ఎరువులకు కూడా కరువు, రైతు గోస పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వం. - జిల్లా పరిషత్ తొలి ఛైర్ పర్సన్ దావ వసంత సురేష్.
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113)
జగిత్యాల, జులై 08 (ప్రజా మంటలు) :
కాంగ్రెస్ పాలనలో ఎరువులకు కూడా కరువు ఉండడం విచారకరం అని జిల్లా పరిషత్ తొలి ఛైర్ పర్సన్ దావ వసంత సురేష్ అన్నారు.
జిల్లాలో రైతులు ఎదురుకుంటున్న యూరియా సమస్య కొరత తీర్చాలని, పెంచిన యూరియా బస్తా ధర తగ్గించాలని కోరుతూ బిఆర్ఎస్ పార్టీ & జెడ్పి తొలి ఛైర్ పర్సన్ దావ వసంత సురేష్ ఆధ్వర్యంలో జిల్లా అదనపు కలెక్టర్ కు వినతిపత్రం సమర్పించారు.
అనంతరం దావ వసంత సురేష్ మాట్లాడుతూ....
- రాష్ట్రం లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక రైతుల దుస్థితి ఆధ్వణంగా మారిందని అవేదన వ్యక్తం చేశారు. గత బి ఆర్ ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ గారి పాలన రైతు పక్షపాతి గా ఉంటే అందుకు భిన్నంగా రేవంత్ రెడ్డి పాలన రైతులపై కక్ష్య పూరీతంగా వ్యవహారిస్తుంది అన్నట్లుగా పాలన సాగుతుందని విమర్శించారు.
- కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం చేసి బీడు వారిన నేలలను సిరుల మాగానిగా మార్చారాని అలాంటి కాళేశ్వరం పైన అసత్య ప్రచారం చేస్తూ ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం పబ్బం గడుపు కుంటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
- సమయానికి ఎరువులు, సాగు నీరు, 24 గంటల ఉచిత కరెంట్, రైతు భరోసా, రుణమాఫీ, కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతుకు కష్టం రాకుండా చూసి రైతుల కన్నీరు తుడిచిన రైతు బాంధవుడు కేసీఆర్ అని కొనియాడారు.
- ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా రుణమాఫీ పూర్తి చేయకుండా, భరోసా రెండు పంటలకు ఎగగొట్టి, సకాలంలో యూరియా అందించకుండా రైతులను అరిగోస పెడుతుందన్నారు.
- కాంగ్రెస్ అంటేనే కరువు అనే మాటను నిజం చేస్తూ, ఆఖరికి ఎరువుల కరువు కు కూడా కాంగ్రెస్ కేరాఫ్ గా నిలిచిందని ఏద్దేవా చేశారు.
- గత ప్రభుత్వం లో రైతుల కళ్ళలో ఉన్న ఆనందం, నేడు ఈ ప్రభుత్వం పాలనలో కన్నీళ్లను మిగిలిస్తుందని ఆరోపించారు.
- కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 2 లక్షల కోట్లు అప్పు చేసింది,అంటే నెలకి 10 వేల కోట్ల చేసి ఒక్క ప్రాజెక్ట్ కట్టలే ఒక్క కొత్త పథకం అమలు చేయలేదు.
- రైతు కంట తడి పెట్టించినా ప్రభుత్వం మనుగడ సాధించలేదని మండి పడ్డారు. ఇప్పటికైనా రాష్ట్రం ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం ఆదుకోవాలని, ఎరువుల ధరలు తగ్గించాలని, రైతులకు యూరియా కొరత లేకుండా చూడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో జగిత్యాల నియోజకవర్గ మండల అధ్యక్షులు ఆనంద్ రావు, తుమ్మ గంగాధర్, ఏలేటి అనిల్, బర్కం మల్లేష్, తెలు రాజు, మాజీ సర్పంచ్ లు బుర్ర ప్రవీణ్, నడేం శంకర్, గంగాధర్ సీనియర్ నాయకులు సాగి సత్యం రావు, శీలం ప్రవీణ్, శ్రీధర్ రెడ్డి, గంగారెడ్డి, ప్రశాంత్ రావు, ముత్తయ్య, హరీష్, సన్నిత్ రావు తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఎరువులకు కూడా కరువు, రైతు గోస పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వం. - జిల్లా పరిషత్ తొలి ఛైర్ పర్సన్ దావ వసంత సురేష్.

పద్మారావునగర్ లో శ్రీసాయి ధన్వంతరీ సేవ

బల్కంపేట అమ్మవార్ల ఆలయ హుండీ లెక్కింపు - ఆదాయం రూ . 87 లక్షలు

టీడీఎఫ్ సిల్వర్ జూబ్లీ వేడుకలకు రావాలని మంత్రి శ్రీధర్ బాబుకు ఆహ్వానం

బీసీ బిల్లు మోదించకపోతే రైలు చక్రాలను ముందుకు కలదలనిచ్చేదే లేదు - ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

పెద్దపూర్ గురుకుల పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన కోరుట్ల ఎమ్మెల్యే డా.కల్వకుంట్ల సంజయ్

మేడిపల్లి భీమారం , మండలాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్

పద్మశాలి కిట్టి పార్టీ ఆధ్వర్యంలో మెహందీ ఉత్సవం

అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేస్తూ రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేయాలి: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

గ్రీవెన్స్ డే సందర్భంగా పలు ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

కేసులకు భయపడి స్వర్ణకారులు ఆత్మహత్యలు చేసుకోవద్దు - తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

కాలభైరవ దేవాలయంను దర్శించుకున్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
