45 శాఖలతో అభివృద్ధి పథంలో గాయత్రి బ్యాంక్ - అధ్యక్షులు ముత్యాల లక్ష్మణ్ రెడ్డి

On
45 శాఖలతో అభివృద్ధి పథంలో గాయత్రి బ్యాంక్ - అధ్యక్షులు ముత్యాల లక్ష్మణ్ రెడ్డి

45 శాఖలతో అభివృద్ధి పథంలో గాయత్రి బ్యాంక్
అధ్యక్షులు ముత్యాల లక్ష్మణ్ రెడ్డి
జగిత్యాల జులై 21 (ప్రజా మంటలు) :
రూ. 2843 కోట్ల వ్యాపారంతో 45 శాఖలతో అభివృద్ధి పథంలో గాయత్రి బ్యాంకు ఉందని బ్యాంకు అధ్యక్షులు  ముత్యాల లక్ష్మణ్ రెడ్డి  అన్నారు. తది: 21-07-2024 న జరిగిన ది గాయత్రి కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంకు యొక్క సర్వ సభ్య సమావేశంలో ఆయన మాట్లాడుతూ బ్యాంకు స్థాపించిన 24 సంవత్సరాల కాలంలో, 7 లక్షల 25 వేల మంది వినియోగదారులను కలిగి 2843.44 కోట్ల వ్యాపారాన్ని కలిగి మల్టీ స్టేట్ కో-ఆపరేటివ్ బ్యాంకుగా అవతరించిందని, ఇట్టి అభివృద్ధికి కారణమైన బ్యాంకు ఖాతాదారులకు, సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు. మన బ్యాంకునకు ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఆధార్ అనుసంధాన పేమెంట్ సేవలను ఏ ఈ పి ఎస్) ప్రారంభించామని అలాగే యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ సేవలు కూడా ప్రారంభించామని తెలియజేశారు. మరియు 344 బ్యాంకింగ్ కరెప్పాండెంట్స్ని నియమించి వినియోగదారుల చెంతకు బ్యాంకు సేవలను తీసుకొని వచ్చామని తెలియజేశారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో బ్యాంక్ రూ. 22 కోట్ల 44 లక్షల నికర లాభాన్ని నమోదు చేసుకొని స్టాటుటరీ ఆడిటర్లచే ఏ క్లాస్ బ్యాంక్గా వర్గీకరించబడ్డామని తెలియజేశారు. ఈ ఆర్ధిక సంవత్సరాంతానికి 3500 కోట్ల వ్యాపార లక్షాన్ని, 1 లక్ష నూతన ఖాతాదారులను సేకరించే సంకల్పంతో పనిచేస్తున్నామన్నారు.

భారతీయ రిజర్వు బ్యాంకు వారి అనుమతితో ఆరు బ్రాంచీలు గల యాదగిరి లక్ష్మి నరసింహస్వామి కో-ఆపరేటివ్ అర్బను మన బ్యాంకు యందు తేదీ: 10.06.2024 నుండి విలీనం చేసుకోవడం జరిగింది.

అంతే కాకుండా నూతనంగా ఇప్పటి వరకు 16 బ్రాంచీలు ప్రారంబించుకోవడం జరిగింది ఇందులో 8 బ్రాంచీలు హైదరాబాద్ లోని వివిధ ప్రాంతాలతో మిగతా 8 బ్రాంచీలను తెలంగాణ యందలి పలు పట్టణాలలో ప్రారంబించుకోవడం జరిగింది. అలాగే తెలంగాణ, ఆంద్రప్రదేశ్ రాష్ట్రాలలోని ముఖ్య పట్టణాలలో మరో 21 బ్రాంచీలను ప్రారంబించుటకు ఏర్పాట్లు చేస్తున్నాము. తద్వారా మొత్తం 66 బ్రాంచీల నెట్వర్కకి గాయత్రి బ్యాంకు చేరుకో బోతుందని తెలియజేశారు.అలాగే మరిని నూతన బ్యాంకింగ్ సేవలు అనగా డైరెక్టర్ ఆర్ టి జి ఎస్  , ఇంటర్ నెట్ బ్రాంకింగ్ వంటి సేవలను అందుబాటులోకి తేనున్నామని తెలియజేశారు.

అనంతరం బ్యాంకు ముఖ్య కార్యనిర్వహణాధికారి  వనమాల శ్రీనివాస్  31-03-2024 నాటికి ఆడిటెడ్ జమ-ఖర్చు, ఆస్థి-అప్పుల, లాభనష్టముల నివేదికలను సమర్పించారు. గడిచిన 24 సంవత్సరాల కాలంలో తమదైన శైలిలో వినియోగదారులకు అనుకూలమైన వేళలలో పారదర్శకమైన సత్వర సేవలందిస్తూ 31-03-2024 తేదీ నాటికి బ్యాంకు డిపాజిట్లలో 11.67% వృద్ధి సాధించి 1475 కోట్ల 95 లక్షల డిపాజిట్లను కలిగి ఉందని అలాగే ఋణాలలో 10.91% వృద్దితో 1050 కోట్ల 81 లక్షల ఋణ నిలువ, 433 కోట్ల 53 లక్షల పెట్టుబడులను కలిగి, 22 కోట్ల 44 లక్షల నికర లాభాన్ని ఆర్జించి 116 కోట్ల 28 లక్షల నెట్వర్త్ కలిగి ఉన్నామని తెలియజేశారు.

బ్యాంకు ఖాతాదారుల సేవే లక్ష్యంగా , ఏ ఈ పి ఎస్ ,యుపిఐ,  మొబైల్ బ్యాంకింగ్ టోల్ ఫ్రీ బ్యాంకింగ్ ఐ ఎం పి ఎస్ వంటిసేవలను అందిస్తున్నామని తెలియజేశారు. ఇప్పటివరకు 344 బ్యాంకింగ్ కరెప్పాండెంట్ (బి.సి)లను నియమించామని,త్వరలో మరిన్ని గ్రామాలకు బి.సి సేవలను విస్తరింపజేస్తామని తెలియజేశారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో 90 ఆన్సైట్ ఏటిఎంల ద్వారా రూ 1342.74 కోట్ల ఏటిఎం లావాదేవీలను, 462.39 లక్షల సంఖ్యలో యు.పి.ఐ లావాదేవీలను నమోదు చేశామని తెలియజేశారు.

తమ వంతు సామాజిక బాధ్యతగా బ్యాంకు యందు సేవింగ్ ఖాతాపై 1 లక్ష రూపాయల ప్రమాద భీమా సౌకర్యాన్ని అందించడం జరుగుతుందని ఇట్టి స్కీమ్ ద్వారా ఇప్పటి వరకు ప్రమాదవశాత్తు మరణించిన 566 మంది ఖాతాదారుల కుటుంబాలకు 1 లక్ష రూపాయల చొప్పున అందించి వారి కుటుంబాలకు ఆసరాగా నిలవడం జరిగిందని అన్నారు. ఈ సమావేశంలో ప్రమాదవశాత్తు మరణించిన గాయత్రి నిర్భయ సేవింగ్ ఖాతాదారులైన బోమ్మకంటి గణపతి, ఆమందు గంగార్, పోటువత్తిని శంకరయ్య యొక్క కుటుంబ సభ్యులకు ఒక్కొక్కరికి 1 లక్ష రూపాయల చొప్పున ప్రమాదబీమా చెక్కులను అందించారు.

బ్యాంకు ఆవరణలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు సభ్యులు బ్యాంకు అభివృద్ధి పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఇట్టి కార్యక్రమంలో బ్యాంకు ఉపాద్యక్షులు మన్నె సౌజన్య డైరెక్టరైన ఎ. రాజిరెడ్డి, ఎ. సత్యం, వై. అశోక్, కె. శ్రీనాథ్, బి. విజయ్, వాసాల మాధవి, ఎస్. రవి కుమార్, ఆర్. సతీష్ గార్లు మరియు ఇతర సభ్యలు, ఖాతాదారులు, సహకార అధికారులు, బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు.

Tags

More News...

Local News 

ట్రీట్మెంట్ పొందుతూ గుర్తుతెలియని వ్యక్తి  మృతి

ట్రీట్మెంట్ పొందుతూ గుర్తుతెలియని వ్యక్తి  మృతి సికింద్రాబాద్,  సెప్టెంబర్ 16 (ప్రజా మంటలు):  సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ పొందుతూ ఓ గుర్తుతెలియని వృద్ధుడు మృతి చెందాడు. చిలకలగూడ పోలీసుల వివరాలు... గాంధీ వెయిటింగ్ హాల్ లో అపస్మారక స్థితిలో పడి ఉన్న దాదాపు 60-65 ఏండ్ల వ్యక్తిని చూసిన సెక్యూరిటీ సిబ్బంది ఆసుపత్రిలో అడ్మిట్ చేయించారు. అయితే ట్రీట్మెంట్ పొందుతూ సదరు...
Read More...
Local News 

సికింద్రాబాద్ లో మెడికవర్ హాస్పిటల్స్ ప్రారంభం

సికింద్రాబాద్ లో మెడికవర్ హాస్పిటల్స్ ప్రారంభం 300 పడకల ఆధునిక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రారంభించిన కేంద్రమంత్రులు సికింద్రాబాద్, సెప్టెంబర్ 16 (ప్రజామంటలు) :     యూరప్‌లోని అతిపెద్ద హెల్త్‌కేర్ గ్రూపులలో ఒకటి గా ప్రపంచవ్యాప్తంగా 12 దేశాలలో కార్యకలాపాలు నిర్వహిస్తూ  అత్యంత గౌరవనీయమైన హెల్త్‌కేర్ బ్రాండ్ గా గుర్తింపు పొందటంతో పాటుగా హాస్పిటల్స్ తో భారతదేశంలో ప్రముఖ హాస్పిటల్స్ చైన్ గా ఈసందర్బంగా...
Read More...
Local News 

ఉమేశ్ ఖండేల్వాల్ కు కన్నీటీ వీడ్కోలు

ఉమేశ్ ఖండేల్వాల్ కు కన్నీటీ వీడ్కోలు సికింద్రాబాద్, సెప్టెంబర్ 16 (ప్రజామంటలు): భారతీయ జనతా పార్టీ బన్సీలాల్ పేట్ డివిజన్ మాజీ అధ్యక్షులు ఉమేష్ ఖండేల్వాల్ సోమవారం ఆకస్మాత్తుగా కనుమూయగా, మంగళవారం ఆయన అంత్యక్రియలు జరిగాయి. పలువురు బీజేపీ నాయకులు ఆయన పార్థివ దేహాన్ని సందర్శించి, పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఉమేశ్ కుటుంబ సభ్యులను ఓదార్చారు. అటు పార్టీకి, ఇటు ప్రజలకు...
Read More...
Local News 

ఇందిరమ్మ రాజ్యంలో విద్య కోసం ఇక్కట్లా? విద్యార్థులను చదువుకు దూరం చేస్తున్న కాంగ్రెస్ సర్కార్ _జిల్లా పరిషత్ తొలి ఛైర్ పర్సన్ దావ వసంత సురేష్

ఇందిరమ్మ రాజ్యంలో విద్య కోసం ఇక్కట్లా?  విద్యార్థులను చదువుకు దూరం చేస్తున్న కాంగ్రెస్ సర్కార్ _జిల్లా పరిషత్ తొలి ఛైర్ పర్సన్  దావ వసంత సురేష్    జగిత్యాల సెప్టెంబర్ 16(ప్రజా మంటలు) ఇందిరమ్మ రాజ్యంలో విద్యార్థులు విద్య కొసం ఇక్కట్లు పడడం శోచనీయం అని జిల్లా పరిషత్ తొలి ఛైర్ పర్సన్  దావ వసంత సురేష్ అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో వసంత  మాట్లాడుతూ విద్యార్ధి ఉద్యమాలతో ఊపందుకోని, రాష్ట్రం సాధించే వరకు పోరాటం చేసినా విద్యార్థుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం వివక్ష,...
Read More...
Local News 

ర్యాగింగ్‌ చట్ట రీత్యా నేరం దీని వల్ల భవిష్యత్తు నాశనం అవుతుంది: జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్ 

ర్యాగింగ్‌ చట్ట రీత్యా నేరం దీని వల్ల భవిష్యత్తు నాశనం అవుతుంది: జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్  జగిత్యాల సెప్టెంబర్ 16(ప్రజా మంటలు) ఉత్తమ విద్యార్థులుగా  ఎదిగి జిల్లా నర్సింగ్ కళాశాలకు మంచి పేరు తీసుకురావాలి. జగిత్యాల పట్టణంలోని ప్రభుత్వ నర్సింగ్ కళాశాల విద్యార్థులకు  ర్యాగింగ్ వల్ల కలిగే దుష్పరిణామాలపై IMA హాల్ లో  అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్  హాజరై విద్యార్థులకు...
Read More...
Local News 

టీ చింగ్  మెటీరియల్ ద్వారా పాఠాలు సులభతరం అవుతాయి జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్

టీ చింగ్  మెటీరియల్ ద్వారా పాఠాలు సులభతరం అవుతాయి జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ జగిత్యాల సెప్టెంబర్ 16 (ప్రజా మంటలు) టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ (TLM) ద్వారా పాఠాలు సులభతరం అవుతాయని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు   జగిత్యాల జిల్లా కేంద్రంలోని పొన్నాల గార్డెన్ లో మంగళవారం టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ కార్యక్రమం సందర్శించిన కలెక్టర్.   ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ  రోజురోజుకు సాంకేతికత వేంగంగా విస్తరిస్తోందని అందువల్ల విద్యార్థులకు...
Read More...
Local News 

ఈవీఎం గోదాము  తనిఖీ భద్రత ఏర్పాట్లు, సిసి కెమెరాల పనితీరులను పరిశీలించిన : కలెక్టర్ బి. సత్యప్రసాద్

ఈవీఎం గోదాము  తనిఖీ  భద్రత ఏర్పాట్లు, సిసి కెమెరాల పనితీరులను పరిశీలించిన : కలెక్టర్ బి. సత్యప్రసాద్ జగిత్యాల సెప్టెంబర్ 16 (ప్రజా మంటలు) జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ బి. సత్యప్రసాద్ మంగళవారం దరూర్ క్యాంప్ లో గల ఈవీఎం లను భద్రపరిచిన గోదామును రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి  ఆదేశాల మేరకు  తనిఖీ చేశారు.ప్రతినెల ఈవీఎం లను తనిఖీ చేయడం జరుగుతుందని గోడౌన్ లోని యంత్రాల భద్రత, సిసి కెమెరాల...
Read More...
Local News 

ఓజోన్ పరిరక్షణ కరపత్రం ఆవిష్కరణ 

ఓజోన్ పరిరక్షణ కరపత్రం ఆవిష్కరణ  జగిత్యాల సెప్టెంబర్ 16 (ప్రజా మంటలు)  అంతర్జాతీయ ఓజోన్ పరిరక్షణ దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రానికి చెందిన సామాజిక కార్యకర్త తవుటు రామచంద్రం రూపొందించిన కరపత్రాలను గత 18 రోజులుగా  శ్రీమద్ అష్టాదశ పురాణాలను అందించిన బుర్రా భాస్కర శర్మ , జిల్లా ఉపవైద్యాధికారి డాక్టర్ ఎన్ శ్రీనివాస్  ముఖ్య అతిథిగా హాజరై కరపత్రాలను ఈ...
Read More...
Local News 

శ్రీ శ్రీనివాస ఆంజనేయ భవాని శంకర దేవాలయంలో ఘనంగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలు

శ్రీ శ్రీనివాస ఆంజనేయ భవాని శంకర దేవాలయంలో ఘనంగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలు జగిత్యాల సెప్టెంబర్ 15 (ప్రజా మంటలు)జిల్లా కేంద్రం కూరగాయల మార్కెట్ లోని శ్రీ శ్రీనివాసా0 జనేయ భవాని శంకర దేవాలయంలో శ్రీ కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈనాటి కార్య కార్య క్రమంలో మంచాల రాంగోపాల్, గౌరి శెట్టి రామ్ మూర్తి దేశాయ్, భాశెట్టి లవకుమార్, గౌరి శెట్టి రాజు, ఆలయ అర్చకులు రుద్రంగి...
Read More...
Local News 

ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రజావాణి పలు సమస్యలపై వినతులు స్వీకరించిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్

ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రజావాణి  పలు సమస్యలపై వినతులు స్వీకరించిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ జగిత్యాల సెప్టెంబర్ 15( ప్రజా మంటలు)               ప్రజావాణి అర్జీల పై సమగ్ర విచారణ జరిపి సమస్యలను పరిష్కరించాలని అధికారులను జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ అదేశించారు. సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి ఫిర్యాదులు, వినతులను  అదనపు కలెక్టర్, ఆర్డీఓలతో తో కలిసి స్వీకరించారు.   ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్...
Read More...
Local News 

పశువైద్యశాల నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే డా .సంజయ్ కుమార్

పశువైద్యశాల నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే డా .సంజయ్ కుమార్    జగిత్యాల సెప్టెంబర్ 15 (ప్రజా మంటలు)  రూరల్ మండలం వెల్దుర్తి గ్రామంలో 10 లక్షల నిధులతో నూతనంగా నిర్మించనున్న పశు వైద్యశాల నిర్మాణానికి భూమిపూజ చేసిన జగిత్యాల శాసనసభ్యులు డా సంజయ్ కుమార్  ఎమ్మెల్యే మాట్లాడుతూ  పశువులు ఆరోగ్యంగా ఉన్నప్పుడే రైతులు ఆర్థికంగా అభివృద్ధి సాధ్యం అవుతుందని అన్నారు ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ పశు...
Read More...
Local News 

గోధుర్ శ్రీ లక్ష్మి నరసింహ స్వామి గుడికి ₹2 లక్షల నిదుల ప్రొసీడింగ్   

గోధుర్ శ్రీ లక్ష్మి నరసింహ స్వామి గుడికి ₹2 లక్షల నిదుల ప్రొసీడింగ్     ఎంపీ అర్వింద్ ధర్మపురి ఎంపీ లీడ్స్ నిదుల ప్రొసీడింగ్    ఇబ్రహీంపట్నం సెప్టెంబర్ 15 (ప్రజా మంటలు దగ్గుల అశోక్): నిజామాబాదు ఎంపీ అర్వింద్ ధర్మపురి ఎంపీ లాడ్స్ నిదుల నుండి ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని గోధుర్ గ్రామంలోని శ్రీ లక్ష్మి నరసింహ స్వామి గుడికి 2 లక్షల రూపాయల నిదుల ప్రొసీడింగ్ పత్రాన్ని దేవాలయం కమిటీ...
Read More...