ఉపాధ్యాయుల అక్రమ స్పాస్ బదిలీలపై చర్యలు తీసుకోవాలి తపస్ డిమాండ్
ఉపాధ్యాయుల అక్రమ స్పాస్ బదిలీలపై చర్యలు తీసుకోవాలి తపస్ డిమాండ్
జగిత్యాల జులై 07 (ప్రజా మంటలు)
ఇటీవల జరిగిన ఉపాధ్యాయ బదిలీల్లో వివిధ క్యాడర్లలో ప్రత్యేక కేటగిరీ కింద పలువురు ఉపాధ్యాయులు తప్పుడు విధానాలతో జిల్లా కేంద్రానికి సమీపాన బదిలీ ఉత్తర్వులు పొందినారని నిబంధనలకు విరుద్ధంగా వీరి బదిలీలు జరిగాయని స్పోస్ మరియు ప్రత్యేక కేటగిరి బదిలీలన్నిటిని పరిశీలించి సదరు ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం జిల్లా శాఖ కోరింది ఈ మేరకు జిల్లా విద్యాధికారి బి జగన్మోహన్ రెడ్డికి వినతి పత్రం సమర్పించింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పాఠశాల విద్యాశాఖ సూచించిన నియమ నిబంధన ప్రకారం స్పోస్ కేటగిరి కింద బదిలీ ఉత్తర్వులు పొందాలంటే భార్య కాని భర్త గాని పనిచేసే చోటు నుండి మొదలుపెట్టి పాఠశాలలకు ఆప్షన్స్ ఇవ్వాలని ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ కొందరు ఉపాధ్యాయులు ఆన్లైన్లో బదిలీలు కదా అని ఎవరు చూస్తారులే అని తమ ఇష్టం వచ్చినట్టు ఆప్షన్స్ పెట్టుకొని నిబంధనలకు విరుద్ధంగా పట్టణ ప్రాంతాలలో బదిలీ ఉత్తర్వులు పొందారని వారు వివరించారు. బుగ్గారం మండలంలో పనిచేస్తున్న ఒక ఎస్జీటీ ఉపాధ్యాయిని తన యొక్క భర్త అదే మండలంలో పనిచేస్తున్నప్పటికి అక్కడ ఖాళీలు ఉన్నప్పటికీ ,వాటిని ఆప్షన్స్ పెట్టుకోకుండా జిల్లా కేంద్రానికి సమీపంలోని పాఠశాలలను ఎంచుకొని అక్రమంగా బదిలీ ఉత్తర్వులు పొందినారని వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.. ఇలా మరికొందరు ఇలాంటి ఉత్తర్వులు పొందినట్లు తెలుస్తోంది. అలాగే ఉపాధ్యాయుల అన్ని క్యాడర్లలో జరిపిన ప్రత్యేక కేటగిరిలో పొందిన బదిలీ ఉత్తర్వులన్నిటిని పరిశీలించాలని అవకతవకలకు పాల్పడ్డ ఉపాధ్యాయులను శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తపస్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బోనగిరి దేవయ్య బోయినిపెల్లి ప్రసాదరావు రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడుఅయిల్నేని నరేందర్ రావు రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఓడ్నాల రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు...
More News...
<%- node_title %>
<%- node_title %>
“భారతం తటస్థం కాదు… శాంతి పక్షాన ఉంది” – ఉక్రెయిన్ యుద్ధంపై మోదీ–పుటిన్ కీలక సందేశం
రెడ్ కార్పెట్ స్వాగతం – రాజ్ఘాట్ నివాళలు
మోదీ–పుతిన్ కీలక సందేశాలు
23వ భారత్–రష్యా వార్షిక సమ్మిట్
న్యూఢిల్లీ, డిసెంబర్ 05 (ప్రజా మంటలు):రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుటిన్ భారత్ పర్యటన రెండో రోజు కీలక దశలోకి ప్రవేశించింది. ప్రధాని నరేంద్ర మోదీతో జరిగిన ద్వైపాక్షిక సమావేశంలో ఉక్రెయిన్ యుద్ధం, రక్షణ సహకారం,... చెరువుల పరిరక్షణ, వైద్య సేవల లోపాలు సరిచేయండి : కవిత డిమాండ్
హైదరాబాద్, డిసెంబర్ 05 (ప్రజా మంటలు):
జాగృతి జనంబాటలో భాగంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గాన్ని సందర్శించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కీలక సమస్యలను పరిశీలించారు. షాపూర్ నగర్లోని అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ (UPHC) లో సేవల లోపాలను గుర్తించి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం పరికి చెరువు కబ్జాలపై ఘాటుగా స్పందించారు.... గాంధీనగర్ సర్పంచ్ ఏకగ్రీవం పట్ల మంత్రి పొన్నం ప్రభాకర్ అభినందనలు
గాంధీనగర్ సర్పంచ్ ఏకగ్రీవం పట్ల మంత్రి పొన్నం ప్రభాకర్ అభినందనలు
భీమదేవరపల్లి, డిసెంబర్ 5 (ప్రజామంటలు) :
గాంధీనగర్ గ్రామ సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నుకోబడిన కేతిరి లక్ష్మారెడ్డి శుక్రవారం హైదరాబాద్లో రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణాశాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ను మర్యాద పూర్వకంగా కలిసి అభివాదం చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ,... హయత్నగర్లో కిలాడీ లేడీ అరెస్ట్ – ఎనిమిది బ్లాక్మెయిల్ కేసులు
హైదరాబాద్ డిసెంబర్ 05 (ప్రజా మంటలు):
పురుషులను వ్యాపారం పేరుతో ట్రాప్ చేసి, సన్నిహితంగా ఉన్న సందర్భాలను రహస్యంగా చిత్రీకరించి, ఆ తర్వాత భారీ మొత్తాలు డిమాండ్ చేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్న ఒక కిలాడీ లేడీని హయత్నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు.
పోలీసుల సమాచారం ప్రకారం, రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఈ మహిళపై ఇప్పటికే ఎనిమిది... భీం రెడ్డి గూడెం , నాయకపు గూడెం, గ్రామపంచాయతీ ఏకగ్రీవ పాలకవర్గాలను అభినందించిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
సారంగాపూర్ డిసెంబర్ 5(ప్రజా మంటలు)మండల భీం రెడ్డి గూడెం,నాయకపు గూడెం గ్రామపంచాయతీ ఎన్నికల్లో నామినేషన్ పూర్తయి సర్పంచ్ ఉపసర్పంచ్ వార్డ్ సభ్యులకు ఒక్కో నామినేషన్ రాగా నూతన పాలకవర్గం ఏకగ్రీవంగా ఎన్నిక శుక్రవారం జగిత్యాలలో ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ ని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలవగా నూతన పాలకవర్గం సర్పంచ్... అంబేద్కర్ విగ్రహానికి నివాళులతో ముత్తారంలో ఉరడి భారతి ప్రచారానికి శ్రీకారం
అంబేద్కర్ విగ్రహానికి నివాళులతో ముత్తారంలో ఉరడి భారతి ప్రచారానికి శ్రీకారం
* అభయాంజనేయ ఆశీస్సులతో ప్రచార ప్రారంభం – సర్పంచ్ అభ్యర్థి ఊరడి భారతి జైపాల్ రెడ్డి
భీమదేవరపల్లి, డిసెంబర్ 5 (ప్రజామంటలు):
ముత్తారం గ్రామ సర్పంచ్ అభ్యర్థి ఊరడి భారతి జైపాల్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని ఉదృతంగా ప్రారంభించారు. శుక్రవారం ఉదయం ఆయన కుటుంబ... ఆదిలాబాద్ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు – సీఎం రేవంత్ రెడ్డి
ఆదిలాబాద్ డిసెంబర్ 04 (ప్రజా మంటలు):
ఆదిలాబాద్ జిల్లాను రాష్ట్రంలోనే అత్యంత అభివృద్ధి చెందిన జిల్లాగా మార్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజా పాలన – ప్రజా విజయోత్సవాల భాగంగా ఆదిలాబాద్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసి బహిరంగ సభలో మాట్లాడారు.
తుమ్మిడిహట్టి వద్ద ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు... IndiGo సంక్షోభం: దేశవ్యాప్తంగా 175 ఫ్లైట్లు రద్దు — బెంగళూరులో ఒక్కరోజులో 73 రద్దు
బెంగళూరు, డిసెంబర్ 04 (ప్రజా మంటలు):
దేశంలో అతి పెద్ద ఎయిర్లైన్ అయిన ఇండిగోలో కొనసాగుతున్న సిబ్బంది కొరత తీవ్ర ప్రభావం చూపుతోంది. డిసెంబర్ 4 ఉదయం నాటికి దేశవ్యాప్తంగా మొత్తం 175 ఇండిగో ఫ్లైట్లు రద్దయ్యాయి. వీటిలో బెంగళూరు కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఒక్కరోజులోనే 73 ఫ్లైట్లు రద్దు కావడంతో ప్రయాణికులు తీవ్ర... చెరువులు, ఫ్లైఓవర్, ఎస్టీపీ—ప్రజా సమస్యలపై కవిత ఘాటు వ్యాఖ్యలు
హైదరాబాద్/మేడ్చల్–మల్కాజిగిరి (ప్రజా మంటలు):
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత జనం బాట కార్యక్రమంలో భాగంగా మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలో పలు ప్రాంతాలను సందర్శించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను దగ్గరగా పరిశీలించి, ప్రభుత్వం మరియు ప్రజా ప్రతినిధుల వైఖరిపై ఘాటుగా వ్యాఖ్యానించారు.
రామంతపూర్: ఐలమ్మ విగ్రహానికి నివాళులు – చెరువు పరిశీలన
కవిత రామంతపూర్ ఇందిరానగర్లోని చాకలి... ఘనంగా ముగిసిన గురు చరిత్ర పారాయణం
జగిత్యాల డిసెంబర్ 4 (ప్రజా మంటలు)దత్త జయంతి పురస్కరించుకొని స్థానిక షిరిడి సాయి మందిరంలో గత వారం రోజులుగా కొనసాగుతున్న గురు చరిత్ర పారాయణం గురువారం ముగిసింది. ప్రముఖ పౌరాణిక పండితులు సభాపతి బ్రహ్మశ్రీ తిగుళ్ల విశు శర్మ, రాజేశ్వర శర్మ, వైదిక కార్యక్రమ క్రతువు నిర్వహించారు.
సామూహిక పంచామృత అభిషేకం, అష్టోత్తర శతనామార్చన,... పలు వార్డుల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
జగిత్యాల డిసెంబర్ 4( ప్రజా మంటలు)జగిత్యాల పట్టణ కొత్త బస్టాండ్ నుండి నర్సింగ్ కళాశాల రోడ్డులో 1 కోటి రూపాయలతో డ్రైనేజీ ,20వ వార్డులో 20 లక్షలతో డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన జగిత్యాల శాసనసభ్యులు డా సంజయ్ కుమార్
ఈ కార్యక్రమంలో కమిషనర్ స్పందన డిఈ ఆనంద్ కె డి సి... బాబ్రీ మసీదు వ్యాఖ్యలతో వివాదం – తృణమూల్ ఎమ్మెల్యే హుమాయున్ కబీర్పై సస్పెన్షన్
కోల్కతా, డిసెంబర్ 04 (ప్రజా మంటలు):
బెంగాల్లో బాబ్రీ మసీదు పునాది వేస్తామని చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో తీవ్ర విమర్శలకు గురైన తృణమూల్ కాంగ్రెస్ (TMC) ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ పై పార్టీ కఠిన చర్యలు తీసుకుంది. భరత్పూర్ నియోజకవర్గానికి చెందిన ఈ ఎమ్మెల్యేను పార్టీ అధికారికంగా సస్పెండ్ చేసినట్లు TMC ప్రకటించింది.
హుమాయున్ కబీర్... 