అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేస్తూ రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేయాలి: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
జగిత్యాల జులై 7 ( ప్రజా మంటలు)
జిల్లా లో జరుగు రోడ్డు ప్రమాదాల నివారణకు జిల్లా కలెక్టర్ కార్యాలయం లో జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ , అదనపు కలెక్టర్ లత ఆధ్వర్యంలో జిల్లా రోడ్డు భద్రత కమిటీ సమావేశం నిర్వహించినారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎస్పీ మాట్లాడుతూ ... రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టడం జరుగుతోంది అన్నారు. జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు జిల్లా స్థాయిలో ఒక ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి ఆధ్వర్యంలో డిస్టిక్ ట్రాఫిక్ అనాలసిస్ బ్యూరో ని ప్రారంభించి ఇతర శాఖల అధికారులను సమన్వయం చేసుకుంట రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు.
అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించి ప్రమాదాల నివారణ తగు చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులను ఆదేశించారు. రోడ్డు ప్రమాదాలు పూర్తిగా నివారించాల్సిన అవసరం ఉందని అందులో బాగంగా జాతీయ రహదారి పై ఉన్న అన్ని గ్రామాల్లో అవగాహాన కార్యక్రమాలు చేపట్టాలని ఆదే విదంగా హైవేలపై జరిగే యాక్సిడెంట్ లకు సంబంధించి ఫస్ట్ రెస్పాండర్స్ గా ఉండేందుకు హైవేలపై ఉన్న పెట్రోల్ బంక్ వారికి, ధాబాలో పనిచేసే వారికి, యూత్ ,విలేజెస్, కి ఫస్ట్ ఎయిడ్ మరియు సిపిఆర్ పై అవగాహన కలిగించాలని అధికారులకు సూచించారు.
జిల్లా లో ఉన్న 43 బ్లాక్ స్పాట్స్(ప్రమాదాలు అధికముగా జరుగు ప్రదేశాలు) ను పంచాయతీ రాజ్ మరియు ఆర్&బి ప్రబుత్వ శాఖల సమన్వయంతో ప్రమాదాల నివరణ పై దృష్టి సారించాలని అన్నారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ బిఎస్ లత మాట్లాడుతూ ... జిల్లాలో రోడ్డు ప్రమాదాల కారణంగా ఏ ఒక్కరూ వైకల్యం బారిన పడకుండా, ప్రాణాలు కోల్పోయే పరిస్థితులు లేకుండా రహదారి ప్రమాదాలు సంభవించకుండా రోడ్డు భద్రతా చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ అధికారులను ఆదేశించారు. రోడ్డు కండిషన్ లో లేకపోవడం, సైనేజ్ బోర్డులు,అవసరమైన చోట స్పీడ్ బ్రేకర్ లు లేకపోవడం వల్ల అక్కడక్కడ ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు.
సంబంధిత ఇంజనీరింగ్ శాఖలు అలాంటి ప్రదేశాలను గుర్తించి వెంటనే అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు.అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేస్తూ రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేయాలని సూచించారు.
ఈ సమావేశంలో ఆర్టీఓ లు డిఎస్పీలు మరియు, మున్సిపల్ అధికారులు, పంచాయతీ అధికారులు మరియు ఇతర సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
పెద్దపూర్ గురుకుల పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన కోరుట్ల ఎమ్మెల్యే డా.కల్వకుంట్ల సంజయ్

మేడిపల్లి భీమారం , మండలాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్

పద్మశాలి కిట్టి పార్టీ ఆధ్వర్యంలో మెహందీ ఉత్సవం

అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేస్తూ రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేయాలి: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

గ్రీవెన్స్ డే సందర్భంగా పలు ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

కేసులకు భయపడి స్వర్ణకారులు ఆత్మహత్యలు చేసుకోవద్దు - తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

కాలభైరవ దేవాలయంను దర్శించుకున్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

రాపల్లిలో ఎమ్మార్పీఎస్ 31 వ ఆవిర్భావ దినోత్సవం

హస్నాబాద్ గ్రామ యువకులచే ఎమ్మెల్యే సంజయ్ కుమార్ జన్మదిన వేడుకలు

మానవత్వం మరిచిన పిన్ని మమత

ఘనంగా జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ పుట్టిన రోజు వేడుకలు.

హనుమాన్ చాలీసా భక్త బృందం చే హరిహరాలయంలో సామూహిక విష్ణు సహస్రనామ పారాయణం
