ఎల్.ఐ.సి. ని కాపాడేందుకే ఎఓఐ కృషి ఏజెంట్లకు 50 లక్షల భీమా కల్పించాలి రాష్ట్ర ఇంచార్జీ అధ్యక్షులు తాళ్లూరి శ్రీనివాస రావు

On
ఎల్.ఐ.సి. ని కాపాడేందుకే ఎఓఐ కృషి ఏజెంట్లకు 50 లక్షల భీమా కల్పించాలి రాష్ట్ర ఇంచార్జీ అధ్యక్షులు తాళ్లూరి శ్రీనివాస రావు

ఎల్.ఐ.సి. ని కాపాడేందుకే ఎఓఐ కృషి
ఏజెంట్లకు 50 లక్షల భీమా కల్పించాలి
రాష్ట్ర ఇంచార్జీ అధ్యక్షులు తాళ్లూరి శ్రీనివాస రావు


జగిత్యాల జులై 10 : భారతీయ జీవిత భీమా సంస్థ ను కాపాడుకునేందుకు ఎల్.ఐ.సి. ఎజెంట్స్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా కృషి చేస్తుందని రాష్ట్ర ఇంచార్జీ అధ్యక్షులు తాళ్లూరి శ్రీనివాస్ రావు అన్నారు. జగిత్యాల బ్రాంచ్ ఎల్.ఐ.సి. ఎజెంట్ల ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా సర్వ సభ్య సమావేశం బుధ వారం జగిత్యాల శాఖ అధ్యక్షులు ఆమందు రాజ్ కుమార్ అధ్యక్షతన స్థానిక హోటల్ పి.ఎం.ఆర్ గ్రాండ్ లో జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ఇంచార్జీ అధ్యక్షులు తాళ్లూరి శ్రీనివాస్ రావు మాట్లాడుతూ ఎల్.ఐ.సి. లో పని చేసే ప్రతి ఎజెంట్ కు కనీసం రూ.50 లక్షల భీమా కల్పించాలని పోరాటం చేయడం జరుగుతుందన్నారు. గతంలో కూడా ఎఓఐ పోరాటం చేయడం వల్లనే ఏజెంట్ల కు 15 లక్షల వరకు భీమా సౌకర్యాన్ని సంస్థ కల్పించడం జరిగిందన్నారు. భీమా సుగం రద్దు కొరకు కూడా గతంలో ఏఓఐ ఆధ్వర్యంలో ఐఆర్ డిఎ కార్యాలయం ఎదుట ధర్నా చేయడం వల్లనే భీమా సుగం ను ఐ. ఆర్ డి.ఎ. రద్దు చేయడం జరిగిందని వివరించారు. రాష్ట్ర కోశాధికారి కొత్తపల్లి రామ్ నర్సయ్య మాట్లాడుతూ సంఘం సభ్యత్వం నమోదు,  సభ్యత్వ ప్రాముఖ్యత, ఎవోఐ సభ్యత్వం వల్ల కలిగే ప్రయోజనాల గురించి వివరించారు. కరీంనగర్ డివిజన్ కన్వీనర్ పాలమాకుల రాజా బాబురెడ్డి మాట్లాడుతూ ట్రేడ్ యూనియన్ కు అనుబంధంగా జాతీయ లేబర్ ఆక్ట్ ప్రకారం మన సంఘం పని చేస్తుందన్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాలలో ఎల్. ఐ.సి. ఎజెంట్ల ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా ఒకే గొడుగు కింద ఉంటూ.. ఒకే పాన్ కార్డు తో దేశ వ్యాప్తంగా బ్యాంక్ ఖాతాలు, లావాదేవీలు కలిగి ఉండడం జరుగుతుందన్నారు. సభాధ్యక్షులు ఆమందు రాజ్ కుమార్, ప్రధాన కార్యదర్శి రేగొండ లక్ష్మీకాంతం లు
మాట్లాడుతూ గత ఆరు నెలల కాలంలో జగిత్యాల లో ఎఓఐ చేసిన కార్యక్రమాలు, సాధించిన విజయాలు, సేవల గురించి వివరించారు.


ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు మొగిలిచర్ల భద్రయ్య, డివిజన్ నాయకులు గాదాసు శ్రీనివాస్, జగిత్యాల బ్రాంచ్ కోశాధికారి మహంకాళి ప్రభాకర్, ఉపాధ్యక్షులు చుక్క గంగారెడ్డి, మంచిర్యాల బ్రాంచ్ నాయకులు గంగాధరి తిరుపతి, కె.మహేష్ మాట్లాడారు.  స్థానిక కార్యవర్గం, సంఘ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Tags
Join WhatsApp

More News...

State News 

ఎన్నికల లబ్ది కోసమే  ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్‌కు సిట్ నోటీసులు : కవిత 

ఎన్నికల లబ్ది కోసమే  ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్‌కు సిట్ నోటీసులు : కవిత  హైదరాబాద్, జనవరి 29 (ప్రజా మంటలు): ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్‌కు సిట్ నోటీసులు జారీ చేయడంపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పందించారు. ఎన్నికలు ఉన్నందునే కేసీఆర్ గారికి నోటీసులు ఇచ్చారని ఆమె వ్యాఖ్యానించారు. ఫోన్ ట్యాపింగ్ వంటి అత్యంత బాధాకరమైన అంశంపై ప్రభుత్వం నిజంగా సీరియస్‌గా లేదని అన్నారు....
Read More...
Local News 

ప్రభుత్వ ఖర్చులతో స్వదేశానికి చేరిన గల్ఫ్ కార్మికుని మృతదేహం

ప్రభుత్వ ఖర్చులతో స్వదేశానికి చేరిన గల్ఫ్ కార్మికుని మృతదేహం హైదరాబాద్, జనవరి 29 – ప్రజా మంటలు. ఓమాన్‌లో మృతి చెందిన నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం యాంచా గ్రామానికి చెందిన గల్ఫ్ కార్మికుడు గొల్ల అబ్బులు మృతదేహం తెలంగాణ ప్రభుత్వ ఖర్చులతో హైదరాబాద్‌కు చేరింది. డిసెంబర్ 9న ‘ఇబ్రి’ ఎడారిలో మృతి చెందిన ఆయన మృతదేహం 52 రోజుల అనంతరం స్వదేశానికి వచ్చింది. కుటుంబం...
Read More...
Crime  State News 

ఫోన్ ట్యాపింగ్ కేసు: మాజీ సీఎం కేసీఆర్‌కు సిట్ నోటీసులు

ఫోన్ ట్యాపింగ్ కేసు: మాజీ సీఎం కేసీఆర్‌కు సిట్ నోటీసులు హైదరాబాద్, జనవరి 29 – ప్రజా మంటలు. తెలంగాణలో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) కు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు సిట్ అధికారులు నందినగర్‌లోని కేసీఆర్ నివాసానికి వెళ్లి నోటీసులు అందజేశారు. నోటీసుల్లో భాగంగా,...
Read More...
Local News  State News 

జాతీయ జనగణనలో బీసీలను పక్కన పెట్టే కుట్ర – రౌండ్ టేబుల్ సమావేశంలో తీవ్ర విమర్శలు

జాతీయ జనగణనలో బీసీలను పక్కన పెట్టే కుట్ర – రౌండ్ టేబుల్ సమావేశంలో తీవ్ర విమర్శలు కేంద్ర ప్రభుత్వ డాక్యుమెంట్ ప్రమాదకరం : కల్వకుంట్ల కవిత
Read More...
Local News  State News 

కులగణనలో బీసీలకు కేంద్రం ద్రోహం : కల్వకుంట్ల కవిత

కులగణనలో బీసీలకు కేంద్రం ద్రోహం : కల్వకుంట్ల కవిత హైదరాబాద్, జనవరి 29  (ప్రజా మంటలు): దేశవ్యాప్తంగా జరుగుతున్న జనగణన–కులగణన ప్రక్రియలో కేంద్ర ప్రభుత్వం బీసీలకు తీవ్ర అన్యాయం చేస్తోందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు. జాతీయ జనగణనలో కులగణనపై సమగ్ర చర్చ కోసం నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆమె ప్రసంగించారు. బిసి కాలం తొలగించడం అన్యాయం పదేళ్లకు ఒకసారి జరగాల్సిన...
Read More...

ఎమ్మెల్యే సంజయ్ అవినీతితో జగిత్యాల మున్సిపాలిటీ బ్రష్టు : మాజీ మంత్రి జీవన్ రెడ్డి

ఎమ్మెల్యే సంజయ్ అవినీతితో జగిత్యాల మున్సిపాలిటీ బ్రష్టు : మాజీ మంత్రి జీవన్ రెడ్డి జగిత్యాల, జనవరి 28 (ప్రజా మంటలు): జగిత్యాల మున్సిపాలిటీని ఎమ్మెల్యే సంజయ్ అవినీతి, అక్రమాలతో బ్రష్టు పట్టించారని మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి ఆరోపించారు. ఇందిరా భవన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గత ఐదేళ్లలో 16 మంది కమిషనర్లు మారటం, 8 మంది ఉద్యోగులు జైలు పాలవడం, ఏసీబీ–విజిలెన్స్ దాడులే ఎమ్మెల్యే...
Read More...
State News 

మున్సిపల్ ఎన్నికల్లో సింహం గుర్తుపై తెలంగాణ జాగృతి అభ్యర్థుల పోటీ

మున్సిపల్ ఎన్నికల్లో సింహం గుర్తుపై తెలంగాణ జాగృతి అభ్యర్థుల పోటీ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్‌తో కలిసి ముందుకు వెళ్లాలని నిర్ణయం హైదరాబాద్, జనవరి 28 (ప్రజా మంటలు): రానున్న మున్సిపల్ ఎన్నికల్లో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ ‘సింహం’ గుర్తుపై తెలంగాణ జాగృతి ఔత్సాహిక అభ్యర్థులు పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయాన్ని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సమక్షంలో ఆల్ ఇండియా...
Read More...
Today's Cartoon 

Today's Cartoon

Today's Cartoon Today's Cartoon
Read More...

ఎన్నికల నియమవళి పక్కాగా అమలు చేయాలి నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్

ఎన్నికల నియమవళి పక్కాగా అమలు చేయాలి  నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ మెట్పల్లి/కోరుట్ల జనవరి 28 (ప్రజా మంటలు)మెట్ పెల్లి మరియు కోరుట్ల మున్సిపాలిటీల్లో జరుగుతున్న నామినేషన్ల ప్రక్రియను జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ సజావుగా, పారదర్శకంగా జరుగుతోందా లేదా అనే విషయాన్ని స్వయంగా పరిశీలించారు.నామినేషన్లు దాఖలు చేసేందుకు వచ్చిన అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా...
Read More...

గోదావరి పుష్కరాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి దేవదాయ శాఖ ప్రధాన కార్యదర్శి శైలజా రామయ్యర్

గోదావరి పుష్కరాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి  దేవదాయ శాఖ ప్రధాన కార్యదర్శి శైలజా రామయ్యర్ జగిత్యాల జనవరి 28 ( ప్రజా మంటలు)2027 లో  గోదావరి పుష్కరాలు జరుగనున్న నేపథ్యంలో పుష్కరాలను పకడ్బందీగా నిర్వహించే క్రమంలో బుధవారం జిల్లా కలెక్టర్ లు మరియు సంబందిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జగిత్యాల జిల్లా నుండి జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ పాల్గొన్నారు.  ఈ సందర్బంగా దేవదాయ శాఖ ప్రధాన కార్యదర్శి...
Read More...

శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రిక ధర్మపురి సిఐ కి అందజేత

శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రిక ధర్మపురి సిఐ కి అందజేత వెల్గటూరు జనవరి 28 (ప్రజా మంటలు) జక్కాపురం నారాయణస్వామి వెలగటూరుధర్మపురి సిఐ ఏ. నరసింహ రెడ్డి నీ మర్యాద పూర్వకం గా కలిసి శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకీ ఆహ్వానం అందించిన ఆలయ చైర్మన్ చింతల రాజయ్య,సర్పంచ్ భూపల్లి రాజయ్య,ఉపసర్పంచ్ యాగండ్ల గంగయ్య, ప్రధాన అర్చకులు పవన్ కుమార్ ,హరి ప్రశాంత్,   ఈ కార్యక్రమం...
Read More...

ఈనెల 30న వెలగటూర్ మండల స్థాయి ( సీఎం కప్) సెకండ్ ఎడిషన్ సెలక్షన్స్

ఈనెల 30న వెలగటూర్ మండల స్థాయి ( సీఎం కప్) సెకండ్ ఎడిషన్ సెలక్షన్స్    వెల్గటూర్ జనవరి 28 ( ప్రజా మంటలు) జక్కాపురం నారాయణస్వామి వెల్గటూర్మండల స్థాయి సీఎం కప్ (సెకండ్ ఎడిషన్)  సెలక్షన్స్ తేదీ 30 జనవరి 2026 శుక్రవారం రోజున జడ్.పి.హెచ్.ఎస్ వెల్గటూర్ లో నిర్వహించబడతాయని ఎంఈఓ బోనగిరి ప్రభాకర్  తెలిపారు. మండలంలోని అన్ని గ్రామాల క్రీడాకారిని మరియు క్రీడాకారులు తమ వెంట రిజిస్ట్రేషన్ చేసుకున్న...
Read More...