జమ్మికుంట..పేరు పెద్ద...ఊరు దిబ్బ... పట్టించుకోని పాలక వర్గం...!
జమ్మికుంట..పేరు పెద్ద...ఊరు దిబ్బ... పట్టించుకోని పాలక వర్గం...!
- వందల కోట్లు నిధులు పట్టణ అభివృద్ధికి కేటాయించిన
- నాసిరక పనులతో ఎక్కడ వేసిన గొంగడి అక్కడే..!
- పత్రికలో వరుస కథనాలు ఇస్తున్నప్పటికీ దున్నపోతు మీద వర్షం కురిసినట్టే..!
- జమ్మికుంట మున్సిపాలిటీలో పట్టణ నడిబొడ్డున పరిస్థితి ఇది..!
- ఇక వార్డుల సంగతి దేవుడెరుగు
- ద్విచక్ర వాహనం లేని నాయకులు నేడు ఇన్నోవా, థార్ లలో తిరుగుతున్న పరిస్థితి
జమ్మికుంట (ప్రజా మంటలు) 26 : వందల కోట్ల రూపాయలు జమ్మికుంట మున్సిపాలిటీ అభివృద్ధికి కేటాయించినప్పటికీ కనీస సౌకర్యాలు కల్పించ లేనటువంటి పరిస్థితి అవుపడుతున్నది. రోడ్ల పరిస్థితి చాలా అధ్వానంగా మారిపోయింది, వర్షం పడితే మన పాలకవర్గం పనితీరు బయటపడుతుంది, తినడానికి తిండికి లేనివారు నాయకులుగా ఎదిగి ఇన్నోవాలు, మహేంద్ర తార్ వాహనాలు వాడుతున్నారు అంటే వాళ్లు ప్రజాసేవలో ఎంత నిమగ్నమయ్యారో మనకు అర్థమవుతుంది. చినుకు పడితే జమ్మికుంట మున్సిపాలిటీ పరిస్థితి చిత్తడి గానే మారుతుంది. పట్టించుకున్న నాధుడే లేడు, జమ్మికుంట గురించి పత్రికల్లో వరుస కథనాలు రాస్తున్నప్పటికీ " ఎవడికి పుట్టినావు బిడ్డ అంటే ఎక్కి ఎక్కి ఏడ్చినట్టు ఉంది " అస్సలు మున్సిపల్ పాలకవర్గంలో, అధికారుల్లో చలనమే లేకుండా పోతుంది జమ్మికుంట నడిబొడ్డున బస్టాండ్ ఎదురుగానే విపరీతమైన రోడ్లకు గుంతలు పడి రోడ్ యాక్సిడెంట్లు అవుతూ ప్రజలు ప్రమాద బారిన పడుతున్నప్పటికీ అస్సలు పట్టించుకున్న నాథుడే లేడు, ఎన్నో మార్లు మున్సిపల్ అధికారులకు విన్నవించుకున్నప్పటికీ కూడా మాకేం పని అన్నట్టు ఉంది పరిస్థితి, ఇప్పటికైనా జమ్మికుంట మున్సిపాలిటీ ప్రజలారా మనం పడుతున్నటువంటి అవస్థలు మీరు చూస్తూనే ఉన్నారు, కౌన్సిలర్ లు చైర్మన్లు ఏ స్థాయిలో వాళ్ల వ్యక్తిగత ఎదుగుదల జరిగిందో మన కళ్ళ ముందు అగుపడుతున్న సాక్ష్యం ఇది, పట్టణ అభివృద్ధి పక్కకు పెట్టి గెలిపించిన ఓటర్ల కష్టాలను పట్టించుకోకుండా వ్యక్తిగత అభివృద్ధి ఎజెండాగా పనిచేస్తున్నారు ఇప్పుడు ఉన్నటువంటి నాయకులు. కాబట్టి ప్రజలారా మన ఇబ్బందులు పట్టించుకోని ఈ నాయకులకు రానున్న ఎన్నికల్లో కర్రు కాల్చి వాత పెడితే తప్ప వీరు మన ప్రజల్ని పట్టించుకోరు అని ప్రజలు భావిస్తున్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
రెండో విడత 7 మండలాల్లోని గ్రామపంచాయతీ ఎన్నికలు ప్రశాంతం
జగిత్యాల డిసెంబర్ 14 (ప్రజా మంటలు)జిల్లాలో రెండో విడత నిర్వహించిన గ్రామపంచాయతీ పోలింగ్ కేంద్రాలను జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ సందర్శించి పోలింగ్ సరళిని అడిగి తెలుసుకున్నారు. ఆయనతోపాటు జగిత్యాల ఆర్డీవో మధుసూదన్ గౌడ్ డిపిఓ రఘువరన్ తదితరులు ఉన్నారు. ఇదిలా ఉండగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో పోలీసులు... రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రభుత్వం మద్దతు ఇచ్చిన అభ్యర్థులే గెలుస్తారు ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
జగిత్యాల రూరల్ డిసెంబర్ 14 (ప్రజా మంటలు) మండలం అంతర్గాం గ్రామంలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ దంపతులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం మద్దతు ఇచ్చిన అభ్యర్థులే ఎక్కువ శాతం గెలుస్తారని ఎమ్మెల్యే డా .సంజయ్ కుమార్ ఆశాభావం వ్యక్తం చేశారు.జగిత్యాల నియోజకవర్గంలో... సత్యమే గెలుస్తుంది – ఓట్ల చోరీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పోరాటం : రాహుల్ గాంధీ
న్యూ డిల్లీ డిసెంబర్ 14:
“సత్యమనే నినాదంతో మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వాన్ని గద్దెదించుతాం” అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఓట్ల చోరీకి పాల్పడుతోందని, ఆ ప్రక్రియలో ఎన్నికల సంఘం (EC) కూడా కేంద్రంతో చేతులు కలిపి పనిచేస్తోందని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు.
ఓట్ల... డెహ్రాడూన్లో సామల వేణుకు పీఆర్ ఎక్సలెన్స్–2025 అవార్డు
సికింద్రాబాద్, డిసెంబర్ 14 (ప్రజామంటలు) :
డెహ్రాడూన్లో జరిగిన 47వ జాతీయ ప్రజాసంబంధాల సదస్సులో హైదరాబాద్కు చెందిన అంతర్జాతీయ ఇంద్రజాలికుడు సామల వేణుకు ‘పబ్లిక్ రిలేషన్స్ ఎక్సలెన్స్–2025’ అవార్డు లభించింది. డెహ్రాడూన్ లో ఆదివారం హోటల్ ఎమరాల్డ్లో నిర్వహించిన కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు నరేష్ భన్సాల్ ఈ అవార్డును అందజేశారు.మ్యాజిక్ను మాధ్యమంగా చేసుకుని ప్రజాసంబంధాలకు విశేష... నెహ్రూపై తప్పుడు కథనాలు, మణిభెన్ డైరీ పేరుతో చరిత్ర వక్రీకరణ
(ప్రత్యేక విశ్లేషణ)
రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇటీవల చేసిన ఒక వ్యాఖ్య దేశ రాజకీయాల్లో, ముఖ్యంగా చరిత్రపరమైన సున్నిత అంశాలపై మరోసారి చర్చకు దారితీసింది. ఆయన చేసిన వ్యాఖ్య ప్రకారం — పండిత్ జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వ ఖర్చుతో బాబ్రీ మసీదును పునర్నిర్మించాలనుకున్నారు అని, ఇందుకు ఆధారంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ కుమార్తె మణిభెన్... "కీ శే"నల్ల రాజిరెడ్డి ఆశయాలతో సర్పంచ్ గా గెలిపిస్తే ఎప్పటికీ మీ ఇంటి ఆడబిడ్డ గా ఉంటా."
" నా బలం మీ నమ్మకం నా లక్ష్యం మన గొల్లపల్లి ఊరి అభివృద్ధి." సర్పంచ్ అభ్యర్థి నల్ల నీరజ సతీష్ రెడ్డి గొల్లపల్లి డిసెంబర్ 14ప్రజా మంటలు ( ప్రతినిధి అంకం భూమయ్య):
గొల్లపల్లి గ్రామ ప్రజలు సర్పంచ్గా గెలిపిస్తే గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని సర్పంచ్ నల్ల నీరజ సతీష్ రెడ్డి... నేత్రదాత గుంటోజు వరలక్ష్మి సంస్మరణ సభ ::నేత్రదానంపై అవగాహన కార్యక్రమం
భూపాలపల్లి / గోరికొత్తపల్లి, డిసెంబర్ 14 (ప్రజామంటలు) :
భూపాలపల్లి జిల్లా గోరికొత్తపల్లి మండలం చిన్న కోడెపాక గ్రామంలో నేత్రదాత గుంటోజు వరలక్ష్మి సంస్మరణ సభను ఆదివారం వారి స్వగృహంలో కుటుంబ సభ్యులు మరియు సదాశయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నేత్రదానం, అవయవ దానం, శరీర దానం ప్రాధాన్యతపై వచ్చిన బంధు... 4 వ,వార్డు సభ్యునికి మద్దతు తెలిపిన ఆర్య వైశ్యులు
గొల్లపల్లి డిసెంబర్ 14 (ప్రజా మంటలు ప్రతినిధి అంకం భూమయ్య)
గొల్లపల్లి గ్రామాన్ని ఆదర్శ గా తీర్చిదిద్దడానికి, పారదర్శకమైన, నిజాయితీతో కూడిన పాలన అందించడానికి మీ ముందుకు వస్తున్న 4వ, వార్డు అభ్యర్థిగా క్యాస సతీష్ ప్రధాన ఐదు హామీలు:మన వీధిలో క్రమం తప్పకుండా చెత్త తొలగింపు మరియు డ్రైనేజీ వ్యవస్థను, పారిశుద్ధ్యానికి అత్యంత... జిల్లా పరిధిలో ప్రశాంతంగా జరిగిన రెండవ విడత సర్పంచ్ ఎన్నికలు: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
జగిత్యాల డిసెంబర్ 14 (ప్రజా మంటలు)రెండవ విడత సర్పంచ్ ఎన్నికలు ప్రశాంతంగా జరిగి న్నట్లుగా జిల్లా ఎస్పీ తెలిపారు. ఎన్నికలు జరుగుతున్న జాబితా పూర్, లక్ష్మీ పూర్, పొలస గ్రామాల్లో పోలింగ్ కేంద్రాలను సందర్శించారు.
ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోనట్లు తెలిపారు .జిల్లాలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన... SIR పేరుతో మహిళల హక్కుల హరణం.. బీజేపీపై మమతా బెనర్జీ ఘాటు విమర్శలు
కృష్ణ నగర్ (పశ్చిమ బెంగాల్) డిసెంబర్ 14:
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఓటర్ల జాబితాలో ప్రత్యేక సమూల సవరణ (SIR) పేరుతో మహిళల హక్కులను హరించే ప్రయత్నం జరుగుతోందని ఆమె ఆరోపించారు.
పశ్చిమ బెంగాల్లోని కృష్ణ నగర్లో SIRకు వ్యతిరేకంగా నిర్వహించిన ర్యాలీకి మమతా... ప్రత్యేక విమానంలో ఢిల్లీకి రాహుల్ గాంధీ, సీఎం రేవంత్… కీలక అంశాలపై సుదీర్ఘ చర్చ
హైదరాబాద్ డిసెంబర్ 15
నిన్న ఉప్పల్ స్టేడియంలో నిర్వహించిన మెస్సీ – రేవంత్ టీమ్ల ఫుట్బాల్ మ్యాచ్ సందర్భంగా హైదరాబాద్కు వచ్చిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డితో కలిసి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లారు.
ఈ ప్రయాణ సమయంలో రాహుల్ గాంధీతో సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర రాజకీయ పరిణామాలపై... 