ఉపాధ్యాయుల అక్రమ స్పాస్ బదిలీలపై చర్యలు తీసుకోవాలి తపస్ డిమాండ్
ఉపాధ్యాయుల అక్రమ స్పాస్ బదిలీలపై చర్యలు తీసుకోవాలి తపస్ డిమాండ్
జగిత్యాల జులై 07 (ప్రజా మంటలు)
ఇటీవల జరిగిన ఉపాధ్యాయ బదిలీల్లో వివిధ క్యాడర్లలో ప్రత్యేక కేటగిరీ కింద పలువురు ఉపాధ్యాయులు తప్పుడు విధానాలతో జిల్లా కేంద్రానికి సమీపాన బదిలీ ఉత్తర్వులు పొందినారని నిబంధనలకు విరుద్ధంగా వీరి బదిలీలు జరిగాయని స్పోస్ మరియు ప్రత్యేక కేటగిరి బదిలీలన్నిటిని పరిశీలించి సదరు ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం జిల్లా శాఖ కోరింది ఈ మేరకు జిల్లా విద్యాధికారి బి జగన్మోహన్ రెడ్డికి వినతి పత్రం సమర్పించింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పాఠశాల విద్యాశాఖ సూచించిన నియమ నిబంధన ప్రకారం స్పోస్ కేటగిరి కింద బదిలీ ఉత్తర్వులు పొందాలంటే భార్య కాని భర్త గాని పనిచేసే చోటు నుండి మొదలుపెట్టి పాఠశాలలకు ఆప్షన్స్ ఇవ్వాలని ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ కొందరు ఉపాధ్యాయులు ఆన్లైన్లో బదిలీలు కదా అని ఎవరు చూస్తారులే అని తమ ఇష్టం వచ్చినట్టు ఆప్షన్స్ పెట్టుకొని నిబంధనలకు విరుద్ధంగా పట్టణ ప్రాంతాలలో బదిలీ ఉత్తర్వులు పొందారని వారు వివరించారు. బుగ్గారం మండలంలో పనిచేస్తున్న ఒక ఎస్జీటీ ఉపాధ్యాయిని తన యొక్క భర్త అదే మండలంలో పనిచేస్తున్నప్పటికి అక్కడ ఖాళీలు ఉన్నప్పటికీ ,వాటిని ఆప్షన్స్ పెట్టుకోకుండా జిల్లా కేంద్రానికి సమీపంలోని పాఠశాలలను ఎంచుకొని అక్రమంగా బదిలీ ఉత్తర్వులు పొందినారని వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.. ఇలా మరికొందరు ఇలాంటి ఉత్తర్వులు పొందినట్లు తెలుస్తోంది. అలాగే ఉపాధ్యాయుల అన్ని క్యాడర్లలో జరిపిన ప్రత్యేక కేటగిరిలో పొందిన బదిలీ ఉత్తర్వులన్నిటిని పరిశీలించాలని అవకతవకలకు పాల్పడ్డ ఉపాధ్యాయులను శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తపస్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బోనగిరి దేవయ్య బోయినిపెల్లి ప్రసాదరావు రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడుఅయిల్నేని నరేందర్ రావు రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఓడ్నాల రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు...
More News...
<%- node_title %>
<%- node_title %>
ఎమ్మెల్సీ బలుమూరు వెంకట్ ,సారయ్య తో కలిసి పలు వార్డుల కార్నర్ మీటింగ్లో పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్
జగిత్యాల ఫిబ్రవరి 8 (ప్రజా మంటలు)పట్టణ 12వ వార్డులో బోయినపల్లి ప్రశాంత్ రావు 37వ వార్డులో కల్లెడ సునీత రాజేంద్ర ప్రసాద్ 39వ వార్డులో బొలుసాని శ్రీనివాస్,23వ వార్డు రంగు ఉష శ్రీ మహేష్ ,4వ వార్డు క్యాదసు నవీన్ కి మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్... ఫుట్పాత్ అనాధలకు 294వ అన్నదానం
సికింద్రాబాద్, ఫిబ్రవరి 08 (ప్రజామంటలు):
హైదరాబాద్ నగరంలో ఫుట్పాత్లపై జీవనం సాగిస్తూ ఆకలితో అలమటిస్తున్న అనాథలు, నిరాశ్రయులు, సంచారజాతుల కుటుంబాలకు స్కై ఫౌండేషన్ మరోసారి సేవా హస్తం అందించింది. నగరంలోని పలు ప్రాంతాల్లో సంస్థ ఆధ్వర్యంలో 294వ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో వందలాది మంది పేదలు భోజనం స్వీకరించారు. సమాజంలోని అట్టడుగు వర్గాలకు... గ్యారంటీల పేర మోసం చేసిన కాంగ్రెస్ ను ఓడించండి - కొప్పుల ఈశ్వర్
ధర్మపురి, ఫిబ్రవరి 08 (ప్రజా మంటలు):
ధర్మపురి మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ గారు 15, 4, 7, 9, 8, 1 వార్డుల బీఆర్ఎస్ అభ్యర్థుల తరఫున విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 420 హామీలు, ఆరు గ్యారెంటీల పేరుతో తెలంగాణ ప్రజలను... ఎన్నికల ప్రచారం ముగిసిన అనంతరం మున్సిపల్ పరిధిలో ఓటరు కానీ వ్యక్తులు ఉండరాదు: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
జగిత్యాల ఫిబ్రవరి 8 ( ప్రజా మంటలు) ప్రచారం ముగిసిన అనంతరం సంబంధిత మున్సిపల్ పరిధిలో ఓటర్లు కాని వ్యక్తులు ఎవరూ ఉండరాదని జిల్లా ఎస్పీ స్పష్టం చేశారు.
ఎన్నికల నిబంధనల ప్రకారం, ప్రచార గడువు ముగిసిన తర్వాత ఇతర ప్రాంతాలకు చెందిన రాజకీయ కార్యకర్తలు, మద్దతుదారులు, ప్రచారకులు మున్సిపల్ పరిధిని తక్షణమే విడిచి వెళ్లాలని... జగిత్యాల 9వ వార్డులో బిజెపి అభ్యర్థిగా బొందు కూరి అనంతలక్ష్మి శ్రీనివాస్ ప్రచారం
జగిత్యాల ఫిబ్రవరి 8 (ప్రజా మంటలు) మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా జగిత్యాల తొమ్మిదవ వార్డ్ బిజెపి అభ్యర్థిగా బొందుకూరి అనంతలక్ష్మి శ్రీనివాస్ ఇంటింట ప్రచారం చేశారు. ఈ సందర్భంగా తమ అమూల్యమైన ఓటు వేసి దీవించాలని ప్రజల్ని అభ్యర్థించారు. వార్డు అభివృద్ధిలో ముందుండి తన వంతు సేవలు అందిస్తానని తెలిపారు. ప్రచార కార్యక్రమంలో పలువురు... సిక్కింలో స్వల్ప భూకంపం
సిక్కిం ఫిబ్రవరి 08:
సిక్కిం రాష్ట్రంలో నిన్న సాయంత్రం 4.7 తీవ్రతతో భూకంపం సంభవించింది. గ్యాంగ్టాక్ సమీప ప్రాంతమే ఎపిసెంటర్గా గుర్తించారు. భూకంపం కారణంగా సిక్కిం తో పాటు ఉత్తర బెంగాల్, నేపాల్ సరిహద్దు ప్రాంతాల్లో స్వల్ప కంపనలు నమోదయ్యాయి.
ప్రస్తుతం ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం లేదు. అధికారులు అప్రమత్తమై... సంత్ సేవాలాల్ 287వ జయంతి పోస్టర్ ఆవిష్కరణ
హైదరాబాద్ – ఫిబ్రవరి 08 (ప్రజా మంటలు):
ఈ నెల 15న నిర్వహించనున్న బంజారా జాతి ఆరాధ్యదైవం, మూలపురుషుడు సంత్ శ్రీ సేవాలాల్ మాహారాజ్ 287వ జయంతి వేడుకల పోస్టర్ను తెలంగాణ జాగృతి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎల్. రూప్ సింగ్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సంత్ సేవాలాల్ మాహారాజ్ జయంతిని జాగృతి కేంద్ర... ప్రపంచం నా జాగీరే అన్నట్లుగా ట్రంప్ వ్యవహారం : బ్రెజిల్ అధ్యక్షుడు లూళా
న్యూఢిల్లీ ఫిబ్రవరి 08 (ప్రజా మంటలు - ప్రత్యేక ప్రతినిధి):
బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లూళా దా సిల్వా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్పై ఘాటు విమర్శలు చేశారు. ట్రంప్ తన ఆధీనంలో ఉండే కొత్త యునైటెడ్ నేషన్స్ (యూన్) తరహా అంతర్జాతీయ సంస్థను ఏర్పాటు చేయాలన్న ఆలోచనతో ముందుకెళ్తున్నారని ఆరోపించారు. ఇది ప్రపంచ... 2026–27 తమిళనాడు బడ్జెట్: ఎన్నికల ఏడాదిలో డీఎంకే వ్యూహం ఏంటి?
చెన్నై ఫిబ్రవరి 08 (ప్రజా మంటలు ప్రత్యేక ప్రతినిధి):
తమిళనాడు రాష్ట్ర బడ్జెట్ను ఫిబ్రవరి 17న ప్రవేశపెట్టనున్నట్లు స్పీకర్ అప్పావు ప్రకటించారు. ఇది సాధారణ బడ్జెట్ కంటే భిన్నంగా, ఎన్నికల ముందు చివరి పూర్తి స్థాయి బడ్జెట్ కావడం వల్ల రాజకీయంగా అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది.డీఎంకే ప్రభుత్వం ఈ బడ్జెట్ను పరిపాలనా పత్రంగా కాకుండా, ... తొలి మహిళా ఒగ్గుకథ కళాకారిణి జమ్మ మల్లారి మృతి
తెలంగాణ సంస్కృతికి నిలువెత్తు విగ్రహం
ఒగ్గు వనితకు వినమ్ర శ్రద్ధాంజలి
మహిళాస్వరంతో మల్లన్న మేల్కొలుపు —పురుషాధిక్య రంగంలో ధైర్యంగా సవారి చేసిన మల్లారి ఇక లేరు.
కళా ప్రపంచంలో ఆడవేషం కట్టిన పురుషులు అనేకమంది లబ్ధప్రతిష్ఠులుగా నిలిచారు. కానీ పురుష ఆహార్యాన్ని ధరించి, ఒక జానపద కళారూపాన్ని జీవితాంతం భుజాన మోసిన స్త్రీమూర్తుల కథలు... నేటి నుండి శ్రీ శైలం లో మల్లికార్జునుని బ్రహ్మోత్సవాలు
శ్రీశైలం ఫిబ్రవరి 08 (ప్రజా మంటలు): కేంద్ర
శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయంలో నేటి నుండి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయాన్ని పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఉదయం ధ్వజారోహణతో ఉత్సవాలకు శ్రీకారం చుట్టగా, వేద మంత్రోచ్ఛారణల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు.
బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రతిరోజూ వివిధ వాహన సేవలు,... విజయ్ అసెంబ్లీ ఎంట్రీ: చెన్నై నుంచే బరిలోకి దిగితే డీఎంకే–ఏఐఏడీఎంకేకు ఎంత ముప్పు?
చెన్నై ఫిబ్రవరి 08 (ప్రజా మంటల - ప్రత్యేక ప్రతినిధి)::
తమిళనాడు రాజకీయాల్లో నటుడు విజయ్ కేవలం కొత్త పార్టీ నేతగానే కాదు, ఇప్పుడు రాష్ట్ర రాజకీయ సమీకరణాలను కదిలించే ఫ్యాక్టర్గా మారుతున్నారు. తమిళగా వెట్రి కజగం (TVK) పార్టీ ద్వారా అసెంబ్లీ బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్న విజయ్, ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్న... 