45 శాఖలతో అభివృద్ధి పథంలో గాయత్రి బ్యాంక్ - అధ్యక్షులు ముత్యాల లక్ష్మణ్ రెడ్డి
45 శాఖలతో అభివృద్ధి పథంలో గాయత్రి బ్యాంక్
అధ్యక్షులు ముత్యాల లక్ష్మణ్ రెడ్డి
జగిత్యాల జులై 21 (ప్రజా మంటలు) :
రూ. 2843 కోట్ల వ్యాపారంతో 45 శాఖలతో అభివృద్ధి పథంలో గాయత్రి బ్యాంకు ఉందని బ్యాంకు అధ్యక్షులు ముత్యాల లక్ష్మణ్ రెడ్డి అన్నారు. తది: 21-07-2024 న జరిగిన ది గాయత్రి కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంకు యొక్క సర్వ సభ్య సమావేశంలో ఆయన మాట్లాడుతూ బ్యాంకు స్థాపించిన 24 సంవత్సరాల కాలంలో, 7 లక్షల 25 వేల మంది వినియోగదారులను కలిగి 2843.44 కోట్ల వ్యాపారాన్ని కలిగి మల్టీ స్టేట్ కో-ఆపరేటివ్ బ్యాంకుగా అవతరించిందని, ఇట్టి అభివృద్ధికి కారణమైన బ్యాంకు ఖాతాదారులకు, సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు. మన బ్యాంకునకు ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఆధార్ అనుసంధాన పేమెంట్ సేవలను ఏ ఈ పి ఎస్) ప్రారంభించామని అలాగే యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ సేవలు కూడా ప్రారంభించామని తెలియజేశారు. మరియు 344 బ్యాంకింగ్ కరెప్పాండెంట్స్ని నియమించి వినియోగదారుల చెంతకు బ్యాంకు సేవలను తీసుకొని వచ్చామని తెలియజేశారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో బ్యాంక్ రూ. 22 కోట్ల 44 లక్షల నికర లాభాన్ని నమోదు చేసుకొని స్టాటుటరీ ఆడిటర్లచే ఏ క్లాస్ బ్యాంక్గా వర్గీకరించబడ్డామని తెలియజేశారు. ఈ ఆర్ధిక సంవత్సరాంతానికి 3500 కోట్ల వ్యాపార లక్షాన్ని, 1 లక్ష నూతన ఖాతాదారులను సేకరించే సంకల్పంతో పనిచేస్తున్నామన్నారు.
భారతీయ రిజర్వు బ్యాంకు వారి అనుమతితో ఆరు బ్రాంచీలు గల యాదగిరి లక్ష్మి నరసింహస్వామి కో-ఆపరేటివ్ అర్బను మన బ్యాంకు యందు తేదీ: 10.06.2024 నుండి విలీనం చేసుకోవడం జరిగింది.
అంతే కాకుండా నూతనంగా ఇప్పటి వరకు 16 బ్రాంచీలు ప్రారంబించుకోవడం జరిగింది ఇందులో 8 బ్రాంచీలు హైదరాబాద్ లోని వివిధ ప్రాంతాలతో మిగతా 8 బ్రాంచీలను తెలంగాణ యందలి పలు పట్టణాలలో ప్రారంబించుకోవడం జరిగింది. అలాగే తెలంగాణ, ఆంద్రప్రదేశ్ రాష్ట్రాలలోని ముఖ్య పట్టణాలలో మరో 21 బ్రాంచీలను ప్రారంబించుటకు ఏర్పాట్లు చేస్తున్నాము. తద్వారా మొత్తం 66 బ్రాంచీల నెట్వర్కకి గాయత్రి బ్యాంకు చేరుకో బోతుందని తెలియజేశారు.అలాగే మరిని నూతన బ్యాంకింగ్ సేవలు అనగా డైరెక్టర్ ఆర్ టి జి ఎస్ , ఇంటర్ నెట్ బ్రాంకింగ్ వంటి సేవలను అందుబాటులోకి తేనున్నామని తెలియజేశారు.
అనంతరం బ్యాంకు ముఖ్య కార్యనిర్వహణాధికారి వనమాల శ్రీనివాస్ 31-03-2024 నాటికి ఆడిటెడ్ జమ-ఖర్చు, ఆస్థి-అప్పుల, లాభనష్టముల నివేదికలను సమర్పించారు. గడిచిన 24 సంవత్సరాల కాలంలో తమదైన శైలిలో వినియోగదారులకు అనుకూలమైన వేళలలో పారదర్శకమైన సత్వర సేవలందిస్తూ 31-03-2024 తేదీ నాటికి బ్యాంకు డిపాజిట్లలో 11.67% వృద్ధి సాధించి 1475 కోట్ల 95 లక్షల డిపాజిట్లను కలిగి ఉందని అలాగే ఋణాలలో 10.91% వృద్దితో 1050 కోట్ల 81 లక్షల ఋణ నిలువ, 433 కోట్ల 53 లక్షల పెట్టుబడులను కలిగి, 22 కోట్ల 44 లక్షల నికర లాభాన్ని ఆర్జించి 116 కోట్ల 28 లక్షల నెట్వర్త్ కలిగి ఉన్నామని తెలియజేశారు.
బ్యాంకు ఖాతాదారుల సేవే లక్ష్యంగా , ఏ ఈ పి ఎస్ ,యుపిఐ, మొబైల్ బ్యాంకింగ్ టోల్ ఫ్రీ బ్యాంకింగ్ ఐ ఎం పి ఎస్ వంటిసేవలను అందిస్తున్నామని తెలియజేశారు. ఇప్పటివరకు 344 బ్యాంకింగ్ కరెప్పాండెంట్ (బి.సి)లను నియమించామని,త్వరలో మరిన్ని గ్రామాలకు బి.సి సేవలను విస్తరింపజేస్తామని తెలియజేశారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో 90 ఆన్సైట్ ఏటిఎంల ద్వారా రూ 1342.74 కోట్ల ఏటిఎం లావాదేవీలను, 462.39 లక్షల సంఖ్యలో యు.పి.ఐ లావాదేవీలను నమోదు చేశామని తెలియజేశారు.
తమ వంతు సామాజిక బాధ్యతగా బ్యాంకు యందు సేవింగ్ ఖాతాపై 1 లక్ష రూపాయల ప్రమాద భీమా సౌకర్యాన్ని అందించడం జరుగుతుందని ఇట్టి స్కీమ్ ద్వారా ఇప్పటి వరకు ప్రమాదవశాత్తు మరణించిన 566 మంది ఖాతాదారుల కుటుంబాలకు 1 లక్ష రూపాయల చొప్పున అందించి వారి కుటుంబాలకు ఆసరాగా నిలవడం జరిగిందని అన్నారు. ఈ సమావేశంలో ప్రమాదవశాత్తు మరణించిన గాయత్రి నిర్భయ సేవింగ్ ఖాతాదారులైన బోమ్మకంటి గణపతి, ఆమందు గంగార్, పోటువత్తిని శంకరయ్య యొక్క కుటుంబ సభ్యులకు ఒక్కొక్కరికి 1 లక్ష రూపాయల చొప్పున ప్రమాదబీమా చెక్కులను అందించారు.
బ్యాంకు ఆవరణలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు సభ్యులు బ్యాంకు అభివృద్ధి పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఇట్టి కార్యక్రమంలో బ్యాంకు ఉపాద్యక్షులు మన్నె సౌజన్య డైరెక్టరైన ఎ. రాజిరెడ్డి, ఎ. సత్యం, వై. అశోక్, కె. శ్రీనాథ్, బి. విజయ్, వాసాల మాధవి, ఎస్. రవి కుమార్, ఆర్. సతీష్ గార్లు మరియు ఇతర సభ్యలు, ఖాతాదారులు, సహకార అధికారులు, బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
కోరుట్ల తాళ్ళచెరువు ఫిల్టర్ బెడ్ పరిశీలించిన అదనపు కలెక్టర్ (లోకల్ బాడీ )బి రాజా గౌడ్
కోరుట్ల నవంబర్ 22(ప్రజా మంటలు) జగిత్యాల జిల్లా కోరుట్ల మండల కేంద్రంలోని తాళ్లచెరువు ఫిల్టర్ బెడ్ ను శనివారం పరిశీలించిన అదనపు కలెక్టర్ (లోకల్ బాడీ) బి.రాజ గౌడ్
పట్టణం లోని పట్టణ ప్రజలకు సకాలంలో నీరు అందించాలి. ఫిల్టర్ బెడ్ ను మరియు నీరు యొక్క స్వచ్ఛతను ఎప్పటికప్పుడు పరిశీలించాలని మున్సిపల్ అధికారులకు ఆదేశించారు.... కోటీ రూపాయల భూమిని ₹16 లక్షలకు ఇచ్చేది లేదంటూ ఆగ్రహించిన రైతులు
సంగారెడ్డి నవంబర్ 22,(ప్రజా మంటలు):సంగారెడ్డి జిల్లాలోని చౌటకూర్ మండలం శివ్వంపేట గ్రామంలో మంగళవారం ఉదయం ఉద్రిక్తత చోటుచేసుకుంది. ట్రిపుల్ ఆర్ రోడ్ ఏర్పాటుకు అవసరమైన భూ సేకరణ నోటీసులు అందజేయడానికి వచ్చిన అధికారులను రైతులు పంచాయతీ కార్యాలయంలో బంధించారు.
భూసేకరణ నోటీసులు అందించడానికి వచ్చిన అధికారులు
ట్రిపుల్ ఆర్ రోడ్ నిర్మాణం కోసం ఎకరాకు... 3లక్షల రూపాయల LOC అందజేసిన ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్
హైద్రాబాద్ నవంబర్ 22(ప్రజా మంటలు)బీర్ పూర్ మండల తుంగురూ గ్రామానికి చెందిన ఉయ్యాల సుజాత అనారోగ్యం తో బాధపడుతూ నరాల సంబంధిత వైద్య చికిత్స చేసుకోలేక ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ ఉండగా విషయాన్ని రంగంపేట నాయకులు డ్రైవర్ శేఖర్ ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ దృష్టికి తీసుకురాగా ముఖ్యమంత్రి సహాయ నిది ద్వారా నిమ్స్ లో... రిపోర్టర్ షఫీ ఆరోగ్య పరిస్థితి ఆసుపత్రిని సందర్శించి వైద్యులను అడిగి తెలుసుకొన్న ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్
హైదరాబాద్ నవంబర్ 22(ప్రజా మంటలు)
జగిత్యాల ఐ న్యూస్ రిపోర్టర్ షఫీ అనారోగ్యంతో హైదరాబాద్ బంజారాహిల్స్ లోని రెనోవ హాస్పిటల్లో చికిత్స పొందుతుండగా షఫీ ని ఆస్పత్రి లో పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని వైద్యులతో అడిగి తెలుసుకున్నారు జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ తెలంగాణలో స్థానిక సంస్థల రిజర్వేషన్లపై కొత్త జీవో విడుదల
హైదరాబాద్ నవంబర్ 23, ప్రజా మంటలు:
తెలంగాణ ప్రభుత్వం ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లపై కీలక ఆదేశాలు జారీ చేసింది. సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు, మండల–జిల్లా పరిషత్ స్థానాల రిజర్వేషన్ కేటాయింపుకు సంబంధించిన మార్గదర్శకాలతో ప్రభుత్వం తాజా జీవో విడుదల చేసింది.
ఈ జీవో ప్రకారం—మొత్తం రిజర్వేషన్లు 50% దాటకూడదు... తెలంగాణలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన ముగింపు – బేగంపేట ఎయిర్పోర్ట్లో ఘన వీడుకోలు
హైదరాబాద్ నవంబర్ 22, ప్రజా మంటలు:
తెలంగాణలో రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారి రెండు రోజుల పర్యటన విజయవంతంగా పూర్తయ్యింది. అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్న రాష్ట్రపతికి శుక్రవారం బేగంపేట ఎయిర్పోర్ట్లో ఘనంగా వీడుకోలు పలికారు.
ఈ సందర్భంగా రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ,ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, రవాణా–బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం... కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకున్న కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్
జగిత్యాల (రూరల్ ) నవంబర్ 22 ప్రజా మంటలు:
కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ గారు శుక్రవారం ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయస్వామి దేవాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా వారు స్వామివారి ప్రత్యేక పూజల్లో పాల్గొని, పరిణతి యజ్ఞోపవిత ధారణ చేసి భక్తి శ్రద్ధలతో ఆరాధన నిర్వహించారు.
ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతూ,“మన కోరుట్ల నియోజకవర్గ... సుప్రీం కోర్టు తీర్పు: గవర్నర్–ముఖ్యమంత్రి అధికారాలపై దేశవ్యాప్త చర్చ
చెరువుల మరమ్మత్తులకు నిధులు ఇవ్వండి : MLA సంజయ్
హైదరాబాద్ నవంబర్ 21 (ప్రజా మంటలు):జగిత్యాల అభివృద్ధి పనులపై కీలక నిర్ణయాలు త్వరలో వెల్లువడనున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ని ఆయన కార్యాలయంలో కలిసి, జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ వినతిపత్రం సమర్పించారు.
చెరువుల మరమ్మత్తులకు నిధుల అభ్యర్థన
ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తెలిపిన వివరాల... చిరు ఉద్యోగుల పెద్ద మనసు....ప్రతి నెల వేతనం నుంచి కొంత భాగం సేవ పనులకు..
సికింద్రాబాద్, నవంబర్ 21 (ప్రజామంటలు) :
ఆర్ఎన్ఆర్ ఇన్ఫ్రా సంస్థ ఉద్యోగులు కృష్ణజ్యోతి, కీర్తిల ఆధ్వర్యంలో గాంధీ ఆస్పత్రి ఎంసీహెచ్ విభాగంలో చికిత్స పొందుతున్న బాలింతలు, గర్భిణీలకు శుక్రవారం పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి సూపరింటెండెంట్ ప్రొఫెసర్ వాణి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సామాజిక సేవలో భాగంగా ఉద్యోగులు తమ వేతనంలో కొంతభాగాన్ని ప్రతి... శిశు సంరక్షణపై మరింత అవగాహన పెంచుకోవాలి.. గాంధీలో న్యూ బోర్న్ బేబీ వారోత్సవాలు..
సికింద్రాబాద్, నవంబర్ 21 (ప్రజామంటలు) :
నవ జాత శిశు సంరక్షణపై తల్లులకు మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు వైద్యనిపుణులు అభిప్రాయపడ్డారు. గాంధీ మదర్ అండ్ చైల్డ్ కేర్ ఆస్పత్రి (ఎంసీహెచ్) లో గైనకాలజీ, పిడియాట్రిక్ విభాగాల సంయుక్త నేతృత్వంలో న్యూబోర్న్ బేబీ వారోత్సవాలను పురష్కరించుకుని శుక్రవారం పలు అవేర్నెస్ కార్యక్రమాలు... దేవాలయానికి ఎలక్ట్రానిక్ గుడి గంట బహుకరణ
ఇబ్రహీంపట్నం నవంబర్ 21 (ప్రజా మంటలు దగ్గుల అశోక్): ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని వర్ష కొండ గ్రామంలోని శ్రీలక్ష్మి వెంకటేశ్వర స్వామి దేవాలయానికి శ్రీ పిస్క శ్రీనివాస్-లత దంపతులు ఎలక్ట్రానిక్ గుడి గంటను బహుకరించారు.
ఈ గంట ప్రతి గంట, ప్రతి గంటకు టైం చెప్పడంతో పాటు, ఒక భగవద్గీత శ్లోకం మరియు భక్తి గీతం... 