45 శాఖలతో అభివృద్ధి పథంలో గాయత్రి బ్యాంక్ - అధ్యక్షులు ముత్యాల లక్ష్మణ్ రెడ్డి

On
45 శాఖలతో అభివృద్ధి పథంలో గాయత్రి బ్యాంక్ - అధ్యక్షులు ముత్యాల లక్ష్మణ్ రెడ్డి

45 శాఖలతో అభివృద్ధి పథంలో గాయత్రి బ్యాంక్
అధ్యక్షులు ముత్యాల లక్ష్మణ్ రెడ్డి
జగిత్యాల జులై 21 (ప్రజా మంటలు) :
రూ. 2843 కోట్ల వ్యాపారంతో 45 శాఖలతో అభివృద్ధి పథంలో గాయత్రి బ్యాంకు ఉందని బ్యాంకు అధ్యక్షులు  ముత్యాల లక్ష్మణ్ రెడ్డి  అన్నారు. తది: 21-07-2024 న జరిగిన ది గాయత్రి కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంకు యొక్క సర్వ సభ్య సమావేశంలో ఆయన మాట్లాడుతూ బ్యాంకు స్థాపించిన 24 సంవత్సరాల కాలంలో, 7 లక్షల 25 వేల మంది వినియోగదారులను కలిగి 2843.44 కోట్ల వ్యాపారాన్ని కలిగి మల్టీ స్టేట్ కో-ఆపరేటివ్ బ్యాంకుగా అవతరించిందని, ఇట్టి అభివృద్ధికి కారణమైన బ్యాంకు ఖాతాదారులకు, సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు. మన బ్యాంకునకు ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఆధార్ అనుసంధాన పేమెంట్ సేవలను ఏ ఈ పి ఎస్) ప్రారంభించామని అలాగే యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ సేవలు కూడా ప్రారంభించామని తెలియజేశారు. మరియు 344 బ్యాంకింగ్ కరెప్పాండెంట్స్ని నియమించి వినియోగదారుల చెంతకు బ్యాంకు సేవలను తీసుకొని వచ్చామని తెలియజేశారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో బ్యాంక్ రూ. 22 కోట్ల 44 లక్షల నికర లాభాన్ని నమోదు చేసుకొని స్టాటుటరీ ఆడిటర్లచే ఏ క్లాస్ బ్యాంక్గా వర్గీకరించబడ్డామని తెలియజేశారు. ఈ ఆర్ధిక సంవత్సరాంతానికి 3500 కోట్ల వ్యాపార లక్షాన్ని, 1 లక్ష నూతన ఖాతాదారులను సేకరించే సంకల్పంతో పనిచేస్తున్నామన్నారు.

భారతీయ రిజర్వు బ్యాంకు వారి అనుమతితో ఆరు బ్రాంచీలు గల యాదగిరి లక్ష్మి నరసింహస్వామి కో-ఆపరేటివ్ అర్బను మన బ్యాంకు యందు తేదీ: 10.06.2024 నుండి విలీనం చేసుకోవడం జరిగింది.

అంతే కాకుండా నూతనంగా ఇప్పటి వరకు 16 బ్రాంచీలు ప్రారంబించుకోవడం జరిగింది ఇందులో 8 బ్రాంచీలు హైదరాబాద్ లోని వివిధ ప్రాంతాలతో మిగతా 8 బ్రాంచీలను తెలంగాణ యందలి పలు పట్టణాలలో ప్రారంబించుకోవడం జరిగింది. అలాగే తెలంగాణ, ఆంద్రప్రదేశ్ రాష్ట్రాలలోని ముఖ్య పట్టణాలలో మరో 21 బ్రాంచీలను ప్రారంబించుటకు ఏర్పాట్లు చేస్తున్నాము. తద్వారా మొత్తం 66 బ్రాంచీల నెట్వర్కకి గాయత్రి బ్యాంకు చేరుకో బోతుందని తెలియజేశారు.అలాగే మరిని నూతన బ్యాంకింగ్ సేవలు అనగా డైరెక్టర్ ఆర్ టి జి ఎస్  , ఇంటర్ నెట్ బ్రాంకింగ్ వంటి సేవలను అందుబాటులోకి తేనున్నామని తెలియజేశారు.

అనంతరం బ్యాంకు ముఖ్య కార్యనిర్వహణాధికారి  వనమాల శ్రీనివాస్  31-03-2024 నాటికి ఆడిటెడ్ జమ-ఖర్చు, ఆస్థి-అప్పుల, లాభనష్టముల నివేదికలను సమర్పించారు. గడిచిన 24 సంవత్సరాల కాలంలో తమదైన శైలిలో వినియోగదారులకు అనుకూలమైన వేళలలో పారదర్శకమైన సత్వర సేవలందిస్తూ 31-03-2024 తేదీ నాటికి బ్యాంకు డిపాజిట్లలో 11.67% వృద్ధి సాధించి 1475 కోట్ల 95 లక్షల డిపాజిట్లను కలిగి ఉందని అలాగే ఋణాలలో 10.91% వృద్దితో 1050 కోట్ల 81 లక్షల ఋణ నిలువ, 433 కోట్ల 53 లక్షల పెట్టుబడులను కలిగి, 22 కోట్ల 44 లక్షల నికర లాభాన్ని ఆర్జించి 116 కోట్ల 28 లక్షల నెట్వర్త్ కలిగి ఉన్నామని తెలియజేశారు.

బ్యాంకు ఖాతాదారుల సేవే లక్ష్యంగా , ఏ ఈ పి ఎస్ ,యుపిఐ,  మొబైల్ బ్యాంకింగ్ టోల్ ఫ్రీ బ్యాంకింగ్ ఐ ఎం పి ఎస్ వంటిసేవలను అందిస్తున్నామని తెలియజేశారు. ఇప్పటివరకు 344 బ్యాంకింగ్ కరెప్పాండెంట్ (బి.సి)లను నియమించామని,త్వరలో మరిన్ని గ్రామాలకు బి.సి సేవలను విస్తరింపజేస్తామని తెలియజేశారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో 90 ఆన్సైట్ ఏటిఎంల ద్వారా రూ 1342.74 కోట్ల ఏటిఎం లావాదేవీలను, 462.39 లక్షల సంఖ్యలో యు.పి.ఐ లావాదేవీలను నమోదు చేశామని తెలియజేశారు.

తమ వంతు సామాజిక బాధ్యతగా బ్యాంకు యందు సేవింగ్ ఖాతాపై 1 లక్ష రూపాయల ప్రమాద భీమా సౌకర్యాన్ని అందించడం జరుగుతుందని ఇట్టి స్కీమ్ ద్వారా ఇప్పటి వరకు ప్రమాదవశాత్తు మరణించిన 566 మంది ఖాతాదారుల కుటుంబాలకు 1 లక్ష రూపాయల చొప్పున అందించి వారి కుటుంబాలకు ఆసరాగా నిలవడం జరిగిందని అన్నారు. ఈ సమావేశంలో ప్రమాదవశాత్తు మరణించిన గాయత్రి నిర్భయ సేవింగ్ ఖాతాదారులైన బోమ్మకంటి గణపతి, ఆమందు గంగార్, పోటువత్తిని శంకరయ్య యొక్క కుటుంబ సభ్యులకు ఒక్కొక్కరికి 1 లక్ష రూపాయల చొప్పున ప్రమాదబీమా చెక్కులను అందించారు.

బ్యాంకు ఆవరణలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు సభ్యులు బ్యాంకు అభివృద్ధి పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఇట్టి కార్యక్రమంలో బ్యాంకు ఉపాద్యక్షులు మన్నె సౌజన్య డైరెక్టరైన ఎ. రాజిరెడ్డి, ఎ. సత్యం, వై. అశోక్, కె. శ్రీనాథ్, బి. విజయ్, వాసాల మాధవి, ఎస్. రవి కుమార్, ఆర్. సతీష్ గార్లు మరియు ఇతర సభ్యలు, ఖాతాదారులు, సహకార అధికారులు, బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు.

Tags
Join WhatsApp

More News...

Local News 

పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు బీసీలు గుర్తు రాలేదా.. 

పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు బీసీలు గుర్తు రాలేదా..  తలసానిని ప్రశ్నించిన బన్సీలాల్ పేట్ కాంగ్రెస్ నాయకులు సికింద్రాబాద్,నవంబర్ 28 (ప్రజా మంటలు):  స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చే విషయంలో చిత్తశుద్ది ఉందని, తమ ప్రయత్నాన్ని తలసాని శ్రీనివాస్ యాదవ్ శంకించాల్సిన అవసరం లేదని బన్సీలాల్ పేట్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు.  శుక్రవారం వారు మీడియాతో మాట్లాడుతూ.. పదేళ్లు బీసీల...
Read More...
Local News  Crime  State News 

రాజన్న సిరిసిల్లలో తల్లి–కొడుకు ఆత్మహత్య : కానిస్టేబుల్ అభిలాష్ విషాద మరణం

రాజన్న సిరిసిల్లలో తల్లి–కొడుకు ఆత్మహత్య : కానిస్టేబుల్ అభిలాష్ విషాద మరణం సిరిసిల్ల నవంబర్ 28 (ప్రజా మంటలు): సిరిసిల్ల పట్టణంలోని మానేరు వాగులో తల్లి–కొడుకు ఇద్దరూ ఆత్మహత్య చేసుకున్న ఘటన జిల్లాలో తీవ్ర విషాదాన్ని నింపింది. మహిళ ఆత్మహత్యను తట్టుకోలేక ఆమె కుమారుడు కూడా ప్రాణాలు తీసుకున్న ఈ సంఘటన స్థానికులను కలచివేసింది. తల్లి లలిత మానేరు వాగులో దూకి ఆత్మహత్య సిరిసిల్లలోని మానేరు వాగులో లలిత...
Read More...
State News 

తెలంగాణ పంచాయతీ ఎన్నికలను వెంటనే రద్దు చేయాలి - బిసి కమీషన్ చైర్మన్ నిరంజన్

తెలంగాణ పంచాయతీ ఎన్నికలను వెంటనే రద్దు చేయాలి - బిసి కమీషన్ చైర్మన్ నిరంజన్ హైదరాబాద్ నవంబర్ 28 (ప్రజా మంటలు): తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు అన్యాయం జరిగిందని, ఈ ఎన్నికలను వెంటనే రద్దు చేసి, రిజర్వేషన్లను సరిచేసి మళ్లీ నిర్వహించాల్సిందేనని బీసీ కమిషన్ చైర్మన్ జి. నిరంజన్ తీవ్రంగా డిమాండ్ చేశారు. “2019లో 22.78% ఇచ్చి… ఇప్పుడు అదికూడా తగ్గించడం ఏ న్యాయం?” – నిరంజన్ ప్రశ్న 2019...
Read More...

మహాత్మ జ్యోతిరావు పూలే వర్ధంతి – కాంగ్రెస్ నేతల ఘన నివాళులు

మహాత్మ జ్యోతిరావు పూలే వర్ధంతి – కాంగ్రెస్ నేతల ఘన నివాళులు కరీంనగర్, నవంబర్ 28 (ప్రజా మంటలు): మహాత్మ జ్యోతిబా పూలే వర్ధంతి సందర్భంగా డిసిసి కార్యాలయం మరియు శాతవాహన యూనివర్సిటీ వద్ద జిల్లా కాంగ్రెస్ బీసీ సెల్ ఆధ్వర్యంలో ఘన కార్యక్రమాలు జరిగాయి. సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు పులి ఆంజనేయులు గౌడ్, కార్పొరేషన్ కాంగ్రెస్...
Read More...
Local News  Crime  State News 

తండ్రి హత్యకు ప్రతీకారంగా మాజీ నక్సలైట్‌ నర్సయ్యను హతమార్చిన కొడుకు

తండ్రి హత్యకు ప్రతీకారంగా మాజీ నక్సలైట్‌ నర్సయ్యను హతమార్చిన కొడుకు సిరిసిల్ల నవంబర్ 28 (ప్రజా మంటలు): రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం గండి లచ్చపేటకు చెందిన మాజీ నక్సలైట్ బల్లెపు సిద్దయ్య అలియాస్ నర్సయ్య (46) దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన వేములవాడ అర్బన్ మండలం అగ్రహారం గుట్ట వద్ద జరిగింది. జగిత్యాల పట్టణానికి చెందిన సంతోష్ అనే వ్యక్తి నర్సయ్యను హతమార్చి,...
Read More...
Local News 

వృద్దుల కోసం జెరియాట్రిక్ వైద్య సేవలు -జిల్లా సంక్షేమాధికారి డాక్టర్ బి. నరేష్.

వృద్దుల కోసం జెరియాట్రిక్ వైద్య సేవలు -జిల్లా సంక్షేమాధికారి డాక్టర్ బి. నరేష్. జగిత్యాల నవంబర్ 28 (ప్రజా మంటలు): వయో వృద్ధులు (సీనియర్ సిటిజెన్లు ) ప్రత్యేక జెరియాట్రిక్ వైద్య సేవలు, కన్సల్టేషన్ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా సంక్షేమాధికారి డాక్టర్ బి. నరేష్ కోరారు.  శుక్రవారం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో వయో వృద్ధుల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన జెరియాట్రిక్  ఉచిత వైద్య సేవల విభాగాన్ని  జిల్లా...
Read More...
State News 

కామారెడ్డిలో కల్వకుంట్ల కవిత అరెస్ట్ - హైదరాబాద్ తరలింపు

కామారెడ్డిలో కల్వకుంట్ల కవిత అరెస్ట్ - హైదరాబాద్ తరలింపు కామారెడ్డి నవంబర్ 28 (ప్రజా మంటలు): కామారెడ్డి రైలు రోకో కార్యక్రమంలో పాల్గొన్న బీఆర్ఎస్ నేత కల్వకుంట్ల కవితను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు అనంతరం ఆమె తీవ్రంగా స్పందించారు.ఆమెను హైదరాబాద్ తరలించారు.   బీజేపీకే స్పష్టమైన హెచ్చరిక “రైల్ రోకో చేసి ఢిల్లీ వరకు మెసేజ్ పంపిస్తున్నాం.” “కచ్చితంగా బీజేపీ దిగిరావాలి… బీజేపీ ఎంపీలు...
Read More...
Local News 

స్వర్గీయ డా. మర్రి చెన్నారెడ్డి వర్ధంతి కార్యక్రమాల ఏర్పాట్లపై సమీక్ష

స్వర్గీయ డా. మర్రి చెన్నారెడ్డి వర్ధంతి కార్యక్రమాల ఏర్పాట్లపై సమీక్ష హైదరాబాద్, నవంబర్28 (ప్రజామంటలు):  రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ డా. మర్రి చెన్నారెడ్డి  29వ వర్ధంతి కార్యక్రమాల ఏర్పాట్లపై బేగంపేట్‌లోని బీజేపీ కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మాజీ మంత్రి, NDMA మాజీ ఉపాధ్యక్షులు, బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యులు శ్రీ మర్రి శశిధర్ రెడ్డి నేతృత్వం వహించారు. డిసెంబర్...
Read More...
Local News 

బాపు నగర్ సమగ్రాభివృద్ధికి చర్యలు తీసుకుంటాం - పీసీసీ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ కోట నీలిమ

బాపు నగర్ సమగ్రాభివృద్ధికి చర్యలు తీసుకుంటాం - పీసీసీ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ కోట నీలిమ సికింద్రాబాద్, నవంబర్ 28 (ప్రజామంటలు) : సనత్ నగర్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో పీసీసీ వైస్ ప్రెసిడెంట్, సనత్ నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి డాక్టర్ కోట నీలిమ శుక్రవారం బస్తీ పర్యటన నిర్వహించారు. ప్రజా సమస్యలపై పర్యటన చేసిన కోట నీలిమ సనత్ నగర్ నియోజకవర్గంలోని అమీర్ పేట్ డివిజన్ లోని బాపు...
Read More...
Local News 

 గాంధీ ఆసుపత్రి ఆర్థోపెడిక్స్ విభాగానికి పరికరాల విరాళాలు

 గాంధీ ఆసుపత్రి ఆర్థోపెడిక్స్ విభాగానికి పరికరాల విరాళాలు గాంధీకి వచ్చే పేద రోగులకు సాయమందించండి..     సికింద్రాబాద్ నవంబర్ 28 (ప్రజామంటలు) : పేద రోగులు వచ్చే గాంధీ ఆసుపత్రిలో వారికి మరింత మెరుగైన వైద్య సౌకర్యాలు అందించేందుకు గాను కార్పొరేట్, స్వచ్చంద సంస్థలు ముందుకు రావాలని గాంధీ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డా.ఇందిరా, సూపరింటెండెంట్ డా.వాణి లు పిలుపు నిచ్చారు. శుక్రవారం గాంధీ ఆసుపత్రి...
Read More...
Local News 

బాల్యవివాహాల రహిత భారత దేశం కోసం విద్యార్థులచే  ప్రతిజ్ఞ

బాల్యవివాహాల రహిత భారత దేశం కోసం విద్యార్థులచే  ప్రతిజ్ఞ మహిళా భివృద్ధి శిశు సంక్షేమ శాఖ జగిత్యాల ఆధ్వర్యంలో  (అంకం భూమయ్య)   గొల్లపల్లి నవంబర్ 28 (ప్రజా మంటలు):   గొల్లపల్లి మండలంలోని రాపల్లి గ్రామంలో జడ్పీహెచ్ఎస్ హైస్కూల్  మరియు నందిపల్లి పంచాయతీ ఆవరణలో బాల్యవివాహాల నిరోధం పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు జిల్లా బాలల పరిరక్షణ విభాగం నుండి పరిరక్షణ అధికారి పడాల సురేష్, జాన్సన్...
Read More...

సూర్య ధన్వంతరి ఆలయంలో కాలభైరవాష్టమి సందర్భంగా ప్రత్యేక కుంకుమ పూజలు

సూర్య ధన్వంతరి ఆలయంలో కాలభైరవాష్టమి సందర్భంగా ప్రత్యేక కుంకుమ పూజలు .   జగిత్యాల నవంబర్ 28(ప్రజా మంటలు)  పట్టణము లోని శ్రీ సూర్య ధన్వంతరి దేవాలయం లో  శ్రీ ధనలక్ష్మి సేవా సమితి  అధ్వర్యంలో    శుక్రవారం కాలభైరవాష్టమి  పర్వదినం  పురస్కరించుకొని, మాతలు పాల్గొని  అమ్మవారికి ప్రత్యేక  కుంకుమార్చన,  లలితా సహస్ర నామాల స్థోత్ర పారాయణం చేసారు. పారాయణం అనంతరం మాతలు  అమ్మ వారికి ఒడి బియ్యం సమర్పించారు.కుంకుమ...
Read More...