ఎల్.ఐ.సి. ని కాపాడేందుకే ఎఓఐ కృషి ఏజెంట్లకు 50 లక్షల భీమా కల్పించాలి రాష్ట్ర ఇంచార్జీ అధ్యక్షులు తాళ్లూరి శ్రీనివాస రావు
ఎల్.ఐ.సి. ని కాపాడేందుకే ఎఓఐ కృషి
ఏజెంట్లకు 50 లక్షల భీమా కల్పించాలి
రాష్ట్ర ఇంచార్జీ అధ్యక్షులు తాళ్లూరి శ్రీనివాస రావు
జగిత్యాల జులై 10 : భారతీయ జీవిత భీమా సంస్థ ను కాపాడుకునేందుకు ఎల్.ఐ.సి. ఎజెంట్స్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా కృషి చేస్తుందని రాష్ట్ర ఇంచార్జీ అధ్యక్షులు తాళ్లూరి శ్రీనివాస్ రావు అన్నారు. జగిత్యాల బ్రాంచ్ ఎల్.ఐ.సి. ఎజెంట్ల ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా సర్వ సభ్య సమావేశం బుధ వారం జగిత్యాల శాఖ అధ్యక్షులు ఆమందు రాజ్ కుమార్ అధ్యక్షతన స్థానిక హోటల్ పి.ఎం.ఆర్ గ్రాండ్ లో జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ఇంచార్జీ అధ్యక్షులు తాళ్లూరి శ్రీనివాస్ రావు మాట్లాడుతూ ఎల్.ఐ.సి. లో పని చేసే ప్రతి ఎజెంట్ కు కనీసం రూ.50 లక్షల భీమా కల్పించాలని పోరాటం చేయడం జరుగుతుందన్నారు. గతంలో కూడా ఎఓఐ పోరాటం చేయడం వల్లనే ఏజెంట్ల కు 15 లక్షల వరకు భీమా సౌకర్యాన్ని సంస్థ కల్పించడం జరిగిందన్నారు. భీమా సుగం రద్దు కొరకు కూడా గతంలో ఏఓఐ ఆధ్వర్యంలో ఐఆర్ డిఎ కార్యాలయం ఎదుట ధర్నా చేయడం వల్లనే భీమా సుగం ను ఐ. ఆర్ డి.ఎ. రద్దు చేయడం జరిగిందని వివరించారు. రాష్ట్ర కోశాధికారి కొత్తపల్లి రామ్ నర్సయ్య మాట్లాడుతూ సంఘం సభ్యత్వం నమోదు, సభ్యత్వ ప్రాముఖ్యత, ఎవోఐ సభ్యత్వం వల్ల కలిగే ప్రయోజనాల గురించి వివరించారు. కరీంనగర్ డివిజన్ కన్వీనర్ పాలమాకుల రాజా బాబురెడ్డి మాట్లాడుతూ ట్రేడ్ యూనియన్ కు అనుబంధంగా జాతీయ లేబర్ ఆక్ట్ ప్రకారం మన సంఘం పని చేస్తుందన్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాలలో ఎల్. ఐ.సి. ఎజెంట్ల ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా ఒకే గొడుగు కింద ఉంటూ.. ఒకే పాన్ కార్డు తో దేశ వ్యాప్తంగా బ్యాంక్ ఖాతాలు, లావాదేవీలు కలిగి ఉండడం జరుగుతుందన్నారు. సభాధ్యక్షులు ఆమందు రాజ్ కుమార్, ప్రధాన కార్యదర్శి రేగొండ లక్ష్మీకాంతం లు
మాట్లాడుతూ గత ఆరు నెలల కాలంలో జగిత్యాల లో ఎఓఐ చేసిన కార్యక్రమాలు, సాధించిన విజయాలు, సేవల గురించి వివరించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు మొగిలిచర్ల భద్రయ్య, డివిజన్ నాయకులు గాదాసు శ్రీనివాస్, జగిత్యాల బ్రాంచ్ కోశాధికారి మహంకాళి ప్రభాకర్, ఉపాధ్యక్షులు చుక్క గంగారెడ్డి, మంచిర్యాల బ్రాంచ్ నాయకులు గంగాధరి తిరుపతి, కె.మహేష్ మాట్లాడారు. స్థానిక కార్యవర్గం, సంఘ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఘనంగా శ్రీ వాణి జూనియర్ కళాశాల ఫేర్వెల్ వేడుకలు
జగిత్యాల ఫిబ్రవరి 10 (ప్రజా మంటలు) జగిత్యాల పట్టణము లోని శ్రీవాణి సహకార జూనియర్ కళాశాల వీడ్కోలు వేడుకలు ఘనంగా నిర్వహించారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు .ఈ సందర్భంగా విద్యార్థులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. గత విద్యా సంవత్సరం ఇంటర్ ప్రథమ సంవత్సరంలో రాష్ట్రస్థాయి ఫలితాలు సాధించిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు.... మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు భద్రతా ఏర్పాట్లు పూర్తి : జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
జగిత్యాల ఫిబ్రవరి 10 (ప్రజా మంటలు)ఎన్నికలు నిర్వహణకు 900 మంది పోలీస్ లతో పటిష్ట బందోబస్తు.
జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల ఎన్నికలను శాంతియుతంగా, స్వేచ్ఛాయుతంగా మరియు నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు జిల్లా పోలీస్ శాఖ అన్ని భద్రతా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధుల్లో భాగంగా పోలీస్ అధికారులు,సిబ్బందితో... దేశవ్యాప్తంగా UPI సేవల్లో అంతరాయం
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 10:
ఈ సాయంత్రం దేశవ్యాప్తంగా UPI ఎలక్ట్రానిక్ చెల్లింపు సేవలు అకస్మాత్తుగా నిలిచిపోయాయి. సుమారు సాయంత్రం 7 గంటల ప్రాంతంలో డబ్బు పంపడం, QR కోడ్ స్కాన్ చేయడం వంటి UPI లావాదేవీలు పనిచేయలేదు.
గూగుల్ పే, ఫోన్పే, పేటీఎం వంటి ప్రధాన చెల్లింపు యాప్లలో సమస్య తలెత్తడంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు... జగిత్యాలలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్కు సర్వం సిద్ధం
జగిత్యాల, ఫిబ్రవరి 10 (ప్రజా మంటలు):
జగిత్యాల జిల్లాలో రేపు జరగనున్న మున్సిపల్ ఎన్నికల పోలింగ్కు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. జగిత్యాల మున్సిపాలిటీ పరిధిలోని 50 వార్డుల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు.
ప్రతి పోలింగ్ కేంద్రానికి ఒక ప్రిసైడింగ్ ఆఫీసర్, ఒక అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్తో పాటు ముగ్గురు ఇతర పోలింగ్ అధికారులను... ధర్మపురిలో ఏం అభివృద్ధి చేశారో చెప్పాలి – మంత్రి లక్ష్మణ్ కుమార్కు కొప్పుల ఈశ్వర్ సవాల్
జగిత్యాల, ఫిబ్రవరి 10 (ప్రజా మంటలు):
మంత్రి లక్ష్మణ్ కుమార్ చేసిన ఆరోపణలపై మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఘాటుగా స్పందించారు. జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడుతూ, ధర్మపురిలో జరిగిన అభివృద్ధి కళ్లకు కనిపించకపోతే తాను ఏం చేయలేనన్నారు.
ధర్మపురి నియోజకవర్గం రాష్ట్రంలోనే అభివృద్ధి చెందిన నియోజకవర్గాల్లో ఒకటని,... జిమ్మీ లైకు 20 ఏళ్ల జైలు – హాంకాంగ్లో పత్రికా స్వేచ్ఛ క్షీణత
హాంకాంగ్ ఫిబ్రవరి 10:చైనా ప్రభుత్వానికి తీవ్ర విమర్శకుడిగా పేరుగాంచిన, హాంకాంగ్కు చెందిన ప్రజాస్వామ్య అనుకూల మీడియా వ్యాపారవేత్త జిమ్మీ లైకు కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఈ తీర్పు హాంకాంగ్లో పత్రికా స్వేచ్ఛ తీవ్రంగా క్షీణిస్తున్నదన్న ఆందోళనలకు మరింత బలం చేకూర్చింది.
యాపిల్ డైలీ పత్రిక వ్యవస్థాపకుడైన జిమ్మీ లై, బీజింగ్... మున్సిపల్ ఎన్నికలు వ్యక్తిగత దూషణలకే పరిమితం : కవిత
హైదరాబాద్, ఫిబ్రవరి 10 (ప్రజా మంటలు):
మున్సిపల్ ఎన్నికల ప్రచారం ప్రజా సమస్యలపై కాకుండా వ్యక్తిగత దూషణలకే పరిమితమైందని తెలంగాణ జాగృతి నాయకురాలు కవిత విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో నీరు, రవాణా, విద్య, వైద్యం వంటి మౌలిక సమస్యలను పూర్తిగా విస్మరించారని ఆరోపించారు.
ప్రెస్మీట్లో ఆమె మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలంటే... ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ కొరకే ఫ్లాగ్ మార్చ్:డిఎస్పి రఘు చందర్
జగిత్యాల ఫిబ్రవరి 9 (ప్రజా మంటలు)ప్రశాంత వాతావరణంలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు అన్ని వర్గాల ప్రజలు పోలీసులకు సహకరించాలి.
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించాలనే లక్ష్యంతో జిల్లా ఎస్పి అశోక్ కుమార్ ఆదేశాల మేరకు జగిత్యాల జిల్లా కేంద్రంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగింది.... అభివృద్ధే అస్త్రం… అధికార పార్టీతోనే జగిత్యాల పురోగతి: ఎమ్మెల్యే సంజయ్ కుమార్
జగిత్యాల – ఫిబ్రవరి 09 (ప్రజా మంటలు):
చేసిన అభివృద్ధి పనులకే ప్రజలు పట్టం కడతారని, ప్రభుత్వంతో కలిసి పనిచేసే ప్రతినిధులను గెలిపిస్తేనే జగిత్యాల అభివృద్ధి సాధ్యమవుతుందని ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల పట్టణంలో నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
యావర్ రోడ్డు విస్తరణకు ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని, 200 కోట్ల... మళ్ళీ సెన్సార్ కు జన నాయకన్ సినిమా: కోర్టులో కేసు ఉపసంహరణ
చెన్నై – ఫిబ్రవరి 09 (ప్రజా మంటలు):
TVK పార్టీ నాయకుడు దలపతి నటించిన ‘జననాయకన్’ చిత్రాన్ని మళ్లీ సెన్సార్ బోర్డుకు పంపాలని చిత్ర నిర్మాతలు నిర్ణయించారు. ఈ నిర్ణయంతో సంబంధించి కోర్టులో పెండింగ్లో ఉన్న కేసును చిత్ర బృందం ఉపసంహరించుకున్నట్లు న్యాయస్థానానికి తెలియజేసింది.
ఇంతవరకు ఉన్న ఈ చిత్ర సెన్సార్ పై ఉన్న సందేహాలను... సీషెల్స్కు 175 మిలియన్ డాలర్ల అభివృద్ధి సహాయం ప్రకటించిన భారత్
న్యూఢిల్లీ – ఫిబ్రవరి 09 (ప్రజా మంటలు):
భారతదేశానికి ఆరు రోజుల అధికారిక పర్యటనకు వచ్చిన సీషెల్స్ అధ్యక్షుడు పాట్రిక్ హెర్మినీతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బహుళ రంగాలపై విస్తృత చర్చలు జరిపారు. ఈ సమావేశాల్లో వాణిజ్యం, ఆర్థిక సహకారం, భద్రతా అంశాలపై పరస్పర సహకారాన్ని మరింత విస్తరించుకోవాలని ఇరుపక్షాలు అంగీకరించాయి.
ఈ చర్చల అనంతరం,... 