గాంధీ ఆస్పత్రిలో కల్తీ కల్లు బాధితుడి మృతి - మరో ఇద్దరిని నిమ్స్ కు తరలింపు.
సికింద్రాబాద్, జూలై 09 (ప్రజామంటలు) :
కల్తీ కల్లు తాగిన ఘటనలో గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సీతారాం(47) అనే వ్యక్తి మృతి చెందాడు. సోమవారం రోజు కల్లు తాగిన సీతారాం ఇంటికి వచ్చిన తర్వాత వాంతులు విరోచనాలు కావడంతో అదే రోజున అరుంధతి ఆసుపత్రికి వెళ్ళినట్లు అతని భార్య అనిత తెలిపారు. గాంధీ ఆసుపత్రికి తీసుకువచ్చిన అనంతరం చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పేర్కొన్నారు. వనపర్తి జిల్లా మదిగట్ల గ్రామానికి చెందిన సీతారాం అనిత దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నట్లు, గత తొమ్మిది సంవత్సరాల క్రితం బతుకుదెరువు కోసం నగరానికి వచ్చి మేస్త్రీగా పని చేస్తున్నట్లు ఆమె తెలిపారు. ఇతనికి కల్లు తాగి అలవాటు ఉన్నట్లు పేర్కొన్నారు. కల్తీ కల్లు మూలంగానే తన భర్త చనిపోయాడని ఆమె ఆరోపిస్తున్నారు. గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కల్తీకల్లు ఘటన బాధితులు విజయ్, కృష్ణయ్యలను మెరుగైన వైద్యం కోసం నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉన్నట్లు వైద్యులు పేర్కొన్నారు. కాగా సీతారాం ను గాంధీకి తీసుకువచ్చేటప్పుడే చనిపోయాడని, అతడు బ్రాట్ డెడ్ అని, అతని మరణానికి కారణాలు ఇప్పుడే చెప్పలేమని, పోస్టుమార్టంలో కారణాలు వివరంగా తెలుస్తాయని గాంధీ వైద్యులు తెలిపారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
మేడిపల్లి నూతన ఎస్ఐగా మాడ శ్రీధర్ రెడ్డి బాధ్యతలు స్వీకరణ

ఘనంగా శ్రీసాయి నరసింహాస్వామి సేవ - నేడు గురుపౌర్ణమి -ప్రత్యేక ఏర్పాట్లు పూర్తి

గాంధీ ఆస్పత్రిలో కల్తీ కల్లు బాధితుడి మృతి - మరో ఇద్దరిని నిమ్స్ కు తరలింపు.

ఆషాడ మాస వనభోజనాలతో ఉల్లాసం – ముత్తారం గ్రామ ఆడపడుచుల సాంప్రదాయ భేటీ

బోనాల జాతర చెక్కుల గోల్ మాల్ పై ఎండోమెంట్ అధికారుల విచారణ

ఎరువులకు కూడా కరువు, రైతు గోస పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వం. - జిల్లా పరిషత్ తొలి ఛైర్ పర్సన్ దావ వసంత సురేష్.

పద్మారావునగర్ లో శ్రీసాయి ధన్వంతరీ సేవ

బల్కంపేట అమ్మవార్ల ఆలయ హుండీ లెక్కింపు - ఆదాయం రూ . 87 లక్షలు

టీడీఎఫ్ సిల్వర్ జూబ్లీ వేడుకలకు రావాలని మంత్రి శ్రీధర్ బాబుకు ఆహ్వానం

బీసీ బిల్లు మోదించకపోతే రైలు చక్రాలను ముందుకు కలదలనిచ్చేదే లేదు - ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

పెద్దపూర్ గురుకుల పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన కోరుట్ల ఎమ్మెల్యే డా.కల్వకుంట్ల సంజయ్

మేడిపల్లి భీమారం , మండలాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్
