జీహెచ్ఎంసీ స్పందించకపోతే తామే శ్రమదానం చేస్తామని హెచ్చరించిన కేటీఆర్.

On
జీహెచ్ఎంసీ స్పందించకపోతే తామే శ్రమదానం చేస్తామని హెచ్చరించిన కేటీఆర్.

(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).

హైదరాబాద్ 16 జూలై (ప్రజా మంటలు) : 

ప్రజలు తమ కాలనీల్లో సమస్యలున్నాయంటూ ఎన్ని ఫిర్యాదులు చేసిన జీహెచ్ఎంసీ అధికారులు పట్టించుకోకపోవటంపై భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఫిర్యాదు చేసిన వెంటనే సమస్యను పరిష్కరించే విషయంలో జీహెచ్ఎంసీ ఎందుకు విఫలమవుతుందని ప్రశ్నించారు.

తమ కాలనీలో చెట్లు భారీగా పెరిగిపోవటం, చెత్త చెదారం కారణంగా పాముల బెడద ఉందంటూ జీహెచ్ఎంసీ మేయర్ కు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినప్పటికీ ఫలితం లేదంటూ ఓ వ్యక్తి కేటీఆర్ కు ట్విట్టర్ ద్వారా తెలిపారు.

తమ కాలనీలో 50 కుటుంబాలున్నాయని మాకు సరైన రోడ్లు, నీటి సౌకర్యం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. రాత్రి అయితే చాలు దొంగతనాలు జరుగుతున్నాయని కేటీఆర్ కు వివరించాడు.

ఈ ట్వీట్ పై కేటీఆర్ స్పందించారు.

ఆ నెటిజన్ ఫిర్యాదు పై స్పందించి సమస్య పరిష్కరించాలని జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ని కోరారు.

గతంలో జీహెచ్ఎంసీ పరిధిలో ఏ సమస్య ఉన్న సరే ఒక్క ట్వీట్ చేస్తే ఆ సమస్యను పరిష్కరించేవాళ్లమని గుర్తు చేశారు. కానీ ప్రస్తుతం కార్పొరేటర్ల పార్టీ ఫిరాయింపులపై మాత్రమే ఈ ప్రభుత్వం దృష్టి పెట్టటంతో ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి వచ్చిందన్నారు.

ఇకనైనా ప్రజా సమస్యలపై మేయర్ సహా ప్రభుత్వం దృష్టి పెట్టాలని సూచించారు.లేదంటే 48 గంటల్లో సమస్య పరిష్కారం కాకపోతే స్థానికులతో కలిసి తామే శ్రమ దానం చేసుకోని సమస్య పరిష్కరించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.

Tags
Join WhatsApp

More News...

Local News 

37, 38 వార్డులలో అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

37, 38 వార్డులలో అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్    జగిత్యాల అక్టోబర్ 23 ( ప్రజా మంటలు)పట్టణ 38వ వార్డులో 30 లక్షలతో సీసీ రోడ్డు డ్రైనేజీ నిర్మాణ పనులకు,37 వ వార్డులో 10 లక్షలతో  డ్రైన్ స్లాబ్ నిర్మాణ పనులకు భూమిపూజ చేసిన జగిత్యాల శాసనసభ్యులు డా సంజయ్ కుమార్ .అంతకముందు  38వ వార్డు లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు...
Read More...
Local News 

సీనియర్ సిటిజెన్ల హక్కుల రక్షణకు కృషి. -సీనియర్ సిటిజెన్స్ జిల్లా అధ్యక్షులు హరి అశోక్ కుమార్.  

సీనియర్ సిటిజెన్ల హక్కుల రక్షణకు కృషి. -సీనియర్ సిటిజెన్స్ జిల్లా అధ్యక్షులు హరి అశోక్ కుమార్.   జగిత్యాల అక్టోబర్ 23 (ప్రజా మంటలు): సీనియర్ సిటిజెన్లు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి, వారి హక్కుల పరిరక్షణకు కృషి చేస్తున్నామని తెలంగాణ అల్ సీనియర్ సిటిజెన్స్  అసోసియేషన్ జగిత్యాల జిల్లా అధ్యక్షులు హరి అశోక్ కుమార్ అన్నారు.గురువారం జిల్లా కేంద్రం లోని సీనియర్ సిటిజెన్స్ కార్యాలయంలో టాస్కా జిల్లా స్థాయి సమావేశం జరిగింది.ఈ సందర్బంగా సీనియర్...
Read More...
National  State News 

తెలంగాణ IAS అధికారి రిజ్వీ స్వచ్ఛంద విరమణ – మద్యం టెండర్ వివాదం నేపథ్యంగా

తెలంగాణ IAS అధికారి రిజ్వీ స్వచ్ఛంద విరమణ – మద్యం టెండర్ వివాదం నేపథ్యంగా మద్యం టెండర్ వివాదం ప్రధాన పరిణామం హైదరాబాద్‌, అక్టోబర్ 23, 2025:టెలంగానా రాష్ట్ర ప్రభుత్వంలో రెవెన్యూ (కామర్షియల్ ట్యాక్స్ అండ్ ఎక్సైజ్) ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేస్తున్న 1999 బ్యాచ్ IAS అధికారి సయ్యద్ అలీ ముర్తజా అలీ రిజ్వీ తన సేవలకు స్వచ్ఛంద విరమణ (VRS) అభ్యర్థన సమర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం అక్టోబర్ 31,...
Read More...

భోపాల్‌లో దీపావళి విషాదం: కార్బైడ్ గన్స్ పేలుళ్లతో 60 మందికి పైగా గాయాలు, పిల్లలు చూపు కోల్పోయిన ఘటనలు

భోపాల్‌లో దీపావళి విషాదం: కార్బైడ్ గన్స్ పేలుళ్లతో 60 మందికి పైగా గాయాలు, పిల్లలు చూపు కోల్పోయిన ఘటనలు తల్లిదండ్రుల ఆవేదన పిల్లల పరిస్థితి ఆందోళనకరం భోపాల్, అక్టోబర్ 23: దీపావళి సంబరాలు భోపాల్‌లో విషాదంగా మారాయి. పండుగ సందర్భంగా క్యాల్షియం కార్బైడ్ గన్స్ పేలుళ్ల కారణంగా 60 మందికి పైగా గాయపడగా, పలువురు చిన్నారులు తమ చూపును కోల్పోయారు. భోపాల్‌లోని వైద్యాధికారులు తెలిపిన వివరాల ప్రకారం, మొత్తం 150కి పైగా కార్బైడ్ గన్ ప్రమాదాలు...
Read More...

ఆస్ట్రేలియా–భారత్ రెండో ODI: రోహిత్ హాఫ్ సెంచరీతో భారత్ 264 పరుగులు

ఆస్ట్రేలియా–భారత్ రెండో ODI: రోహిత్ హాఫ్ సెంచరీతో భారత్ 264 పరుగులు భారత్ మొదటి బ్యాటింగ్‌లో 264/9 రోహిత్ శర్మ అద్భుతమైన 73 పరుగులు కోహ్లీ 42 పరుగులు, సూర్యకుమార్ 29 పరుగులు జాంపా, హేజిల్‌వుడ్ తలో రెండు వికెట్లు ఆస్ట్రేలియా బ్యాటింగ్ ప్రారంభం, మ్యాచ్ ఉత్కంఠగా అడిలైడ్, అక్టోబర్ 23: అడిలైడ్ ఓవల్ మైదానంలో ఈరోజు జరుగుతున్న భారత్–ఆస్ట్రేలియా రెండో వన్డే మ్యాచ్ ఉత్కంఠభరితంగా కొనసాగుతోంది. మొదటి...
Read More...
National  State News 

బిహార్ ఎన్నికలు - తేజస్వీ యాదవ్ సీఎం అభ్యర్థి, ముకేష్ సహని డిప్యూటీ సీఎం

బిహార్ ఎన్నికలు - తేజస్వీ యాదవ్ సీఎం అభ్యర్థి, ముకేష్ సహని డిప్యూటీ సీఎం మహాఘట్బంధన్ సంయుక్త పత్రికా సమావేశం పాల్గొన్న అశోక్ గెహ్లాట్, తేజస్వి యాదవ్ ముఖేష్ సహాని, దీపాంకర్ భట్టాచార్య, రాజేశ్ రామ్, అమిత్ షా రెండు భారీ సభల్లో పాల్గొంటారు. పట్నా, అక్టోబర్ 23:బిహార్ ఎన్నికల వాతావరణం మరింత వేడెక్కింది. రాబోయే 2025 బిహార్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో రాజకీయ కూటములు తమ వ్యూహాలను ఖరారు...
Read More...
National  Crime  State News 

కాకినాడ అత్యాచారయత్నం కేసులో నిందితుడి ఆత్మహత్య.. చెరువులోకి దూకి మృతి

కాకినాడ అత్యాచారయత్నం కేసులో నిందితుడి ఆత్మహత్య.. చెరువులోకి దూకి మృతి కాకినాడ అక్టోబర్ 23: కాకినాడ జిల్లా తుని మండలం జగన్నాథగిరి గురుకుల పాఠశాలలో చదువుతున్న బాలికపై జరిగిన లైంగిక దాడి యత్నం కేసు విషాదంగా మారింది. నిందితుడు నారాయణరావు ఆత్మహత్య చేసుకున్నాడు. చెరువులోకి దూకి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. వివరాల్లోకి వెళితే— నిన్న మధ్యాహ్నం సమయంలో నారాయణరావు అనే వ్యక్తి, తాను బాలికకు తాతయ్యనని...
Read More...

తమిళనాడులో ఈ రాత్రి భారీ వర్షాల హెచ్చరిక – 30 జిల్లాల్లో వర్ష సూచన

తమిళనాడులో ఈ రాత్రి భారీ వర్షాల హెచ్చరిక – 30 జిల్లాల్లో వర్ష సూచన ప్రభావిత జిల్లాలు: 30 ప్రధానంగా ప్రభావిత ప్రాంతాలు: చెన్నై, చెంగల్పట్టు, మధురై, తిరుచ్చి వర్షాల సమయం: రాత్రి 7 గంటల నుండి 10 గంటల వరకు వర్షాల రకం: ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు చెన్నై, అక్టోబర్ 22: తమిళనాడులో వాతావరణం మళ్లీ మారబోతోందని చెన్నై వాతావరణ శాఖ ప్రకటించింది. రాబోయే ...
Read More...
National  State News 

శ్రేయసి సింగ్‌ నుంచి శివానీ శుక్లా వరకు… కుటుంబ రాజకీయ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్న మహిళా నాయకులు

శ్రేయసి సింగ్‌ నుంచి శివానీ శుక్లా వరకు… కుటుంబ రాజకీయ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్న మహిళా నాయకులు మహిళా నాయకత్వం కుటుంబ వారసత్వ రాజకీయాలు బీహార్ అసెంబ్లీ ఎన్నికలు 2025 పాట్నా, అక్టోబర్ 22: బీహార్ రాజకీయాల్లో ఇప్పుడు మహిళల పాత్ర మరింత బలంగా కనిపిస్తోంది. ఆధి ఆబాదీ (మహిళలు) తమ కుటుంబాల రాజకీయ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 26 మంది మహిళలు ఎమ్మెల్యేలుగా...
Read More...
State News 

పట్టణ పేదలకు శుభవార్త! ఇందిరమ్మ ఇళ్ల పథకంలో మంత్రి పొంగులేటి కీలక నిర్ణయం

పట్టణ పేదలకు శుభవార్త! ఇందిరమ్మ ఇళ్ల పథకంలో మంత్రి పొంగులేటి కీలక నిర్ణయం హైదరాబాద్ అక్టోబర్ 22 (ప్రజా మంటలు): పట్టణ ప్రాంత పేదల కోసం ప్రభుత్వం మరో సానుకూల నిర్ణయం తీసుకుంది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించిన వివరాల ప్రకారం, ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద జీప్లస్‌–1 (గ్రౌండ్‌ ప్లస్‌ వన్‌) ఇళ్ల నిర్మాణానికి అనుమతి ఇవ్వబడింది. ప్రభుత్వం తాజాగా జీవో నెంబర్‌ 69ను జారీ...
Read More...
State News 

మాజీ ప్రజా ప్రతినిధులకు క్యాష్ లెస్ వైద్యం అందించాలి - రాజేశం గౌడ్

మాజీ ప్రజా ప్రతినిధులకు క్యాష్ లెస్ వైద్యం అందించాలి - రాజేశం గౌడ్ హైదరాబాద్ అక్టోబర్ 22 (ప్రజా మంటలు):. మాజీ ప్రజాప్రతినిధులు వయో వృద్ధులు కావడంతో వైద్య అవసరాల సమయంలో ముందుగా నగదు చెల్లించి, తర్వాత రీయింబర్స్‌మెంట్ పొందే ప్రక్రియలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ఈ సమస్యను పరిష్కరించి, తక్షణమే నగదు రహిత చికిత్స సదుపాయాన్ని అమలు చేయాలని ఫైనాన్స్ శాఖను మాజీ ప్రజాప్రతినిధుల సంఘ నాయకులు కోరారు. మాజీ...
Read More...
Local News 

జగిత్యాల జిల్లాలో అంతర్ రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్ .

జగిత్యాల జిల్లాలో అంతర్ రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్ . జగిత్యాల అక్టోబర్ 22 (ప్రజా మంటలు)  జిల్లాతోపాటు నిజామాబాద్‌, మంచిర్యాల, ఆదిలాబాద్‌, నిర్మల్‌ జిల్లాలో చోరీలకు పాల్పడిన అంతర్‌ రాష్ర్ట దొంగల ముఠాను జగిత్యాల రూరల్‌ పోలీసులు పట్టుకున్నారు. గత కొంతకాలంగా ముసుగులు వేసుకుని తాళాలు వేసి ఉన్న ఇళ్లనే  లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడ్డ ఈ ముఠా మహారాష్ర్టకు చెందిన వారుగా గుర్తించారు. నలుగురు...
Read More...