ధర్మపురి మండల కేంద్రంలో పర్యటించిన జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్
(గొల్లపల్లి ధర్మపురి ) జూలై 05 (ప్రజా మంటలు):
జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ శనివారం ధర్మపురి మండల కేంద్రంలో పర్యటించారు.ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాలను పరిశీలించి, ప్రమాదకర స్థితిలో ఉన్న తరగతి గదులను తక్షణమే కూల్చి వేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
తరువాత సానిటేషన్ అంశంపై అధికారులతో సమీక్షించారు. డ్రైనేజీ,కాలువలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచి పరిశుభ్రత కోసం తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. రానున్న రోజుల్లో వర్షాలు అధికంగా కురిసే అవకాశం ఉండటంతో గోదావరి తీర ప్రాంతాన్ని పరిశీలించి,లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేసేందుకు ముందస్తు ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు ఇచ్చారు.తరువాత ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలించిన కలెక్టర్ నిర్మాణాన్ని వేగవంతం చేయాలని సూచించారు.అనంతరం మున్సిపల్ అధికారులు నిర్వహించిన వనమహోత్సవంలో పాల్గొని స్వయంగా చెట్లు నాటారు.
ధర్మపురి కేంద్రంలో స్వయం ఉపాధితో అగరత్తులు తయారు చేస్తున్న వారిని కలసి,తయారీ విధానాల గురించి అడిగి తెలుసుకున్నారు.వారిని ప్రోత్సహిస్తూ మరింత పరిమాణంలో ఉత్పత్తి చేసే విధంగా ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మరియు ఇన్చార్జ్ తహసిల్దార్,మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు
More News...
<%- node_title %>
<%- node_title %>
ఢిల్లీ పాలకులు దిగివచ్చేలా రైల్ రోకో - బీసీ రిజర్వేషన్ల ఉద్యమంలో పౌర సమాజం కలిసి రావాలి

అనాధ పిల్లలకు సాయం చేయడం ఆదర్శనీయం..

కల్వకుంట్ల కవిత తో జాగృతి వైస్ ప్రెసిడెంట్ మంచాల వరలక్ష్మీ భేటి

ధర్మపురి మండల కేంద్రంలో పర్యటించిన జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్

చదువుతోపాటు సంస్కారం అందించాలి -గీతా విద్యాలయం అధ్యక్షుడు డాక్టర్ చింత రమేష్

జ్యోతి బిల్డింగ్ బ్లాక్స్ ప్లే స్కూల్ లో ఆషాఢ మాసపు గోరింటాకు వేడుక"*

జగిత్యాలలో ఎల్.జీ రాం హెల్త్ కేర్ & వెల్ఫేర్ సొసైటీ ఉచిత మెగా వైద్య శిబిరం పోస్టర్ ఆవిష్కరణ

ధరూర్ క్యాంప్ ఈ వీ ఎం గోడౌన్ కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్.

బాలలపై జరుగుతున్న లైంగిక దాడుల పట్ల కఠినంగా వ్యవహరించాలి - సీఎం రేవంత్ రెడ్డి

సిద్దిపేట జిల్లాలో కాంగ్రెస్ నాయకుల ఆగడాలు - ప్రభుత్వ అధికారులకు బెదిరింపులు

సిరిసిల్ల TV9 రిపోర్టర్ ప్రసాద్ మృతి

ముఖ్యమంత్రితో తెలంగాణ జన సమితి భేటీ - పలు సమస్యలపై వినతి పత్రం అందజేసిన నేతలు
