ధర్మపురి దేవస్థానంలో రథోత్సవానికి భారీ ఏర్పాట్లు

On
ధర్మపురి దేవస్థానంలో రథోత్సవానికి భారీ ఏర్పాట్లు

ధర్మపురి దేవస్థానంలో రథోత్సవానికి భారీ ఏర్పాట్లు

(రామ కిష్టయ్య సంగన భట్ల.)
...................................
   
 సుప్రసిద్ధ పుణ్య క్షేత్రమైన ధర్మపురి దేవస్థానంలో నిర్వహిస్తున్న లక్ష్మీనరసింహ, శ్రీవేంకటేశ్వర స్వాముల బ్రహ్మోత్సవాలలో ప్రధాన ఘట్టమైన రథోత్సవం శుక్ర వారం నిర్వహించ నున్నందున అధిక మవుతున్న భక్తుల రద్దీ దృష్ట్యా దేవస్థానం, మున్సిపల్,  ఇతర సంబంధిత అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. కల్యాణ మహోత్సవ, తెప్పోత్సవ, డోలోత్సవాది కార్యక్రమాలు, ఉత్తర, దక్షిణ దిగ్యాత్రలు విజయవంతంగా పూర్తి చేసుకుని, వేద సదస్యం, భోగమంటపం, సంగీత సభలను ముగించుకున్న శ్రీనృసింహుడు, సకలాభరణ శోభితయై వెలుగొందుచున్న లక్ష్మీదేవితో కూడి, తమ ఏకాంత మందిరాన నిద్రించుచున్న సమయాన, గుర్తు తెలియని వ్యక్తులెవరో దొంగ చాటున ప్రవేశించి మహాలక్ష్మి నగలన్నీ దోచుకుని వెళతారు. తెల్లవారి నిద్రలేచి జరిగిన విషయాన్ని లక్ష్మీదేవి ద్వారా గ్రహించిన నారసింహుడు, కైలాస గిరీశుడైన అభయం కరుడు శంకరుడు, కలియుగ దైవమైన వేంకటేశ్వ రుడు తోడురాగా, రథారూఢులై బయలుదేరి దొంగలను కనుగొని, వారిని బంధించి దిగ్విజయంగా తిరిగి రావడం పురి క్షేత్ర రథోత్సవ ప్రత్యేకత. అనాదిగా ఆచరిస్తున్న సంప్రదాయాచరణలో భాగంగా దేవస్థాన ప్రాంగణాన గల, దివంగత ధర్మపురి దానకర్ణులు దివంగతులైన కోరిడె సదాశివు రాంబాయమ్మ దంపతులు ప్రత్యేకించి తయారు చేయించి దేవస్థానానికి బహూకరించిన లక్ష్మీనర సింహ, శ్రీరామలింగేశ్వర, రాష్ట్ర మాజీ మంత్రి కర్నె వెంకట కేశవుల హయంలో దేవస్థానం తయారు చేయించిన వేంకటేశ్వర స్వాముల రథాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. అధిక సంఖ్యలో భక్తులు, యాత్రికులు రథోత్సవంలో భాగస్వాములు కానున్నందున సౌకర్యాలు, వసతులు కల్పనపై దృష్టి పెట్టి వివిధ శాఖల పక్షాన ఏర్పా ట్లను చేశారు. జగిత్యాలతోపాటు ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, ఆర్మూర్, కోరుట్ల, మెట్పల్లి, కామారెడ్డి, భైంసా, వరంగల్, కరీంనగర్ డిపోల నుండి ప్రత్యేక జాతర బస్సులను నడుపుతున్నారు.

మొక్కులు తీర్చుకున్న భక్తులు...
దైవ దర్శనాలకు వేచి ఉన్న భక్తజనం

 ధర్మపరి క్షేత్రంలో నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాలలో అంతర్భాగంగా గురు వారం నిర్వహించిన శ్రీవేంకటేశ్వర ఉత్తర, దక్షిణ దిగ్యాత్రల సందర్భంగా వంశపారంపర్య ఆచార ఆచరణ నేపథ్యంలో రాష్ట్రం నలు మూలల నుండే కాక, మహారాష్ట్ర తదితర సుదూర ప్రాంతాల నుండి ఏతెంచిన భక్తజన దేవస్థానంలో మొక్కులు తీర్చుకున్నారు. పిల్లా పాపలతో గోదావరి నదికి మూదా ముళ్ళీ వెత్తిన పెట్టుకు వచ్చిన భక్తులు, మంగళ స్నానాలను ఆచరించి, గోదావరి మాతను ఆర్పించి, దానధర్మా దులను ఆచరించి, వివిధ ఆలయాలలో దైవ దర్శనాలు చేసుకున్నారు. ప్రధానంగా కలియుగ దైవమైన శ్రీవేంకటేశ్వర మందిరంలో చిరకాల వాంఛలు ఈడేర్చాలని ప్రార్ధిస్తూ మొక్కులు తీర్చుకున్నారు. ముడుపులు చెల్లించుకున్నారు.

సంప్రదాయ రీతిలో వేద సదస్యం 

దేవస్థానంలోని శేషప్ప కళావేదికపై రాత్రి సాంప్రదాయ రీతిలో వేద సదస్యం నిర్వహించారు. యోగానంద, ఉగ్ర నరసింహ, వేంకటేశ్వర బ్రహ్మోత్సవాలలో భాగంగా కల్యాణం, విహారం, ఉత్తర, దక్షిణ దిగ్యాత్ర  అనంతరం శేషప్ప కళా వేదికపై 
ఏటా వేద పండితులచే వేద సదస్సును నిర్వహించడం ఆనవాయితీ. రుక్, యజుర్, సామ, ఆధర్వణ వేదాలచే దైవారాధన చేయడానికి నిర్ణయించిన క్రమంలో  క్షేత్ర వేద పండితులు, అర్చకులే కాక, లబ్ధప్రతిష్ఠులైన స్థానిక వేదవిదులు అపురూపంగా, అరుదుగా ఒకే వేదికపై ఆసన్నులై, వేద సదస్సు నిర్వహించారు. అధ్యాత్మిక ప్రసంగాలు చేశారు.

Tags

More News...

National  International   State News 

మ్యూనిచ్ లో రేవంత్ రెడ్డి బృందానికి ఘన స్వాగతం

మ్యూనిచ్ లో రేవంత్ రెడ్డి బృందానికి ఘన స్వాగతం మ్యూనిచ్ లో రేవంత్ రెడ్డి బృందానికి ఘన స్వాగతం మ్యూనిచ్ జనవరి 20: దావోస్ వరల్డ్ ఎకనమిక్ ఫోరం (World Economic Forum) సదస్సులో పాల్గొనడానికి జ్యూరిచ్ చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందానికి విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది.  ముఖ్యమంత్రి, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఉన్నతాధికారుల ప్రతినిధి బృందం జ్యూరిచ్ విమానాశ్రయం చేరుకోగానే అక్కడ...
Read More...
Local News 

ముదిరాజ్​లను బీసీ 'డీ' నుంచి బీసీ 'ఏ' లోకి మార్చాలి

ముదిరాజ్​లను బీసీ 'డీ' నుంచి బీసీ 'ఏ' లోకి మార్చాలి ముదిరాజ్​లను బీసీ 'డీ' నుంచి బీసీ 'ఏ' లోకి మార్చాలి- అఖిల భారతీయ కోలి ముదిరాజ్ జాతీయ కార్యవర్గ తీర్మానం సికింద్రాబాద్​, జనవరి 20 ( ప్రజామంటలు): దీర్ఘకాలికంగా పెండింగ్​ లో ఉన్న ముదిరాజ్​ కమ్యూనిటీని బీసీ డీ నుంచి బీసీ ఏ లోకి మార్చే ప్రతిపాదనను వెంటనే అమలు చేయాలని పలువురు వక్తలు...
Read More...
Local News 

పిల్లల భద్రతే  మాకు ముఖ్యం, రోడ్డు ప్రమాద నివారణలో అందరూ భాగస్వాములు కావాలి: జిల్లా ఎస్పి శ్రీ అశోక్ కుమార్

పిల్లల భద్రతే  మాకు ముఖ్యం, రోడ్డు ప్రమాద నివారణలో అందరూ భాగస్వాములు కావాలి: జిల్లా ఎస్పి శ్రీ అశోక్ కుమార్ పిల్లల భద్రతే  మాకు ముఖ్యం, రోడ్డు ప్రమాద నివారణలో అందరూ భాగస్వాములు కావాలి: జిల్లా ఎస్పి శ్రీ అశోక్ కుమార్    జగిత్యాల జనవరి 20  (ప్రజా మంటలు):స్కూల్ వాహనాలకు ఎలాంటి చిన్న ప్రమాదం జరిగిన సంబంధిత డ్రైవరు, యాజమాన్యం పై  కఠినంగా వ్యవహరిస్తాం.విద్యాసంస్థల ప్రతి వాహనానికి తప్పనిసరిగా రోడ్  ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వారి చే...
Read More...
Local News 

ప్రవేట్ స్కూల్ బస్సులను తనిఖీ చేసిన ఎస్ఐ సిహెచ్.సతీష్ 

ప్రవేట్ స్కూల్ బస్సులను తనిఖీ చేసిన ఎస్ఐ సిహెచ్.సతీష్  ప్రవేట్ స్కూల్ బస్సులను తనిఖీ చేసిన ఎస్ఐ సిహెచ్.సతీష్  గొల్లపల్లి జనవరి 20 (ప్రజా మంటలు): జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకురోడ్డు మరియు రహదారి భద్రత  మాసవోత్సవం   సందర్భంగా  గొల్లపల్లి మండల లోని ప్రైవేట్ స్కూల్ బస్సులను  ఎస్ఐ,సతీష్ తనిఖీలు చేశారు. ఆయన మాట్లాడుతూ, మాట్లాడుతూ పిల్లల్ని స్కూలుకు ఇంటికి వరకు...
Read More...
Local News 

భార్య చనిపోగా భర్త మానసిక వేదనతో  ఆత్మహత్య

భార్య చనిపోగా భర్త మానసిక వేదనతో  ఆత్మహత్య భార్య చనిపోగా భర్త మానసిక వేదనతో ఆత్మహత్య ఇబ్రహీంపట్నం జనవరి 20( ప్రజా మంటలు): ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని  గోదురు గ్రామానికి చెందిన రెబ్బసి శాంత మూడు నెలల క్రితం మరణించగా తన భర్త రెబ్బసి ఆశన్న, భార్య గురించి తలుచుకుంటూ మానసిక వేదనకు గురవుతూ ప్రతిరోజు బాధపడుతుండెవాడని  సోమవారం  ఇటలీ ఎవరు లేని సమయంలో...
Read More...
Local News 

మధ్యాహ్న భోజన పథకం లో పెరిగిన ధరలకు అనుగుణంగా బిల్లులు ఇవ్వాలి - వర్కర్స్ యూనియన్ వినతి పత్రం

మధ్యాహ్న భోజన పథకం లో పెరిగిన ధరలకు అనుగుణంగా బిల్లులు ఇవ్వాలి - వర్కర్స్ యూనియన్ వినతి పత్రం   మధ్యాహ్న భోజన పథకం లో పెరిగిన ధరలకు అనుగుణంగా బిల్లులు ఇవ్వాలి - వర్కర్స్ యూనియన్ వినతి పత్రం మెట్టుపల్లి జనవరి 20( ప్రజా మంటలు) తెలంగాణ రాష్ట్ర ఏఐటీయూసీ అనుబంధ మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో  పెరిగిన ధరలకు అనుగుణంగా బిల్లులు ఇవ్వాలని మెట్పల్లిలోని మండల విద్యాశాఖ అధికారికి మధ్యాహ్న భోజన...
Read More...
Local News 

మీత అయ్య వార్ల అధ్యక్షునిగా తిరు కోవేల నరసయ్య, 

మీత అయ్య వార్ల అధ్యక్షునిగా తిరు కోవేల నరసయ్య,  మీత అయ్య వార్ల అధ్యక్షునిగా తిరు కోవేల నరసయ్య,  మెట్టుపల్లి జనవరి 26 (ప్రజా మంటలు) మెట్టుపల్లి  డివిజన్ మిత అయ్యవారు అధ్యక్షుని గా తిరు కోవెల  నరసయ్య, ఉపాధ్యక్షులుగా సాత్పడిఅశోక్, ప్రధాన కార్యదర్శిగా గడ్డల కాంతయ్య, కోశాధికారి గా ధర్మపురి పురుషోత్తం ను ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డారు మెట్టుపల్లి లో సోమవారం జరిగిన మిత అయ్యవార్ల...
Read More...
Local News 

ధర్మపురి క్షేత్రాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి  ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ 

ధర్మపురి క్షేత్రాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి  ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్  ధర్మపురి క్షేత్రాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి  ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్  ధర్మపురి జనవరి 20:   దక్షిణ కాశీగా, హరిహర క్షేత్రంగా, గోదావరి తీరాన వెలసి, మున్సిపాలిటీ, మండల, నియోజక వర్గ కేంద్రంగా, నిత్య భక్త జన సందడితో అలరారే ధర్మపురి క్షేత్రం సమగ్రాభివృద్ధికి కృషి సల్పగనని ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరిలక్ష్మణ్ కుమార్...
Read More...
Local News 

కాంగ్రెస్​ నేతలు కంటి పరీక్షలు  చేయించుకోవాలి  * బీఆర్​ఎస్​ హాయంలో చేసిన పనులు కనిపించడం లేదా..?

కాంగ్రెస్​ నేతలు కంటి పరీక్షలు  చేయించుకోవాలి  * బీఆర్​ఎస్​ హాయంలో చేసిన పనులు కనిపించడం లేదా..? కాంగ్రెస్​ నేతలు కంటి పరీక్షలు  చేయించుకోవాలి  * బీఆర్​ఎస్​ హాయంలో చేసిన పనులు కనిపించడం లేదా..? సికింద్రాబాద్, జనవరి 20 (ప్రజామంటలు): బీఆర్​ఎస్​ ప్రభుత్వం చేసిన అభివృద్ది పనులు కాంగ్రెస్​ నాయకులకు కనింపించకపోతే, కంటి పరీక్షలు చేయించుకోవాలని బన్సీలాల్​ పేట డివిజన్​ బీఆర్​ఎస్​ ప్రెసిడెంట్​ ఎల్​.వెంకటేశన్​ రాజు పేర్కొన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ...మాజీ మంత్రి,...
Read More...
Local News 

ప్రతి బ్యాంక్ ఏటీఎం వద్ద తప్పనిసరిగా  సెక్యూరిటీ గార్డు, సిసి కెమెరాలు, అలారం సిస్టం ఏర్పాటు చేయాలి

ప్రతి బ్యాంక్ ఏటీఎం వద్ద తప్పనిసరిగా  సెక్యూరిటీ గార్డు, సిసి కెమెరాలు, అలారం సిస్టం ఏర్పాటు చేయాలి ఎస్పీ అశోక్   జగిత్యాల జనవరి 20(  ప్రజా మంటలు  )జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా  వ్యాప్తంగా  ఉన్న  వివిధ బ్యాంకుల్లో పని చేస్తున్న బ్యాంకు అధికారులతో  బ్యాంకుల, ఏటీఎంల  వద్ద భద్రతా ప్రమాణాలు, సిసి కెమెరాల ఏర్పాటు, ఆర్థిక నేరాలు, గతంలో   జరిగిన బ్యాంకు మరియు ఏటీఎం సంబందించిన నేరాల గురించి, భవిష్యత్తు లో...
Read More...
Local News 

మాదిగల మహా ప్రదర్శనకు బీసీలుగా మద్దతిద్దాం బీసీ నేత దరువు అంజన్న

మాదిగల మహా ప్రదర్శనకు బీసీలుగా మద్దతిద్దాం  బీసీ నేత దరువు అంజన్న   జగిత్యాల జనవరి 20(ప్రజా మంటలు   )      ఫిబ్రవరి ఏడవ తారీఖున హైదరాబాద్ మహానగరంలో మందకృష్ణ మాదిగ జరపతల పెట్టిన లక్ష డప్పులు వేల గొంతుల మహాప్రదర్శనకు బీసీలుగా తరలిరావాలని బీసీ కవులు కళాకారులు మేధావుల ఐక్యవేదిక కన్వీనర్  దరువు అంజన్న పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలో విలేకరుల సమావేశం లో   ఉద్యమకారులు,కవి మోహన్ బైరాగి మాట్లాడుతూ ,...
Read More...