క్రమపద్ధతిలో హైదరాబాద్ నగరాభివృద్ధికి ప్రణాళికలు - సిఎం రేవంత్ రెడ్డి 

ప్రజాపాలన – ప్రజా విజయోత్సవాలు

On
క్రమపద్ధతిలో హైదరాబాద్ నగరాభివృద్ధికి ప్రణాళికలు - సిఎం రేవంత్ రెడ్డి 

క్రమపద్ధతిలో హైదరాబాద్ నగరాభివృద్ధికి ప్రణాళికలు - సిఎం రేవంత్ రెడ్డి 

ప్రజాపాలన – ప్రజా విజయోత్సవాలు

హైదరాబాద్ డిసెంబర్ 03:

దేశంలో ముఖ్య నగరాలైన ఢిల్లీ, ముంబయ్, చెన్నై, బెంగుళూరు, కోల్‌కతా నగరాలు వాయు, భూమి, నీటి కాలుష్యాలతో అతలాకుతలమవుతున్న అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకుని అలాంటి ప్రమాదాలు హైదరాబాద్ నగరానికి రాకుండా అభివృద్ధికి ఒక క్రమపద్ధతిలో బాటలు వేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు.

హైదరాబాద్‌ను అంతర్జాతీయ స్థాయి నగరంగా తీర్చిదిద్దాలని సంకల్పంతో అడుగులు వేస్తున్న ప్రజా ప్రభుత్వం అందుకు అవసరమైన మౌలిక సదుపాయాల అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. రూ. 5,827 కోట్లతో వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు.

♦️ప్రజాపాలన – ప్రజా విజయోత్సవాలు కార్యక్రమంలో భాగంగా Hyderabad Rising ఉత్సవాలను హెచ్ఎండీఏ మైదానంలో మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నగరంలో పలు అభివృద్ధి పనులకు వర్చువల్ గా ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేశారు.

♦️ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క గారు, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు, పొన్నం ప్రభాకర్ గారు, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి గారు, స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ గారితో పాటు పాటు పలువురు ప్రజాప్రతినిధులు, ఆయా శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

➡️ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ...

♦️దేశంలోని ప్రధాన నగరాలు ఎదుర్కొంటున్న ప్రమాదకర పరిస్థితులను గమనించే మూసీ నదిని ప్రక్షాళన చేయాలని, నదికి పునరుజ్జీవం చేయాలని సంకల్పించాం. వరదలొస్తే నగరంలో ఎక్కడికక్కడ నీళ్లు నిలిచే పరిస్థితి వచ్చింది. అందుకే నగరంలో 141 ప్రాంతాల్లో వాటర్ హార్వెస్టింగ్ వెల్స్ కడుతున్నాం.

♦️భవిష్యత్తరాలకు ఒక అద్భుతమైన హైదరాబాద్ నగరాన్ని అందించాలి. అప్పుడే నగరం ప్రపంచ పెట్టుబడులకు వేదిక అవుతుంది. ప్రపంచ పటంలో ఒక అద్భుతమైన నగరంగా నిలబడుతుంది.

♦️మనం బాగుపడటానికి ఎవరో వస్తారని చూసుకుంటూ కూర్చుంటే ఈ నగరం వరదలతో ముంచెత్తుతుంది. కాలుష్యం కోరల్లో చిక్కుకుంటుంది. నాలాల ఆక్రమణలను తొలగించాలి. మూసీని ప్రక్షాళన చేయాలి. పారిశ్రామిక కాలుష్యాలు మూసీలో కలవకుండా నియంత్రించాలి.

♦️చెరువులు, కుంటలు, నాలాలను ఆక్రమించుకున్న చోట ఆక్రమణలను తొలగించడానికి హైడ్రా పనిచేస్తుంది.

♦️రాష్ట్ర సమగ్రాభివృద్ధిని కాంక్షించే తెలంగాణకు మణిహారంగా 35 వేల కోట్ల రూపాయలను వెచ్చించి 360 కిలోమీటర్ల పొడవున రీజినల్ రింగ్ రోడ్డును చేపట్టాం. కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు సాధించి రీజినల్ రింగ్ రోడ్డును పూర్తి చేయడానికి ప్రయత్నిస్తున్నాం.

♦️రీజినల్ రింగ్ రోడ్డు నుంచి అవుటర్ రింగ్ రోడ్డు వరకు మధ్యన రేడియల్ రోడ్లు వేయడానికి 15 వేల కోట్ల రూపాయల వ్యయం చేయగలిగితే తద్వారా 60 శాతం తెలంగాణను అభివృద్ధి బాటన పడుతుంది.

♦️ఇబ్రహీంపట్నంలో 250 ఎకరాల్లో అంతర్జాతీయ స్థాయిలో మార్కెట్ ఏర్పాటు చేస్తున్నాం. అందులో కూరగాయలు,   ఫ్రూట్ మార్కెట్, డెయిరీ, పౌల్టీ, మీట్ ప్రాడక్ట్స్ సదుపాయాలు ఉంటాయి. వీటికి అనుబంధంగా కోల్డ్ స్టోరేజీలను నిర్మిస్తాం.

♦️ముచ్చర్ల ప్రాంతంలో 40 నుంచి 50 వేల ఎకరాల్లో అంతర్జాతీయ స్థాయి ఫ్యూచర్ సిటీని ప్రతిపాదించాం. 1 ఏప్రిల్ - 30 నవంబర్ 2023 ఆరు నెల్లతో పోల్చితే 1 ఏప్రిల్ - 30 నవంబర్ 2024 కాలంలో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ 29 శాతం పెరిగింది.

♦️రాజధాని హైదరాబాద్ నగరానికి పెట్టుబడులు, ప్రపంచ పర్యాటకులను ఆకర్షించాలంటే మెట్రో విస్తరణ, రీజినల్ రింగ్ రోడ్డు, రేడియల్ రోడ్ల నిర్మాణం, గోదావరి నుంచి నీటిని తరలింపు, మూసీ ప్రక్షాళన చేయకతప్పదు. ఈ ప్రాజెక్టులన్నింటికీ రాబోయే 4 సంవత్సరాల్లో లక్షన్నర కోట్ల రూపాయలు కావాలి.

♦️హైదరాబాద్ నగరమే మన ఆదాయం. ఆత్మగౌరవం. నగర సమగ్రాభివృద్ధికి ప్రణాళికలు చేస్తున్నాం. ఆ ప్రణాళికల ద్వారా అంతర్జాతీయ పెట్టుబడులు తీసుకొచ్చి నగరాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పారు.

✅ Hyderabada Rising ఉత్సవంలో భాగంగా నెక్లెస్ రోడ్డు HMDA మైదానంలో నిర్వహించిన కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ గారితో కలిసి ఆయా అభివృద్ధి ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి వర్చువల్ గా ప్రారంభించారు.

✅ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) పరిధిలో H-CITI ఫేజ్-1 లో ఇప్పటికే పరిపాలనా అనుమతులను మంజూరు చేసిన రూ. 3446 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన.

✅ నగరంలో రహదారులు, వివిధ జంక్షన్ల సుందరీకరణకు రూ. 150 కోట్లతో వివిధ పనులకు శంకుస్థాపన చేశారు.

✅ నగరంలో వరదనీరు నిలవకుండా వర్షపు నీటి సంరక్షణ, వరద నీటిని నియంత్రించే పనులకు రూ. 17 కోట్ల అంచనాలతో చేపట్టే పనుల ప్రారంభించారు. 

✅ రూ. 669 కోట్ల అంచనాలతో హైదరాబాద్ జల మండలి (HMWSSB) అధ్వర్యంలో నిర్మించిన మురుగు నీటిని శుద్ధి చేసే ప్లాంట్లు (సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు) ప్రారంభించారు. 

✅ తాగునీటి సరఫరాకు అవుటర్ రింగ్ రోడ్డు ORR చుట్టూ వివిధ ప్రాంతాల్లో రూ. 45 కోట్లతో చేపట్టిన 19 రిజర్వాయర్లను ప్రారంభించారు.

✅ హైదరాబాద్ రోడ్స్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (HRDCL) అధ్వర్యంలో గ్రేటర్ సిటీలో రూ. 1500 కోట్లతో రోడ్లను అభివృద్ధి చేసే ప్యాకేజీతో పాటు గతంలో పెండింగ్‌లో ఉన్న పనులకు శంకుస్థాపన చేశారు.

✅ అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనుసంధానంతో కొత్త ఆన్‌లైన్‌లో బిల్డింగ్ అప్రూవల్, లేఅవుట్ అప్రూవల్ సాఫ్ట్‌వేర్‌ను  సీఎంగారు లాంఛనంగా ప్రారంభించారు. 2025 ఫిబ్రవరి నుంచి ఈ విధానం అమలులోకి రానుంది.

Tags

More News...

Local News 

ఘనంగా శ్రీసాయి సప్తాహం ముగింపువేడుకలు

ఘనంగా శ్రీసాయి సప్తాహం ముగింపువేడుకలు గురు పౌర్ణమి సందర్బంగా భక్తుల రద్దీ సికింద్రాబాద్ జూలై 10 (ప్రజామంటలు) : పద్మారావునగర్ లోని శ్రీసాయి కుమార్ వ్యాధి నివారణ  ఆశ్రమ్ లోని శ్రీసాయిబాబా ఆలయంలో గత వారం రోజుల నుంచి నిర్వహిస్తున్న శ్రీసాయి సప్తాహ వేడుకలు గురువారం తో ముగిశాయి. చివరి రోజున ఉదయం శ్రీసాయి కుంభాభిషేకం,శ్రీసాయి విభూతి సేవ,సాయంత్రం మహామృత్యుంజయ హోమం...
Read More...

మృతుల కుటుంబాలను పరామర్శించిన మాజీ శాసనసభ్యులు అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి

మృతుల కుటుంబాలను పరామర్శించిన మాజీ శాసనసభ్యులు అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి మృతుల కుటుంబాలను పరామర్శించిన మాజీ శాసనసభ్యులు జూలై 10, ఎల్కతుర్తి (ప్రజామంటలు) :ఎల్కతుర్తి మండలంలోని జీల్గుల గ్రామానికి చెందిన పెద్ది సౌందర్య, బండి మల్లయ్య ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలుసుకున్న హుస్నాబాద్ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి  గురువారం వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ...
Read More...
Local News 

నేడు అధికారభాష హిందీ గోల్డెన్ జూబ్లీ వేడుకలు

నేడు అధికారభాష హిందీ గోల్డెన్ జూబ్లీ వేడుకలు సికింద్రాబాద్ జులై 10 (ప్రజామంటలు): కేంద్ర ప్రభుత్వ హోం మంత్రిత్వ శాఖ అధీనంలో పనిచేస్తున్న హిందీ అధికారిక భాషా విభాగం 50ఏళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో  గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు అధికారిక భాషా విభాగం సంయుక్త కార్యదర్శి డాక్టర్ మీనాక్షీ జాలీ తెలిపారు.ఈ మేరకు  సికింద్రాబాద్ కవాడీగూడలోని సీజీఓ టవర్స్లో  ఆమె శుక్రవారం మీడియాకు...
Read More...
Local News 

కిమ్స్-సన్‌షైన్ హాస్పిటల్స్, బేగంపేటలో కేవలం 3 నెలల్లో 50 రోబోటిక్ సర్జరీలు

కిమ్స్-సన్‌షైన్ హాస్పిటల్స్, బేగంపేటలో కేవలం 3 నెలల్లో 50 రోబోటిక్ సర్జరీలు విజయవంతంగా పూర్తి చేసిన టీమ్ విమలాకర్ సికింద్రాబాద్ జూలై 10 (ప్రజామంటలు): కిమ్స్-సన్‌షైన్ హాస్పిటల్స్, బేగంపేట్‌లో ప్రముఖ గ్యాస్ట్రోఎంటరాలజీ సర్జన్ డాక్టర్ విమలాకర్ రెడ్డి  నేతృత్వంలోని టీమ్ విమలాకర్ కేవలం మూడు నెలల వ్యవధిలో 50 మేజర్ రోబోటిక్ అసిస్టెడ్ సర్జరీలను విజయవంతంగా పూర్తి చేశారు. ఈ అధునాతన శస్త్రచికిత్సల్లో ప్యాంక్రియాస్, కాలేయం, బైలరీ ట్రాక్ట్,...
Read More...
Local News 

ఉద్యోగులు సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ పాల్గొనాలి

ఉద్యోగులు సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ పాల్గొనాలి సికింద్రాబాద్, జూలై 10 (ప్రజామంటలు) : ఉద్యోగులు తమ విధులు నిర్వర్తిస్తూనే మరో వైపు సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని టీఎన్జీవో హైదరాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి కే.శ్రీనివాస్ పిలుపునిచ్చారు. సెంట్రల్ యూనియన్ ప్రధాన కార్యదర్శి ముజీబ్ హుస్సేన్ జన్మదిన వేడుకల సందర్బంగా గురువారం టీఎన్జీవో నాయకులు గాంధీ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ...
Read More...
Local News 

ఆరోగ్యవంతులైన బాలికలే దేశ భవిత

ఆరోగ్యవంతులైన బాలికలే దేశ భవిత బాలికల ఆరోగ్యానికి సంబంధించి పెద్ద సమస్య రక్తహీనతకు దారితీసే పోషకాహార లోపం  - ఐఎం ఏ అధ్యక్షులు డాక్టర్ గూడూరి హేమంత్  -ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆకుతోట శ్రీనివాస్ రెడ్డి   గొల్లపల్లి జూలై 10 (ప్రజా మంటలు):  గొల్లపెల్లి మండల కేంద్రంలోని గురువారం  బాలికల ఉన్నత పాఠశాలలో ఐఎంఏ జగిత్యాల శాఖ ఆధ్వర్యంలో అనీమియా ముక్త్...
Read More...
Local News  State News 

మీ హామీలపై చర్చిద్దాం రండి - సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సవాల్

మీ హామీలపై చర్చిద్దాం రండి - సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సవాల్ పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ కి మహిళలు వస్తాం... ఇచ్చిన హామీలపై చర్చిద్దాం ఏపీలో కలిపిన ఐదు గ్రామాలు వెనక్కి ఇచ్చేయాలని డిమాండ్ ఏపీ సీఎం చంద్రబాబుకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత  లేఖ తెలంగాణ జాగృతిలో చేరిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సీఐటీయూ కార్యదర్శి వీరన్న కొత్తగూడెం జూలై 10:    "పదే పదే కేసీఆర్ మహిళలకు...
Read More...
Local News 

కొండగట్టు 30.వ.గిరిప్రదక్షిణ ఆదివారం మద్యం, మాంసం మానేద్దాం'

కొండగట్టు 30.వ.గిరిప్రదక్షిణ ఆదివారం మద్యం, మాంసం మానేద్దాం' దేవాలయ ఏకీకరణ దేవాలయ రక్షణ (అంకం భూమయ్య) మల్యాల జులై 10 (ప్రజా మంటలు):    మల్యాల మండలం కొండగట్టులో గురుపూర్ణిమ వ్యాస పూర్ణిమ గురువారం రోజున తెలంగాణలోని ప్రముఖ పుణ్య క్షేత్రం కొండగట్టు అంజన్న సన్నిధిలో 30. వ గిరి ప్రదక్షిణ చిలుకూరి బాలాజీ శివాలయం ప్రధాన అర్చకులు సురేష్ ఆత్మారామ్ మహారాజ్ ఆధ్వర్యంలో ఈ...
Read More...
Local News 

కేజీవీలతో ట్రాక్టర్లు తారు రోడ్డుపై తిరిగితే కేసులు నమోదు - ఎస్ఐ, కృష్ణ సాగర్ రెడ్డి 

కేజీవీలతో ట్రాక్టర్లు తారు రోడ్డుపై తిరిగితే కేసులు నమోదు - ఎస్ఐ, కృష్ణ సాగర్ రెడ్డి  గొల్లపల్లి జూలై 10 (ప్రజా మంటలు): గొల్లపల్లి మండలం కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో  ట్రాక్టర్లు ఇనుప కేజీ వీలతో రోడ్డు పై తిరిగినచో కేసులు నమోదు చేస్తామని ఎస్ఐ ఎం, కృష్ణ సాగర్ రెడ్డి హెచ్చరించారు ఎస్ఐ మాట్లాడుతూ కోట్ల రూపాయలతో నిర్మించిన రోడ్లపై ట్రాక్టర్ కేజీ వీల్స్ తో తిరగడం వల్ల బీటీ...
Read More...
Local News 

బాల్య వివాహాల నిర్మూలనపై అవగాహన కార్యక్రమం

బాల్య వివాహాల నిర్మూలనపై అవగాహన కార్యక్రమం  బాల్య వివాహాల నిర్మూలనపై అవగాహన కార్యక్రమం వేలేరు, జూలై 10 (ప్రజామంటలు):బాల్య వివాహాల చట్టం గురించి అవగాహన కల్పించే ఉద్దేశ్యంతో గురువారం మండలంలోని వేలేరు గ్రామంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శ్రీమతి క్షమా దేశ్పాండే గారు (డీఎల్‌ఎస్‌ఏ జడ్జ్) అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, బాల్యవివాహాలు పిల్లల మానసిక...
Read More...
Local News 

షిరిడి సాయి మందిరంలో ఘనంగా గురు పూర్ణిమ వేడుకలు 

షిరిడి సాయి మందిరంలో ఘనంగా గురు పూర్ణిమ వేడుకలు  హైదరాబాద్ జూలై 10(ప్రజా మంటలు)  రామంతపూర్( వెంకట్ రెడ్డి నగర్ )లోని షిర్డీ సాయి మందిరంలో గురువారం ఉదయాత్ పూర్వం నుండి గురుపౌర్ణమి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా మూలవిరాట్టు దత్తాత్రేయ స్వామి విగ్రహానికి, షిరిడి సాయి విగ్రహానికి స్వహస్తాలతో భక్తులు క్షీరాభిషేకం నిర్వహించారు. అనంతరం లక్ష పుష్పార్చన కార్యక్రమం నిర్వహించారు. . వైదిక...
Read More...
Local News  State News 

జగిత్యాల జిల్లా జర్నలిస్ట్ సంఘ్ అధ్యక్షునిగా చీటీ శ్రీనివాస్ రావు

జగిత్యాల జిల్లా జర్నలిస్ట్ సంఘ్ అధ్యక్షునిగా చీటీ శ్రీనివాస్ రావు జగిత్యాల జూలై 10:   జగిత్యాల జిల్లా జర్నలిస్ట్ సంఘ్ ఎన్నికలలో అధ్యక్షులు చీటీ శ్రీనివాస్ రావు, ప్రధాన కార్యదర్శి, బెజ్జంకి సంపూర్ణ చారి, కోశాధికారిగా సిరిసిల్ల వేణు గోపాల్ ‌ఘన విజయం సాధించారు. ఉపాధ్యక్షులుగా హైదర్ అలీ, గడ్డల హరికృష్ణ కృష్ణ, అల్లే రాము లు, సహాయ కార్యదర్శి గా కోరే రాజ్ కుమార్,గుర్రపు చంద్ర...
Read More...