బోనాల జాతర చెక్కుల గోల్ మాల్ పై ఎండోమెంట్ అధికారుల విచారణ
పక్కదారి పట్టిన నిధులను రికవరీ చేయాలని కాంగ్రెస్ నేతల డిమాండ్
సికింద్రాబాద్ జూలై 09 (ప్రజా మంటలు):
ఆషాడ బోనాల జాతరను ఆయా ఆలయాల్లో ఘనంగా నిర్వహించడానికి ప్రభుత్వం ఆయా ఆలయాలకు అందించే నిధులు దుర్వినియోగం అవుతున్నాయి. ఈమేరకు ఇటీవల బన్సీలాల్ పేట డివిజన్ లో కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఐత చిరంజీవి బోనాల జాతర చెక్కులు దుర్వినియోగం అవుతూ, పక్కదారి పడుతున్నాయని దేవాదాయ శాఖాధికారులకు ఆధారాలతో సహా పిర్యాదుచేశారు. ఈమేరకు స్పందించిన ఎండోమెంట్ అధికారులు మంగళవారం డివిజన్ లోని పలు ఆలయాలను సందర్శించి, విచారణ చేపట్టారు. పద్మారావునగర్ లో ఓచోట చెట్టుకింద అమ్మవారి ఆలయం లేకపోగా, అక్కడ టెంపుల్ ఉందని ఓ వ్యక్తి గత 8ఏండ్లుగా ప్రభుత్వం ఇచ్చే చెక్కులను తీసుకుంటున్నట్లు గుర్తించారు. అలాగే ఒకే టెంపుల్ పై రెండేసీ చెక్కులను తీసుకుంటున్నట్లు ఆరోపణలు వచ్చిన పద్మారావునగర్ పార్కు, వెంకటపురం కాలనీ,హమాలీబస్తీ,గాంధీ ఆసుపత్రి ఆవరణలో ఉన్న పలు ఆలయాలను ఎండోమెంట్ ఇన్స్పెక్టర్ శ్రీదేవి,సురేశ్ లు సందర్శించారు. ఈమేరకు అక్కడి స్థానికులను అడిగి వివరాలు నమోదుచేశారు. చెక్కుల దుర్వినియోగంపై విచారణ పూర్తి అయిన వెంటనే పూర్తి స్థాయిలో నివేదికను ఎండోమెంట్ కమిషనర్ కు అందచేస్తామన్నారు. అవకతవకలకు పాల్పడిన టెంపుల్ నిర్వాహకులను గుర్తించి, వారికి వచ్చే ఏడాది నుంచి చెక్కుల పంపిణీని నిలిపివేస్తామన్నారు.
ఒక్కో టెంపుల్ నుంచి రెండేసీ చెక్కులను గత కొన్నేండ్లుగా తీసుకుంటున్న వారినుంచి ప్రభుత్వం ఇచ్చిన నిధులను రికవరీ చేసి,వారిపై చట్టరిత్యా చర్యలు తీసుకోవాలని డివిజన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఐత చిరంజీవి ఎండోమెంట్ అధికారులను కోరారు. రికవరీ చేసిన నిధులను జెన్యూన్ గా ఉండే పెద్ద ఆలయాలకు ఇస్తే బోనాల ఉత్సవాలు ఇంకా ఘనంగా జరుపుకునే అవకాశం ఉంటుందన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఆషాడ మాస వనభోజనాలతో ఉల్లాసం – ముత్తారం గ్రామ ఆడపడుచుల సాంప్రదాయ భేటీ

బోనాల జాతర చెక్కుల గోల్ మాల్ పై ఎండోమెంట్ అధికారుల విచారణ

ఎరువులకు కూడా కరువు, రైతు గోస పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వం. - జిల్లా పరిషత్ తొలి ఛైర్ పర్సన్ దావ వసంత సురేష్.

పద్మారావునగర్ లో శ్రీసాయి ధన్వంతరీ సేవ

బల్కంపేట అమ్మవార్ల ఆలయ హుండీ లెక్కింపు - ఆదాయం రూ . 87 లక్షలు

టీడీఎఫ్ సిల్వర్ జూబ్లీ వేడుకలకు రావాలని మంత్రి శ్రీధర్ బాబుకు ఆహ్వానం

బీసీ బిల్లు మోదించకపోతే రైలు చక్రాలను ముందుకు కలదలనిచ్చేదే లేదు - ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

పెద్దపూర్ గురుకుల పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన కోరుట్ల ఎమ్మెల్యే డా.కల్వకుంట్ల సంజయ్

మేడిపల్లి భీమారం , మండలాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్

పద్మశాలి కిట్టి పార్టీ ఆధ్వర్యంలో మెహందీ ఉత్సవం

అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేస్తూ రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేయాలి: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

గ్రీవెన్స్ డే సందర్భంగా పలు ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
