మీ హామీలపై చర్చిద్దాం రండి - సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సవాల్

On
మీ హామీలపై చర్చిద్దాం రండి - సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సవాల్

పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ కి మహిళలు వస్తాం... ఇచ్చిన హామీలపై చర్చిద్దాం

ఏపీలో కలిపిన ఐదు గ్రామాలు వెనక్కి ఇచ్చేయాలని డిమాండ్

ఏపీ సీఎం చంద్రబాబుకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత  లేఖ

తెలంగాణ జాగృతిలో చేరిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సీఐటీయూ కార్యదర్శి వీరన్న

కొత్తగూడెం జూలై 10: 


 "పదే పదే కేసీఆర్ గారు అసెంబ్లీకి రావాలని సీఎం రంకెలు వేస్తున్నారు. డైవర్షన్ పాలిటిక్స్ కు పాల్పడుతున్నారు. మేం మహిళలు అందరం మీ పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ కు వస్తాం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సవాల్ విసిరారు.

మహిళలకు నెలకు రూ.2,500 ఎందుకు ఇస్తలేరో చర్చ చేద్దాం. కళ్యాణ లక్ష్మీ, షాది ముభారక్ కింద తులం బంగారం ఇస్తలేరో, ఎందుకు పింఛన్లు పెంచడం లేదో చర్చిద్దాం" అని స్పష్టం చేశారు. 

కొత్తగూడెంలో  బుధవారం నిర్వహించిన తెలంగాణ జాగృతి విస్తృత సమావేశంలో సీపీఎం జిల్లా నాయకుడు,  సీఐటీయూ జిల్లా కార్యదర్శి వీరన్న తన అనుచరులతో కలిసి ఎమ్మెల్సీ కవిత సమక్షంలో తెలంగాణ జాగృతి లో చేరారు. ఆయనకు తెలంగాణ జాగృతి కండువాను కప్పి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.... తెలంగాణలో బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చి విస్మరిస్తోందని మండిపడ్డారు. 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వకుండా ఎన్నికలు పెడితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. 42 శాతం రిజర్వేషన్లు సాధకై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి తేవడానికి ఈ నెల 17వ తేదీన రైల్ రోకో నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని డిమాండ్ చేశారు.

IMG-20250710-WA0017తెలంగాణ జాగృతిని రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతపరుస్తున్నామని తెలిపారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కనీసం జై తెలంగాణ అనడం లేదని విమర్శించారు. రాష్ట్రంలో పరిపాలన కుంటుపడిందని, సంపూర్ణ రైతురుణమాఫీ కాలేదనీ, ప్రజా సమస్యలపై చర్చకు రమ్మంటే సీఎం పారిపోయారని మండిపడ్డారు.ఆడబిడ్డలకు నెలకు 2,500 ఇస్తామని రేవంత్ రెడ్డి మాట తప్పారని తెలిపారు.

సింగరేణిని రేవంత్ రెడ్డి పట్టించుకోవడంలేదనీ, సింగరేణిలో డిపెండెంట్ ఉద్యోగాలు రావడం లేదని ప్రస్తావించారు. సింగరేణి బొగ్గు గనులను ప్రయివేటుపరం చేస్తుంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. రేవంత్ రెడ్డికి అవినీతి చక్రవర్తి,అసమర్థ ముఖ్యమంత్రి అనే బిరుదు ఇచ్చామని చెప్పారు. మహిళల పక్షాన జాగృతి పోరాటం చేస్తుందనీ స్పష్టం చేశారు. 

"కొత్తగూడెం జిల్లా అంటే పరిశ్రమలు ఉండే జిల్లా. ఐటీసీలో కాలుష్యం లేకుండా పరిశ్రమ యాజమాన్యం దృష్టి సారించాలి. స్పాంజ్ ఐరన్ కర్మాగారాన్ని పునరుద్ధరణ చేయాలి." అని డిమాండ్ చేశారు. మరోవైపు, ఆంధ్రప్రదేశ్ లో విలీనం చేసిన ఐదు గ్రామాలను తిరిగి తెలంగాణలో తిరిగి కలపాలని కోరుతూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు ఎమ్మెల్సీ కవిత లేఖ రాశారు. 

"భద్రాచలం చుట్టుపక్కల ఉన్న ఐదు గ్రామ పంచాయతీలు ఆందోళనలో ఉన్నాయి. భద్రాచలం రాముడి భూములు పురుషోత్తపట్నంలో ఉన్నాయి.ఐదు గ్రామ పంచాయతీలను తెలంగాణలో కలిపేందుకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు చొరవ తీసుకోవాలి. తెలంగాణ జాగృతి రౌండ్ టేబుల్ సమావేశం తర్వాత కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కు తుమ్మల ఐదు గ్రామ పంచాయతీలపై లెటర్ ఇచ్చారు. పురుషోత్తపట్నంలో ఉన్న రాముడి భూములను చూడటానికి వెళ్లిన రామాలయం ఈవోపై దాడి చేశారు. భద్రాచల రాముడు తెలంగాణ దేవుడు." అని వ్యాఖ్యానించారు. తెలంగాణ ఆడబిడ్డ,బీసీ బిడ్డ భద్రాచలం రామాలయం ఈవో రమాదేవిపై జరిగిన దాడిని ఖండిస్తున్నట్లు ప్రకటించారు. సీతారామ ఎత్తిపోతల పథకం పనులు కేసీఆర్ ముఖ్యమంత్రి గా ఉన్న సమయంలోనే 70 శాతం పూర్తయ్యాయని.. మిగతా పనులు పూర్తి చేసి రైతులకు నీళ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

Tags

More News...

Local News 

ఘనంగా శ్రీసాయి సప్తాహం ముగింపువేడుకలు

ఘనంగా శ్రీసాయి సప్తాహం ముగింపువేడుకలు గురు పౌర్ణమి సందర్బంగా భక్తుల రద్దీ సికింద్రాబాద్ జూలై 10 (ప్రజామంటలు) : పద్మారావునగర్ లోని శ్రీసాయి కుమార్ వ్యాధి నివారణ  ఆశ్రమ్ లోని శ్రీసాయిబాబా ఆలయంలో గత వారం రోజుల నుంచి నిర్వహిస్తున్న శ్రీసాయి సప్తాహ వేడుకలు గురువారం తో ముగిశాయి. చివరి రోజున ఉదయం శ్రీసాయి కుంభాభిషేకం,శ్రీసాయి విభూతి సేవ,సాయంత్రం మహామృత్యుంజయ హోమం...
Read More...

మృతుల కుటుంబాలను పరామర్శించిన మాజీ శాసనసభ్యులు అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి

మృతుల కుటుంబాలను పరామర్శించిన మాజీ శాసనసభ్యులు అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి మృతుల కుటుంబాలను పరామర్శించిన మాజీ శాసనసభ్యులు జూలై 10, ఎల్కతుర్తి (ప్రజామంటలు) :ఎల్కతుర్తి మండలంలోని జీల్గుల గ్రామానికి చెందిన పెద్ది సౌందర్య, బండి మల్లయ్య ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలుసుకున్న హుస్నాబాద్ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి  గురువారం వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ...
Read More...
Local News 

నేడు అధికారభాష హిందీ గోల్డెన్ జూబ్లీ వేడుకలు

నేడు అధికారభాష హిందీ గోల్డెన్ జూబ్లీ వేడుకలు సికింద్రాబాద్ జులై 10 (ప్రజామంటలు): కేంద్ర ప్రభుత్వ హోం మంత్రిత్వ శాఖ అధీనంలో పనిచేస్తున్న హిందీ అధికారిక భాషా విభాగం 50ఏళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో  గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు అధికారిక భాషా విభాగం సంయుక్త కార్యదర్శి డాక్టర్ మీనాక్షీ జాలీ తెలిపారు.ఈ మేరకు  సికింద్రాబాద్ కవాడీగూడలోని సీజీఓ టవర్స్లో  ఆమె శుక్రవారం మీడియాకు...
Read More...
Local News 

కిమ్స్-సన్‌షైన్ హాస్పిటల్స్, బేగంపేటలో కేవలం 3 నెలల్లో 50 రోబోటిక్ సర్జరీలు

కిమ్స్-సన్‌షైన్ హాస్పిటల్స్, బేగంపేటలో కేవలం 3 నెలల్లో 50 రోబోటిక్ సర్జరీలు విజయవంతంగా పూర్తి చేసిన టీమ్ విమలాకర్ సికింద్రాబాద్ జూలై 10 (ప్రజామంటలు): కిమ్స్-సన్‌షైన్ హాస్పిటల్స్, బేగంపేట్‌లో ప్రముఖ గ్యాస్ట్రోఎంటరాలజీ సర్జన్ డాక్టర్ విమలాకర్ రెడ్డి  నేతృత్వంలోని టీమ్ విమలాకర్ కేవలం మూడు నెలల వ్యవధిలో 50 మేజర్ రోబోటిక్ అసిస్టెడ్ సర్జరీలను విజయవంతంగా పూర్తి చేశారు. ఈ అధునాతన శస్త్రచికిత్సల్లో ప్యాంక్రియాస్, కాలేయం, బైలరీ ట్రాక్ట్,...
Read More...
Local News 

ఉద్యోగులు సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ పాల్గొనాలి

ఉద్యోగులు సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ పాల్గొనాలి సికింద్రాబాద్, జూలై 10 (ప్రజామంటలు) : ఉద్యోగులు తమ విధులు నిర్వర్తిస్తూనే మరో వైపు సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని టీఎన్జీవో హైదరాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి కే.శ్రీనివాస్ పిలుపునిచ్చారు. సెంట్రల్ యూనియన్ ప్రధాన కార్యదర్శి ముజీబ్ హుస్సేన్ జన్మదిన వేడుకల సందర్బంగా గురువారం టీఎన్జీవో నాయకులు గాంధీ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ...
Read More...
Local News 

ఆరోగ్యవంతులైన బాలికలే దేశ భవిత

ఆరోగ్యవంతులైన బాలికలే దేశ భవిత బాలికల ఆరోగ్యానికి సంబంధించి పెద్ద సమస్య రక్తహీనతకు దారితీసే పోషకాహార లోపం  - ఐఎం ఏ అధ్యక్షులు డాక్టర్ గూడూరి హేమంత్  -ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆకుతోట శ్రీనివాస్ రెడ్డి   గొల్లపల్లి జూలై 10 (ప్రజా మంటలు):  గొల్లపెల్లి మండల కేంద్రంలోని గురువారం  బాలికల ఉన్నత పాఠశాలలో ఐఎంఏ జగిత్యాల శాఖ ఆధ్వర్యంలో అనీమియా ముక్త్...
Read More...
Local News  State News 

మీ హామీలపై చర్చిద్దాం రండి - సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సవాల్

మీ హామీలపై చర్చిద్దాం రండి - సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సవాల్ పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ కి మహిళలు వస్తాం... ఇచ్చిన హామీలపై చర్చిద్దాం ఏపీలో కలిపిన ఐదు గ్రామాలు వెనక్కి ఇచ్చేయాలని డిమాండ్ ఏపీ సీఎం చంద్రబాబుకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత  లేఖ తెలంగాణ జాగృతిలో చేరిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సీఐటీయూ కార్యదర్శి వీరన్న కొత్తగూడెం జూలై 10:    "పదే పదే కేసీఆర్ మహిళలకు...
Read More...
Local News 

కొండగట్టు 30.వ.గిరిప్రదక్షిణ ఆదివారం మద్యం, మాంసం మానేద్దాం'

కొండగట్టు 30.వ.గిరిప్రదక్షిణ ఆదివారం మద్యం, మాంసం మానేద్దాం' దేవాలయ ఏకీకరణ దేవాలయ రక్షణ (అంకం భూమయ్య) మల్యాల జులై 10 (ప్రజా మంటలు):    మల్యాల మండలం కొండగట్టులో గురుపూర్ణిమ వ్యాస పూర్ణిమ గురువారం రోజున తెలంగాణలోని ప్రముఖ పుణ్య క్షేత్రం కొండగట్టు అంజన్న సన్నిధిలో 30. వ గిరి ప్రదక్షిణ చిలుకూరి బాలాజీ శివాలయం ప్రధాన అర్చకులు సురేష్ ఆత్మారామ్ మహారాజ్ ఆధ్వర్యంలో ఈ...
Read More...
Local News 

కేజీవీలతో ట్రాక్టర్లు తారు రోడ్డుపై తిరిగితే కేసులు నమోదు - ఎస్ఐ, కృష్ణ సాగర్ రెడ్డి 

కేజీవీలతో ట్రాక్టర్లు తారు రోడ్డుపై తిరిగితే కేసులు నమోదు - ఎస్ఐ, కృష్ణ సాగర్ రెడ్డి  గొల్లపల్లి జూలై 10 (ప్రజా మంటలు): గొల్లపల్లి మండలం కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో  ట్రాక్టర్లు ఇనుప కేజీ వీలతో రోడ్డు పై తిరిగినచో కేసులు నమోదు చేస్తామని ఎస్ఐ ఎం, కృష్ణ సాగర్ రెడ్డి హెచ్చరించారు ఎస్ఐ మాట్లాడుతూ కోట్ల రూపాయలతో నిర్మించిన రోడ్లపై ట్రాక్టర్ కేజీ వీల్స్ తో తిరగడం వల్ల బీటీ...
Read More...
Local News 

బాల్య వివాహాల నిర్మూలనపై అవగాహన కార్యక్రమం

బాల్య వివాహాల నిర్మూలనపై అవగాహన కార్యక్రమం  బాల్య వివాహాల నిర్మూలనపై అవగాహన కార్యక్రమం వేలేరు, జూలై 10 (ప్రజామంటలు):బాల్య వివాహాల చట్టం గురించి అవగాహన కల్పించే ఉద్దేశ్యంతో గురువారం మండలంలోని వేలేరు గ్రామంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శ్రీమతి క్షమా దేశ్పాండే గారు (డీఎల్‌ఎస్‌ఏ జడ్జ్) అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, బాల్యవివాహాలు పిల్లల మానసిక...
Read More...
Local News 

షిరిడి సాయి మందిరంలో ఘనంగా గురు పూర్ణిమ వేడుకలు 

షిరిడి సాయి మందిరంలో ఘనంగా గురు పూర్ణిమ వేడుకలు  హైదరాబాద్ జూలై 10(ప్రజా మంటలు)  రామంతపూర్( వెంకట్ రెడ్డి నగర్ )లోని షిర్డీ సాయి మందిరంలో గురువారం ఉదయాత్ పూర్వం నుండి గురుపౌర్ణమి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా మూలవిరాట్టు దత్తాత్రేయ స్వామి విగ్రహానికి, షిరిడి సాయి విగ్రహానికి స్వహస్తాలతో భక్తులు క్షీరాభిషేకం నిర్వహించారు. అనంతరం లక్ష పుష్పార్చన కార్యక్రమం నిర్వహించారు. . వైదిక...
Read More...
Local News  State News 

జగిత్యాల జిల్లా జర్నలిస్ట్ సంఘ్ అధ్యక్షునిగా చీటీ శ్రీనివాస్ రావు

జగిత్యాల జిల్లా జర్నలిస్ట్ సంఘ్ అధ్యక్షునిగా చీటీ శ్రీనివాస్ రావు జగిత్యాల జూలై 10:   జగిత్యాల జిల్లా జర్నలిస్ట్ సంఘ్ ఎన్నికలలో అధ్యక్షులు చీటీ శ్రీనివాస్ రావు, ప్రధాన కార్యదర్శి, బెజ్జంకి సంపూర్ణ చారి, కోశాధికారిగా సిరిసిల్ల వేణు గోపాల్ ‌ఘన విజయం సాధించారు. ఉపాధ్యక్షులుగా హైదర్ అలీ, గడ్డల హరికృష్ణ కృష్ణ, అల్లే రాము లు, సహాయ కార్యదర్శి గా కోరే రాజ్ కుమార్,గుర్రపు చంద్ర...
Read More...