45 శాఖలతో అభివృద్ధి పథంలో గాయత్రి బ్యాంక్ - అధ్యక్షులు ముత్యాల లక్ష్మణ్ రెడ్డి
45 శాఖలతో అభివృద్ధి పథంలో గాయత్రి బ్యాంక్
అధ్యక్షులు ముత్యాల లక్ష్మణ్ రెడ్డి
జగిత్యాల జులై 21 (ప్రజా మంటలు) :
రూ. 2843 కోట్ల వ్యాపారంతో 45 శాఖలతో అభివృద్ధి పథంలో గాయత్రి బ్యాంకు ఉందని బ్యాంకు అధ్యక్షులు ముత్యాల లక్ష్మణ్ రెడ్డి అన్నారు. తది: 21-07-2024 న జరిగిన ది గాయత్రి కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంకు యొక్క సర్వ సభ్య సమావేశంలో ఆయన మాట్లాడుతూ బ్యాంకు స్థాపించిన 24 సంవత్సరాల కాలంలో, 7 లక్షల 25 వేల మంది వినియోగదారులను కలిగి 2843.44 కోట్ల వ్యాపారాన్ని కలిగి మల్టీ స్టేట్ కో-ఆపరేటివ్ బ్యాంకుగా అవతరించిందని, ఇట్టి అభివృద్ధికి కారణమైన బ్యాంకు ఖాతాదారులకు, సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు. మన బ్యాంకునకు ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఆధార్ అనుసంధాన పేమెంట్ సేవలను ఏ ఈ పి ఎస్) ప్రారంభించామని అలాగే యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ సేవలు కూడా ప్రారంభించామని తెలియజేశారు. మరియు 344 బ్యాంకింగ్ కరెప్పాండెంట్స్ని నియమించి వినియోగదారుల చెంతకు బ్యాంకు సేవలను తీసుకొని వచ్చామని తెలియజేశారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో బ్యాంక్ రూ. 22 కోట్ల 44 లక్షల నికర లాభాన్ని నమోదు చేసుకొని స్టాటుటరీ ఆడిటర్లచే ఏ క్లాస్ బ్యాంక్గా వర్గీకరించబడ్డామని తెలియజేశారు. ఈ ఆర్ధిక సంవత్సరాంతానికి 3500 కోట్ల వ్యాపార లక్షాన్ని, 1 లక్ష నూతన ఖాతాదారులను సేకరించే సంకల్పంతో పనిచేస్తున్నామన్నారు.
భారతీయ రిజర్వు బ్యాంకు వారి అనుమతితో ఆరు బ్రాంచీలు గల యాదగిరి లక్ష్మి నరసింహస్వామి కో-ఆపరేటివ్ అర్బను మన బ్యాంకు యందు తేదీ: 10.06.2024 నుండి విలీనం చేసుకోవడం జరిగింది.
అంతే కాకుండా నూతనంగా ఇప్పటి వరకు 16 బ్రాంచీలు ప్రారంబించుకోవడం జరిగింది ఇందులో 8 బ్రాంచీలు హైదరాబాద్ లోని వివిధ ప్రాంతాలతో మిగతా 8 బ్రాంచీలను తెలంగాణ యందలి పలు పట్టణాలలో ప్రారంబించుకోవడం జరిగింది. అలాగే తెలంగాణ, ఆంద్రప్రదేశ్ రాష్ట్రాలలోని ముఖ్య పట్టణాలలో మరో 21 బ్రాంచీలను ప్రారంబించుటకు ఏర్పాట్లు చేస్తున్నాము. తద్వారా మొత్తం 66 బ్రాంచీల నెట్వర్కకి గాయత్రి బ్యాంకు చేరుకో బోతుందని తెలియజేశారు.అలాగే మరిని నూతన బ్యాంకింగ్ సేవలు అనగా డైరెక్టర్ ఆర్ టి జి ఎస్ , ఇంటర్ నెట్ బ్రాంకింగ్ వంటి సేవలను అందుబాటులోకి తేనున్నామని తెలియజేశారు.
అనంతరం బ్యాంకు ముఖ్య కార్యనిర్వహణాధికారి వనమాల శ్రీనివాస్ 31-03-2024 నాటికి ఆడిటెడ్ జమ-ఖర్చు, ఆస్థి-అప్పుల, లాభనష్టముల నివేదికలను సమర్పించారు. గడిచిన 24 సంవత్సరాల కాలంలో తమదైన శైలిలో వినియోగదారులకు అనుకూలమైన వేళలలో పారదర్శకమైన సత్వర సేవలందిస్తూ 31-03-2024 తేదీ నాటికి బ్యాంకు డిపాజిట్లలో 11.67% వృద్ధి సాధించి 1475 కోట్ల 95 లక్షల డిపాజిట్లను కలిగి ఉందని అలాగే ఋణాలలో 10.91% వృద్దితో 1050 కోట్ల 81 లక్షల ఋణ నిలువ, 433 కోట్ల 53 లక్షల పెట్టుబడులను కలిగి, 22 కోట్ల 44 లక్షల నికర లాభాన్ని ఆర్జించి 116 కోట్ల 28 లక్షల నెట్వర్త్ కలిగి ఉన్నామని తెలియజేశారు.
బ్యాంకు ఖాతాదారుల సేవే లక్ష్యంగా , ఏ ఈ పి ఎస్ ,యుపిఐ, మొబైల్ బ్యాంకింగ్ టోల్ ఫ్రీ బ్యాంకింగ్ ఐ ఎం పి ఎస్ వంటిసేవలను అందిస్తున్నామని తెలియజేశారు. ఇప్పటివరకు 344 బ్యాంకింగ్ కరెప్పాండెంట్ (బి.సి)లను నియమించామని,త్వరలో మరిన్ని గ్రామాలకు బి.సి సేవలను విస్తరింపజేస్తామని తెలియజేశారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో 90 ఆన్సైట్ ఏటిఎంల ద్వారా రూ 1342.74 కోట్ల ఏటిఎం లావాదేవీలను, 462.39 లక్షల సంఖ్యలో యు.పి.ఐ లావాదేవీలను నమోదు చేశామని తెలియజేశారు.
తమ వంతు సామాజిక బాధ్యతగా బ్యాంకు యందు సేవింగ్ ఖాతాపై 1 లక్ష రూపాయల ప్రమాద భీమా సౌకర్యాన్ని అందించడం జరుగుతుందని ఇట్టి స్కీమ్ ద్వారా ఇప్పటి వరకు ప్రమాదవశాత్తు మరణించిన 566 మంది ఖాతాదారుల కుటుంబాలకు 1 లక్ష రూపాయల చొప్పున అందించి వారి కుటుంబాలకు ఆసరాగా నిలవడం జరిగిందని అన్నారు. ఈ సమావేశంలో ప్రమాదవశాత్తు మరణించిన గాయత్రి నిర్భయ సేవింగ్ ఖాతాదారులైన బోమ్మకంటి గణపతి, ఆమందు గంగార్, పోటువత్తిని శంకరయ్య యొక్క కుటుంబ సభ్యులకు ఒక్కొక్కరికి 1 లక్ష రూపాయల చొప్పున ప్రమాదబీమా చెక్కులను అందించారు.
బ్యాంకు ఆవరణలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు సభ్యులు బ్యాంకు అభివృద్ధి పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఇట్టి కార్యక్రమంలో బ్యాంకు ఉపాద్యక్షులు మన్నె సౌజన్య డైరెక్టరైన ఎ. రాజిరెడ్డి, ఎ. సత్యం, వై. అశోక్, కె. శ్రీనాథ్, బి. విజయ్, వాసాల మాధవి, ఎస్. రవి కుమార్, ఆర్. సతీష్ గార్లు మరియు ఇతర సభ్యలు, ఖాతాదారులు, సహకార అధికారులు, బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా సాయి శ్రీనివాస్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య సేవలు
మెట్టుపల్లి నవంబర్ 19 (ప్రజా మంటలు దగ్గుల అశోక్):
కాంగ్రెస్ పార్టీ మాజీ ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా.మెట్టుపల్లి లోని సాయి శ్రీనివాస్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య సేవలు అందించడం జరిగింది మరియు రోగులకు పండ్లు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కాంగ్రెస్ పార్టీ కోరుట్ల నియోజకవర్గం ఇంచార్జ్... డ్రగ్స్.సైబర్ నేరాలపై అవగాహన సదస్సు.
ఇబ్రహీంపట్నం నవంబర్ 19 (ప్రజా మంటలు దగ్గుల అశోక్):
జగిత్యాల జిల్లా గౌరవ ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు బుధవారం రోజున ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలోని మోడల్ స్కూల్ నందు విద్యార్థులకు సైబర్,డ్రగ్స్, ట్రాఫిక్ మరియు ఉమెన్ ట్రాఫికింగ్ లాంటి పలు అంశాల పైన అవగాహన సదస్సు ను ఇబ్రహీంపట్నం ఎస్... వేములకుర్తి పాఠశాల కు పురిపైడ్,నిటి ట్యాంక్ అందచేత
ఇబ్రహీంపట్నం నవంబర్ 19( ప్రజా మంటలు దగ్గుల అశోక్):
జగిత్యాల జిల్లా ఇబ్రహింపట్నం మండలం లోని వేములకుర్తి గ్రామంలో ప్రాథమిక పాఠశాల (బండమిది బడి) విధ్యర్డుల కు తాగునీరు అందిచాలని బుదవారం 2005- 06 పదవతరగతి పుర్వవిధ్యరుల అధ్వర్యంలో పురిపైడ్,మరియు గంగపుత్ర యుత్ అధ్వర్యంలో నిటి ట్యాంక్ ను పాఠశాల ప్రధానోపాధ్యాయులు గంగమణి కీ ఎర్పాటు... రాంగోపాల్పేట్ లో ఇందిరాగాంధీ విగ్రహావిష్కరణ
సికింద్రాబాద్, నవంబర్ 19 (ప్రజామంటలు ):
దేశానికి సేవలందించిన దివంగత మాజీ ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ చేసిన మేలును దేశ ప్రజలు ఎప్పటికీ మరచిపోలేరని రాజ్యసభ సభ్యుడు అనిల్కుమార్ అన్నారు. రాంగోపాల్పేట్ డివిజన్ అధ్యక్షుడు దుండిగల్ల మల్లికార్జున్ ఆధ్వర్యంలో నెక్లెస్ రోడ్ అంబేడ్కర్నగర్లో ఏర్పాటు చేసిన ఇందిరాగాంధీ నూతన విగ్రహాన్ని బుధవారం ఆమె జయంతి... అమెరికాలో 2017 నాటి శశికళ–అనీష్ హత్య కేసులో అసలు నిందితుడికి చేరుకున్న విచారణ
హైదరాబాద్ నవంబర్ 19:
అమెరికాలో ఆంధ్రప్రదేశ్కు చెందిన శశికళ నర్రా (Sasikala Narra) మరియు ఆమె ఏడేళ్ల కుమారుడు అనీష్ సాయి నర్రా 2017లో జరిగిన దారుణ హత్య కేసు ఎనిమిదేళ్ల తర్వాత మళ్లీ సంచలనంగా మారింది. న్యూజెర్సీలో జరిగిన ఈ ద్విప్రమాణ హత్యలో నిజమైన నిందితుడిని అధికారులు గుర్తించినట్టు తాజా నివేదికలు తెలియజేస్తున్నాయి.
ఎలా... మహిళా అభ్యున్నతీకి కాంగ్రెస్ పార్టీ కృషి. జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు తాటిపర్తి విజయలక్ష్మి దేవేందర్ రెడ్డి.
జగిత్యాల నవంబర్ 19 (ప్రజా మంటలు):రాష్ట్రంలోని మహిళ సోదరిమణుల అభ్యున్నతే ధ్యేయంగా రాష్ట్రం లో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని జగిత్యాల జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు తాటిపర్తి విజయలక్ష్మి దేవేందర్ రెడ్డి అన్నారు.
ఇందిరా గాంధీ జన్మదినం సందర్భంగా జగిత్యాల జిల్లా కేంద్రంలోని స్థానిక భగినీ నివేదిత ఆశ్రమంలో ఆల్... జగిత్యాలలో ASMITA కిక్బాక్సింగ్ లీగ్ రాష్ట్ర స్థాయి పోటీలు
జగిత్యాల, నవంబర్ 19 (ప్రజా మంటలు):
జగిత్యాల పట్టణంలోని విరూపాక్షి గార్డెన్స్ లో ఖేలో ఇండియా కార్యక్రమం భాగంగా నిర్వహిస్తున్న ASMITA కిక్ బాక్సింగ్ లీగ్ 2025–26 రాష్ట్ర స్థాయి కిక్బాక్సింగ్ పోటీలను జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ ఘనంగా ప్రారంభించారు.
రాష్ట్ర స్థాయి లీగ్ పోస్టర్ ఆవిష్కరణ
ఈ సందర్భంగా ఎమ్మెల్యే డిసెంబర్... ఎమ్మెల్యేను కలిసిన కరీంనగర్ అర్బన్ బ్యాంక్ ఛైర్మన్
జగిత్యాల, నవంబర్ 19 (ప్రజా మంటలు):జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ గారిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన కరీంనగర్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ ఛైర్మన్ కే. రాజశేఖర్, డైరెక్టర్ సాయి కృష్ణ మర్యాద పూర్వక భేటీ చేశారు. ఇటీవల ఎన్నికైన అర్బన్ బ్యాంక్ నూతన కార్యవర్గ సభ్యులకు ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలిపారు... ఇందిరా గాంధీ ఆశయ సాధనకు కృషి చేయాలి: మాజీ మంత్రి జీవన్ రెడ్డి
జగిత్యాల, నవంబర్ 19 (ప్రజా మంటలు):
జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్లో మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో ఇందిరా గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
ఇందిరా భవన్ నుండి పాత బస్టాండ్ వరకు ర్యాలీ
కార్యక్రమంలో భాగంగా... జమాత్ ఇస్లాం హింద్ ఆధ్వర్యంలో ఫారన్ క్లినిక్ ఫ్యామిలీ హెల్త్ కేర్ ప్రారంభం
జగిత్యాల నవంబర్ 19 (ప్రజా మంటలు)ఇస్లామిక్ వెల్ఫేర్ సొసైటీ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ జమాత్ ఏ ఇస్లామీ హింద్ జగిత్యాల ఆద్వర్యం లో ఫారన్ క్లినిక్ ను ఫ్యామిలీ హెల్త్ కేర్ ను ప్రారంభించిన తెలంగాణ మైనార్టీ కమిషన్ చైర్మన్ తారీక్అన్వర్,జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
ఎమ్మెల్యే మాట్లాడుతూ
ప్రతి సొసైటీ సేవ... ఇస్లామిక్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఫ్యామిలీ హెల్త్ కేర్ క్లినిక్
జగిత్యాల (రూరల్), నవంబర్ 19 (ప్రజా మంటలు):
జమాత్ ఏ ఇస్లామీ హింద్ – జగిత్యాల విభాగం ఆద్వర్యంలో ఇస్లామిక్ వెల్ఫేర్ సొసైటీ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నిర్వహిస్తున్న ఫారన్ ఫ్యామిలీ హెల్త్ కేర్ క్లినిక్ ఈరోజు ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ప్రధాన అతిథులుగా తెలంగాణ మైనారిటీ కమిషన్ చైర్మన్ తారీక్అన్వర్, జగిత్యాల... బిహార్ ముఖ్యమంత్రిగా 10 వ సారి నితీష్ కుమార్కు ఎన్నిక
20 మంది మంత్రులతో ప్రమాణస్వీకారం
పాట్నా, నవంబర్ 19 (ప్రజా మంటలు):
బిహార్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. జేడీయూ అధినేత నితీష్ కుమార్ 10వ సారి బిహార్ ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. ఎన్డీఏ శాసనసభ పక్ష సమాఖ్య సమావేశంలో ఆయన పేరును ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. అదే సమావేశంలో బీజేపీ నేత సామ్రాట్ చౌదరి, విజయ్... 