ప్రజావాణి దరఖాస్తులకు ప్రాధాన్యత ఇవ్వండి. - డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ జితేందర్.
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113)
హైదరాబాద్ 16 జూలై (ప్రజా మంటలు) :
ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజావాణి కార్యక్రమం ద్వారా అందిన దరఖాస్తులకు ప్రాధాన్యత ఇవ్వాలని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ జితేందర్ పోలీస్ కమిషనర్లు, జిల్లా ఎస్పీలకు ఆదేశాలు జారీ చేశారు.
ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన కలెక్టర్లు, ఎస్పీల సదస్సులో పాల్గొనేందుకు పోలీసు అధికారులు హైదరాబాద్కు వచ్చారు.
డిజిపి కార్యాలయంలో మంగళవారం నాడు వారిని ఉద్దేశించి డీజీపీ మాట్లాడారు.
ఆయా జిల్లాలు, కమిషనరేట్లకు పంపిన దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని డీజీపీ జితేందర్ అధికారులను ఆదేశించారు, ఈ సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించడం వల్ల ప్రజలు సంతృప్తి చెందుతారని చెప్పారు.
పోలీస్ స్టేషన్లలో వచ్చే ఫిర్యాదుల ఆధారంగా వెంటనే కేసులు నమోదు చేయాలని, ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని డిజిపి అధికారులను ఆదేశించారు.
పోలీసు కమీషనర్లు, ఎస్పీలు తప్పనిసరిగా పోలీస్ స్టేషన్లలో ఆకస్మిక తనిఖీల చేయాలని ఆదేశించారు.
తాను కూడా త్వరలోనే జిల్లాల వారీగా తనిఖీల చేపడుతానని వెల్లడించారు.
తనతోపాటు పోలీస్ శాఖ ఉన్నతాధికారులు కూడా వివిధ జిల్లాల్లో తనిఖీలు చేపడతారని తెలియజేశారు.
హిస్టరీ షీట్ల సమీక్షించాలని, ఆయుధాల లైసెన్స్ల జారీపై జాగ్రత్త వహించాలని, శాంతి భద్రతలు మెరుగైన నిర్వాహణ, ఎస్సీ, ఎస్టీలు, మహిళలకు సంబంధించిన కేసులను త్వరితగతిన పరిష్కరించాలని డిజిపి జితేందర్ ఆదేశాలు జారీ చేశారు.
‘నేను సైతం’ కార్యక్రమం ద్వారా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పనితీరును పర్యవేక్షించడంతోపాటు రోడ్డు భద్రత ప్రాముఖ్యతను ఆయన వివరించారు.
స్టేషన్ హౌస్ ఆఫీసర్ల పనితీరును అంచనా వేసేందుకు నేర సమీక్ష సమావేశాలు నిర్వహించాలని డిజిపి సూచించారు.
గౌరవనీయులైన ముఖ్యమంత్రి దార్శనికతకు అనుగుణంగా, రాష్ట్రంలో డ్రగ్స్ అక్రమ రవాణాను అరికట్టాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పిన డిజిపి, అవసరమైతే ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలను నిర్వహించాలని ప్రతిపాదించారు.
ఈ సమావేశంలో లా అండ్ ఆర్డర్ అదనపు డిజిపి మహేశ్ ఎం భగవత్, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కె. శ్రీనివాస్ రెడ్డి, అదనపు డిజిపిలు శిఖా గోయెల్, అభిలాష బిష్త్, వీవీ శ్రీనివాస్ రావు, విజయ్ కుమార్, స్టీఫెన్ రవీంద్ర, పోలీస్ కమిషనర్లు అవినాష్ మహంతి (సైబరాబాద్), జి. సుధీర్ బాబు (రాచకొండ), ఐజిపిలు ఎస్. చంద్రశేఖర్ రెడ్డి (మల్టీ జోన్-1), వి. సత్యనారాయణ (మల్టీ జోన్ -II), ఎం రమేష్, కె. రమేష్ నాయుడు, నార్కోటిక్స్ బ్యూరో డైరెక్టర్ సందీప్ శాండిల్య, ఇతర పోలీసు కమిషనర్లు, జిల్లా ఎస్పీలు సహా కీలక అధికారులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
జగిత్యాలలో రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకుల మృతి,
జగిత్యాల, జనవరి 18 (ప్రజా మంటలు):
జగిత్యాల పట్టణంలో శనివారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందగా, మరో యువకుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
జగిత్యాలకు చెందిన నవనీత్, సాయి తేజ, ధరూర్కు చెందిన సృజన్ అనే ముగ్గురు యువకులు సంక్రాంతి సెలవుల సందర్భంగా జగిత్యాలకు వచ్చారు.... యుఎఈ అధ్యక్షుడి ఆకస్మిక భారత పర్యటన – వెనుక కారణాలు ఏమిటి?
న్యూఢిల్లీ, జనవరి 17:
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ ఆల్ నహ్యాన్ ఆకస్మికంగా భారతదేశాన్ని సందర్శించడం అంతర్జాతీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.
ఇరాన్, అమెరికాల మధ్య ఉద్రిక్తతలు, సౌదీ, పాకిస్తాన్, టర్కీ ల మధ్య సైనిక, రక్షణ ఒప్పందాల నేపధ్యంలో ఈ పర్యటన వెనుక గల్ఫ్ దేశాలలో నెలకొన్న రాజకీయ... పొత్తులపై బహిరంగ వ్యాఖ్యలు వద్దు : తమిళనాడు కాంగ్రెస్ నాయకులకు రాహుల్ గాంధీ సూచన
న్యూఢిల్లీ, జనవరి 17 (ప్రజా మంటలు):
తమిళనాడు కాంగ్రెస్ నాయకులు కూటములు, సీట్ల పంపకం వంటి అంశాలపై బహిరంగంగా మాట్లాడవద్దని పార్టీ అధిష్ఠానం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందని తమిళనాడు కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు సెల్వప్పెరుంధగై వెల్లడించారు. అధిష్ఠానం తీసుకున్న నిర్ణయాలను రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ పూర్తిగా అనుసరిస్తుందని ఆయన స్పష్టం చేశారు.
తమిళనాడులో అసెంబ్లీ... రాష్ర్టంలో కొత్త రాజకీయ కూటమి
వివరాలు వెల్లడించిన గాలి వినోద్ కుమార్, కపిలవాయి దిలీప్ కుమార్
సికింద్రాబాద్, జనవరి 17 (ప్రజా మంటలు):
రాష్ర్టంలో కొత్తగా రాజకీయ కూటమి ఏర్పాటు అయింది. తెలంగాణ ఎన్నికల సంఘం(ఎస్ఈసీ) లో నమోదైన తొమ్మిది రాజకీయ పార్టీలు కలసి కొత్తగా తెలంగాణ రాజకీయ కూటమిగా ఏర్పడ్డాయి. తెలంగాణ రాజకీయ కూటమి కి సంబందించిన వివరాలను కూటమి... అమెరికా కు వ్యతిరేకంగా డెన్మార్క్ ప్రజల నిరసన ప్రదర్శనలు
కోపెన్హేగెన్, జనవరి 17 :
విరోధ భావాలతో వేలాది ప్రజలు డెన్మార్క్ రాజధాని కోపెన్హేగెన్లో రోడ్డులకు దిగారు, ఎందుకంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గ్రీన్ల్యాండ్ను స్వాధీనంగా పొందాలని పునఃప్రచారం చేస్తున్నారని ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. ఈ ఆర్టిక్ ద్వీపం స్వయంప్రభుత్వాన్ని కలిగి ఉన్నప్పటికీ, ఆదేశం దేనికి సరిపోయేది కాదని నిరూపించాలని అక్కడి ప్రజలు తీవ్రంగా... గత ప్రభుత్వం పాలమూరును పట్టించుకోలేదు – డీకే అరుణ
జడ్చర్ల, జనవరి 17 (ప్రజా మంటలు):
గత ప్రభుత్వం పాలమూరు అభివృద్ధిని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని, పాలమూరు ప్రాజెక్టు పూర్తి చేస్తామని ప్రజలను మోసం చేసిందని ఎంపీ డీకే అరుణ ఆరోపించారు.
మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలం చిట్టబోయినపల్లిలో రూ.200 కోట్లతో నిర్మించనున్న రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (IIIT) భూమిపూజ కార్యక్రమంలో ఆమె... జగిత్యాల, రాయికల్ మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశం దిశా నిర్దేశం చేసిన మాజీ మంత్రి కొప్పుల
జగిత్యాల జనవరి 17 (ప్రజా మంటలు)
జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు విద్యాసాగర్ రావు అధ్యక్షతన జగిత్యాల, రాయికల్ మున్సిపాలిటీల ఎన్నికల సన్నాహకపై కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ , కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ , ఎమ్మెల్సీ ఎల్ రమణ , జగిత్యాల జిల్లా బీఆర్ఎస్... లక్ష్యం ఉన్నతంగా ఉండాలి – చదువే జీవితాన్ని మార్చుతుంది – సీఎం రేవంత్ రెడ్డి
జడ్చర్ల, జనవరి 17 (ప్రజా మంటలు):
లక్ష్యం ఉన్నతంగా పెట్టుకుని కష్టపడితేనే జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోగలమని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి విద్యార్థినీ విద్యార్థులకు సూచించారు. చదువుతోనే సమాజంలో గౌరవం లభిస్తుందని తెలిపారు.
మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలం చిట్టబోయినపల్లిలో రూ.200 కోట్లతో నిర్మించనున్న రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (IIIT) భూమిపూజ... అవినీతి కవలలుగా ప్రజల కష్టాన్ని దోచుకున్న బీజేపీ–బీఆర్ఎస్ – డిసిసి అధ్యక్షులు, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
కరీంనగర్, జనవరి 17 (ప్రజా మంటలు):
బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల పాలనలో కరీంనగర్ నగరంలో అభివృద్ధి జరగలేదని, అవినీతే రాజ్యమేలిందని డిసిసి అధ్యక్షులు, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఆరోపించారు. ఈ రెండు పార్టీలు అవినీతి కవలలుగా మారి ప్రజల కష్టార్జితాన్ని దోచుకున్నాయని విమర్శించారు.
నగరంలోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో కరీంనగర్ అసెంబ్లీ... మెటుపల్లి మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు
మెటుపల్లి, జనవరి 17 (ప్రజా మంటలు):
మెటుపల్లి మున్సిపాలిటీలో మొత్తం 26 వార్డులకు సంబంధించి ఎన్నికల రిజర్వేషన్లు ఖరారయ్యాయి. వర్గాల వారీగా వార్డుల విభజన ఈ విధంగా ఉంది.
జనరల్ (ఓపెన్) వార్డులు
వార్డు నంబర్లు
01, 03, 17, 21, 23
మొత్తం : 5 వార్డులు
జనరల్ – మహిళ వార్డులు
వార్డు... తెలంగాణ మున్సిపల్ చైర్మన్ ఎన్నికలు: వర్గాలవారిగా రిజర్వేషన్ల వివరాలు
హైదరాబాద్ జనవరి 17 (ప్రజా మంటలు):
తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికలలో చైర్మన్ పదవులుBC, SC, మహిళ (Women), జనరల్ (Unreserved) — వర్గాల వారీగా విడివిడిగా జాబితాలు )
BC (బీసీ) కేటగిరీ – మున్సిపల్ చైర్మన్ రిజర్వేషన్లు
🔹 BC మహిళ
మున్సిపాలిటీ
ఎల్లందు
జగిత్యాల
కామారెడ్డి
బాన్సువాడ... జగిత్యాల బిసి మహిళా, కోరుట్ల, ధర్మపురి జనరల్ మహిళ, రాయికల్, మెటుపల్లి జనరల్ చైర్మన్ సీట్లు
హైదరాబాద్ జనవరి 17 (ప్రజా మంటలు):
తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ చైర్మన్ ఎన్నికల కోసం వర్గాల వారీ రిజర్వేషన్లను ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ మేరకు ST, SC, BC, అన్రిజర్వ్డ్ (జనరల్ + మహిళ) కేటగిరీల్లో మున్సిపాలిటీలను కేటాయించింది.
జగిత్యాల బిసి మహిళకు, కోరుట్ల, ధర్మపురి జనరల్ మహిళకు, రాయికల్, మెటుపల్లి జనరల్... 