45 శాఖలతో అభివృద్ధి పథంలో గాయత్రి బ్యాంక్ - అధ్యక్షులు ముత్యాల లక్ష్మణ్ రెడ్డి

On
45 శాఖలతో అభివృద్ధి పథంలో గాయత్రి బ్యాంక్ - అధ్యక్షులు ముత్యాల లక్ష్మణ్ రెడ్డి

45 శాఖలతో అభివృద్ధి పథంలో గాయత్రి బ్యాంక్
అధ్యక్షులు ముత్యాల లక్ష్మణ్ రెడ్డి
జగిత్యాల జులై 21 (ప్రజా మంటలు) :
రూ. 2843 కోట్ల వ్యాపారంతో 45 శాఖలతో అభివృద్ధి పథంలో గాయత్రి బ్యాంకు ఉందని బ్యాంకు అధ్యక్షులు  ముత్యాల లక్ష్మణ్ రెడ్డి  అన్నారు. తది: 21-07-2024 న జరిగిన ది గాయత్రి కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంకు యొక్క సర్వ సభ్య సమావేశంలో ఆయన మాట్లాడుతూ బ్యాంకు స్థాపించిన 24 సంవత్సరాల కాలంలో, 7 లక్షల 25 వేల మంది వినియోగదారులను కలిగి 2843.44 కోట్ల వ్యాపారాన్ని కలిగి మల్టీ స్టేట్ కో-ఆపరేటివ్ బ్యాంకుగా అవతరించిందని, ఇట్టి అభివృద్ధికి కారణమైన బ్యాంకు ఖాతాదారులకు, సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు. మన బ్యాంకునకు ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఆధార్ అనుసంధాన పేమెంట్ సేవలను ఏ ఈ పి ఎస్) ప్రారంభించామని అలాగే యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ సేవలు కూడా ప్రారంభించామని తెలియజేశారు. మరియు 344 బ్యాంకింగ్ కరెప్పాండెంట్స్ని నియమించి వినియోగదారుల చెంతకు బ్యాంకు సేవలను తీసుకొని వచ్చామని తెలియజేశారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో బ్యాంక్ రూ. 22 కోట్ల 44 లక్షల నికర లాభాన్ని నమోదు చేసుకొని స్టాటుటరీ ఆడిటర్లచే ఏ క్లాస్ బ్యాంక్గా వర్గీకరించబడ్డామని తెలియజేశారు. ఈ ఆర్ధిక సంవత్సరాంతానికి 3500 కోట్ల వ్యాపార లక్షాన్ని, 1 లక్ష నూతన ఖాతాదారులను సేకరించే సంకల్పంతో పనిచేస్తున్నామన్నారు.

భారతీయ రిజర్వు బ్యాంకు వారి అనుమతితో ఆరు బ్రాంచీలు గల యాదగిరి లక్ష్మి నరసింహస్వామి కో-ఆపరేటివ్ అర్బను మన బ్యాంకు యందు తేదీ: 10.06.2024 నుండి విలీనం చేసుకోవడం జరిగింది.

అంతే కాకుండా నూతనంగా ఇప్పటి వరకు 16 బ్రాంచీలు ప్రారంబించుకోవడం జరిగింది ఇందులో 8 బ్రాంచీలు హైదరాబాద్ లోని వివిధ ప్రాంతాలతో మిగతా 8 బ్రాంచీలను తెలంగాణ యందలి పలు పట్టణాలలో ప్రారంబించుకోవడం జరిగింది. అలాగే తెలంగాణ, ఆంద్రప్రదేశ్ రాష్ట్రాలలోని ముఖ్య పట్టణాలలో మరో 21 బ్రాంచీలను ప్రారంబించుటకు ఏర్పాట్లు చేస్తున్నాము. తద్వారా మొత్తం 66 బ్రాంచీల నెట్వర్కకి గాయత్రి బ్యాంకు చేరుకో బోతుందని తెలియజేశారు.అలాగే మరిని నూతన బ్యాంకింగ్ సేవలు అనగా డైరెక్టర్ ఆర్ టి జి ఎస్  , ఇంటర్ నెట్ బ్రాంకింగ్ వంటి సేవలను అందుబాటులోకి తేనున్నామని తెలియజేశారు.

అనంతరం బ్యాంకు ముఖ్య కార్యనిర్వహణాధికారి  వనమాల శ్రీనివాస్  31-03-2024 నాటికి ఆడిటెడ్ జమ-ఖర్చు, ఆస్థి-అప్పుల, లాభనష్టముల నివేదికలను సమర్పించారు. గడిచిన 24 సంవత్సరాల కాలంలో తమదైన శైలిలో వినియోగదారులకు అనుకూలమైన వేళలలో పారదర్శకమైన సత్వర సేవలందిస్తూ 31-03-2024 తేదీ నాటికి బ్యాంకు డిపాజిట్లలో 11.67% వృద్ధి సాధించి 1475 కోట్ల 95 లక్షల డిపాజిట్లను కలిగి ఉందని అలాగే ఋణాలలో 10.91% వృద్దితో 1050 కోట్ల 81 లక్షల ఋణ నిలువ, 433 కోట్ల 53 లక్షల పెట్టుబడులను కలిగి, 22 కోట్ల 44 లక్షల నికర లాభాన్ని ఆర్జించి 116 కోట్ల 28 లక్షల నెట్వర్త్ కలిగి ఉన్నామని తెలియజేశారు.

బ్యాంకు ఖాతాదారుల సేవే లక్ష్యంగా , ఏ ఈ పి ఎస్ ,యుపిఐ,  మొబైల్ బ్యాంకింగ్ టోల్ ఫ్రీ బ్యాంకింగ్ ఐ ఎం పి ఎస్ వంటిసేవలను అందిస్తున్నామని తెలియజేశారు. ఇప్పటివరకు 344 బ్యాంకింగ్ కరెప్పాండెంట్ (బి.సి)లను నియమించామని,త్వరలో మరిన్ని గ్రామాలకు బి.సి సేవలను విస్తరింపజేస్తామని తెలియజేశారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో 90 ఆన్సైట్ ఏటిఎంల ద్వారా రూ 1342.74 కోట్ల ఏటిఎం లావాదేవీలను, 462.39 లక్షల సంఖ్యలో యు.పి.ఐ లావాదేవీలను నమోదు చేశామని తెలియజేశారు.

తమ వంతు సామాజిక బాధ్యతగా బ్యాంకు యందు సేవింగ్ ఖాతాపై 1 లక్ష రూపాయల ప్రమాద భీమా సౌకర్యాన్ని అందించడం జరుగుతుందని ఇట్టి స్కీమ్ ద్వారా ఇప్పటి వరకు ప్రమాదవశాత్తు మరణించిన 566 మంది ఖాతాదారుల కుటుంబాలకు 1 లక్ష రూపాయల చొప్పున అందించి వారి కుటుంబాలకు ఆసరాగా నిలవడం జరిగిందని అన్నారు. ఈ సమావేశంలో ప్రమాదవశాత్తు మరణించిన గాయత్రి నిర్భయ సేవింగ్ ఖాతాదారులైన బోమ్మకంటి గణపతి, ఆమందు గంగార్, పోటువత్తిని శంకరయ్య యొక్క కుటుంబ సభ్యులకు ఒక్కొక్కరికి 1 లక్ష రూపాయల చొప్పున ప్రమాదబీమా చెక్కులను అందించారు.

బ్యాంకు ఆవరణలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు సభ్యులు బ్యాంకు అభివృద్ధి పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఇట్టి కార్యక్రమంలో బ్యాంకు ఉపాద్యక్షులు మన్నె సౌజన్య డైరెక్టరైన ఎ. రాజిరెడ్డి, ఎ. సత్యం, వై. అశోక్, కె. శ్రీనాథ్, బి. విజయ్, వాసాల మాధవి, ఎస్. రవి కుమార్, ఆర్. సతీష్ గార్లు మరియు ఇతర సభ్యలు, ఖాతాదారులు, సహకార అధికారులు, బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు.

Tags
Join WhatsApp

More News...

ఐ–బొమ్మ పైరసీ వెబ్‌సైట్ లో సంచలన ప్రకటన

ఐ–బొమ్మ  పైరసీ వెబ్‌సైట్ లో సంచలన ప్రకటన హైదరాబాద్, నవంబర్ 17 (ప్రజా మంటలు): ఇన్నాళ్లు పోలీసులను చాలెంజ్ చేసిన ibomma సంచలన ప్రకటనను తన వెబ్సైట్ లో పోస్ట్ చేసింది. ఐ–బొమ్మ తన ప్రకటనలో, “ఈ మధ్యలో మీరు మా గురించి విన్నే ఉంటారు… మొదటి నుంచీ మా విశ్వసనీయ అభిమానులుగా ఉన్నారు… కానీ ఇప్పుడు మా సేవలను నిలిపివేస్తున్నాం. దేశవ్యాప్తంగా మా...
Read More...
Local News  State News 

ఖమ్మం జాగృతి జనంబాటలో సమస్యలపై కవిత విమర్శలు, పరిశీలనలు

ఖమ్మం జాగృతి జనంబాటలో సమస్యలపై కవిత విమర్శలు, పరిశీలనలు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా జాగృతి జనంబాటలో భాగంగా కవిత పర్యటన. మోడల్ స్కూల్ సమస్యలు, సీతారామ ఎత్తిపోతల పథకం ఆలస్యం, సింగరేణి కార్మికుల ఇబ్బందులు, వైరా మార్కెట్ సమస్యలు, ప్రజా సమస్యలపై కీలక వ్యాఖ్యలు. సమగ్ర కథనం
Read More...
Local News 

15 దుకాణాలకు ఓపెన్ వేలం వేసి కేటాయించండి. - ప్రజావాణికి వినతి పత్రం సమర్పణ

15 దుకాణాలకు ఓపెన్ వేలం వేసి కేటాయించండి. - ప్రజావాణికి వినతి పత్రం సమర్పణ సికింద్రాబాద్, నవంబర్ 17 (ప్రజామంటలు) : బన్సీలాల్ పేట డివిజన్ లోని న్యూ బోయిగూడ, ఐడీహెచ్ కాలనీల పరిధిలోని 15 జీహెచ్ఎమ్ సీ షాపింగ్ కాంప్లెక్స్ లల్లోని మొత్తం 15 దుకాణాలకు కొత్తం ఓపెన్ వేలం వేసి, అర్హులకు కేటాయించాలని సికింద్రాబాద్‌ జీహెచ్‌ఎంసీ నార్త్‌ జోన్‌ అధికారులకు కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షుడు ఐత చిరంజీవి సోమవారం...
Read More...
National  State News 

దార్జిలింగ్ గోర్ఖా సమస్యపై మమతా బెనర్జీ లేఖ – ఇంటర్‌లాక్యూటర్ నియామకం రద్దు చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి

దార్జిలింగ్ గోర్ఖా సమస్యపై మమతా బెనర్జీ లేఖ – ఇంటర్‌లాక్యూటర్ నియామకం రద్దు చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి హైదరాబాద్, నవంబర్ 17 (ప్రజా మంటలు):పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరోసారి ప్రధానమంత్రి నరేంద్రమోదీకి లేఖ రాశారు. దార్జిలింగ్ కొండ ప్రాంతంలోని గోర్ఖా సమస్యలపై చర్చలు నిర్వహించేందుకు కేంద్రం నియమించిన రిటైర్డ్ ఐపీఎస్ అధికారి నియామకాన్ని రద్దు చేయాలంటూ ఆమె పునరుద్ఘాటించారు. గోర్ఖాల సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక పాత్ర పోషించాలనే...
Read More...
Local News 

తల్లిదండ్రులను  వేదిస్తున్న కొడుకులు -ఎస్పీ, ఆర్డీవో లకు ఫిర్యాదులు.  

తల్లిదండ్రులను  వేదిస్తున్న కొడుకులు -ఎస్పీ, ఆర్డీవో లకు ఫిర్యాదులు.   జగిత్యాల నవంబర్ 17 (ప్రజా మంటలు): కడుపున పుట్టిన పిల్లలే వృద్దాప్యంలో ఉన్న తల్లి దండ్రులను వేధింపులకు గురిచేస్తూ, చంపుత మని     బెదిరిస్తూ, చివరకు ఇంట్లోంచి గెంటి వేస్తున్నారు. జగిత్యాల రూరల్ మండలం పొలాస గ్రామానికి చెందిన గుగ్గిళ్ల నర్సవ్వ( 80)    అనే వృద్దురాలిని ఆమె నడిపి  కొడుకు, కోడలు తన స్వంత ఇంటి లోనుంచి...
Read More...
National  Sports  State News 

డెఫ్లింపిక్స్‌లో స్వర్ణం సాధించిన ధనుష్ శ్రీకాంత్‌కు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు

డెఫ్లింపిక్స్‌లో స్వర్ణం సాధించిన ధనుష్ శ్రీకాంత్‌కు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు జపాన్ డెఫ్లింపిక్స్‌లో 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో స్వర్ణ పతకం, ప్రపంచ రికార్డు సాధించిన హైదరాబాద్ షూటర్ ధనుష్ శ్రీకాంత్‌కు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు. యువ క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలిచిన ధనుష్‌కు ప్రభుత్వ అండ.
Read More...

సౌదీ అరేబియా బస్సు ప్రమాదం: 45 మంది రాష్ట్రవాసులు: ,: తెలంగాణ కేబినెట్ 5 లక్షల పరిహారం

సౌదీ అరేబియా బస్సు ప్రమాదం: 45 మంది రాష్ట్రవాసులు: ,: తెలంగాణ కేబినెట్ 5 లక్షల పరిహారం హైదరాబాద్, నవంబర్ 17 (ప్రజా మంటలు):సౌదీ అరేబియాలో మక్కా నుంచి మదీనాకు ప్రయాణిస్తున్న బస్సు ప్రమాదంలో మరణించిన తెలంగాణకు చెందిన యాత్రికుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం భారీ సానుభూతి ప్రకటించింది. ఈ దుర్ఘటనపై జరిగిన మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేసి, బాధిత కుటుంబాలకు ఐదు లక్షల రూపాయల...
Read More...

డిసెంబర్ మొదటివారంలో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్

డిసెంబర్ మొదటివారంలో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ హైదరాబాద్, నవంబర్ 17 (ప్రజా మంటలు): తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియకు వేగం పెరిగింది. ఈరోజు సమావేశమైన రాష్ట్ర కేబినెట్ కీలక నిర్ణయాలను తీసుకుంది. గ్రామ పంచాయతీ ఎన్నికలను ముందుగానే నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించింది. ముఖ్యంగా రిజర్వేషన్లపై హైకోర్టు చేసిన సూచనలను పరిగణనలోకి తీసుకుని, 50 శాతం మించకుండా రిజర్వేషన్లు అమలు...
Read More...
Local News  Crime  State News 

రాజేశ్ ను పోలీసులు చిత్రహింసలు  చేసి, చంపారు.?

రాజేశ్ ను పోలీసులు చిత్రహింసలు  చేసి, చంపారు.? విచారణ చేయకుండానే రిమాండ్ చేశారని ఆరోపణ   గాంధీ ఆసుపత్రి వద్ద ఫ్యామిలీమెంబర్స్, ధర్మ స్టూడెంట్స్ నేతల ఆందోళన
Read More...
Local News 

టూరిజం మేనేజ్‌మెంట్‌లో డా. దినేష్ కుమార్ గట్టుకు పిహెచ్.డి

టూరిజం మేనేజ్‌మెంట్‌లో డా. దినేష్ కుమార్ గట్టుకు పిహెచ్.డి హైదరాబాద్‌, నవంబర్‌ 17 (ప్రజా మంటలు): చైతన్య (డీమ్డ్ టు బి యూనివర్సిటీ) డా. దినేష్ కుమార్ గట్టుకు టూరిజం మేనేజ్‌మెంట్‌లో పిహెచ్.డి డాక్టోరల్ డిగ్రీని ప్రకటించింది. ఆయన పరిశోధన ‘తెలంగాణలోని అమ్యూజ్‌మెంట్ పార్కులపై పర్యాటకుల అవగాహన, వైఖరి మరియు సంతృప్తి’పై ఆధారితం. ఈ పరిశోధన ప్రొఫెసర్ జి. విజయ్ పర్యవేక్షణలో పూర్తయింది. యూనివర్సిటీ అధికారులు...
Read More...

రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసుల చొరవ- రహదారి పక్కన దట్టంగా పెరిగిన పొదల తొలగింపు

రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసుల చొరవ- రహదారి పక్కన దట్టంగా పెరిగిన పొదల తొలగింపు మేడిపల్లి నవంబర్ 17 ( ప్రజా మంటలు)జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణనే ప్రధాన లక్ష్యంగా జిల్లా ఎస్పి  అశోక్ కుమార్, ఆదేశాల మేరకు మేడిపల్లి ఎస్‌ఐ శ్రీధర్ రెడ్డి ప్రత్యేక చర్యలు చేపట్టారు. రంగా పూర్ – భీమరం రహదారిపై ఫ్లడ్ కాలువ సమీపంలోని మూలమలుపు(కర్వ్ పాయింట్‌)లో దట్టంగా పెరిగిన పొదలు, మొక్కలు కారణంగా...
Read More...

ప్రజావాణి అర్జీలకు సత్వర పరిష్కార మార్గం చూపాలి వినతులు స్వీకరించిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్

ప్రజావాణి అర్జీలకు సత్వర పరిష్కార మార్గం చూపాలి  వినతులు స్వీకరించిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ జగిత్యాల నవంబర్ 17 (ప్రజా మంటలు)ప్రజావాణి ఫిర్యాదుల సంఖ్య : 24                                    ప్రజావాణి అర్జీల పై సమగ్ర విచారణ జరిపి సమస్యలను పరిష్కరించాలని అధికారులను జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ అదేశించారు. సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి ఫిర్యాదులు, వినతులను  అదనపు కలెక్టర్ లు మరియు ఆర్డీఓల...
Read More...