ఎల్.ఐ.సి. ని కాపాడేందుకే ఎఓఐ కృషి ఏజెంట్లకు 50 లక్షల భీమా కల్పించాలి రాష్ట్ర ఇంచార్జీ అధ్యక్షులు తాళ్లూరి శ్రీనివాస రావు
ఎల్.ఐ.సి. ని కాపాడేందుకే ఎఓఐ కృషి
ఏజెంట్లకు 50 లక్షల భీమా కల్పించాలి
రాష్ట్ర ఇంచార్జీ అధ్యక్షులు తాళ్లూరి శ్రీనివాస రావు
జగిత్యాల జులై 10 : భారతీయ జీవిత భీమా సంస్థ ను కాపాడుకునేందుకు ఎల్.ఐ.సి. ఎజెంట్స్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా కృషి చేస్తుందని రాష్ట్ర ఇంచార్జీ అధ్యక్షులు తాళ్లూరి శ్రీనివాస్ రావు అన్నారు. జగిత్యాల బ్రాంచ్ ఎల్.ఐ.సి. ఎజెంట్ల ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా సర్వ సభ్య సమావేశం బుధ వారం జగిత్యాల శాఖ అధ్యక్షులు ఆమందు రాజ్ కుమార్ అధ్యక్షతన స్థానిక హోటల్ పి.ఎం.ఆర్ గ్రాండ్ లో జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ఇంచార్జీ అధ్యక్షులు తాళ్లూరి శ్రీనివాస్ రావు మాట్లాడుతూ ఎల్.ఐ.సి. లో పని చేసే ప్రతి ఎజెంట్ కు కనీసం రూ.50 లక్షల భీమా కల్పించాలని పోరాటం చేయడం జరుగుతుందన్నారు. గతంలో కూడా ఎఓఐ పోరాటం చేయడం వల్లనే ఏజెంట్ల కు 15 లక్షల వరకు భీమా సౌకర్యాన్ని సంస్థ కల్పించడం జరిగిందన్నారు. భీమా సుగం రద్దు కొరకు కూడా గతంలో ఏఓఐ ఆధ్వర్యంలో ఐఆర్ డిఎ కార్యాలయం ఎదుట ధర్నా చేయడం వల్లనే భీమా సుగం ను ఐ. ఆర్ డి.ఎ. రద్దు చేయడం జరిగిందని వివరించారు. రాష్ట్ర కోశాధికారి కొత్తపల్లి రామ్ నర్సయ్య మాట్లాడుతూ సంఘం సభ్యత్వం నమోదు, సభ్యత్వ ప్రాముఖ్యత, ఎవోఐ సభ్యత్వం వల్ల కలిగే ప్రయోజనాల గురించి వివరించారు. కరీంనగర్ డివిజన్ కన్వీనర్ పాలమాకుల రాజా బాబురెడ్డి మాట్లాడుతూ ట్రేడ్ యూనియన్ కు అనుబంధంగా జాతీయ లేబర్ ఆక్ట్ ప్రకారం మన సంఘం పని చేస్తుందన్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాలలో ఎల్. ఐ.సి. ఎజెంట్ల ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా ఒకే గొడుగు కింద ఉంటూ.. ఒకే పాన్ కార్డు తో దేశ వ్యాప్తంగా బ్యాంక్ ఖాతాలు, లావాదేవీలు కలిగి ఉండడం జరుగుతుందన్నారు. సభాధ్యక్షులు ఆమందు రాజ్ కుమార్, ప్రధాన కార్యదర్శి రేగొండ లక్ష్మీకాంతం లు
మాట్లాడుతూ గత ఆరు నెలల కాలంలో జగిత్యాల లో ఎఓఐ చేసిన కార్యక్రమాలు, సాధించిన విజయాలు, సేవల గురించి వివరించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు మొగిలిచర్ల భద్రయ్య, డివిజన్ నాయకులు గాదాసు శ్రీనివాస్, జగిత్యాల బ్రాంచ్ కోశాధికారి మహంకాళి ప్రభాకర్, ఉపాధ్యక్షులు చుక్క గంగారెడ్డి, మంచిర్యాల బ్రాంచ్ నాయకులు గంగాధరి తిరుపతి, కె.మహేష్ మాట్లాడారు. స్థానిక కార్యవర్గం, సంఘ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
Sanchar Saathi తప్పనిసరి ప్రీ-ఇన్స్టాలేషన్పై వివాదం — మంత్రి జ్యోతిరాదిత్య సింధియా వివరణ
న్యూ ఢిల్లీ డిసెంబర్ 02 (ప్రజా మంటలు):
భారత ప్రభుత్వం 2026 మార్చి నుంచి మార్కెట్లో అమ్మకానికి వచ్చే అన్ని స్మార్ట్ఫోన్లలో Sanchar Saathi యాప్ను తప్పనిసరిగా ప్రీ-ఇన్స్టాల్ చేయాలని టెలికం శాఖ (DoT) ఇచ్చిన తాజా ఆదేశాలపై దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది. వినియోగదారుల గోప్యత, డిజిటల్ ఫ్రీడమ్, ఫోన్ కంపెనీల విధానాలు వంటి... పర్యావరణ రక్షణలో అందరి భాగస్వామ్యం ఉండాలి
నేడు జాతీయ కాలుష్య నియంత్రణ దినోత్సవం(డిసెంబర్ 2వ తేదీ )
--డాక్టర్. వై. సంజీవ కుమార్, ఫౌండర్ & ప్రెసిడెంట్, స్కై ఫౌండేషన్. 9393613555,9493613555.
సృష్టిలో జీవం మనుగడ తీసుకునే శ్వాస మీద ఆధారపడి ఉంటుంది. ఆ శ్వాస పర్యావరణంపైనా ఆధారపడుతుంది. ఆ పర్యావరణం కాలుష్యం అయితే జీవం మనుగడ ప్రమాదంలో... తెలంగాణ అమరవీరుల స్మరణలో జాగృతి మెగా రక్తదాన శిబిరం
హైదరాబాద్ డిసెంబర్ 02 (ప్రజా మంటలు):
తెలంగాణ అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ, తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో హైదరాబాద్లో భారీ మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్వయంగా రక్తదానం చేసి, ఉద్యమ నాయకులు, కార్యకర్తలు, యువతను ఉత్సాహపరచారు.
కవిత మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర నిర్మాణం... రేపు హుస్నాబాద్లో భారీ కాంగ్రెస్ బహిరంగ సభ
హుస్నాబాద్, డిసెంబర్ 3, 2025 (ప్రజా మంటలు):
హుస్నాబాద్ పట్టణం మరో భారీ కాంగ్రెస్ శక్తి ప్రదర్శనకు సాక్ష్యమవుతోంది. బుధవారం (03-12-2025) జరుగనున్న హుస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధి బహిరంగ సభలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుమల రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు.
సీఎం హోదాలో మొదటిసారి హుస్నాబాద్ వస్తున్న రేవంత్ రెడ్డి, ఏమిస్టారో అని సామాన్యులే... గాంధీ ఆసుపత్రి వద్ద పేదలకు దుప్పట్లు పంపిణీ
సికింద్రాబాద్, డిసెంబర్ 02 (ప్రజా మంటలు):
స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి, వివిధ రాష్ట్రాల మాజీ గవర్నర్ డా. మర్రి చెన్నారెడ్డి 29వ వర్ధంతిని మంగళవారం బన్సీలాల్ పేట డివిజన్ లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మర్రి చెన్నారెడ్డి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి వద్ద పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు.బిజెపి నాయకులు... సరియైన ఆధారాలు లేకుండా పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకెళ్తే సీజ్ చేస్తాము దొంగల మర్రి చెక్పోస్ట్ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
,
మల్యాల డిసెంబర్ 2 ( ప్రజా మంటలు)సరియైన ఆధారాలు లేకుండా పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకెళ్తే సీజ్ చేస్తాము అన్నారు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా వాహన తనిఖీలు ముమ్మరంగా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, తెలిపారు. కొడిమ్యాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జిల్లా... గొల్లపల్లి మండలంలో 6 నామినేషన్ స్వీకరణ కేంద్రాలు
(అంకం భూమయ్య)
గొల్లపల్లి డిసెంబర్ 01 (ప్రజా మంటలు):
పంచాయతి ఎన్నికలు -2025 మండలం లోని మూడవ విడతలో 6 నామినేషన్ల స్వీకరణ కేంద్రాలలో తేది 3 నుండి 5 వరకు సర్పంచి మరియు వార్డు సభ్యులకు 6 కేంద్రాలు ఏర్పాటు చేశారు.
గొల్లపల్లి మండలంలోని 27 గ్రామాలను ఆరు క్లస్టర్లుగా 6 కేంద్రాలు విభజించారు.... బాల్య వివాహాలపై అవగాహన సదస్సు.
ఇబ్రహీంపట్నం డిసెంబర్ 01 (ప్రజా మంటలు దగ్గుల అశోక్):
ఇబ్రహీంపట్నం మండలంలోనీ వర్షకొండ గ్రామంలోని జిల్లా ప్రజా పరిషత్ పాఠశాలలో బాల్య వివాహం అవగాహన సదస్సులు ఏర్పాటు చేయడం జరిగింది.మహిళా సాధికారత కేంద్రం సిబ్బంది హేమశ్రీ మాట్లాడుతూ గ్రామ సభ్యులకు,పాఠశాల విద్యార్థులకు, మరియు తల్లులకు,కిశోర బాలికలకు బాల్య వివాహాల వల్ల జరిగే నష్టాల గురించి... ఫ్రీడమ్ సన్ ఫ్లవర్ ఆయిల్ కంపెనీ ఆధ్వర్యంలో కొండగట్టు అగ్ని ప్రమాద బాధితులకు చేయూత...
కొండగట్టు డిసెంబర్ 1(ప్రజా మంటలు)ఫ్రీడమ్ సన్ ఫ్లవర్ ఆయిల్ కంపెనీ ఆధ్వర్యంలో కొండగట్టు అగ్ని ప్రమాద బాధితులకు సోమవారం రూపాయలు 40 వేల విలువగల దుస్తువులను కంపెనీ ప్రతినిధులు అందజేశారు.
ఈ సందర్బంగా కంపెనీ ASM రమేష్ కుమార్ , CFA ఏజెంట్ వూటూరి నవీన్ కుమార్ మాట్లాడుతూ రెండు రోజుల క్రితం కొండగట్టులోని... హెచ్ఐవీ బాధితులు ఆందోళన చెందొద్దు : సూపరింటెండెంట్ డాక్టర్ వాణి
గాంధీ ఏఆర్టీ సెంటర్ లో అందుబాటులో చక్కటి వైద్యం
సికింద్రాబాద్, డిసెంబర్ 01 (ప్రజామంటలు) : ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా గాంధీ ఆసుపత్రిలోని జనరల్ మెడిసిన్ విభాగం,ఎ.ఆర్.టి. సెంటర్ ఆధ్వర్యంలో సోమవారం వరల్డ్ ఎయిడ్స్ డే ర్యాలీ, అవేర్నెస్ నిర్వహించారు. ముఖ్య అతిథిగా సూపరింటెండెంట్ డాక్టర్ ఎన్ వాణి హాజరయ్యారు.
అనంతరం ఎ ఆర్... మొబైల్ ఫోన్ పోతే సంబదిత పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేయండి: : జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
జగిత్యాల డిసెంబర్ 1 (ప్రజా మంటలు)
మొబైల్ ఫోన్ పోయిన,చోరికి గురైనా www.ceir.gov.in CEIR అప్లికేషన్ సద్వినియోగం చేసుకోవాలి
జిల్లా పరిధిలో పోగొట్టుకున్న, చోరికి గురైన 28 లక్షల విలువగల 136 మొబైల్ ఫోన్లను బాధితులకు అందజేత.
సెల్ ఫోన్ పోయిన, చోరీకి గురైన ఆందోళన చెందవద్దని CEIR ద్వారా తిరిగి పొందవచ్చని జిల్లా ఎస్పీ... ఇది ప్రభుత్వ భూమి..ఆక్రమిస్తే చర్యలు తప్పవు : ఐడీహెచ్ కాలనీలో బోర్డు పెట్టిన రెవిన్యూ సిబ్బంది
సికింద్రాబాద్, డిసెంబర్ 01 (ప్రజామంటలు):బన్సీలాల్ పేట డివిజన్ న్యూ బోయిగూడా ఐడిహెచ్ కాలనీ లోని ఉన్న భూమి ప్రభుత్వానికి చెందినదని స్పష్టంచేస్తూ సికింద్రాబాద్ తహాసీల్దార్ కార్యాలయ సిబ్బంది సోమవారం హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు.
ఈ భూమి ప్రభుత్వానికి చెందిన భూమి...అక్రమంగా ఆక్రమించే వారికి కఠిన చర్యలు తప్పవు.. అని బోర్డుపై పేర్కొన్నారు. సదరు... 