ఇందిరమ్మ రాజ్యం అంటే జర్నలిస్ట్ పై దాడి చేయడమా..? -జర్నలిస్ట్ లపై ప్రభుత్వం దాడులు హే్యమైన చర్య
ఇందిరమ్మ రాజ్యం అంటే జర్నలిస్ట్ పై దాడి చేయడమా..?
-జర్నలిస్ట్ లపై ప్రభుత్వం దాడులు హే్యమైన చర్య
-జిల్లా పరిషత్ మాజీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్
జగిత్యాల, జులై 11( ప్రజా మంటలు ) ఇందిరమ్మ రాజ్యం అంటే ప్రజాస్వామ్యం కు నాలుగో స్థంభం అయిన జర్నలిజం పై ఉక్కు పాదం మోపుతూ, జర్నలిస్ట్ లపై దాడులు చెయ్యడమా అని జిల్లా పరిషత్ తొలి చైర్ పర్సన్ దావ వసంత సురేష్ ప్రశ్నించారు. ఈ సందర్బంగా వసంత మాట్లాడుతూ ఇందిరమ్మ రాజ్యంలో జర్నలిస్ట్ లకు రక్షణ కరువైందన్నారు. విధి నిర్వహణలో భాగంగా జర్నలిస్ట్ లు కవరేజికి వెళ్తే, కవరేజ్ కి వెళ్లిన జర్నలిస్ట్ పై దాడులు చేయడం పై దురదృష్టకరం అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మీడియా పై దాడులు మొదలవడం ప్రజాస్వామ్యం కే మాయని మచ్చ అని అన్నారు. గతంలో న్యూస్ లైన్ రిపోర్టార్ జర్నలిస్ట్ శంకర్ పై దాడులు చేశారని, ఇటీవల బాల్కంపేట ఎల్లమ్మ తల్లీ బోనాల కవరేజి కి వెళ్లిన 10 టివి ఛానల్ మహిళా జర్నలిస్ట్ పై పోలీసులు దురుసుగా ప్రవర్తించరాని గుర్తు చేశారు. ప్రజా పాలన అంటూనే ప్రజల పక్షంగా, ప్రజలు ప్రభుత్వం కు మధ్య వారిదిగా ఉండే మీడియా ప్రతినిధులపై దాడులు చేయడం ఏంటని వసంత ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం లోకి వచ్చాక ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఉద్యమ కాలం నాటి పరిస్థితి కనిపిస్తుందని గుర్తు చేశారు. పరీక్ష రాసే అభ్యర్థులు తమ ఇబ్బందులు ప్రభుత్వం కు విన్నవించే ప్రయత్నం చేస్తే పట్టించుకోని ప్రభుత్వం ఒంటెద్దు పోకడలతో పరీక్షల నిర్వహణ చేస్తుందని, దీంతో అగ్రహించిన విద్యార్థులు, అభ్యర్థులు నిరసనలు దిగితే వారి వెనక రాజకీయశక్తులు ఉన్నాయని, కోచింగ్ సెంటర్ ల మాఫియా ఉందని సీఎం స్థాయిలో ఉన్న రేవంత్ రెడ్డి మాట్లాడ్డం విచారకరం అన్నారు. సీఎం ప్రకటనపై నిరుద్యోగులు ఆందోళన చేస్తే వాస్తవాలు పరిగణలోకి తీసుకోవాల్సిన ప్రభుత్వం ఏకపక్షంగా నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడే విధంగా చర్యలు చేపట్టడం దురదృష్టకరం అన్నారు. నిరుద్యోగుల ఆకాంక్షలను తొక్కివేసిన ప్రభుత్వం, వారి ఆకాంక్షలను ప్రపంచానికి చూపించేందుకు వెళ్లిన జర్నలిస్ట్ లపై దాడులు జరపడం, వారిపై దురుసుగా ప్రవర్తించడం నియంత పాలనకు నిదర్శనం అన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం పరీక్షల విషయంలో పునరాలోచన చెయ్యాలని, జర్నలిస్ట్ లపై దాడులు నిలువరించేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. మీడియపై జర్నలిస్ట్ పై దాడులకు దిగితే బీఆరెస్ పార్టీ ఊరుకోబోధని, జర్నలిస్ట్ లకు అండగా నిలిచి, ప్రభుత్వ విధానాన్ని ప్రజాక్షేత్రంలో ఎండగడతామని హెచ్చరించారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కొండగట్టు పర్యటనకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు: జిల్లా ఎస్పి అశోక్ కుమార్
జగిత్యాల డిసెంబర్ 31 (ప్రజా మంటలు)ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కొండగట్టు ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పర్యటన సందర్భంగా చేపట్టాల్సిన భద్రతా ఏర్పాట్లను జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ప్రత్యక్షంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా హెలిప్యాడ్ ప్రాంతం, వాహనాల పార్కింగ్ స్థలాలు, ట్రాఫిక్ రూట్లు, బందోబస్తు ఏర్పాటు చేయాల్సిన ముఖ్య ప్రదేశాలు తదితర... పదవి విరమణ పొందిన ఏ ఆర్ ఎస్ ఐ సయ్యద్ తకీద్దీన్ కి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆత్మీయ వీడ్కోలు
జగిత్యాల డిసెంబర్ 31 (ప్రజా మంటలు)
పోలీస్ శాఖలో గత 30 సంవత్సరాలుగా విధులు నిర్వహించి పదవి విరమణ పొందుతున్న ఏ ఆర్ ఎస్ ఐ సయ్యద్ తకీద్దీన్ ను బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ అశోక్ కుమార్ పూలమాల వేసి శాలువ లతో ఘనంగా సన్మానించారు.
సుధీర్ఘ కాలంగా పోలీస్ శాఖ లో... ధర్మపురిలో మాతా–శిశు ఆసుపత్రి ప్రారంభించకపోవడంపై మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆగ్రహం
ధర్మపురి, డిసెంబర్ 31 (ప్రజా మంటలు):
ధర్మపురి పట్టణంలో రూ.8.50 కోట్ల వ్యయంతో నిర్మించిన 50 పడకల మాతా–శిశు సంరక్షణ కేంద్రాన్ని ఇప్పటికీ ప్రజలకు అందుబాటులోకి తీసుకురాకపోవడంపై మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఆసుపత్రి ఎదుట నిన్న నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా... అసెంబ్లీలో పెన్షనర్ల బకాయిల విడుద ప్రకటించాలి: హరి అశోక్ కుమార్
జగిత్యాల (రూరల్) డిసెంబర్ 31 (ప్రజా మంటలు):
అసెంబ్లీ ఎన్నికల హామీల మేరకు పెన్షనర్ల పెండింగ్ బకాయిల విడుదల, పీఆర్సీ అమలు, పాత పెన్షన్ పథకం పునరుద్ధరణను అసెంబ్లీలో ప్రకటించాలని తెలంగాణ పెన్షనర్స్ సెంట్రల్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి హరి అశోక్ కుమార్ డిమాండ్ చేశారు.
జిల్లాలో టీ.పి.సి.ఏ. ఆధ్వర్యంలో జరిగిన జాతీయ పెన్షనర్ల పక్షోత్సవాల్లో... బీర్పూర్ మండలంలో రోళ్లవాగు–అరగుండాల ప్రాజెక్టు ను పరిశీలించిన జీవన్ రెడ్డి
రైతులు, మత్స్యకారులకు అండగా నిలుస్తాం : మాజీ మంత్రి జీవన్ రెడ్డి
జగిత్యాల రూరల్, డిసెంబర్ 31 (ప్రజా మంటలు):
బీర్పూర్ మండలంలోని రోళ్లవాగు–అరగుండాల ప్రాజెక్టును మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టుకు సంబంధించిన సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, తక్షణ పరిష్కార చర్యలపై అధికారులతో చర్చించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర... తెలంగాణ ఉద్యమకారుల భూమి హక్కుల కోసం భూపోరాటం చేస్తా – కల్వకుంట్ల కవిత
మానకొండూరులో ఉద్యమకారులతో కలిసి వంటా వార్పులో పాల్గొన్న కవిత
మానకొండూరు/కరీంనగర్ 31 (ప్రజా మంటలు):
తెలంగాణ ఉద్యమకారులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో మానకొండూరులో భూపోరాటం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పాల్గొని ఉద్యమకారులతో కలిసి వంటావార్పు నిర్వహించారు. ఈ సందర్భంగా గుడిసెలో పాలు పొంగించి,... జగిత్యాల పట్టణ ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గాన్ని సత్కరించిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
జగిత్యాల డిసెంబర్ 30 (ప్రజా మంటలు)ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ ని మర్యాదపూర్వకంగా కలిసిన నూతనంగా ఎనికైనా టీయూడబ్ల్యూజే (ఐజేయు) అనుబంధ జగిత్యాల ప్రెస్ క్లబ్ సభ్యులు.ఈ సందర్బంగా ప్రెస్ క్లబ్ కార్యవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపి, శాలువాతో సత్కరించిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు ఎల్లాల రాజేందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి... బీఆర్ఎస్ శాసనసభ, శాసనమండలిలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్ల నియామకం
హైదరాబాద్, డిసెంబర్ 30 (ప్రజా మంటలు):
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు కీలక నియామకాలు చేపట్టారు. శాసనసభలో మరియు శాసనమండలిలో పార్టీ కార్యకలాపాలను సమర్థంగా సమన్వయం చేసేందుకు డిప్యూటీ ఫ్లోర్ లీడర్లను నియమిస్తూ ఆయన ఉత్తర్వులు జారీ చేశారు.
శాసనసభలో బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్లుగా
శ్రీ... రవీంద్రభారతిలో ముదిరాజ్ ప్రజాప్రతినిధులకు ఘన సన్మానం
సికింద్రాబాద్, డిసెంబర్ 30 ( ప్రజామంటలు):
తెలంగాణ రాష్ర్టంలో సర్పంచులు, వార్డు సభ్యులుగా ఇటీవల ఎన్నికైన ముదిరాజ్ ప్రజాప్రతినిధులను సోమవారం రవీంద్రభారతిలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి ముదిరాజ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ ముదిరాజ్,
ఎమ్మెల్సీ బండ ప్రకాష్ ముదిరాజ్ పాల్గొని మాట్లాడారు.బుర్ర జ్ఞానేశ్వర్... వైకుంఠ ఏకాదశి వేళ...భక్తుల రద్దీతో పోటెత్తిన ఆలయాలు
సికింద్రాబాద్, డిసెంబర్ 30 ( ప్రజామంటలు):
సికింద్రాబాద్ శ్రీనివాస నగర్ శ్రీగిరి ప్రసన్న వేంకటేశ్వర ఆలయంలో మంగళవారం వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా జరిగాయి. వేకువ జాము నుంచే వేలాది మంది భక్తులు ఆలయాన్ని సందర్శించి ఉత్తర ద్వారం గుండా శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ నిర్వాహకులు... గొప్ప దాతృత్వం కలిగిన వ్యక్తి కాసుగంటి సుధాకర్ రావు_ జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
జగిత్యాల డిసెంబర్ 30 (ప్రజా మంటలు)గొప్ప దాతృత్వం కలిగిన వ్యక్తి కాసుగంటి సుధాకర్ రావు అని జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు.జగిత్యాల పట్టణ పద్మనాయక కళ్యాణ మంటపం లో పద్మనాయక వెలమ సంక్షేమ మండలి జగిత్యాల వారి ఆధ్వర్యం లో కాసుగంటి సుధాకర్ రావు సంతాప కార్యక్రమంలో ఎమ్మెల్యే డా... 