పేద ప్రజల అభ్యున్నతే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వ పాలన.- మంత్రి శ్రీధర్ బాబు 

On
పేద ప్రజల అభ్యున్నతే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వ పాలన.- మంత్రి శ్రీధర్ బాబు 

మంథని ఆగస్ట్ 02 (ప్రజా మంటలు):

ప్రతి కుటుంబానికి నెలకు సగటున 1200 రూపాయల విలువ గల సన్న బియ్యం ఉచితంగా అందిస్తున్నామని, పేద ప్రజల అభ్యున్నతి లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పాలన కొనసాగుతుందని రాష్ట్ర ఐటి, పరిశ్రమలు శాసన సభ వ్యవహారాల శాఖా డి. శ్రీధర్ బాబు అన్నారు.

ఆర్ఆర్ గార్డెన్స్ లో నిర్వహించిన నూతన రేషన్ కార్డుల పంపిణీ, మహిళా శక్తి సంబరాలు కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్నారు.

మహిళల కోసం మంథని సమీపంలో ప్రత్యేక పారిశ్రామిక పార్క్ ఏర్పాటుకు కృషి చేస్తున్నామని, టి హబ్ ఉప కేంద్రం పెద్దపల్లి జిల్లాలో ఏర్పాటు చేస్తామని అన్నారు.

అర్హులైన పేద ప్రజలకు రేషన్ కార్డుల జారీ చేయాలని ప్రతిపక్షంలో అనేక సందర్భాలలో ధర్నాలు చేసినప్పటికీ గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని అన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం అర్హులకు నూతన రేషన్ కార్డులతో పాటు 50నుంచి 60 రూపాయల విలువ చేసే సన్న బియ్యం సరఫరా చేస్తున్నామని అన్నారు.IMG-20250802-WA0003 

రేషన్ ద్వారా దొడ్డు బియ్యం సరఫరా చేయడం ద్వారా రీసైక్లింగ్ గురై అక్రమార్కులు మాత్రమే బాగు పడ్డారని, నేడు సన్న బియ్యం సరఫరా పేద ప్రజలకు ఉపయోగ పడుతుందని అన్నారు. ప్రతి కుటుంబానికి సగటున నెలకు 1200 రూపాయల విలువ గల బియ్యం ఉచితంగా పంపిణీ చేస్తున్నామని అన్నారు.

రేషన్ డీలర్లు బియ్యం పంపిణీ కార్యక్రమం సక్రమంగా చేయాలని అన్నారు. పేద ప్రజలకు నాణ్యమైన విద్య అందించడం కోసం పెద్ద ఎత్తున ఆదర్శ పాఠశాలలను మన హయాంలో ఏర్పాటు చేశామని మంత్రి గుర్తు చేశారు. వేములవాడ రాజన్న, కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి, సమక్క సారలమ్మ జాతర వెళ్లడానికి, రాష్ట్రంలో ఎక్కడికైనా మహిళలు ఉచితంగా ప్రయాణం చేసేందుకు ఆర్టీసీ బస్సుల్లో ప్రభుత్వం సౌకర్యం కల్పించిందని అన్నారు

 పేద ప్రజల అభ్యున్నతే లక్ష్యంగా రాష్ట్రంలో ప్రభుత్వ పాలన సాగుతోందని రాష్ట్ర ఐటి, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖా మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు కోరారు. శనివారం మంథని ప్రాంతంలో రాష్ట్ర మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్షతో కలిసి ఆర్ఆర్ గార్డెన్స్ లో నిర్వహించిన నూతన రేషన్ కార్డుల పంపిణీ, మహిళా శక్తి సంబరాలు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. 

ఆర్టీసీ బస్సులు ఉచితంగా ప్రయాణించే మహిళలకు ఇప్పటి వరకు 200 కోట్ల పైగా జీరో టికెట్లు జారీ చేసి 6680 కోట్ల రూపాయలు మహిళల తరఫున ప్రభుత్వం చెల్లించిందని అన్నారు. పేద ప్రజల కుటుంబాలకు నెలకు 200 యూనిట్ల విద్యుత్ ఉచితంగా సరఫరా చేస్తున్నామని అన్నారు. మహిళలకు వడ్డీ లేని రుణాల పథకం డబ్బులను గత ప్రభుత్వం జమ చేయ లేదని మంత్రి విమర్శించారు.IMG-20250802-WA0005 

ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాల కార్యక్రమం మళ్ళీ ప్రారంభించామని అన్నారు. మహిళలు వ్యాపార రంగంలో అభివృద్ధి చెందేందుకు ప్రత్యేకంగా ఇండస్ట్రియల్ పార్క్ మహిళల కోసం ఏర్పాటు చేస్తున్నామని మంత్రి తెలిపారు. మహిళలకు వ్యాపార నైపుణ్యాలలో శిక్షణ అందించేందుకు వీ-హబ్ ఉప కేంద్రం పెద్దపెల్లి జిల్లాలో ఏర్పాటు చేస్తామని మంత్రి తెలిపారు. ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం కింద డైయిరీ, పౌల్ట్రీ ఫార్మ్ ఏర్పాటు చేసుకునేందుకు ప్రణాళికలు తయారు చేయాలని అన్నారు.

మహిళలకు మంథని లో కుట్టు మిషన్ శిక్షణ అందిస్తున్నామని, రాబోయే కాలంలో కొన్ని కంపెనీలను ఇక్కడ ఏర్పాటు ప్రతిపాదనలు ఆలోచిస్తున్నామని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వస్తువుల కల్పన పనులను అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా చేపట్టామని అన్నారు.

రైతు సోదరులకు ఒకే సంవత్సరంలో 21 వేల కోట్ల రూపాయల ఖర్చు చేసి 2 లక్షల రుణ మాఫీ పూర్తి చేశామని అన్నారు. 9 రోజుల వ్యవధిలో 9 వేల కోట్ల రైతు భరోసా సోమ్ము విడుదల చేశామని అన్నారు. ఆరోగ్య శ్రీ పరిమితి 10 లక్షలకు పెంచామని, మొదటి సంవత్సరంలో 60 వేల నిరుద్యోగ యువతకు ప్రభుత్వ నియామక పత్రాలు పంపిణీ చేశామని అన్నారు. ప్రైవేట్ రంగంలో యువతకు ఉపాధి కల్పించాలని గతంలో ఎన్నడు లేని విధంగా భారీ ఎత్తున పెట్టుబడులను ఆకర్షించడం జరిగిందని అన్నారు. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నామని అన్నారు. మంథని నియోజకవర్గ పరిధిలో మొదటి దశలో 3500 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తున్నామని అన్నారు. చివరి లబ్ధిదారుడి వరకు ఇల్లు చేరేలా ఇందిరమ్మ ఇండ్ల పథకం కొనసాగుతుందని, ప్రతి సంవత్సరం నూతనంగా ఇండ్లు మంజూరు చేస్తామని ప్రజలు ఎవరూ ఆందోళన చెందవద్దని మంత్రి తెలిపారు.

ఇండ్ల స్థలాలు లేని నిరు పేదలకు ప్రభుత్వ భూములను కేటాయించి ఇందిరమ్మ ఇండ్లు కట్టించే సంకల్పం చేస్తున్నామని అన్నారు. అడవి సోమన పల్లి లో 200 కోట్లు ఖర్చు చేసి కార్పొరేట్ స్థాయికి దీటుగా ఉండేలా ఇండియా సమీకృత గురుకుల పాఠశాల నిర్మాణం చేస్తున్నామని అన్నారు. గురుకులాల్లో చదివే పిల్లలకు 40 శాతం డైట్ చార్జీలు పెంచామని అన్నారు.

మండలాలకు చెందిన 2389 స్వశక్తి మహిళా సంఘాలకు 2 కోట్ల 37 లక్షల వడ్డీ రాయితీ చెక్కు, సహజంగా మరణించిన 17 మంది సంఘ సభ్యులకు 14 లక్షల 66 వేల 344 రూపాయల లోన్ బీమా చెక్కు, ప్రమాదవశాత్తు మరణించిన ఒక మహిళా సంఘ సభ్యురాలి కుటుంబానికి 10 లక్షల రూపాయల ప్రమాద బీమా చెక్కు, 385 శివశక్తి మహిళా సంఘాలకు 30 కోట్ల రూపాయల బ్యాంకు లింకేజీ రుణాల చెక్కులను మంత్రి పంపిణీ చేశారు. క్రిస్టియన్ కార్పొరేషన్ ద్వారా మూడు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. 

అంతకుముందు మంథని పట్టణం లో పెట్రోల్ బంక్ ఏరియా ,పెద్దపల్లి రోడ్డు, గోదావరిఖని రోడ్డులో 6 కోట్ల 70 లక్షల రూపాయలతో నెలకొల్పిన సెంట్రల్ లైటింగ్ వ్యవస్థను, రామగిరి మండలం కల్వచర్ల గ్రామంలో 2 కోట్ల 60 లక్షల రూపాయల నిధులతో కల్వచర్ల నుంచి లోంక కేశారం వరకు నిర్మించిన సిసి రోడ్డును మంత్రి ప్రారంభించారు.

మంథని ఎంపీడీవో కార్యాలయం వద్ద మంథని పట్టణంలో 20 కోట్ల 50 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించే 410 ఇందిరమ్మ ఇండ్ల పైలాన్, 7 గ్రామాలలో కోటి 40 లక్షలతో నిర్మించే గ్రామపంచాయతీ భవనాలకు, ఎక్లాస్పూర్ గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2 కోట్ల 70 లక్షలతో నూతనంగా నిర్మించబోతున్న బాయ్స్ హాస్టల్ భవనానికి మంత్రి శ్రీధర్ బాబు శంకుస్థాపన చేశారు.

ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో సింగరేణి సిఎస్ఆర్ నిధుల కింద పదో తరగతి విద్యార్థులకు ఉపయోగపడే క్యూఆర్ కోడ్ పుస్తకాలు పంపిణీ చేసారు. అటవీశాఖ& మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వనమహోత్సవం కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు

.ఈ కార్యక్రమంలో కలెక్టర్ శ్రీ హర్ష, అదనపు కలెక్టర్ దాసరి వేణు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ నన్నయ గౌడ్, ఆర్డిఓ సురేష్, తహసిల్దార్, ఎంపిడిఓ, సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

Tags

More News...

Local News  Spiritual  

శ్రీ కోటిలింగేశ్వర స్వామి దేవాలయ నూతన కమిటీ ప్రమాణ స్వీకారం

శ్రీ కోటిలింగేశ్వర స్వామి దేవాలయ నూతన కమిటీ ప్రమాణ స్వీకారం పాల్గొన్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఆలయంలో ప్రత్యేక పూజలు  ఆలయ కమిటీ అధ్యక్షులుగా పుదారి రమేష్ ప్రమాణ స్వీకారం  (అంకం భూమయ్య)  గొల్లపల్లి (వెల్గటూర్ )ఆగస్టు 03 (ప్రజా మంటలు):  వెల్గటూర్ మండలం కోటిలింగాలలో ప్రసిద్ధ కోటి లింగేశ్వర స్వామి దేవాలయాన్ని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మరియు వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి...
Read More...
Local News 

అనాధలకు దుప్పట్లు, దుస్తులు, ఔషధాలు పంపిణి

అనాధలకు దుప్పట్లు, దుస్తులు, ఔషధాలు పంపిణి సికింద్రాబాద్, ఆగస్టు 03 (ప్రజా మంటలు): హైదరాబాద్ నగరంలో రోడ్ల పక్కన ఫుట్ పాత్ ల మీద జీవనం సాగిస్తున్న అనాథలు, నిరాశ్రయులు, సంచార జాతుల వారికి స్కై ఫౌండేషన్ నిర్వాహకులు దుస్తులు, దుప్పట్లు, బిస్కెట్ ప్యాకెట్స్ పంపిణి చేశారు. ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో వివిధ రుగ్మతలతో బాధపడుతున్న వారిని గుర్తించి ఔషధాలను కూడా అందించారు....
Read More...
Local News 

గాంధీలో ట్రీట్మెంట్ పొందుతూ గుర్తుతెలియని వ్యక్తి మృతి

గాంధీలో ట్రీట్మెంట్ పొందుతూ గుర్తుతెలియని వ్యక్తి మృతి సికింద్రాబాద్,ఆగస్టు 02 సికింద్రాబాద్ ఆగస్ట్ 03 (ప్రజా మంటలు): గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందినట్లు చిలకలగూడ పోలీసులు తెలిపారు.  పద్మారావు నగర్ పెట్రోల్ బంక్ సమీపంలో కిందపడి ఉన్న గుర్తు తెలియని వ్యక్తి (50) గురించి కొందరు డయల్ 100 కు సమాచారం ఇచ్చారు. పెట్రోలింగ్ పోలీసు సిబ్బంది వెంటనే...
Read More...
Local News  State News 

ప్రభుత్వం మా దీక్షకు అనుమతి ఇవ్వాలనీ డిమాండ్ చేస్తున్నాం -ఎమ్మెల్సీ కవిత

ప్రభుత్వం మా దీక్షకు అనుమతి ఇవ్వాలనీ డిమాండ్ చేస్తున్నాం -ఎమ్మెల్సీ కవిత నా పై మరుగుజ్జుల వ్యాఖ్యలకు భయపడను ఆర్డినెన్సు పై బిజెపి స్పష్టమైన నిర్ణయం తీసుకోవడం లేదు - కవిత హైదరాబాద్ ఆగస్ట్ 03: బీసీ రిజర్వేషన్ ల సాధన కై తెలంగాణ జాగృతి 72 గంటల పాటు రేపటి నుంచి మూడు రోజులు నిరాహార దీక్ష చేస్తున్నాం. ప్రభుత్వం మా దీక్షకు అనుమతి ఇవ్వాలనీ డిమాండ్...
Read More...
National  State News 

త్వరలో డయాగ్నిస్టిక్  నమూనాల సేకరణపై కనిస ప్రమాణాల నిర్ణయం 

త్వరలో డయాగ్నిస్టిక్  నమూనాల సేకరణపై కనిస ప్రమాణాల నిర్ణయం  న్యూ ఢిల్లీ ఆగస్ట్ 03: డయాగ్నస్టిక్ నమూనా సేకరణ మరియు రవాణా విధానం కోసం కనీస ప్రమాణాలను త్వరగా తెలియజేస్తామని కేంద్రం ఢిల్లీ హైకోర్టుకు తెలిపింది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఢిల్లీ హైకోర్టుకు డయాగ్నస్టిక్ నమూనా సేకరణ మరియు నమూనా రవాణా విధానం కోసం కనీస ప్రమాణాలను త్వరగా తెలియజేస్తామని తెలియజేసింది. జూలై 18న జారీ...
Read More...
State News 

సృష్టి కేసులో పోలీస్ కస్టడికి మరో ఇద్దరు నిందితులు 

సృష్టి కేసులో పోలీస్ కస్టడికి మరో ఇద్దరు నిందితులు  ఏ–3 కళ్యాణి,ఏ–6–సంతోషి లకు గాంధీలో వైద్య పరీక్షలుడా.నమ్రతతో పాటు వీరిని విచారించిన పోలీసులు సికింద్రాబాద్, ఆగస్ట్ 02 (ప్రజామంటలు) : సికింద్రాబాద్ కోర్టు అనుమతితో సృష్టి కేసులోని మరో ఇద్దరు నిందితులను గోపాలపురం పోలీసులు శనివారం కస్టడీలోకి తీసుకున్నారు. అక్రమ సరోగసి, శిశువుల కొనుగోలు, విక్రయం తదితర అభియోగాలకు సంబందించిన కేసులో ఏ–3 నిందితురాలిగా...
Read More...
Local News 

శ్రీలత క్రియేషన్స్ బోటిక్ లో హునర్ ఆన్లైన్ కోర్సెస్ బ్రాంచి ప్రారంభించిన మాజీ జెడ్పీ చైర్పర్సన్ వసంత

శ్రీలత క్రియేషన్స్ బోటిక్ లో హునర్ ఆన్లైన్ కోర్సెస్ బ్రాంచి ప్రారంభించిన మాజీ జెడ్పీ చైర్పర్సన్ వసంత జగిత్యాల ఆగస్ట్ 2 (ప్రజా మంటలు) జిల్లా కేంద్రం లోని బ్రాహ్మణవాడలో శ్రీలత క్రియేషన్స్ బోటిక్ లో హునర్ ఆన్లైన్ కోర్సెస్ బ్రాంచి ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ దావ వసంత – సురేష్  రిబ్బన్ కట్ చేసి ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా దావ వసంత సురేష్ మాట్లాడుతూ మహిళలు...
Read More...
Local News  State News 

వైద్య ఆరోగ్యశాఖ పదోన్నతులలో అవినీతి అక్రమాలు అవాస్తవం  - రాష్ట్ర జనరల్ సెక్రెటరీ వెంకటేశ్వర్ రెడ్డి 

వైద్య ఆరోగ్యశాఖ పదోన్నతులలో అవినీతి అక్రమాలు అవాస్తవం  - రాష్ట్ర జనరల్ సెక్రెటరీ వెంకటేశ్వర్ రెడ్డి  సికింద్రాబాద్, ఆగస్ట్ 02 (ప్రజామంటలు):    వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టర్ ఆఫ్ హెల్త్ పరిధిలో ఇటీవల జరిగిన పదోన్నతులలో అవినీతి అక్రమాలు జరిగాయని అనడం పూర్తిగా అవాస్తవమని రాష్ర్ట  ప్రజారోగ్య వైద్య ఉద్యోగుల సంఘం ఐ ఎన్ టి యూ సి 3194 జనరల్ సెక్రటరీ బొందుగుల వెంకటేశ్వర్ రెడ్డి ఖండించారు.    శనివారం ఆయన యూనియన్ రాష్ట్ర...
Read More...
Local News 

అర్హులైన  ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇస్తాం - రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ 

అర్హులైన  ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇస్తాం - రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్  సికింద్రాబాద్,ఆగస్ట్ 02 (ప్రజామంటలు):   అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు అందుతుందని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.  శనివారం సికింద్రాబాద్ సీతాఫల్ మండి జీహెచ్ఎంసీ ఫంక్షన్ హాల్ లో సికింద్రాబాద్ నియోజకవర్గ లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులను శాసనసభ్యులు పద్మారావు గౌడ్, జిల్లా కలెక్టర్  హరిచందన దాసరిలతో ఈ...
Read More...
Local News 

జిల్లా పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమలు: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ 

జిల్లా పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమలు: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్    జగిత్యాల ఆగస్ట్ 2 ( ప్రజా మంటలు) జిల్లాలో శాంతి భద్రతలను దృష్టిలో వుంచుకొని నెల రోజుల (ఆగస్టు 1వ తేది నుండి 31 వరకు) నెల పాటు జిల్లా వ్యాప్తంగా పోలీసు యాక్ట్  అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ   తెలిపినారు. దీని ప్రకారం పోలీసు అధికారుల అనుమతి లేకుండా ఎలాంటి ధర్నాలు, రాస్తా రోకోలు,...
Read More...
Local News  Crime 

ఐదుగురు గంజాయి విక్రేతల అరెస్ట్

ఐదుగురు గంజాయి విక్రేతల అరెస్ట్ జగిత్యాల ఆగస్టు 02 (ప్రజా మంటలు): జగిత్యాల, కోడిమ్యాల పోలీస్ స్టేషన్లో పరిధిలో  2 వేల 250 కిలోల గంజాయి అమ్ముతున్న ఐదుగురు నిందితులను జగిత్యాల పోలీసులు పట్టుకున్నారని, విలేకరుల సమావేశంలో  జగిత్యాల డిఎస్పీ రఘు చందర్  వివరాలు వెల్లడించారు   దాదాపు లక్ష 50 వేల విలువ గల గంజాయి గుర్తించి, స్వాధీనం చేసుకున్నారు.పూడూరు    
Read More...
Local News  State News 

పేద ప్రజల అభ్యున్నతే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వ పాలన.- మంత్రి శ్రీధర్ బాబు 

పేద ప్రజల అభ్యున్నతే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వ పాలన.- మంత్రి శ్రీధర్ బాబు  మంథని ఆగస్ట్ 02 (ప్రజా మంటలు): ప్రతి కుటుంబానికి నెలకు సగటున 1200 రూపాయల విలువ గల సన్న బియ్యం ఉచితంగా అందిస్తున్నామని, పేద ప్రజల అభ్యున్నతి లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పాలన కొనసాగుతుందని రాష్ట్ర ఐటి, పరిశ్రమలు శాసన సభ వ్యవహారాల శాఖా డి. శ్రీధర్ బాబు అన్నారు. ఆర్ఆర్ గార్డెన్స్ లో నిర్వహించిన...
Read More...