ఇందిరమ్మ రాజ్యం అంటే జర్నలిస్ట్ పై దాడి చేయడమా..? -జర్నలిస్ట్ లపై ప్రభుత్వం దాడులు హే్యమైన చర్య
ఇందిరమ్మ రాజ్యం అంటే జర్నలిస్ట్ పై దాడి చేయడమా..?
-జర్నలిస్ట్ లపై ప్రభుత్వం దాడులు హే్యమైన చర్య
-జిల్లా పరిషత్ మాజీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్
జగిత్యాల, జులై 11( ప్రజా మంటలు ) ఇందిరమ్మ రాజ్యం అంటే ప్రజాస్వామ్యం కు నాలుగో స్థంభం అయిన జర్నలిజం పై ఉక్కు పాదం మోపుతూ, జర్నలిస్ట్ లపై దాడులు చెయ్యడమా అని జిల్లా పరిషత్ తొలి చైర్ పర్సన్ దావ వసంత సురేష్ ప్రశ్నించారు. ఈ సందర్బంగా వసంత మాట్లాడుతూ ఇందిరమ్మ రాజ్యంలో జర్నలిస్ట్ లకు రక్షణ కరువైందన్నారు. విధి నిర్వహణలో భాగంగా జర్నలిస్ట్ లు కవరేజికి వెళ్తే, కవరేజ్ కి వెళ్లిన జర్నలిస్ట్ పై దాడులు చేయడం పై దురదృష్టకరం అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మీడియా పై దాడులు మొదలవడం ప్రజాస్వామ్యం కే మాయని మచ్చ అని అన్నారు. గతంలో న్యూస్ లైన్ రిపోర్టార్ జర్నలిస్ట్ శంకర్ పై దాడులు చేశారని, ఇటీవల బాల్కంపేట ఎల్లమ్మ తల్లీ బోనాల కవరేజి కి వెళ్లిన 10 టివి ఛానల్ మహిళా జర్నలిస్ట్ పై పోలీసులు దురుసుగా ప్రవర్తించరాని గుర్తు చేశారు. ప్రజా పాలన అంటూనే ప్రజల పక్షంగా, ప్రజలు ప్రభుత్వం కు మధ్య వారిదిగా ఉండే మీడియా ప్రతినిధులపై దాడులు చేయడం ఏంటని వసంత ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం లోకి వచ్చాక ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఉద్యమ కాలం నాటి పరిస్థితి కనిపిస్తుందని గుర్తు చేశారు. పరీక్ష రాసే అభ్యర్థులు తమ ఇబ్బందులు ప్రభుత్వం కు విన్నవించే ప్రయత్నం చేస్తే పట్టించుకోని ప్రభుత్వం ఒంటెద్దు పోకడలతో పరీక్షల నిర్వహణ చేస్తుందని, దీంతో అగ్రహించిన విద్యార్థులు, అభ్యర్థులు నిరసనలు దిగితే వారి వెనక రాజకీయశక్తులు ఉన్నాయని, కోచింగ్ సెంటర్ ల మాఫియా ఉందని సీఎం స్థాయిలో ఉన్న రేవంత్ రెడ్డి మాట్లాడ్డం విచారకరం అన్నారు. సీఎం ప్రకటనపై నిరుద్యోగులు ఆందోళన చేస్తే వాస్తవాలు పరిగణలోకి తీసుకోవాల్సిన ప్రభుత్వం ఏకపక్షంగా నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడే విధంగా చర్యలు చేపట్టడం దురదృష్టకరం అన్నారు. నిరుద్యోగుల ఆకాంక్షలను తొక్కివేసిన ప్రభుత్వం, వారి ఆకాంక్షలను ప్రపంచానికి చూపించేందుకు వెళ్లిన జర్నలిస్ట్ లపై దాడులు జరపడం, వారిపై దురుసుగా ప్రవర్తించడం నియంత పాలనకు నిదర్శనం అన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం పరీక్షల విషయంలో పునరాలోచన చెయ్యాలని, జర్నలిస్ట్ లపై దాడులు నిలువరించేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. మీడియపై జర్నలిస్ట్ పై దాడులకు దిగితే బీఆరెస్ పార్టీ ఊరుకోబోధని, జర్నలిస్ట్ లకు అండగా నిలిచి, ప్రభుత్వ విధానాన్ని ప్రజాక్షేత్రంలో ఎండగడతామని హెచ్చరించారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఉప్పల్ స్టేడియంలో మెస్సీ–రేవంత్ ఫుట్బాల్ మ్యాచ్.. అభిమానుల్లో ఉత్సాహం
హైదరాబాద్ డిసెంబర్ 13 (ప్రజా మంటలు):
ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగిన ప్రత్యేక ఫుట్బాల్ మ్యాచ్లో ముఖ్యమంత్రి ఏ. రేవంత్రెడ్డి, ప్రపంచ ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ మైదానంలోకి దిగారు. ఈ మ్యాచ్ ప్రేక్షకులను ఉర్రూతలూగించింది.
మ్యాచ్లో సీఎం రేవంత్రెడ్డి ఒక గోల్ సాధించగా, మెస్సీ రెండు గోల్స్తో తన ప్రతిభను చాటుకున్నారు. గోల్స్తో పాటు... నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాతే జగిత్యాలకు మెడికల్ కాలేజీ: ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్
జగిత్యాల (రూరల్) డిసెంబర్ 13 (ప్రజా మంటలు):
రాజకీయాల్లోకి తాను వచ్చిన తర్వాత అప్పటి ముఖ్యమంత్రిని కోరడంతోనే జగిత్యాలకు మెడికల్ కాలేజీ మంజూరైందని ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ తెలిపారు. రాష్ట్రంలో ఆరు మెడికల్ కాలేజీలు మంజూరైన సమయంలో జగిత్యాల పేరు జాబితాలో ఉండేలా కృషి చేశానని చెప్పారు. రాష్ట్రంలో మొదట అనుమతి పొందిన మెడికల్... వయోవృద్ధులకు టాస్కా ఆసరా. -అల్ సీనియర్ సిటీజేన్స్ ఆధ్వర్యంలో 9వ టాస్క ఆవిర్భావ దినోత్సవం వేడుకలు.
జగిత్యాల డిసెంబర్ 13 (ప్రజా మంటలు):
వయో వృద్ధులకు తెలంగాణ ఆల్ సీనియర్ సిటీజేన్స్ అసోసియేషన్ ఆసరాగా ఉందని,వయోవృద్ధుల సంరక్షణ చట్టాన్ని పకడ్బందీగా అమలుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేయడం పట్ల సీనియర్ సిటీజేన్స్ జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు.
శనివారం ఆల్ సీనియర్ సిటీజేన్స్... సర్పంచ్ ఎన్నికల్లో తమ్ముడు ఓటమి: గుండెపోటుతో అక్క మృతి
కోరుట్ల డిసెంబర్ 13 (ప్రజా మంటలు) :
సర్పంచ్ ఎన్నికల్లో తమ్ముడు ఓడిపోవడాన్ని తట్టుకోలేక అక్క గుండెపోటుతో మృతి చెందిన ఘటన జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం గంభీర్పూర్ గ్రామంలో చోటుచేసుకుంది.
గ్రామస్తుల వివరాల ప్రకారం, పోతు రాజశేఖర్ సర్పంచ్ పదవికి పోటీ చేయగా గురువారం ఎన్నికలు జరిగాయి. ఫలితాల సమయంలో రాజశేఖర్ అక్క కొక్కుల... రాహుల్ గాంధీకి సీఎం రేవంత్ రెడ్డి స్వాగతం
హైదరాబాద్ డిసెంబర్ 13:
లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ హైదరాబాద్కు చేరుకున్నారు. శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయనకు స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా మంత్రులు, ప్రభుత్వ సలహాదారులు, పీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ఎల్కతుర్తి గ్రామ సర్పంచిగా మునిగడప లావణ్య శేషగిరి ఘన విజయం
ఎల్కతుర్తి డిసెంబర్ 13 (ప్రజా మంటలు)
ఎల్కతుర్తి మండలం గ్రామంలో బి. ఆర్.ఎస్. పార్టీ బలపరిచిన అభ్యర్థి మునిగడప లావణ్య శేషగిరి ఘన విజయం సాధించిన సందర్భంగా ఎల్కాతుర్తి మండలానికి చెందిన తెలంగాణ రైతు రక్షణ సమితి హన్మకొండ ఉమ్మడి కరీంనగర్ జిల్లాల అధ్యక్షుడు హింగే భాస్కర్ ఆధ్వర్యంలో గ్రామంలో ప్రజలతో మమేకమై పండుగ వాతావరణముగా... కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి నిలిచిపోయింది: జగిత్యాలలో బీఆర్ఎస్ నేతల తీవ్ర విమర్శలు
జగిత్యాల (రూరల్) డిసెంబర్ 13 (ప్రజా మంటలు):
జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకే రవి శంకర్,మాజీ మంత్రి రాజేశం గౌడ్జి,తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ పాల్గొన్నారు. ఈ... నన్ను ఆదరించి గెలిపిస్తే.... గ్రామ అభివృద్ధి చేస్తా :
గొల్లపల్లి డిసెంబర్ 13 (ప్రజా మంటలు,అంకం భూమయ్య):
గొల్లపల్లి మండల గ్రామ సర్పంచ్గా తనను గెలిపిస్తే గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని సర్పంచ్ అభ్యర్థి, బీసీ బిడ్డ ఆవుల జమున సత్యం యాదవ్ ప్రకటించారు.శనివారం గ్రామంలో ఆమె ఇంటింటా ప్రచారం నిర్వహించి,ఉంగరం గుర్తుకు ఓటు వేయాలని ప్రచారానికి వెళ్ళినప్పుడు గ్రామ ప్రజలందరూ సానుకూలంగా స్పందిస్తున్నారని,అధిక మెజారిటీతో... బాపూఘాట్ అభివృద్ధి, క్రైమ్–డ్రగ్స్ నియంత్రణపై ప్రభుత్వ నిర్లక్ష్యం -కవిత విమర్శ
హైదరాబాద్ డిసెంబర్ 13 (ప్రజా మంటలు):
జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ జిల్లాలో నాలుగో రోజు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పర్యటించారు. శనివారం కార్వాన్ నియోజకవర్గ పరిధిలోని బాపూఘాట్ను సందర్శించి, మహాత్మా గాంధీ విగ్రహానికి నివాళులు అర్పించారు. అనంతరం బాపూఘాట్ నుంచి లంగర్ హౌస్ దర్గాకు ఆటోలో ప్రయాణించి దర్గా వద్ద... రాజస్థాన్ గ్రామాల నుంచి ప్రపంచ వేదిక వరకు ..
ఆడపిల్లలకు ఆరాధ్యదైవం
భారతదేశానికి చెందిన సామాజిక ఉద్యమకారిణి సఫీనా హుసేన్ మరోసారి దేశానికి గర్వకారణంగా నిలిచారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్యకు దూరమైన బాలికల కోసం చేసిన అసాధారణ కృషికి ఆమెకు ప్రతిష్టాత్మక ‘వైజ్ (WISE – World Innovation Summit for Education) అవార్డు’ లభించింది. ఈ అవార్డు అందుకున్న మొదటి భారతీయ మహిళగా... దేశమే ప్రథమం – విభజన భాషకు చోటు లేదు: అండమాన్లో మోహన్ భాగవత్ కీలక సందేశం
పోర్ట్ బ్లెయిర్ డిసెంబర్ 13:
జాతీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) సర్సంఘచాలక్ మోహన్ భాగవత్ దేశభక్తి, జాతీయ ఏకత్వంపై గట్టి సందేశం ఇచ్చారు. దేశాన్ని అన్ని విషయాల కంటే ముందుగా ఉంచాలని, ఇది భారత్ కోసం జీవించే సమయం కానీ చనిపోయే సమయం కాదని స్పష్టం చేశారు. “మన దేశంలో మన దేశ భక్తి... యూపీ ఎన్నికలు – యోగి నాయకత్వానికే ఆర్ఎస్ఎస్ ముద్ర: వ్యతిరేక ప్రచారానికి చెక్, బీజేపీలో స్పష్టత
లక్నో డిసెంబర్ 13:
ఉత్తరప్రదేశ్ ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో బీజేపీ–ఆర్ఎస్ఎస్ మధ్య జరిగిన కీలక భేటీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆర్ఎస్ఎస్ సర్సంఘచాలక్ మోహన్ భగవత్తో సమావేశం అనంతరం బీజేపీలో స్పష్టమైన సంకేతాలు వెలువడ్డాయి. యూపీ ఎన్నికలకు సీఎం యోగి ఆదిత్యనాథ్ నాయకత్వంలోనే వెళ్లాలన్నది ఆర్ఎస్ఎస్ స్పష్టమైన సందేశంగా పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.
ఈ... 