ఇందిరమ్మ రాజ్యం అంటే జర్నలిస్ట్ పై దాడి చేయడమా..? -జర్నలిస్ట్ లపై ప్రభుత్వం దాడులు హే్యమైన చర్య
ఇందిరమ్మ రాజ్యం అంటే జర్నలిస్ట్ పై దాడి చేయడమా..?
-జర్నలిస్ట్ లపై ప్రభుత్వం దాడులు హే్యమైన చర్య
-జిల్లా పరిషత్ మాజీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్
జగిత్యాల, జులై 11( ప్రజా మంటలు ) ఇందిరమ్మ రాజ్యం అంటే ప్రజాస్వామ్యం కు నాలుగో స్థంభం అయిన జర్నలిజం పై ఉక్కు పాదం మోపుతూ, జర్నలిస్ట్ లపై దాడులు చెయ్యడమా అని జిల్లా పరిషత్ తొలి చైర్ పర్సన్ దావ వసంత సురేష్ ప్రశ్నించారు. ఈ సందర్బంగా వసంత మాట్లాడుతూ ఇందిరమ్మ రాజ్యంలో జర్నలిస్ట్ లకు రక్షణ కరువైందన్నారు. విధి నిర్వహణలో భాగంగా జర్నలిస్ట్ లు కవరేజికి వెళ్తే, కవరేజ్ కి వెళ్లిన జర్నలిస్ట్ పై దాడులు చేయడం పై దురదృష్టకరం అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మీడియా పై దాడులు మొదలవడం ప్రజాస్వామ్యం కే మాయని మచ్చ అని అన్నారు. గతంలో న్యూస్ లైన్ రిపోర్టార్ జర్నలిస్ట్ శంకర్ పై దాడులు చేశారని, ఇటీవల బాల్కంపేట ఎల్లమ్మ తల్లీ బోనాల కవరేజి కి వెళ్లిన 10 టివి ఛానల్ మహిళా జర్నలిస్ట్ పై పోలీసులు దురుసుగా ప్రవర్తించరాని గుర్తు చేశారు. ప్రజా పాలన అంటూనే ప్రజల పక్షంగా, ప్రజలు ప్రభుత్వం కు మధ్య వారిదిగా ఉండే మీడియా ప్రతినిధులపై దాడులు చేయడం ఏంటని వసంత ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం లోకి వచ్చాక ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఉద్యమ కాలం నాటి పరిస్థితి కనిపిస్తుందని గుర్తు చేశారు. పరీక్ష రాసే అభ్యర్థులు తమ ఇబ్బందులు ప్రభుత్వం కు విన్నవించే ప్రయత్నం చేస్తే పట్టించుకోని ప్రభుత్వం ఒంటెద్దు పోకడలతో పరీక్షల నిర్వహణ చేస్తుందని, దీంతో అగ్రహించిన విద్యార్థులు, అభ్యర్థులు నిరసనలు దిగితే వారి వెనక రాజకీయశక్తులు ఉన్నాయని, కోచింగ్ సెంటర్ ల మాఫియా ఉందని సీఎం స్థాయిలో ఉన్న రేవంత్ రెడ్డి మాట్లాడ్డం విచారకరం అన్నారు. సీఎం ప్రకటనపై నిరుద్యోగులు ఆందోళన చేస్తే వాస్తవాలు పరిగణలోకి తీసుకోవాల్సిన ప్రభుత్వం ఏకపక్షంగా నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడే విధంగా చర్యలు చేపట్టడం దురదృష్టకరం అన్నారు. నిరుద్యోగుల ఆకాంక్షలను తొక్కివేసిన ప్రభుత్వం, వారి ఆకాంక్షలను ప్రపంచానికి చూపించేందుకు వెళ్లిన జర్నలిస్ట్ లపై దాడులు జరపడం, వారిపై దురుసుగా ప్రవర్తించడం నియంత పాలనకు నిదర్శనం అన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం పరీక్షల విషయంలో పునరాలోచన చెయ్యాలని, జర్నలిస్ట్ లపై దాడులు నిలువరించేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. మీడియపై జర్నలిస్ట్ పై దాడులకు దిగితే బీఆరెస్ పార్టీ ఊరుకోబోధని, జర్నలిస్ట్ లకు అండగా నిలిచి, ప్రభుత్వ విధానాన్ని ప్రజాక్షేత్రంలో ఎండగడతామని హెచ్చరించారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
తెలంగాణ ను దేశంలో ఆదర్శంగా నిలపడమే లక్ష్యం: రేవంత్ రెడ్డి
నల్లగొండ డిసెంబర్ 06 (ప్రజా మంటలు):
నల్గొండ జిల్లా దేవరకొండలో జరిగిన ‘ప్రజా పాలన – ప్రజా విజయోత్సవాలు’ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ ఇప్పటికే వరి ఉత్పత్తి, శాంతి భద్రతలు, విద్య, వైద్య రంగం, మాదకద్రవ్యాల నియంత్రణలో దేశంలో నంబర్ వన్గా నిలిచిందని తెలిపారు. ఇందులో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి,... తల్లిదండ్రులను విస్మరిస్తే జైలుకే :జగిత్యాల ఆర్డీవో మధుసూదన్
జగిత్యాల డిసెంబర్ 06 (ప్రజా మంటలు):
వయోవృద్ధులైన తల్లిదండ్రులను పోషించాల్సిన భాద్యత పిల్లలదే నని విస్మరిస్తే జైలు శిక్ష జరిమానా తదితర చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జగిత్యాల డివిజన్ ఆర్డీవో, వయో వృద్ధుల ట్రిబ్యునల్ చైర్మన్ పి. మధుసూదన్ హెచ్చరించారు. శనివారం ఆర్డీవో ఛాంబర్లో వృద్ధుల నిరాధరణ కేసులను విచారించారు.
జగిత్యాల రూరల్ మండలం గుల్లపేట... తులగంగవ్వ ట్రస్ట్ ఆధ్వర్యంలో అంబేద్కర్ కు నివాళి
మెటుపల్లి డిసెంబర్ 06:మెట్పల్లి అంబేద్కర్ పార్క్లో డా. బాబాసాహెబ్ అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగా తుల గంగవ్వ ట్రస్ట్ చైర్మన్ డా. తుల రాజేందర్ కుమార్ అంబేద్కర్ సంఘాల నాయకులతో కలిసి ఘనంగా నివాళులు అర్పించారు. గ్రామాల్లో కోతుల బెడద నివారించే అభ్యర్థులనే గెలిపించండి : తెలంగాణ డెవలప్ మెంట్ ఫోరం పిలుపు
సికింద్రాబాద్, డిసెంబర్ 06 (ప్రజామంటలు):
తెలంగాణ గ్రామాలను వేధిస్తున్న కోతుల సమస్యను పరిష్కరించగల అభ్యర్థులనే రాబోయే సర్పంచ్ ఎన్నికల్లో గెలిపించాలని తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం (జై కిసాన్) విజ్ఞప్తి చేసింది. బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్లో జరిగిన ప్రెస్ మీట్ లో ఫోరం ప్రతినిధులు మాట్లాడారు. కోతుల బెడద రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో ఈ సమస్యను... రాయికల్ పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ చేసిన అదనపు ఎస్పీ శేషాద్రిని రెడ్డి
రాయికల్ డిసెంబర్ 6(ప్రజా మంటలు)*గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పోలీస్ అధికారులు సిబ్బంది విధి నిర్వహణలో ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలి*
అదనపు ఎస్పీ శేషాద్రిని రెడ్డి శనివారం రాయికల్ పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా సందర్శించి తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా స్టేషన్ పరిసరాలు, నమోదు చేసిన రికార్డులు, పెండింగ్ కేసుల పురోగతి
ఈ... అంబేద్కర్ ఆశయాలు కొనసాగించాలి. -సీనియర్ సివిల్ జడ్జి నాగేశ్వర్ రావు
మెట్టుపల్లి డిసెంబర్ 6 (ప్రజా మంటలు దగ్గుల అశోక్):
భారత రత్న డా. బి. ఆర్. ఆశయాలు కొనసాగించాల్సిన అవసరం ఉందని సీనియర్ సివిల్ జడ్జి డి. నాగేశ్వర్ రావు అన్నారు. శనివారం అంబేద్కర్ వర్ధంతి సందర్బంగా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నివాళి కార్యక్రమం ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన ఆయన... డబ్బా గ్రామంలో ఘనంగా అంబేద్కర్ వర్ధంతి వేడుకలు*
ఇబ్రహీంపట్నం డిసెంబర్ 6 (ప్రజ మంటలు దగ్గుల అశోక్ )
ఇబ్రహీంపట్నం మండలంలోని డబ్బా గ్రామంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ సంఘ నాయకులు మాట్లాడుతు అంబేద్కర్ ఆశయాలను కొనసాగించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయుడు నేరల సుభాష్ గౌడ్,విడిసి అధ్యక్షుడు తేలు... కరీంనగర్లో అంబేద్కర్ ఘనంగా వర్ధంతి
కరీంనగర్ డిసెంబర్ 06 (ప్రజా మంటలు):అంబేద్కర్ వర్ధంతి సభలో మంత్రి పొన్నం ప్రభాకర్,ఇతర నేతలు మాట్లాడుతూ, అంబేద్కర్ రూపొందించిన భారత రాజ్యాంగం ప్రపంచ దేశాలకు ఆదర్శమైందని, కుల–మత–వర్గ విభేదాలకు ముగింపు పలుకుతూ అన్ని వర్గాలకు సమాన హక్కులు కల్పించిన మహనీయుడిగా ఆయనను జాతి శతకోటీ వందనాలతో గుర్తుంచుకోవాలని పేర్కొన్నారు.నేడు BJP, BRS వంటి... తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కు కేంద్ర మంత్రి బండి సంజయ్ను ఆహ్వానించిన మంత్రి పొన్నం ప్రభాకర్
కరీంనగర్ డిసెంబర్ 06 (ప్రజా మంటలు):
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్–2025 ఆహ్వాన పత్రికను కేంద్ర హోంమంత్రి బండి సంజయ్కు అందించిన అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.ఈ కార్యక్రమంలో వేములవాడ ఎమ్మెల్యే మరియు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం,... జగిత్యాల జిల్లాలో రోళ్ళవాగు ప్రాజెక్ట్ అనుమతులు వేగవంతం చేయాలి – ఎంపీ ధర్మపురి అర్వింద్
నిజామాబాద్ డిసెంబర్ 06 (ప్రజా మంటలు):
జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలంలోని రోళ్ళవాగు ప్రాజెక్ట్కు సంబంధించిన అనుమతులు త్వరగా మంజూరు చేయాలని కేంద్ర పర్యావరణ–అటవీ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ ను నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ కోరారు.
ఇటీవల జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ ఈ అనుమతుల విషయంపై ఎంపీ అర్వింద్ ను... డా.బీఆర్ అంబేడ్కర్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారు.
సికింద్రాబాద్, డిసెంబర్ 06 (ప్రజామంటలు):
రాజ్యాంగ నిర్మాణంలో కీలకపాత్ర పోషించిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారని పలువురు వక్తలు పేర్కొన్నారు. రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ వర్థంతిని శనివారం బన్సీలాల్ పేట డివిజన్ చాచా నెహ్రునగర్ లో బీజేపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈసందర్బంగా అంబేడ్కర్ అమర్ రహే... కాంగ్రెస్ ప్రభుత్వ రెండేళ్ల పూర్తి సందర్భంగా సికింద్రాబాద్లో రేపు భారీ సంబరాలు
సికింద్రాబాద్, డిసెంబర్ 06 (ప్రజా మంటలు)::
కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకొని మూడవ సంవత్సరంలోకి ప్రవేశిస్తున్న నేపథ్యంలో సికింద్రాబాద్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున8 వేడుకలు నిర్వహించనున్నట్లు కాంగ్రెస్ నాయకుడు అదం సంతోష్ కుమార్ తెలిపారు.డిసెంబర్ 7న సాయంత్రం 4 గంటలకు సీతాఫలమండి అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రజాసభ, అభివృద్ధి సమీక్ష, ప్రజలతో సంభాషణ,... 