45 శాఖలతో అభివృద్ధి పథంలో గాయత్రి బ్యాంక్ - అధ్యక్షులు ముత్యాల లక్ష్మణ్ రెడ్డి

On
45 శాఖలతో అభివృద్ధి పథంలో గాయత్రి బ్యాంక్ - అధ్యక్షులు ముత్యాల లక్ష్మణ్ రెడ్డి

45 శాఖలతో అభివృద్ధి పథంలో గాయత్రి బ్యాంక్
అధ్యక్షులు ముత్యాల లక్ష్మణ్ రెడ్డి
జగిత్యాల జులై 21 (ప్రజా మంటలు) :
రూ. 2843 కోట్ల వ్యాపారంతో 45 శాఖలతో అభివృద్ధి పథంలో గాయత్రి బ్యాంకు ఉందని బ్యాంకు అధ్యక్షులు  ముత్యాల లక్ష్మణ్ రెడ్డి  అన్నారు. తది: 21-07-2024 న జరిగిన ది గాయత్రి కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంకు యొక్క సర్వ సభ్య సమావేశంలో ఆయన మాట్లాడుతూ బ్యాంకు స్థాపించిన 24 సంవత్సరాల కాలంలో, 7 లక్షల 25 వేల మంది వినియోగదారులను కలిగి 2843.44 కోట్ల వ్యాపారాన్ని కలిగి మల్టీ స్టేట్ కో-ఆపరేటివ్ బ్యాంకుగా అవతరించిందని, ఇట్టి అభివృద్ధికి కారణమైన బ్యాంకు ఖాతాదారులకు, సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు. మన బ్యాంకునకు ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఆధార్ అనుసంధాన పేమెంట్ సేవలను ఏ ఈ పి ఎస్) ప్రారంభించామని అలాగే యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ సేవలు కూడా ప్రారంభించామని తెలియజేశారు. మరియు 344 బ్యాంకింగ్ కరెప్పాండెంట్స్ని నియమించి వినియోగదారుల చెంతకు బ్యాంకు సేవలను తీసుకొని వచ్చామని తెలియజేశారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో బ్యాంక్ రూ. 22 కోట్ల 44 లక్షల నికర లాభాన్ని నమోదు చేసుకొని స్టాటుటరీ ఆడిటర్లచే ఏ క్లాస్ బ్యాంక్గా వర్గీకరించబడ్డామని తెలియజేశారు. ఈ ఆర్ధిక సంవత్సరాంతానికి 3500 కోట్ల వ్యాపార లక్షాన్ని, 1 లక్ష నూతన ఖాతాదారులను సేకరించే సంకల్పంతో పనిచేస్తున్నామన్నారు.

భారతీయ రిజర్వు బ్యాంకు వారి అనుమతితో ఆరు బ్రాంచీలు గల యాదగిరి లక్ష్మి నరసింహస్వామి కో-ఆపరేటివ్ అర్బను మన బ్యాంకు యందు తేదీ: 10.06.2024 నుండి విలీనం చేసుకోవడం జరిగింది.

అంతే కాకుండా నూతనంగా ఇప్పటి వరకు 16 బ్రాంచీలు ప్రారంబించుకోవడం జరిగింది ఇందులో 8 బ్రాంచీలు హైదరాబాద్ లోని వివిధ ప్రాంతాలతో మిగతా 8 బ్రాంచీలను తెలంగాణ యందలి పలు పట్టణాలలో ప్రారంబించుకోవడం జరిగింది. అలాగే తెలంగాణ, ఆంద్రప్రదేశ్ రాష్ట్రాలలోని ముఖ్య పట్టణాలలో మరో 21 బ్రాంచీలను ప్రారంబించుటకు ఏర్పాట్లు చేస్తున్నాము. తద్వారా మొత్తం 66 బ్రాంచీల నెట్వర్కకి గాయత్రి బ్యాంకు చేరుకో బోతుందని తెలియజేశారు.అలాగే మరిని నూతన బ్యాంకింగ్ సేవలు అనగా డైరెక్టర్ ఆర్ టి జి ఎస్  , ఇంటర్ నెట్ బ్రాంకింగ్ వంటి సేవలను అందుబాటులోకి తేనున్నామని తెలియజేశారు.

అనంతరం బ్యాంకు ముఖ్య కార్యనిర్వహణాధికారి  వనమాల శ్రీనివాస్  31-03-2024 నాటికి ఆడిటెడ్ జమ-ఖర్చు, ఆస్థి-అప్పుల, లాభనష్టముల నివేదికలను సమర్పించారు. గడిచిన 24 సంవత్సరాల కాలంలో తమదైన శైలిలో వినియోగదారులకు అనుకూలమైన వేళలలో పారదర్శకమైన సత్వర సేవలందిస్తూ 31-03-2024 తేదీ నాటికి బ్యాంకు డిపాజిట్లలో 11.67% వృద్ధి సాధించి 1475 కోట్ల 95 లక్షల డిపాజిట్లను కలిగి ఉందని అలాగే ఋణాలలో 10.91% వృద్దితో 1050 కోట్ల 81 లక్షల ఋణ నిలువ, 433 కోట్ల 53 లక్షల పెట్టుబడులను కలిగి, 22 కోట్ల 44 లక్షల నికర లాభాన్ని ఆర్జించి 116 కోట్ల 28 లక్షల నెట్వర్త్ కలిగి ఉన్నామని తెలియజేశారు.

బ్యాంకు ఖాతాదారుల సేవే లక్ష్యంగా , ఏ ఈ పి ఎస్ ,యుపిఐ,  మొబైల్ బ్యాంకింగ్ టోల్ ఫ్రీ బ్యాంకింగ్ ఐ ఎం పి ఎస్ వంటిసేవలను అందిస్తున్నామని తెలియజేశారు. ఇప్పటివరకు 344 బ్యాంకింగ్ కరెప్పాండెంట్ (బి.సి)లను నియమించామని,త్వరలో మరిన్ని గ్రామాలకు బి.సి సేవలను విస్తరింపజేస్తామని తెలియజేశారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో 90 ఆన్సైట్ ఏటిఎంల ద్వారా రూ 1342.74 కోట్ల ఏటిఎం లావాదేవీలను, 462.39 లక్షల సంఖ్యలో యు.పి.ఐ లావాదేవీలను నమోదు చేశామని తెలియజేశారు.

తమ వంతు సామాజిక బాధ్యతగా బ్యాంకు యందు సేవింగ్ ఖాతాపై 1 లక్ష రూపాయల ప్రమాద భీమా సౌకర్యాన్ని అందించడం జరుగుతుందని ఇట్టి స్కీమ్ ద్వారా ఇప్పటి వరకు ప్రమాదవశాత్తు మరణించిన 566 మంది ఖాతాదారుల కుటుంబాలకు 1 లక్ష రూపాయల చొప్పున అందించి వారి కుటుంబాలకు ఆసరాగా నిలవడం జరిగిందని అన్నారు. ఈ సమావేశంలో ప్రమాదవశాత్తు మరణించిన గాయత్రి నిర్భయ సేవింగ్ ఖాతాదారులైన బోమ్మకంటి గణపతి, ఆమందు గంగార్, పోటువత్తిని శంకరయ్య యొక్క కుటుంబ సభ్యులకు ఒక్కొక్కరికి 1 లక్ష రూపాయల చొప్పున ప్రమాదబీమా చెక్కులను అందించారు.

బ్యాంకు ఆవరణలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు సభ్యులు బ్యాంకు అభివృద్ధి పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఇట్టి కార్యక్రమంలో బ్యాంకు ఉపాద్యక్షులు మన్నె సౌజన్య డైరెక్టరైన ఎ. రాజిరెడ్డి, ఎ. సత్యం, వై. అశోక్, కె. శ్రీనాథ్, బి. విజయ్, వాసాల మాధవి, ఎస్. రవి కుమార్, ఆర్. సతీష్ గార్లు మరియు ఇతర సభ్యలు, ఖాతాదారులు, సహకార అధికారులు, బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు.

Tags
Join WhatsApp

More News...

Filmi News 

అత్యంత వైభవంగా ‘100 డేస్ లవ్ స్టోరీ’ ట్రైలర్ విడుదల

అత్యంత వైభవంగా ‘100 డేస్ లవ్ స్టోరీ’ ట్రైలర్ విడుదల హైదరాబాద్, జనవరి 24: శ్రీ సాయి శివ ప్రియ క్రియేషన్స్ పతాకంపై పురిపండ వి. వెంకటరమణ మూర్తి శర్మ నిర్మాతగా, విజయమిత్ర దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘100 డేస్ లవ్ స్టోరీ’. ‘అతి ప్రేమ భయానకం’ అనే క్యాప్షన్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను శుక్రవారం ప్రసాద్ ల్యాబ్‌లో ఘనంగా విడుదల చేశారు....
Read More...
National 

బడ్జెట్ పార్లమెంట్ 28 నుండి, సమావేశాలకు ముందు రోజు అఖిలపక్ష సమావేశం

బడ్జెట్ పార్లమెంట్ 28 నుండి, సమావేశాలకు ముందు రోజు అఖిలపక్ష సమావేశం న్యూఢిల్లీ జనవరి 24 (ప్రజా మంటలు): పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం జనవరి 27న అఖిలపక్ష సమావేశం నిర్వహించనుంది. సంప్రదాయం ప్రకారం, సమావేశాలు ప్రారంభమయ్యే ముందు అన్ని రాజకీయ పార్టీలతో కేంద్రం చర్చలు జరపనుంది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జనవరి 28 నుంచి ప్రారంభమవుతాయి. ఈ సమావేశాలు రెండు దశలుగా ఏప్రిల్...
Read More...
National  Entertainment   State News 

ఫిబ్రవరి 3 నుంచి ప్రజల కోసం రాష్ట్రపతి భవన్, అమృత్ ఉద్యాన్

ఫిబ్రవరి 3 నుంచి ప్రజల కోసం రాష్ట్రపతి భవన్, అమృత్ ఉద్యాన్ న్యూఢిల్లీ జనవరి 24, (ప్రజా మంటలు):ఢిల్లీ వాసులు, పర్యాటకులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. రాష్ట్రపతి భవన్ ప్రాంగణంలో ఉన్న ప్రసిద్ధ అమృత్ ఉద్యాన్ (Amrit Udyan) ఫిబ్రవరి 3 నుంచి సాధారణ ప్రజల సందర్శనకు తెరవనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ ఉద్యాన్ మార్చి 31 వరకు ప్రజలకు అందుబాటులో ఉంటుంది. ప్రతి ఏడాది...
Read More...
National  International   State News 

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభం ప్రభావం డాలర్ కుదేలు… భారత్‌లో ₹1.56 లక్షలకు చేరిన బంగారం ధర

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభం ప్రభావం డాలర్ కుదేలు… భారత్‌లో ₹1.56 లక్షలకు చేరిన బంగారం ధర లండన్ / న్యూఢిల్లీ జనవరి 24(ప్రజా మంటలు): గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు, యూరోపియన్ దేశాలపై టారిఫ్ హెచ్చరికలు ప్రపంచ ఆర్థిక మార్కెట్లలో తీవ్ర అనిశ్చితిని పెంచాయి. ఈ పరిస్థితుల్లో పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తుల వైపు పరుగులు తీయడంతో బంగారం ధరలు 2008 గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ తర్వాత అత్యుత్తమ...
Read More...
State News 

భండారు విజయ కథా సంపటాల పరిచయ సభ

భండారు విజయ కథా సంపటాల పరిచయ సభ హైదరాబాద్, జనవరి 24 (ప్రజా మంటలు): హైదరాబాద్ విమెన్ రైటర్స్ మరియు హస్మిత ప్రచురణ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో, రవీంద్రభారతి కాన్ఫరెన్స్ హాలులో జనవరి 23 సాయంత్రం భండారు విజయ సంపాదకత్వంలో రూపొందిన ‘పరిష్కృత’ (కథా సంకలనం) మరియు ఆమె స్వీయ కథా సంపుటి ‘సహజాత’ పుస్తకాల పరిచయ...
Read More...

మధ్యప్రదేశ్‌ ఉజ్జయినిలో చెలరేగిన హింస – నిషేధాజ్ఞలు విధించిన పోలీసులు

మధ్యప్రదేశ్‌ ఉజ్జయినిలో చెలరేగిన హింస – నిషేధాజ్ఞలు విధించిన పోలీసులు ఉజ్జయిని జనవరి 23 (ప్రజా మంటలు): మధ్యప్రదేశ్ రాష్ట్రం ఉజ్జయినిలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఓ వీఎచ్‌పీ (VHP) నాయకుడిపై జరిగిన దాడి అనంతరం పరిస్థితి ఉద్రిక్తంగా మారి అల్లర్లు చెలరేగినట్లు సమాచారం. ఆందోళనకారులు పలుచోట్ల బస్సులకు నిప్పు పెట్టడంతో పాటు ఇళ్లపై రాళ్లు రువ్వినట్లు అధికారులు తెలిపారు. హింస తీవ్రత పెరగడంతో పోలీసులు భారీగా...
Read More...
National 

శ్రీనగర్‌లో మంచుపాతం రవాణా, విద్యుత్ అంతరాయం

శ్రీనగర్‌లో మంచుపాతం  రవాణా, విద్యుత్ అంతరాయం శ్రీనగర్‌ జనవరి 23: శ్రీనగర్‌ నగరం మరియు దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో తాజాగా మంచు కురిసింది. పర్వతాలు పూర్తిగా మంచుతో కప్పబడి అందంగా కనిపిస్తున్నాయి. డాల్ లేక్‌ సరస్సు కూడా శీతాకాలపు అందాన్ని ప్రతిబింబిస్తూ పర్యాటకులను ఆకర్షిస్తోంది.   మంచు పరిస్థిత శ్రీనగర్ నగరంలో తేలికపాటి నుంచి మోస్తరు స్థాయిలో మంచు పడింది. ఎత్తైన ప్రాంతాల్లో మాత్రం...
Read More...
Local News  State News 

కేటీఆర్‌, హరీష్ రావులకు సంఘీభావం తెలిపిన దావ వసంత సురేష్

కేటీఆర్‌, హరీష్ రావులకు సంఘీభావం తెలిపిన దావ వసంత సురేష్ హైదరాబాద్, జనవరి 23 (ప్రజా మంటలు): సిట్ విచారణ అనంతరం తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌, మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావును జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ కలిసి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌, జిల్లా బీఆర్ఎస్ పార్టీ...
Read More...

పద్మశాలి సేవా సంఘం అభివృద్ధి  కొరకు నిధులు కోరుతూ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ను కలిసిన కాంగ్రెస్ అధ్యక్షుడు నందయ్య

పద్మశాలి సేవా సంఘం అభివృద్ధి  కొరకు నిధులు కోరుతూ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ను కలిసిన కాంగ్రెస్ అధ్యక్షుడు నందయ్య జగిత్యాల జనవరి 23 ( ప్రజా మంటలు)జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ని,జిల్లా అధ్యక్షులు గాజంగి నందయ్య  ని కలిసిన జగిత్యాల పద్మశాలి సేవా సంఘం సభ్యులు.  జగిత్యాల పట్టణంలో పద్మశాలి సేవా సంఘం అభివృద్ధి కొరకు నిధులు మంజూరు చేయాలని మరియు పద్మశాలి విద్యార్థుల సంక్షేమం కోసం హాస్టల్,సంఘానికి కళ్యాణ
Read More...
Local News  State News 

సీఎం రేవంత్ నిజాయితీపరుడైతే బీఆర్ఎస్ నేతలు జైలుకెళ్తారు : ఎంపీ అరవింద్

సీఎం రేవంత్ నిజాయితీపరుడైతే బీఆర్ఎస్ నేతలు జైలుకెళ్తారు : ఎంపీ అరవింద్ బిఆర్ఎస్ కు మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థులే లేరు? జగిత్యాల, జనవరి 23 (ప్రజా మంటలు): ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిజంగా నిజాయితీపరుడైతే గత పాలనలో అవినీతికి పాల్పడ్డ బీఆర్ఎస్ నేతలు తప్పకుండా జైలుకు వెళ్లాల్సి ఉంటుందని బీజేపీ ఎంపీ అరవింద్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. లేదంటే ప్యాకేజీలకు లొంగుతాడా? లేక ధైర్యంగా చర్యలు తీసుకుంటాడా? అనే...
Read More...
Crime  State News 

భద్రాచలం సబ్‌ రిజిస్ట్రార్ ఖాదీర్ను అరెస్ట్ చేసిన ఏసీబీ

 భద్రాచలం సబ్‌ రిజిస్ట్రార్ ఖాదీర్ను అరెస్ట్ చేసిన ఏసీబీ భద్రాచలం, జనవరి 23 (ప్రజా మంటలు): భద్రాచలం సబ్‌ రిజిస్ట్రార్ షేక్ ఖాదీర్‌ను అవినీతి ఆరోపణలపై ఏసీబీ అధికారులు గురువారం రాత్రి అరెస్ట్ చేశారు. బూర్గంపాడు సబ్‌ రిజిస్ట్రార్‌గా పనిచేసిన సమయంలో భూ రిజిస్ట్రేషన్లలో భారీ అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణలపై గత ఏడాది కాలంగా విచారణ కొనసాగుతోంది. ఏసీబీ ఖమ్మం రేంజ్ డీఎస్పీ వై. రమేష్...
Read More...
Crime  State News 

మేడారంలో విద్యుత్ హోర్డింగ్ కూలి ముగ్గురికి గాయాలు

మేడారంలో విద్యుత్ హోర్డింగ్ కూలి ముగ్గురికి గాయాలు మేడారం, జనవరి 23 (ప్రజా మంటలు): మేడారంలొ, శుక్రవారం విద్యుత్ హోర్డింగ్ కూలి ముగ్గురు గాయపడిన ఘటన చోటుచేసుకుంది. ఇందులో ఒకరికి తీవ్ర గాయాలు కాగా, మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన వారిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. జంపన్నవాగు–గడ్డెల రోడ్డులోని హరిత ‘వై’ జంక్షన్ వద్ద విద్యుత్ నేమ్ హోర్డింగ్ ఏర్పాటు చేస్తున్న...
Read More...