ప్రజావాణి దరఖాస్తులకు ప్రాధాన్యత ఇవ్వండి. - డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ జితేందర్.
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113)
హైదరాబాద్ 16 జూలై (ప్రజా మంటలు) :
ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజావాణి కార్యక్రమం ద్వారా అందిన దరఖాస్తులకు ప్రాధాన్యత ఇవ్వాలని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ జితేందర్ పోలీస్ కమిషనర్లు, జిల్లా ఎస్పీలకు ఆదేశాలు జారీ చేశారు.
ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన కలెక్టర్లు, ఎస్పీల సదస్సులో పాల్గొనేందుకు పోలీసు అధికారులు హైదరాబాద్కు వచ్చారు.
డిజిపి కార్యాలయంలో మంగళవారం నాడు వారిని ఉద్దేశించి డీజీపీ మాట్లాడారు.
ఆయా జిల్లాలు, కమిషనరేట్లకు పంపిన దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని డీజీపీ జితేందర్ అధికారులను ఆదేశించారు, ఈ సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించడం వల్ల ప్రజలు సంతృప్తి చెందుతారని చెప్పారు.
పోలీస్ స్టేషన్లలో వచ్చే ఫిర్యాదుల ఆధారంగా వెంటనే కేసులు నమోదు చేయాలని, ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని డిజిపి అధికారులను ఆదేశించారు.
పోలీసు కమీషనర్లు, ఎస్పీలు తప్పనిసరిగా పోలీస్ స్టేషన్లలో ఆకస్మిక తనిఖీల చేయాలని ఆదేశించారు.
తాను కూడా త్వరలోనే జిల్లాల వారీగా తనిఖీల చేపడుతానని వెల్లడించారు.
తనతోపాటు పోలీస్ శాఖ ఉన్నతాధికారులు కూడా వివిధ జిల్లాల్లో తనిఖీలు చేపడతారని తెలియజేశారు.
హిస్టరీ షీట్ల సమీక్షించాలని, ఆయుధాల లైసెన్స్ల జారీపై జాగ్రత్త వహించాలని, శాంతి భద్రతలు మెరుగైన నిర్వాహణ, ఎస్సీ, ఎస్టీలు, మహిళలకు సంబంధించిన కేసులను త్వరితగతిన పరిష్కరించాలని డిజిపి జితేందర్ ఆదేశాలు జారీ చేశారు.
‘నేను సైతం’ కార్యక్రమం ద్వారా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పనితీరును పర్యవేక్షించడంతోపాటు రోడ్డు భద్రత ప్రాముఖ్యతను ఆయన వివరించారు.
స్టేషన్ హౌస్ ఆఫీసర్ల పనితీరును అంచనా వేసేందుకు నేర సమీక్ష సమావేశాలు నిర్వహించాలని డిజిపి సూచించారు.
గౌరవనీయులైన ముఖ్యమంత్రి దార్శనికతకు అనుగుణంగా, రాష్ట్రంలో డ్రగ్స్ అక్రమ రవాణాను అరికట్టాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పిన డిజిపి, అవసరమైతే ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలను నిర్వహించాలని ప్రతిపాదించారు.
ఈ సమావేశంలో లా అండ్ ఆర్డర్ అదనపు డిజిపి మహేశ్ ఎం భగవత్, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కె. శ్రీనివాస్ రెడ్డి, అదనపు డిజిపిలు శిఖా గోయెల్, అభిలాష బిష్త్, వీవీ శ్రీనివాస్ రావు, విజయ్ కుమార్, స్టీఫెన్ రవీంద్ర, పోలీస్ కమిషనర్లు అవినాష్ మహంతి (సైబరాబాద్), జి. సుధీర్ బాబు (రాచకొండ), ఐజిపిలు ఎస్. చంద్రశేఖర్ రెడ్డి (మల్టీ జోన్-1), వి. సత్యనారాయణ (మల్టీ జోన్ -II), ఎం రమేష్, కె. రమేష్ నాయుడు, నార్కోటిక్స్ బ్యూరో డైరెక్టర్ సందీప్ శాండిల్య, ఇతర పోలీసు కమిషనర్లు, జిల్లా ఎస్పీలు సహా కీలక అధికారులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఎమ్మెల్యేను కలిసిన కరీంనగర్ అర్బన్ బ్యాంక్ ఛైర్మన్
జగిత్యాల, నవంబర్ 19 (ప్రజా మంటలు):జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ గారిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన కరీంనగర్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ ఛైర్మన్ కే. రాజశేఖర్, డైరెక్టర్ సాయి కృష్ణ మర్యాద పూర్వక భేటీ చేశారు. ఇటీవల ఎన్నికైన అర్బన్ బ్యాంక్ నూతన కార్యవర్గ సభ్యులకు ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలిపారు... ఇందిరా గాంధీ ఆశయ సాధనకు కృషి చేయాలి: మాజీ మంత్రి జీవన్ రెడ్డి
జగిత్యాల, నవంబర్ 19 (ప్రజా మంటలు):
జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్లో మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో ఇందిరా గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
ఇందిరా భవన్ నుండి పాత బస్టాండ్ వరకు ర్యాలీ
కార్యక్రమంలో భాగంగా... జమాత్ ఇస్లాం హింద్ ఆధ్వర్యంలో ఫారన్ క్లినిక్ ఫ్యామిలీ హెల్త్ కేర్ ప్రారంభం
జగిత్యాల నవంబర్ 19 (ప్రజా మంటలు)ఇస్లామిక్ వెల్ఫేర్ సొసైటీ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ జమాత్ ఏ ఇస్లామీ హింద్ జగిత్యాల ఆద్వర్యం లో ఫారన్ క్లినిక్ ను ఫ్యామిలీ హెల్త్ కేర్ ను ప్రారంభించిన తెలంగాణ మైనార్టీ కమిషన్ చైర్మన్ తారీక్అన్వర్,జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
ఎమ్మెల్యే మాట్లాడుతూ
ప్రతి సొసైటీ సేవ... ఇస్లామిక్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఫ్యామిలీ హెల్త్ కేర్ క్లినిక్
జగిత్యాల (రూరల్), నవంబర్ 19 (ప్రజా మంటలు):
జమాత్ ఏ ఇస్లామీ హింద్ – జగిత్యాల విభాగం ఆద్వర్యంలో ఇస్లామిక్ వెల్ఫేర్ సొసైటీ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నిర్వహిస్తున్న ఫారన్ ఫ్యామిలీ హెల్త్ కేర్ క్లినిక్ ఈరోజు ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ప్రధాన అతిథులుగా తెలంగాణ మైనారిటీ కమిషన్ చైర్మన్ తారీక్అన్వర్, జగిత్యాల... బిహార్ ముఖ్యమంత్రిగా 10 వ సారి నితీష్ కుమార్కు ఎన్నిక
20 మంది మంత్రులతో ప్రమాణస్వీకారం
పాట్నా, నవంబర్ 19 (ప్రజా మంటలు):
బిహార్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. జేడీయూ అధినేత నితీష్ కుమార్ 10వ సారి బిహార్ ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. ఎన్డీఏ శాసనసభ పక్ష సమాఖ్య సమావేశంలో ఆయన పేరును ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. అదే సమావేశంలో బీజేపీ నేత సామ్రాట్ చౌదరి, విజయ్... సింగరేణి భవన్ ముట్టడి… కల్వకుంట్ల కవిత అరెస్ట్!
హైదరాబాద్, నవంబర్ 19 (ప్రజా మంటలు):
సింగరేణి కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత ఇవాళ నగరంలోని సింగరేణి భవన్ను ముట్టడించారు. ఆమెతో పాటు జాగృతి కార్యకర్తలు, హెచ్ఎంఎస్ సింగరేణి యూనియన్ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ముట్టడి సమాచారం తెలుసుకున్న పోలీసులు... “మహిళల ఉన్నతి - తెలంగాణ ప్రగతి “జిల్లా కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ లో ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి
జగిత్యాల నవంబర్ 19 (ప్రజా మంటలు)భారత రత్న , దేశ మాజీ ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధీ 108వ జయంతి సందర్భంగా కోటి మహిళలకు కోటి చీరల పంపిణీ చేయాలనే ఉద్ధేశ్యంతో హైదరాబాద్ లో ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమంను ఘనంగా ప్రారంభించారు .
అనంతరం అన్ని జిల్లాల కలెక్టర్లు జిల్లా,మండల... దేశ సమగ్రత కోసం పాటుపడిన ఉక్కు మహిళ ఇందిరాగాంధీ _ఎమ్మెల్యే డా.సంజయ్
జగిత్యాల నవంబర్ 19(ప్రజా మంటలు)దేశ సమగ్రత కోసం,పేదరిక నిర్మూలన కోసం పాటుపడిన ఉక్కుమహిళ, మాజీ ప్రధానమంత్రి, భారతరత్న శ్రీమతి ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా జగిత్యాల ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఇందిర చిత్ర పటానికి ఘనంగా నివాళులర్పించారు.
జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ ,జగిత్యాల నియోజకవర్గ ముఖ్య నాయకులు.ఎమ్మేల్యే మాట్లాడుతూదేశ... శ్రీ సత్య సాయిబాబా శతజయంతి సందర్భంగా పుట్టపర్తికి ప్రధాని విచ్చేసిన సందర్భంగా మర్యాదపూర్వకంగా కలిసిన మహిళా మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు విజయలక్ష్మి
పుట్టపర్తి నవంబర్ 19 ( ప్రజా మంటలు)శ్రీసత్యసాయిబాబా శతజయంతి ఉత్సవ వేడుకలలో పాల్గొనేందుకు పుట్టపర్తికి విచ్చేసిన భారత దేశ ప్రధానమంత్రి నరేంద్రమోడీ ని పుట్టపర్తి ఎయిర్పోర్ట్ లో మర్యాదపూర్వకంగా కలిసిన బిజెపి మహిళా మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు మరియు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా.. FCI Ap Director వనగొందివిజయలక్ష్మిబీజేపీ పార్టీ లో కష్టపడి... అంత్యక్రియలకు డబ్బులు లేక కొడుకుది దేహంతో 8 గంటలు స్మశానంలో కూర్చున్న తండ్రి
స్వచ్ఛంద సేవా సంస్థ సాయం
మహబూబ్నగర్, నవంబర్ 18 (ప్రజా మంటలు):
మహబూబ్నగర్లో చోటుచేసుకున్న ఒక హృదయవిదారక సంఘటన ప్రతి ఒక్కరి హృదయాన్ని కలచివేస్తోంది. అంత్యక్రియల ఖర్చు కూడా చేయలేని దారిద్య్రం ఒక తండ్రిని 8 గంటలపాటు తన చిన్నారి మృతదేహంతో స్మశానంలోనే కూర్చోబెట్టింది.
ఎంతో కష్టాల్లో కుటుంబం
ప్రేమ్ నాగర్ ప్రాంతానికి చెందిన బాలరాజ్... లొంగుబాటు ప్రయత్నాల మధ్యే షాక్: మావోయిస్టు అగ్రనేతలు ఆజాద్, దేవ్జీని ఏపీ ఎన్కౌంటర్లో హతమార్చినట్టు లడ్డా ధృవీకరణ
హైదరాబాద్ నవంబర్ 19 (ప్రజా మంటలు):
మహారాష్ట్ర, తెలంగాణ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో ఇటీవల మావోయిస్టుల లొంగుబాట్లు వేగం పుంజుకోవడంతో, పైస్థాయి నాయకులకు మాత్రమే ప్రత్యేక రిహాబిలిటేషన్ సదుపాయాలు కల్పిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఆంధ్రప్రదేశ్లో మాత్రం విరుద్ధ దిశగా భారీ ఆపరేషన్లు కొనసాగుతున్నాయి.
ఇలాంటి సమయంలోనే మావోయిస్టు పార్టీకి భారీ దెబ్బతీసే లొంగుబాటు జరగబోతోందని విశ్వసనీయ... ప్రజాస్వామ్యానికి ‘నోట్ల బానిసత్వం’: బిహార్ మహిళా రోజ్గార్ పథకం అసలు ముఖం
బీహార్ ముఖ్యమంత్రి మహిళా రోజ్గార్ యోజన పరిశీలన
(సిహెచ్.వి. ప్రభాకర్ రావు)
బిహార్ ఎన్నికల సమయంలో ప్రకటించిన ముఖ్యమంత్రి మహిళా రోజ్గార్ యోజన రాజకీయాల నైతిక పతనానికి, రాష్ట్ర ఆర్థిక పతనానికి జాతీయ రహదారి. ఇప్పటికే మొదటి క్రీస్తు కింద దాదాపు కోటి మందికి, తలా పదివేల రూపాయల చొప్పున, ₹10 వేల కోట్లు పంచినట్లు... 