కొండగట్టు 30.వ.గిరిప్రదక్షిణ ఆదివారం మద్యం, మాంసం మానేద్దాం'
దేవాలయ ఏకీకరణ దేవాలయ రక్షణ
(అంకం భూమయ్య)
మల్యాల జులై 10 (ప్రజా మంటలు):
మల్యాల మండలం కొండగట్టులో గురుపూర్ణిమ వ్యాస పూర్ణిమ గురువారం రోజున తెలంగాణలోని ప్రముఖ పుణ్య క్షేత్రం కొండగట్టు అంజన్న సన్నిధిలో 30. వ గిరి ప్రదక్షిణ చిలుకూరి బాలాజీ శివాలయం ప్రధాన అర్చకులు సురేష్ ఆత్మారామ్ మహారాజ్ ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతున్నట్లు అర్చకులు భక్తులు తెలిపారు.ఇందులో సుమారు నాలుగువేల మందికి పైగా అంజన్న భక్తులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ కొండగట్టు గిరి ప్రదర్శన చేపట్టడం వల్ల సహజ సిద్ధమైన ప్రాణవాయువు వనమూలికల ఔషధాల స్వేచ్ఛాయుత ప్రాణవాయువు లభించడం వల్ల మరింత ఉద్దేశం కలుగుతుందన్నారు.అనంరం గిరి ప్రదర్శనలో పాల్గొన్న.భక్తులు,అర్చకులు సురేష్ ఆత్మారాం దాతలు సహాయంతో వచ్చిన చీరలు గిరి ప్రదక్షిణలో పాల్గొన్న భక్తుల ఆధ్వర్యంలో గ్రామంలోని అమ్మవారి ఆలయాలకు పంపిణీ చేస్తామని తెలియజేశారు.ఆదివారం మద్యం, మాంసం మానేద్దామని కొండగట్టు గిరిప్రదక్షిణ ప్రారంభికులు చిలుకూరు బాలాజీ శివాలయం అర్చకులు సురేష్ ఆత్మారాం అన్నారు.కొండగట్టు గిరిప్రదక్షిణలో వేల సంఖ్యలో భక్తులు పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు.ఈ సందర్భంగా తామందరం సూర్య భగవానుని రోజైన ఆదివారం నాడు మద్యం,మాంసం మానేద్దామని గిరి ప్రదక్షిణలో పాల్గొన్న భక్తులతో ప్రమాణం చేయించారు.
ఈ కార్యక్రమంలో కొడిమ్యాల గిరి ప్రదక్షిణ భక్తులు చెన్న దేవేందర్, బల్ల చిన్న అంజయ్య,కొండూరీ ప్రవీణ్, కంచర్ల రామస్వామి.పాలకుర్తి శ్రీనివాస్.బాలే గణేష్ తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాలు,మండలాలు,కొడిమ్యాల,మల్యాల మండలంలోని వివిధ గ్రామాల భక్తులు,ప్రజలు,మహిళలు,యువకులు, విద్యార్థులు,తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఘనంగా శ్రీసాయి సప్తాహం ముగింపువేడుకలు

మృతుల కుటుంబాలను పరామర్శించిన మాజీ శాసనసభ్యులు అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి

నేడు అధికారభాష హిందీ గోల్డెన్ జూబ్లీ వేడుకలు

కిమ్స్-సన్షైన్ హాస్పిటల్స్, బేగంపేటలో కేవలం 3 నెలల్లో 50 రోబోటిక్ సర్జరీలు

ఉద్యోగులు సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ పాల్గొనాలి

ఆరోగ్యవంతులైన బాలికలే దేశ భవిత

మీ హామీలపై చర్చిద్దాం రండి - సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సవాల్

కొండగట్టు 30.వ.గిరిప్రదక్షిణ ఆదివారం మద్యం, మాంసం మానేద్దాం'

కేజీవీలతో ట్రాక్టర్లు తారు రోడ్డుపై తిరిగితే కేసులు నమోదు - ఎస్ఐ, కృష్ణ సాగర్ రెడ్డి

బాల్య వివాహాల నిర్మూలనపై అవగాహన కార్యక్రమం

షిరిడి సాయి మందిరంలో ఘనంగా గురు పూర్ణిమ వేడుకలు

జగిత్యాల జిల్లా జర్నలిస్ట్ సంఘ్ అధ్యక్షునిగా చీటీ శ్రీనివాస్ రావు
