్ రెడ్డి, ఈటల కృషి ఉంది

రూ.303 కోట్లను తేవడంలో  కిషన్ రెడ్డి, ఈటల కృషి ఉంది సికింద్రాబాద్ జూలై 09 (ప్రజా మంటలు):  ఎలివెటెడ్ కారిడర్ విషయంలో 303 కోట్ల రుపాయలు తీసుకరావడంలో బీజేపీ నేతల ప్రయత్నాలు ఫలించాయని..ఇందులో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీఈటల రాజేందర్ కృషితో పాటు సైనికులుగా తమ ప్రయత్నం ఉందని కంటోన్మెంట్ బోర్డు నామినేట్ మాజీ సభ్యుడు రామకృష్ణ స్పష్టం చేశారు. కేంద్రం ఖాతా లో జమ...
Read More...
Local News 

సీఎం కృషి తోనే కంటోన్మెంట్ బోర్డుకు రూ 303 కోట్ల మంజూరు

సీఎం కృషి తోనే కంటోన్మెంట్ బోర్డుకు రూ 303 కోట్ల మంజూరు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్  సికింద్రాబాద్ జూలై09 (ప్రజామంటలు) : రాష్ట్ర ప్రభుత్వం కంటోన్మెంట్ ఏరియాలో ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణం కోసం తీసుకున్న భూములకు కేంద్ర ప్రభుత్వానికి చెల్లించాల్సిన 303 కోట్లను కంటోన్మెంట్ బోర్డుకు వచ్చేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి చేశారని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ పేర్కొన్నారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ..రాష్ర్ట ప్రభుత్వం దగ్గర...
Read More...
Local News  State News 

మేడిపల్లి నూతన ఎస్ఐగా మాడ శ్రీధర్ రెడ్డి బాధ్యతలు స్వీకరణ

మేడిపల్లి నూతన ఎస్ఐగా మాడ శ్రీధర్ రెడ్డి బాధ్యతలు స్వీకరణ గొల్లపల్లి (మేడిపల్లి) జూలై 9 (ప్రజా మంటలు):    మేడిపల్లి మండల పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ గామాడ శ్రీధర్ రెడ్డి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఎస్ఐ గా పదవి బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా స్టేషన్ సిబ్బంది శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ, శాంతి భద్రతలను మెరుగుపరిచేందుకు
Read More...
Local News 

ఘనంగా శ్రీసాయి నరసింహాస్వామి సేవ - నేడు గురుపౌర్ణమి -ప్రత్యేక ఏర్పాట్లు పూర్తి

ఘనంగా శ్రీసాయి నరసింహాస్వామి సేవ - నేడు గురుపౌర్ణమి -ప్రత్యేక ఏర్పాట్లు పూర్తి సికింద్రాబాద్ జూలై 09 (ప్రజామంటలు) : పద్మారావునగర్ లోని డాక్టర్ సాయి కుమార్ వ్యాధి నివారణ్ ఆశ్రమ్ లో శ్రీసాయి సప్తాహ ఉత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. ఆరవ రోజు బుధవారం శ్రీసాయి బాబా ఆలయంలో శ్రీసాయి నరసింహాస్వామి  సేవ నిర్వహించగా, వందలాది మంది భక్తులు పాల్గొన్నారు. ఈసందర్బంగా భక్తులకు అన్నదానం నిర్వహించారు. సాయంత్రం ఆలయ ఆవరణలో...
Read More...
Local News  State News 

గాంధీ ఆస్పత్రిలో కల్తీ కల్లు బాధితుడి మృతి - మరో ఇద్దరిని నిమ్స్ కు తరలింపు.

గాంధీ ఆస్పత్రిలో కల్తీ కల్లు బాధితుడి మృతి - మరో ఇద్దరిని నిమ్స్ కు తరలింపు. సికింద్రాబాద్, జూలై 09 (ప్రజామంటలు) : కల్తీ కల్లు తాగిన ఘటనలో గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సీతారాం(47) అనే వ్యక్తి మృతి చెందాడు. సోమవారం రోజు కల్లు తాగిన సీతారాం ఇంటికి వచ్చిన తర్వాత వాంతులు విరోచనాలు కావడంతో అదే రోజున అరుంధతి ఆసుపత్రికి వెళ్ళినట్లు అతని భార్య అనిత తెలిపారు. గాంధీ ఆసుపత్రికి...
Read More...
Local News 

ఆషాడ మాస వనభోజనాలతో ఉల్లాసం – ముత్తారం గ్రామ ఆడపడుచుల సాంప్రదాయ భేటీ

ఆషాడ మాస వనభోజనాలతో ఉల్లాసం – ముత్తారం గ్రామ ఆడపడుచుల సాంప్రదాయ భేటీ 📍 భీమదేవరపల్లి మండలం, జూలై 9 (ప్రజామంటలు) 🌿 ఆషాడ మాసం చివరదశలో భక్తి, ఆనంద, స్నేహ బంధాలతో సాగిన ఓ మధుర ఘట్టం… భీమదేవరపల్లి మండలంలోని ముత్తారం గ్రామ మహిళలు సంప్రదాయ పద్ధతిలో వనభోజనాలను నిర్వహించారు. ప్రకృతి ఒడిలోని హరితవనంలో ఆటపాటలతో, మిఠపలుకులతో, హాస్యాలతో వెలిగిన ఈ కార్యక్రమం ప్రతి ఒక్కరికీ మరిచిపోలేని అనుభూతిగా...
Read More...
Local News  State News 

బోనాల జాతర చెక్కుల గోల్ మాల్ పై ఎండోమెంట్ అధికారుల విచారణ

బోనాల జాతర చెక్కుల గోల్ మాల్ పై ఎండోమెంట్ అధికారుల విచారణ పక్కదారి పట్టిన నిధులను రికవరీ చేయాలని కాంగ్రెస్ నేతల డిమాండ్ సికింద్రాబాద్  జూలై 09 (ప్రజా మంటలు): ఆషాడ బోనాల జాతరను ఆయా ఆలయాల్లో ఘనంగా నిర్వహించడానికి ప్రభుత్వం ఆయా ఆలయాలకు అందించే నిధులు దుర్వినియోగం అవుతున్నాయి. ఈమేరకు ఇటీవల బన్సీలాల్ పేట డివిజన్ లో కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఐత చిరంజీవి బోనాల జాతర చెక్కులు...
Read More...
Local News  State News 

ఎరువులకు కూడా కరువు, రైతు గోస పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వం. - జిల్లా పరిషత్ తొలి ఛైర్ పర్సన్ దావ వసంత సురేష్.

ఎరువులకు కూడా కరువు, రైతు గోస పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వం. - జిల్లా పరిషత్ తొలి ఛైర్ పర్సన్ దావ వసంత సురేష్. (సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113) జగిత్యాల, జులై 08 (ప్రజా మంటలు) : కాంగ్రెస్ పాలనలో ఎరువులకు కూడా కరువు ఉండడం విచారకరం అని జిల్లా పరిషత్ తొలి ఛైర్ పర్సన్ దావ వసంత సురేష్ అన్నారు. జిల్లాలో రైతులు ఎదురుకుంటున్న యూరియా సమస్య కొరత తీర్చాలని, పెంచిన యూరియా బస్తా ధర...
Read More...
Local News 

పద్మారావునగర్ లో  శ్రీసాయి ధన్వంతరీ సేవ

పద్మారావునగర్ లో  శ్రీసాయి ధన్వంతరీ సేవ సికింద్రాబాద్, జూలై 08 (ప్రజామంటలు) : సికింద్రాబాద్ పద్మారావునగర్ లోని డాక్టర్ సాయి వ్యాధి నివారణ ఆశ్రమ్ లో జరుగుతున్న శ్రీసాయి సప్తాహం లో భాగంగా మంగళవారం శ్రీసాయి ధన్వంతరీ సేవ ను ఘనంగా నిర్వహించారు. ఈసందర్బంగా సద్గురు శ్రీశ్రీసాయి కుమార్ జీ  సాయిబాబా సన్నిధానంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం నిర్వహించిన సత్సంగ్ లో...
Read More...
Local News 

బల్కంపేట అమ్మవార్ల ఆలయ హుండీ లెక్కింపు - ఆదాయం రూ . 87 లక్షలు

బల్కంపేట అమ్మవార్ల ఆలయ హుండీ లెక్కింపు - ఆదాయం రూ . 87 లక్షలు సికింద్రాబాద్ జూలై 08 (ప్రజామంటలు): బల్కంపేట ఎల్లమ్మ, పోచమ్మ దేవస్థాన హుండీల లెక్కింపు కార్యక్రమాన్ని అధికారులు నిర్వహించారు. మే 14 నుంచి జూలై 7 వరకు హుండీల ద్వారా భక్తులు సమర్పించిన మొత్తం కానుకలు రూ 87,24,602 ఆదాయం వచ్చిందని  ఆలయ ఈవో పి.మహేందర్ గౌడ్ తెలిపారు. జనరల్ హుండీల ద్వారా రూ86,18, 047 ఆదాయం...
Read More...
Local News 

టీడీఎఫ్ సిల్వర్ జూబ్లీ వేడుకలకు రావాలని మంత్రి శ్రీధర్ బాబుకు ఆహ్వానం 

టీడీఎఫ్ సిల్వర్ జూబ్లీ వేడుకలకు రావాలని మంత్రి శ్రీధర్ బాబుకు ఆహ్వానం  సికింద్రాబాద్ జూలై 08 (ప్రజామంటలు): అమెరికా లో ఆగస్ట్ నెలలో నిర్వహించే తెలంగాణ డెవలప్మెంట్ ఫోరమ్ 25 వసంతాల సెలబ్రేషన్స్ కు రావాలని టీడీఎఫ్ ప్రతినిధులు రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబుకు ఆహ్వాన లేఖ అందజేశారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో పాల్గొనడంతో పాటు తర్వాత తెలంగాణ అభివృద్ధికి పలు కార్యక్రమాలు చేపడుతున్న టీడీఎఫ్ ను మంత్రి...
Read More...
National  Local News  State News 

బీసీ బిల్లు మోదించకపోతే రైలు చక్రాలను ముందుకు కలదలనిచ్చేదే లేదు - ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత 

బీసీ బిల్లు మోదించకపోతే రైలు చక్రాలను ముందుకు కలదలనిచ్చేదే లేదు - ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత  జూలై 17న నిర్వహించబోయే రైల్ రోకో ట్రైలర్ మాత్రమే బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల బిల్లును కేంద్రం తక్షణమే ఆమోదించాలి 42 శాతం రిజర్వేషన్ల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేయవచ్చు దేశమంతా రాజ్యాంగం పట్టుకొని తిరిగే రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డికి చెప్పి జీవో ఇప్పించాలి -  న్యూ ఢిల్లీ జూలై 08:...
Read More...