జమ్మికుంట..పేరు పెద్ద...ఊరు దిబ్బ... పట్టించుకోని పాలక వర్గం...!
జమ్మికుంట..పేరు పెద్ద...ఊరు దిబ్బ... పట్టించుకోని పాలక వర్గం...!
- వందల కోట్లు నిధులు పట్టణ అభివృద్ధికి కేటాయించిన
- నాసిరక పనులతో ఎక్కడ వేసిన గొంగడి అక్కడే..!
- పత్రికలో వరుస కథనాలు ఇస్తున్నప్పటికీ దున్నపోతు మీద వర్షం కురిసినట్టే..!
- జమ్మికుంట మున్సిపాలిటీలో పట్టణ నడిబొడ్డున పరిస్థితి ఇది..!
- ఇక వార్డుల సంగతి దేవుడెరుగు
- ద్విచక్ర వాహనం లేని నాయకులు నేడు ఇన్నోవా, థార్ లలో తిరుగుతున్న పరిస్థితి
జమ్మికుంట (ప్రజా మంటలు) 26 : వందల కోట్ల రూపాయలు జమ్మికుంట మున్సిపాలిటీ అభివృద్ధికి కేటాయించినప్పటికీ కనీస సౌకర్యాలు కల్పించ లేనటువంటి పరిస్థితి అవుపడుతున్నది. రోడ్ల పరిస్థితి చాలా అధ్వానంగా మారిపోయింది, వర్షం పడితే మన పాలకవర్గం పనితీరు బయటపడుతుంది, తినడానికి తిండికి లేనివారు నాయకులుగా ఎదిగి ఇన్నోవాలు, మహేంద్ర తార్ వాహనాలు వాడుతున్నారు అంటే వాళ్లు ప్రజాసేవలో ఎంత నిమగ్నమయ్యారో మనకు అర్థమవుతుంది. చినుకు పడితే జమ్మికుంట మున్సిపాలిటీ పరిస్థితి చిత్తడి గానే మారుతుంది. పట్టించుకున్న నాధుడే లేడు, జమ్మికుంట గురించి పత్రికల్లో వరుస కథనాలు రాస్తున్నప్పటికీ " ఎవడికి పుట్టినావు బిడ్డ అంటే ఎక్కి ఎక్కి ఏడ్చినట్టు ఉంది " అస్సలు మున్సిపల్ పాలకవర్గంలో, అధికారుల్లో చలనమే లేకుండా పోతుంది జమ్మికుంట నడిబొడ్డున బస్టాండ్ ఎదురుగానే విపరీతమైన రోడ్లకు గుంతలు పడి రోడ్ యాక్సిడెంట్లు అవుతూ ప్రజలు ప్రమాద బారిన పడుతున్నప్పటికీ అస్సలు పట్టించుకున్న నాథుడే లేడు, ఎన్నో మార్లు మున్సిపల్ అధికారులకు విన్నవించుకున్నప్పటికీ కూడా మాకేం పని అన్నట్టు ఉంది పరిస్థితి, ఇప్పటికైనా జమ్మికుంట మున్సిపాలిటీ ప్రజలారా మనం పడుతున్నటువంటి అవస్థలు మీరు చూస్తూనే ఉన్నారు, కౌన్సిలర్ లు చైర్మన్లు ఏ స్థాయిలో వాళ్ల వ్యక్తిగత ఎదుగుదల జరిగిందో మన కళ్ళ ముందు అగుపడుతున్న సాక్ష్యం ఇది, పట్టణ అభివృద్ధి పక్కకు పెట్టి గెలిపించిన ఓటర్ల కష్టాలను పట్టించుకోకుండా వ్యక్తిగత అభివృద్ధి ఎజెండాగా పనిచేస్తున్నారు ఇప్పుడు ఉన్నటువంటి నాయకులు. కాబట్టి ప్రజలారా మన ఇబ్బందులు పట్టించుకోని ఈ నాయకులకు రానున్న ఎన్నికల్లో కర్రు కాల్చి వాత పెడితే తప్ప వీరు మన ప్రజల్ని పట్టించుకోరు అని ప్రజలు భావిస్తున్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
డిటిఎఫ్ భీమదేవరపల్లి మండల శాఖ నూతన కార్యవర్గం ఎన్నిక

ధర్మపురి మం నేరెళ్ల లోనే జవహర్ నవోదయ నెలకొల్పాలని కేంద్రమంత్రికి ప్రభుత్వ విప్, ఎంపి వినతి

ఘనంగా కొనసాగుతున్న శ్రీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు

రైతులకు పెద్ద పీట వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం
.jpg)
సుబ్రహ్మాణ్యస్వామి సేవలో మాజీ మంత్రి మర్రి సికింద్రాబాద్ ఫిబ్రవరి 11 (

జనహిత సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత కంటి శిభిరం
.jpg)
స్కందగిరిలో ఘనంగా తైపూసం పాలకావడి ఉత్సవాలు

నేషనల్ ఆల్ స్టైల్ మార్షల్ ఆర్ట్స్ లో గోల్డ్ మెడల్ విద్యార్థిని అభినందించిన ఎమ్మెల్యే డా. సంజయ్

దేవాలయ పవిత్రతను కాపాడుకునేందుకే బోర్డు.. ఏర్పాటు చేశాం-గ్రామ ప్రజలు భక్తులు

దేవాలయ పవిత్రతను కాపాడుకునేందుకే బోర్డు.. ఏర్పాటు చేశాం-గ్రామ ప్రజలు భక్తులు

పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కి బ్రహ్మోత్సవ ఆహ్వాన పత్రిక అందజేత

మోడీ అమెరికా పర్యటనకు ముందే ట్రంప్ బహుమతి
.jpg)