ఆరునెలల పాటు గోదావరి ఒడిలో ఉండే శివయ్య.. ధ్వజ స్తంభం లేని, శ్రీరాముడు సైకతం తో చేసిన లింగమే ఈ శివాలయం
నందిపేట సెప్టెంబర్ 12 (ప్రజా మంటలు)
పవిత్ర భారతదేశంలో ఎన్నో శివాలయాలు ఉన్నాయి. అందులో కొన్నింటికి మాత్రమే చారిత్రక నేపథ్యం ఉందని రాయికల్ పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (బాలురు) తెలుగు పండితులు చెరుకు మహేశ్వర శర్మ తెలిపారు.
శతాబ్దాల చరిత్రను తమలో దాచుకున్న కొన్ని ఆలయాల్లో అడుగడుగునా వింతలు విశేషాలు నేటికీ మనల్ని ఆశ్చర్యపరుస్తూనే ఉంటాయని చెప్పారు.
అలాంటి అద్భుతమైన శివాలయం నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం ఉమ్మెడ గ్రామంలో ఉందని అన్నారు. అక్కడ కొలువైన శివుడు ఏడాదిలో ఆరు నెలలు మాత్రమే భక్తులకు దర్శనమిచ్చి మిగతా ఆరు నెలలు గోదారమ్మ ఒడిలోకి చేరిపోతాడు అక్కడ గర్భగుడికి ద్వారం ఉండదు ఆలయంలో ధ్వజస్తంభం కనిపించదు .ఇలాంటి ఎన్నో ప్రత్యేకతలు ఉమ్మెడ ఉమా మహేశ్వరుడి ఆలయ సన్నిధిలో భక్తులను ఆశ్చర్య పరుస్తాయి.
చుట్టూ విశాలమైన నీలాకాశం.. కనుచూపు మేరలో గోదావరి తీరం.. ఆధ్యాత్మిక వెలుగులు ప్రసరించే ప్రాంతం..
కోదండరాముడు నడయాడిన పవిత్ర ప్రదేశం.. సైకత లింగం కొలువుదీరిన పరమ పవిత్ర పుణ్యక్షేత్రం.. ఉమా మహేశ్వరుడి సన్నిధి.
ఉమామహేశ్వర పుణ్యక్షేత్రానికి వెయ్యేళ్ల చరిత్ర ఉందని స్థానికులు తెలిపారు. కాశీలో ఉన్నట్లుగానే.. ఇక్కడ కొలువైన శివలింగంపై త్రినేత్రం కనిపిస్తుందని చెబుతారు. కల్యాణ చాణక్యులు ఈ ఆలయాన్ని నిర్మించారని శాసనాలు చెబుతున్నాయి. ఆలయ మండపానికి మూడు ముఖ ద్వారాలు ఉంటాయి. సాక్షాత్తు శ్రీరాముడు చేసిన సైకత లింగమే ఇక్కడ కొలువు దీరిందని పురాణాలు చెబుతున్నాయి.
ఈ ఆలయంలో ప్రత్యేతక ఏంటంటే గర్భగుడికి తలుపులు ఉండవు. సాధారణంగా మనం ఏ ఆలయానికి వెళ్లిన ముందుగా ధ్వజస్తంభం కనిపిస్తుంది. కానీ ఉమామహేశ్వర ఆలయంలో ధ్వజస్తంభం ఉండదు.
కేవలం ఆరు నెలలు మాత్రమే ఉమా మహేశ్వరస్వామి దర్శనం భక్తులకు కలుగుతుంది. మిగతా ఆరు నెలలు స్వామి గోదావరి ఒడిలోకి చేరిపోతారు. ఏటా గోదావరికి వరదలు వచ్చినప్పుడల్లా.. ఆలయం పూర్తిగా నీట మునిగిపోతుంది. ఎగువ మహారాష్ట్రలో భారీ వర్షాలు కురిసినా.. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకున్నా… ఇక్కడి శివాలయం గోదావరి ఒడిలోకి వెళ్లిపోతుంది. సుమారు 6 నెలల పాటు పూజలు, ధూపదీప నైవేధ్యాలు పూర్తిగా నిలిచిపోతాయి. గోదావరి జోరు తగ్గిన తర్వాత మళ్లీ ఆలయాన్ని శుద్ధి చేసి నిత్య పూజలు చేస్తుంటారు.
ఉమ్మెడ లో కొలువైన ఉమా మహేశ్వరుడి ని కోరిన కోర్కెలు తీర్చే స్వామిగా భక్తులు నమ్ముతారు. ఏడాదిలో ఆరు నెలలు మాత్రమే స్వామి దర్శనానికి అవకాశం ఉండడంతో ఎక్కడెక్కడి నుంచో ఈ ఆలయానికి తరలివస్తుంటారు. ఇక శివరాత్రి, కార్తీకమాసాల్లో ఆలయం వేలాది భక్తజనులతో రద్దీగా మారిపోతుంది.
ప్రతిఏడాది దాదాపుగా ఆరు నెలల పాటు నీట్లోనే ఉన్నా.. ఆలయం మాత్రం చెక్కు చెదరదు.సాధారణంగా అంతకాలం పాటు నీట్లో ఉంటే ఎలాంటి నిర్మాణమైనా కొన్నేళ్లకు శిథిలావస్థకు చేరుకుంటుంది.
కానీ ఉమా మహేశ్వరుడి ఆలయం విషయంలో అలాంటిదేమీ జరగలేదు.
దాదాపు వెయ్యేళ్ల కింద నిర్మాణం జరిగినా… ఇప్పటికీ అంతే బలంగా ఉంది.ఇప్పుడు నీట మునిగినందున మరో ఆరు నెలల వరకు స్వామి దర్శనం దొరకదు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు 1075 అడుగులకు చేరుకోగానే ఆలయంలోకి బ్యాక్ వాటర్ వస్తుంది. 1085 అడుగులకు చేరుకోగానే శ్రీ ఉమ మహేశ్వర ఆలయం గర్భగుడి పూర్తిగా నీటిలో మునిగిపోతుంది. ప్రాజెక్టు నీటి మట్టం 1070 అడుగులకు చేరుకోనేంత వరకు ఆలయం అలాగే ఉంటుంది. ప్రతి సంవత్సరం మహాశివరాత్రి ఉత్సవాలకు ఉమా మహేశ్వరుడు ప్రజలకు దర్శనం ఇస్తారని ఆలయ ప్రధాన అర్చకులు తెలిపారు.
**.
చెరుకు మహేశ్వర శర్మ తెలుగు పండితులు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలురు రాయికల్, జగిత్యాల
More News...
<%- node_title %>
<%- node_title %>
నిద్రపోయిన విద్యార్థుల కళ్లకు జిగురు పోసిన అగంతకులు

వరంగల్ సిటీ విశ్రాంత ఉద్యోగుల నూతన కార్యవర్గం

భారతదేశంపై కన్ను వేసిన చైనా - టిబెట్ ప్రవాస ప్రభుత్వ మాజీ ప్రధాని లోబ్సాంగ్ సంగే హెచ్చరిక

గాంధీ సూపరింటెండెంట్తో జూడా ప్రతినిధుల భేటీ

అంగరంగ వైభవంగా కొనసాగిన వామన పురాణం

అంగన్వాడీ కేంద్రంలో, సంచార జాతుల వారి మధ్యలో స్కై ఫౌండేషన్ వేడుకలు

మైనార్టీలకు కాంగ్రెస్ పార్టీ సదా అండగా ఉంటుంది - రాష్ర్ట మంత్రి వివేక్ వెంకటస్వామి

మాజీ మంత్రి హరీష్ రావును కలిసిన మాజీ మంత్రి రాజేశం గౌడ్

సైన్స్ ల్యాబ్ నిర్మూణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

సింగరేణి ఎన్నికల్లో గెలవబోయేది మనమే - కల్వకుంట్ల కవిత

జగిత్యాల జిల్లా పెగడపల్లి ఎమ్మార్వో రవీందర్ పై కేసు నమోదు

గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ గా ప్రొ. వాణి బాధ్యతల స్వీకరణ
