ఇందిరమ్మ రాజ్యం అంటే జర్నలిస్ట్ పై దాడి చేయడమా..? -జర్నలిస్ట్ లపై ప్రభుత్వం దాడులు హే్యమైన చర్య
ఇందిరమ్మ రాజ్యం అంటే జర్నలిస్ట్ పై దాడి చేయడమా..?
-జర్నలిస్ట్ లపై ప్రభుత్వం దాడులు హే్యమైన చర్య
-జిల్లా పరిషత్ మాజీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్
జగిత్యాల, జులై 11( ప్రజా మంటలు ) ఇందిరమ్మ రాజ్యం అంటే ప్రజాస్వామ్యం కు నాలుగో స్థంభం అయిన జర్నలిజం పై ఉక్కు పాదం మోపుతూ, జర్నలిస్ట్ లపై దాడులు చెయ్యడమా అని జిల్లా పరిషత్ తొలి చైర్ పర్సన్ దావ వసంత సురేష్ ప్రశ్నించారు. ఈ సందర్బంగా వసంత మాట్లాడుతూ ఇందిరమ్మ రాజ్యంలో జర్నలిస్ట్ లకు రక్షణ కరువైందన్నారు. విధి నిర్వహణలో భాగంగా జర్నలిస్ట్ లు కవరేజికి వెళ్తే, కవరేజ్ కి వెళ్లిన జర్నలిస్ట్ పై దాడులు చేయడం పై దురదృష్టకరం అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మీడియా పై దాడులు మొదలవడం ప్రజాస్వామ్యం కే మాయని మచ్చ అని అన్నారు. గతంలో న్యూస్ లైన్ రిపోర్టార్ జర్నలిస్ట్ శంకర్ పై దాడులు చేశారని, ఇటీవల బాల్కంపేట ఎల్లమ్మ తల్లీ బోనాల కవరేజి కి వెళ్లిన 10 టివి ఛానల్ మహిళా జర్నలిస్ట్ పై పోలీసులు దురుసుగా ప్రవర్తించరాని గుర్తు చేశారు. ప్రజా పాలన అంటూనే ప్రజల పక్షంగా, ప్రజలు ప్రభుత్వం కు మధ్య వారిదిగా ఉండే మీడియా ప్రతినిధులపై దాడులు చేయడం ఏంటని వసంత ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం లోకి వచ్చాక ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఉద్యమ కాలం నాటి పరిస్థితి కనిపిస్తుందని గుర్తు చేశారు. పరీక్ష రాసే అభ్యర్థులు తమ ఇబ్బందులు ప్రభుత్వం కు విన్నవించే ప్రయత్నం చేస్తే పట్టించుకోని ప్రభుత్వం ఒంటెద్దు పోకడలతో పరీక్షల నిర్వహణ చేస్తుందని, దీంతో అగ్రహించిన విద్యార్థులు, అభ్యర్థులు నిరసనలు దిగితే వారి వెనక రాజకీయశక్తులు ఉన్నాయని, కోచింగ్ సెంటర్ ల మాఫియా ఉందని సీఎం స్థాయిలో ఉన్న రేవంత్ రెడ్డి మాట్లాడ్డం విచారకరం అన్నారు. సీఎం ప్రకటనపై నిరుద్యోగులు ఆందోళన చేస్తే వాస్తవాలు పరిగణలోకి తీసుకోవాల్సిన ప్రభుత్వం ఏకపక్షంగా నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడే విధంగా చర్యలు చేపట్టడం దురదృష్టకరం అన్నారు. నిరుద్యోగుల ఆకాంక్షలను తొక్కివేసిన ప్రభుత్వం, వారి ఆకాంక్షలను ప్రపంచానికి చూపించేందుకు వెళ్లిన జర్నలిస్ట్ లపై దాడులు జరపడం, వారిపై దురుసుగా ప్రవర్తించడం నియంత పాలనకు నిదర్శనం అన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం పరీక్షల విషయంలో పునరాలోచన చెయ్యాలని, జర్నలిస్ట్ లపై దాడులు నిలువరించేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. మీడియపై జర్నలిస్ట్ పై దాడులకు దిగితే బీఆరెస్ పార్టీ ఊరుకోబోధని, జర్నలిస్ట్ లకు అండగా నిలిచి, ప్రభుత్వ విధానాన్ని ప్రజాక్షేత్రంలో ఎండగడతామని హెచ్చరించారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
మెట్టుగూడలో కాంగ్రెస్ మహా పాదయాత్ర ; GHMC ఎన్నికల్లో గెలుపే లక్ష్యం
సికింద్రాబాద్, జనవరి 11 (ప్రజా మంటలు):
సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలోని మెట్టుగూడ డివిజన్లో ఆదివారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహా పాదయాత్ర నిర్వహించారు. నియోజకవర్గ ఇంచార్జ్, కాంగ్రెస్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే అదం సంతోష్ కుమార్ నాయకత్వంలో జరిగిన ఈ పాదయాత్ర GHMC ఎన్నికల్లో విజయం లక్ష్యంగా సాగింది.
పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపడం, ప్రభుత్వ పథకాలను... సూరారం ఆటో యూనియన్ నూతన కమిటీ ఎన్నిక
ఎల్కతుర్తి డిసెంబర్ 11 ప్రజా మంటలు
ఎల్కతుర్తి మండలంలోని సూరారం గ్రామంలో ఆటో యూనియన్ నూతన కమిటీని కమిటీని ఆదివారం అధికారికంగా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా యూనియన్ సభ్యులు ఎల్కతుర్తి సర్కిల్ ఇన్స్పెక్టర్ పులి రమేష్ ఎల్కతుర్తి స్టేషన్ ఎస్ ఐ అక్కినేపల్లి ప్రవీణ్ కుమార్లను మర్యాదపూర్వకంగా కలిసి అభివాదం చేశారు.ఈ సమావేశంలో... నేరెళ్ల గ్రామంలో యువకుని ఆదృశ్యం
గొల్లపల్లి జనవరి 11 (ప్రజా మంటలు ):
ధర్మపురి మండలం నేరెళ్ల గ్రామానికి చెందిన మంద నరేష్ (35) నేరెళ్లలో కుటుంబంతో సోమవారం మధ్యాహ్నం భార్యతో కిరాణా షాపుకు వెళ్తున్నాను అని చెప్పి ఇంటి నుండి వెళ్ళి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు చుట్టుపక్కల ఎంత వెతికినా ఆచూకీ లభించకపోవడంతో తల్లి మంద శంకరమ్మ నిజాంపేట్ ఫేజ్–3లో సంక్రాంతి కానుకల పంపిణీ
సికింద్రాబాద్, జనవరి 11 (ప్రజా మంటలు):
మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ గారు నిజాంపేట్ ఫేజ్–3లో నిర్వహించిన సంక్రాంతి కానుకల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని మహిళలకు చీరలను అందజేశారు. ఈ కార్యక్రమాన్ని పద్మ ప్రసాద్ ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు సమన్వయంతో నిర్వహించారు.ఈ సందర్భంగా నిజాంపేట్ బీజేపీ అధ్యక్షులు ఎం. బిక్షపతి యాదవ్, ఓబీసీ నిజాంపేట్... హైదరాబాద్లో స్కై ఫౌండేషన్ 292వ అన్నదాన కార్యక్రమం
సికింద్రాబాద్, జనవరి 11 (ప్రజా మంటలు):
స్కై ఫౌండేషన్ ఆధ్వర్యంలో నగరంలో రోడ్ల పక్కన జీవనం సాగిస్తున్న అనాథలు, నిరాశ్రయులు, నిరుపేదలకు 292వ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. వాహనంలో నగరమంతా సంచరిస్తూ ఆకలితో ఉన్నవారిని గుర్తించి ఒక్కపూట భోజనం అందించారు.ఈ కార్యక్రమంలో ఫౌండర్ & ప్రెసిడెంట్ డా. వై. సంజీవ కుమార్, వైస్ ప్రెసిడెంట్... మేడిబావిలో ఆర్యసమాజ్ రంగవల్లిక పోటీలు
సికింద్రాబాద్, జనవరి 11 (ప్రజా మంటలు):
మేడిబావి ఆర్యసమాజ్ ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహించిన రంగవల్లిక పోటీలకు 50కిపైగా మంది పాల్గొన్నారు. విజేతలకు బహుమతులు అందజేశారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఆర్యసమాజ్ ప్రెసిడెంట్ ఎం.ఆర్. రవీందర్ మాట్లాడుతూ పండుగలు మన సంస్కృతికి ప్రతీకలని, ప్రతి ఒక్కరూ సంక్రాంతి పండుగను ఆనందంగా జరుపుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్యసమాజ్ సభ్యులు... బతికుండగానే సమాధి నిర్మించుకున్న నక్క ఇంద్రయ్య మృతి – సంతాపం
జగిత్యాల, జనవరి 11 (ప్రజా మంటలు):
జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన సీనియర్ సిటిజన్, జగిత్యాల రూరల్ మండల సీనియర్ సిటిజెన్స్ అధ్యక్షుడు నక్క ఇంద్రయ్య శనివారం రాత్రి మృతి చెందారు. ఆయన బతికుండగానే స్వయంగా నిర్మించుకున్న సమాధిలోనే ఆదివారం ఆయన భౌతిక కాయాన్ని భూస్థాపితం చేశారు. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని... తొలగించిన IAS పూజా ఖేడ్కర్ తల్లిదండ్రులు సహా ఐదుగురు అచేతనం
పుణే, జనవరి 11:పదవి నుంచి తొలగించబడిన IAS ట్రైనీ అధికారి పూజా ఖేడ్కర్ తల్లిదండ్రులు సహా మరో ముగ్గురు పుణేలోని వారి బంగ్లాలో అచేతన స్థితిలో కనిపించడం కలకలం రేపింది. బానెర్–ఆంధ్ ప్రాంతంలోని నివాసంలో జరిగిన ఈ ఘటనలో నిద్ర మందులు కలిపి వారిని అచేతనం చేసి దొంగతనం చేసినట్లు అనుమానం వ్యక్తమవుతోంది.
సమాచారం... ఇరాన్ లో ఇంటర్నెట్ సేవలు బంద్: ప్రపంచంతో తెగిన సంబంధాలు
టెహ్రాన్ జనవరి 11:
నిరసనలు తీవ్రమవుతున్న తరుణంలో, ఇరాన్ ప్రపంచంతో సంబంధాలను తెంచుకుంది.ఆర్థిక వ్యవస్థపై నిరసనలు వ్యాపిస్తున్న నేపథ్యంలో ఇరాన్లో ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి.
ఇరాన్లో ఆర్థిక సంక్షోభం కారణంగా ప్రారంభమైన నిరసనలు నేషన్లవైడ్ స్థాయిలో విస్తరుతూ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులను సృష్టిస్తున్నాయి. ప్రభుత్వం ఇంటర్నెట్, టెలిఫోన్ నెట్వర్క్లను పూర్తిగా నిలిపివేయడం వంటి చర్యలు... వడ్డే ఓబన్న జయంతి కార్యక్రమాల్లో మాజీ మంత్రి జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్
జగిత్యాల, జనవరి 11 (ప్రజా మంటలు):
జగిత్యాల జిల్లా కేంద్రంలో వడ్డే ఓబన్న జయంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమాల్లో మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి, జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ వేర్వేరు ప్రాంతాల్లో పాల్గొన్నారు.
గోవింద్పల్లె సమీపంలో నిర్వహించిన జయంతి ఉత్సవాల్లో మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ, వడ్డే... మంత్రి వాకిటి శ్రీహరి తో ముదిరాజ్ నేత భేటి
సికింద్రాబాద్, జనవరి 11 (ప్రజా మంటలు):
తెలంగాణ రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి ముదిరాజ్ ను ఆదివారం జాతీయ ముదిరాజ్ సమాజ్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ పొట్లకాయల వెంకటేశ్వర్లు మర్యాదపూర్వకంగా కలిశారు. దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న ముదిరాజ్ రిజర్వేషన్ల అంశాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని మంత్రి కి విజ్ఞప్తి చేశారు. అలాగే మంత్రి... జగిత్యాల మున్నూరు కాపు వర్తక–వ్యాపార సంఘం 2026 క్యాలెండర్ ఆవిష్కరణ
వేములవాడ, జనవరి 11 (ప్రజా మంటలు):
జగిత్యాల మున్నూరు కాపు వర్తక–వ్యాపార సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన 2026 సంవత్సర క్యాలెండర్ను వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ శ్రీ ఆది శ్రీనివాస్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ మున్నూరు కాపు కులబాంధవులందరికీ నూతన సంవత్సరం, సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. సంఘం అభివృద్ధికి... 