ఆత్మకూరుకు చెందిన రాజమల్లుకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు - మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
గొల్లపల్లి జూలై 24 (ప్రజా మంటలు):
గొల్లపల్లి మండలంలోని ఆత్మకూరు గ్రామానికి చెందిన వికలాంగుడు అత్తెన రాజమల్లుకు ఇందిరమ్మ ఇల్లుకు సంబంధించిన మంజూరు పత్రాన్ని గురువారంరాష్ట్ర ఎస్సీ,ఎస్టీ,మైనారిటీ,వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ రాజమల్లుకు అందజేసారు.
గతంలో ఎండపెల్లి మండల పర్యటనలో ఉన్న సమయంలో రాజమల్లు మంత్రి ని కలిసి తనకు ఇల్లు కావాలని కోరగా, మంత్రి వెంటనే స్పందించి సంబంధిత అధికారులతో చర్చించి త్వరలో ఇంటి మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆ హామీని నిలబెట్టుకుంటూ ఇళ్లు మంజూరు పత్రాన్ని ప్రత్యక్షంగా అందించి రాజమల్లుకు అండగా నిలిచారు.
ఈ సందర్భంగా తాను కోరిన వెంటనే స్పందించి ఇల్లును మంజూరు చెందిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు రాజమల్లు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో మధుసూదన్, మార్కెట్ చైర్మన్ భీమసంతోష్, వైస్ చైర్మన్ పురపాటి రాజిరెడ్డి, తాసిల్దార్ కటకం వరందన్, ఎంపిడిఓ రామ్ రెడ్డి, ఆర్ఐ అనూష కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు
More News...
<%- node_title %>
<%- node_title %>
భరోసా సెంటర్ ద్వారా బాధిత మహిళలకు రక్షణ, భరోసా: జిల్లా ఎస్పి అశోక్ కుమార్

కార్గిల్ విజయ్ దివస్ యుద్ధంలో అమరులైన వారికి ఘన నివాళులు

ఐజేయు 143 జిల్లా ఉపాధ్యక్షునికి సన్మానం,

హరిహరాలయంలో ఘనంగా శ్రావణమాస అభిషేక ఉత్సవాలు

మున్నూరు కాపు సంఘాల ఆధ్వర్యంలో భారీ కార్ల ర్యాలీ - రెండు వందల కార్లు , బస్సులతో హైదరాబాద్ నుంచి వేములవాడకు

పట్టణంలోని పలు వార్డులలో అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

ఉజ్జయిని మహకాళీ ఆలయంలో జనసేన నేతలు *హరిహర వీరమల్లు సినిమా సక్సెస్ పూ జలు

విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలనీ ప్రదర్శన

నూతనంగా మున్సిపల్ డి ఈ గా బాధ్యతలు స్వీకరించి ఎమ్మెల్యేను కలిసిన ఆనంద్ కుమార్

రేషన్ కార్డు అనేది పేదల ఆత్మ గౌరవం సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి

కోటిలింగాల శ్రీ పార్వతీ కోటేశ్వర స్వామీ ఆలయ కమిటీ చైర్మన్ గా పూదరి రమేష్

అర్ధరాత్రి సమయం లో నిఘా మరింత పటిష్టం: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అర్ధరాత్రి సమయంలో జిల్లా ఎస్పీ ఆకస్మిక తనిఖీ
