ప్రజావాణి దరఖాస్తులకు ప్రాధాన్యత ఇవ్వండి. - డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ జితేందర్.

On
ప్రజావాణి దరఖాస్తులకు ప్రాధాన్యత ఇవ్వండి. - డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ జితేందర్.

(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113)

హైదరాబాద్ 16 జూలై (ప్రజా మంటలు) : 

ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజావాణి కార్యక్రమం ద్వారా అందిన దరఖాస్తులకు ప్రాధాన్యత ఇవ్వాలని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ జితేందర్ పోలీస్ కమిషనర్లు, జిల్లా ఎస్పీలకు ఆదేశాలు జారీ చేశారు.

ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన కలెక్టర్లు, ఎస్పీల సదస్సులో పాల్గొనేందుకు పోలీసు అధికారులు హైదరాబాద్‌కు వచ్చారు.

డిజిపి కార్యాలయంలో మంగళవారం నాడు వారిని ఉద్దేశించి డీజీపీ మాట్లాడారు.

ఆయా జిల్లాలు, కమిషనరేట్‌లకు పంపిన దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని డీజీపీ జితేందర్ అధికారులను ఆదేశించారు, ఈ సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించడం వల్ల ప్రజలు సంతృప్తి చెందుతారని చెప్పారు. 

పోలీస్ స్టేషన్లలో వచ్చే ఫిర్యాదుల ఆధారంగా వెంటనే కేసులు నమోదు చేయాలని, ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని డిజిపి అధికారులను ఆదేశించారు.

పోలీసు కమీషనర్లు, ఎస్పీలు తప్పనిసరిగా పోలీస్ స్టేషన్లలో ఆకస్మిక తనిఖీల చేయాలని ఆదేశించారు.

తాను కూడా త్వరలోనే జిల్లాల వారీగా తనిఖీల చేపడుతానని వెల్లడించారు.

తనతోపాటు పోలీస్ శాఖ ఉన్నతాధికారులు కూడా వివిధ జిల్లాల్లో తనిఖీలు చేపడతారని తెలియజేశారు.

హిస్టరీ షీట్‌ల సమీక్షించాలని, ఆయుధాల లైసెన్స్‌ల జారీపై జాగ్రత్త వహించాలని, శాంతి భద్రతలు మెరుగైన నిర్వాహణ, ఎస్సీ, ఎస్టీలు, మహిళలకు సంబంధించిన కేసులను త్వరితగతిన పరిష్కరించాలని డిజిపి జితేందర్ ఆదేశాలు జారీ చేశారు.

‘నేను సైతం’ కార్యక్రమం ద్వారా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పనితీరును పర్యవేక్షించడంతోపాటు రోడ్డు భద్రత ప్రాముఖ్యతను ఆయన వివరించారు.

స్టేషన్ హౌస్ ఆఫీసర్ల పనితీరును అంచనా వేసేందుకు నేర సమీక్ష సమావేశాలు నిర్వహించాలని డిజిపి సూచించారు.

గౌరవనీయులైన ముఖ్యమంత్రి దార్శనికతకు అనుగుణంగా, రాష్ట్రంలో డ్రగ్స్ అక్రమ రవాణాను అరికట్టాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పిన డిజిపి, అవసరమైతే ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలను నిర్వహించాలని ప్రతిపాదించారు. 

 ఈ సమావేశంలో లా అండ్ ఆర్డర్ అదనపు డిజిపి మహేశ్ ఎం భగవత్, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కె. శ్రీనివాస్ రెడ్డి, అదనపు డిజిపిలు శిఖా గోయెల్, అభిలాష బిష్త్, వీవీ శ్రీనివాస్ రావు, విజయ్ కుమార్, స్టీఫెన్ రవీంద్ర, పోలీస్ కమిషనర్లు అవినాష్ మహంతి (సైబరాబాద్), జి. సుధీర్ బాబు (రాచకొండ), ఐజిపిలు ఎస్. చంద్రశేఖర్ రెడ్డి (మల్టీ జోన్-1), వి. సత్యనారాయణ (మల్టీ జోన్ -II), ఎం రమేష్, కె. రమేష్ నాయుడు, నార్కోటిక్స్ బ్యూరో డైరెక్టర్ సందీప్ శాండిల్య, ఇతర పోలీసు కమిషనర్‌లు, జిల్లా ఎస్పీలు సహా కీలక అధికారులు పాల్గొన్నారు.

Tags
Join WhatsApp

More News...

Local News  State News 

కాంగ్రెస్ పార్టీ మీటింగ్ పెట్టేవరకు స్వామి మాల విరమణ చేయను : డా. సాయికుమార్

కాంగ్రెస్ పార్టీ మీటింగ్ పెట్టేవరకు స్వామి మాల విరమణ చేయను : డా. సాయికుమార్ కోరుట్ల, డిసెంబర్ 23 (ప్రజా మంటలు): కోరుట్ల నియోజకవర్గ రాజకీయాల్లో డాక్టర్ సాయికుమార్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు డాక్టర్ సాయికుమార్ నేడు కొత్తపేట శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి సంచలన ప్రకటన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గతంలో జువ్వాడి నర్సింగరావు గారు “డాక్టర్ సాయికుమార్...
Read More...
National  Crime  State News 

ఏపీలో పలు జిల్లాల్లో ఏసీబీ మెరుపు సోదాలు – సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలపై దాడులు

ఏపీలో పలు జిల్లాల్లో ఏసీబీ మెరుపు సోదాలు – సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలపై దాడులు అమరావతి డిసెంబర్ 23(ప్రజా మంటలు): ఆంధ్రప్రదేశ్‌లో అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు విస్తృతంగా సోదాలు నిర్వహించారు. విజయనగరం, విశాఖపట్నం, ఎన్టీఆర్‌, సత్యసాయి జిల్లాల్లో ఏకకాలంలో దాడులు చేపట్టి పలు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలను, ఉద్యోగుల నివాసాలను తనిఖీ చేశారు. విజయనగరం జిల్లా భోగాపురం సబ్‌రిజిస్ట్రార్ రామకృష్ణతో పాటు ఆయన సహ ఉద్యోగులు, మరో ప్రైవేట్...
Read More...
National  State News 

కోచిలో రోడ్డుపై ప్రాణాలు నిలిపిన డాక్టర్‌ ధైర్యం – సినిమా సన్నివేశాన్ని తలపించిన నిజజీవిత రక్షణ

కోచిలో రోడ్డుపై ప్రాణాలు నిలిపిన డాక్టర్‌ ధైర్యం – సినిమా సన్నివేశాన్ని తలపించిన నిజజీవిత రక్షణ కోచి, కేరళ డిసెంబర్ 23 (ప్రత్యేక కథనం): కోచిలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదం అనంతరం ప్రాణాపాయ స్థితిలో రోడ్డుపై పడి ఉన్న వ్యక్తికి ఓ డాక్టర్ చేసిన అత్యవసర చికిత్స అక్షరాలా ప్రాణాలను నిలిపింది. శ్వాస తీసుకోలేక తంటాలు పడుతూ, మరణం అంచున ఉన్న ఆ వ్యక్తికి డాక్టర్ రోడ్డుపైనే తక్షణ శస్త్రచికిత్స చేసి...
Read More...

న్యూ ఢిల్లీలో బంగ్లాదేశ్ హైకమిషన్ ముందు ఉద్రిక్తత – భారీగా మోహరించిన భద్రతా బలగాలు

న్యూ ఢిల్లీలో బంగ్లాదేశ్ హైకమిషన్ ముందు ఉద్రిక్తత – భారీగా మోహరించిన భద్రతా బలగాలు న్యూ ఢిల్లీ డిసెంబర్ 24 (ప్రజా మంటలు): దేశ రాజధాని న్యూ ఢిల్లీలోని బంగ్లాదేశ్ హైకమిషన్ కార్యాలయం ముందు మంగళవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బంగ్లాదేశ్‌లో ఇటీవల చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలు, మానవ హక్కుల అంశాలపై నిరసన వ్యక్తం చేస్తూ పలు సంఘాలు హైకమిషన్ కార్యాలయం ముందు ఆందోళనకు దిగాయి. నిరసనకారులు పెద్ద ఎత్తున...
Read More...

జాగృతి జనంబాట పర్యటనలో మానవత్వం చాటిన కవిత

జాగృతి జనంబాట పర్యటనలో మానవత్వం చాటిన కవిత హైదరాబాద్ డిసెంబర్ 23 (ప్రజా మంటలు): యాదాద్రి భువనగిరి జిల్లా పర్యటనలో భాగంగా జాగృతి జనంబాట కార్యక్రమానికి వెళ్తున్న సమయంలో, నారపల్లి వద్ద కవిత గారికి అభివాదం చేసేందుకు ప్రయత్నించిన తండ్రీకుమార్తె బైక్ అదుపుతప్పి కింద పడిపోయారు. ఈ ఘటనను గమనించిన కవిత గారు వెంటనే తన వాహనాన్ని ఆపి, వారిని తన కాన్వాయ్‌లోని వాహనంలో...
Read More...
Today's Cartoon 

Today's cartoon

Today's cartoon
Read More...

బీర్పూర్ మండలం తుంగూరు గ్రామపంచాయతీ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారోత్సవం

బీర్పూర్ మండలం తుంగూరు గ్రామపంచాయతీ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారోత్సవం బీర్పూర్ డిసెంబర్ 22 (ప్రజా మంటలు)ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలలో  గెలుపొందిన నూతన సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డ్ మెంబర్ ల ప్రమాణ స్వీకార కార్యక్రమం జగిత్యాల నియోజకవర్గం బీర్పూర్ మండలం తుంగూరు గ్రామపంచాయతీ నూతన పాలకవర్గం ప్రమాణస్వీకారోత్సవం ఘనంగా జరిగింది. సోమవారం  విజయం సాధించిన గ్రామపంచాయతీ సర్పంచ్లు ఉప సర్పంచ్ లు...
Read More...

హరిహరాలయంలో ఘనంగా మూలమూర్తికి అభిషేకం

హరిహరాలయంలో ఘనంగా మూలమూర్తికి అభిషేకం   జగిత్యాల డిసెంబర్ 22 (ప్రజా మంటలు)జగిత్యాల జిల్లా కేంద్రంలోని బ్రాహ్మణ వీధి హరిహరాలయంలో పుష్య మాసము తొలి సోమవారం సాయంత్రం మూలమూర్తికి వివిధ ఫల రసాధులచే అభిషేకం నిర్వహించారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు విచ్చేసిన భక్తులకు తీర్థ ప్రసాద వితరణతో పాటు వేద ఆశీర్వచనం చేశారు ఇదిలా ఉండగా ఏ ఎస్ ఐ...
Read More...
Local News  State News 

రూ.3855.02 కోట్ల వ్యాపారానికి చేరుకున్న గాయత్రి బ్యాంకు : కొడిమ్యాల‌లో 68వ శాఖ ప్రారంభం

రూ.3855.02 కోట్ల వ్యాపారానికి చేరుకున్న గాయత్రి బ్యాంకు : కొడిమ్యాల‌లో 68వ శాఖ ప్రారంభం జగిత్యాల, డిసెంబర్ 23 (ప్రజా మంటలు): జగిత్యాల కేంద్రంగా పనిచేస్తున్నది. గాయత్రి కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంకు లిమిటెడ్ మరో కీలక మైలురాయిని చేరుకుంది. కొడిమ్యాల మండల కేంద్రంలో బ్యాంకు 68వ శాఖను జగిత్యాల జిల్లా కలెక్టర్ & మెజిస్ట్రేట్ బి. సత్యప్రసాద్ ఐఏఎస్ చేతుల మీదుగా సోమవారం ఘనంగా ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో జిల్లా...
Read More...

కస్టడీ మృతిపై తీవ్ర ఆరోపణలు: విచారణకు ఆదేశించిన TGHRC

కస్టడీ మృతిపై తీవ్ర ఆరోపణలు: విచారణకు ఆదేశించిన TGHRC హైదరాబాద్ డిసెంబర్ 22 (ప్రజా మంటలు): కర్లా రాజేష్ కస్టడీ మృతికి సంబంధించి వచ్చిన తీవ్ర ఆరోపణలను తెలంగాణ మానవ హక్కుల కమిషన్ (TGHRC) పరిగణనలోకి తీసుకుంది. SR నెం.4129, 4130 ఆఫ్‌ 2025 కేసుల్లో అక్రమ నిర్బంధం, కస్టడీలో చిత్రహింసలు, తప్పుడు కేసు నమోదు వల్లే రాజేష్ మృతి చెందినట్లు ఆరోపణలు ఉన్నాయని కమిషన్...
Read More...

ప్రజా సమస్యలను పట్టించుకొని కేసీఆర్‌ : మంత్రి అడ్లూరి లక్ష్మణ్ విమర్శలు

ప్రజా సమస్యలను పట్టించుకొని కేసీఆర్‌ : మంత్రి అడ్లూరి లక్ష్మణ్ విమర్శలు కరీంనగర్, డిసెంబర్ 22 (ప్రజా మంటలు): కరీంనగర్ ఆర్‌అండ్‌బీ గెస్ట్ హౌస్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, సుడ ఛైర్మెన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. జూబ్లీహిల్స్‌తో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు మార్పును కోరుతూ కాంగ్రెస్‌కు అధికారం ఇచ్చారని తెలిపారు. మాజీ సీఎం...
Read More...

ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులకు సమగ్ర విచారణ జరిపి పరిష్కారానికి చొరవ చూపాలి జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్

ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులకు సమగ్ర విచారణ జరిపి పరిష్కారానికి చొరవ చూపాలి జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ జగిత్యాల డిసెంబర్ 22 (ప్రజా మంటలు) ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పలు సమస్యల పరిష్కారం కోరుతూ జిల్లా కేంద్రంతో పాటు జిల్లాలోని పలు మండలాల నుండి ప్రజలు సమస్యలు విన్నవించుకోడానికి ప్రజావాణికి వస్తారని, అధికారులు వారి శాఖల వారిగా స్వీకరించిన ఫిర్యాదులపై సానుకూలంగా వ్యవహరించడంతో పాటు సమస్యల పై సమగ్ర విచారణ చేపట్టి...
Read More...