వాయుసేన అధికారి నుండి లక్షల మందికి లైఫ్ కోచ్ గా డా.యలమంచి రామకృష్ణ.

On
వాయుసేన అధికారి నుండి లక్షల మందికి లైఫ్ కోచ్ గా డా.యలమంచి రామకృష్ణ.

(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113). 

నల్లగొండ 25 జూలై (ప్రజా మంటలు) : 

జీవితాన్ని ఒక లక్ష్యంగా మలచుకుని, అందరిలో స్ఫూర్తి నింపడం కొద్దిమందికే సాధ్యమవుతుంది. అలాంటి అరుదైన వ్యక్తిత్వం కలిగినవారు డాక్టర్ యలమంచి రామకృష్ణ.

  • ఆయన ప్రస్థానాన్ని పరిశీలిస్తే ఆయన అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నల్లగొండ జిల్లా బీబీనగర్ మండలం ఒక మారుమూల గ్రామం వెనికిరాలలో జన్మించి ఎంతో మందికి మార్గం చూపిన జీవతగాథ.
  • ఆయన భారత వాయుసేనలో 23 సంవత్సరాలు సేవ చేసిన ఈ అధికారి, పదవీ విరమణ తరువాత తన జీవితాన్ని వ్యక్తిత్వ వికాసానికి మరియు విద్యాభివృద్ధికి అంకితం చేశారు.

వాయుసేనలో నిస్వార్థ సేవ :  

  • రామకృష్ణ 1994 నుండి 2017 వరకు భారత వాయుసేనలో వారెంట్ ఆఫీసర్‌గా వాయుసేన ప్రధాన కార్యాలయం, న్యూఢిల్లీలో బాధ్యతలు నిర్వహిస్తూ దేశవ్యాప్తంగా ఉన్న 130 కి పైగా ఎయిర్ ఫోర్స్ పాఠశాలలు మరియు 98 కేంద్రీయ విద్యాలయాల విద్యా పరిపాలనాధికారిగా సమర్థవంతంగా తన భాద్యతలను నిర్వర్తించారు.
  • సుమారు 52,000 మంది విద్యార్థులకు, 5000 మంది ఉపాధ్యాయులకు మార్గనిర్దేశం చేసి, విద్యా రంగంలో కొత్త శకానికి నాంది పలికారు.

IMG-20250630-WA0039

పదవీ విరమణ తర్వాత విద్యా రంగంలో వెలుగులు నింపే ప్రయత్నం : 

  • 2017లో వాయుసేన నుంచి పదవీ విరమణ చేసిన తర్వాత, డాక్టర్ రామకృష్ణ సామాన్య ప్రజల కోసం తన జీవితాన్ని అంకితం చేశారు.
  • హైదరాబాద్‌లోని నాచారంలో నివసిస్తూ, ప్రస్తుతం రెండు శిక్షణ సంస్థలను నెలకొల్పి వ్యవస్థాపకుడిగా, నిర్దేశకుడిగా వ్యవహరిస్తున్నారు.
  • దేశవ్యాప్తంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులకు లైఫ్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్ శిక్షణలతో 150000 లక్షల మందికి పైగా జీవితాల్లో మార్పు తీసుకువచ్చారు.

అధ్యయనం, రచన, ప్రేరణ: త్రివేణి సంగమం

  • ఇప్పటివరకు 5 పుస్తకాలను రచించిన రామకృష్ణ, వ్యక్తిత్వ వికాసంపై ప్రత్యేకంగా దృష్టి సారించారు.
  • ఆయన వ్యాసాలు ఎన్నో జాతీయ, అంతర్జాతీయ మ్యాగజైన్లలో ప్రచురితమై, పలు అవార్డులను అందుకున్నారు.

IMG-20250725-WA0008

శిక్షణా ప్రస్థానానికి ప్రతిబింబం : 

  • డాక్టర్ రామకృష్ణ అనేక ప్రఖ్యాత సంస్థల్లో శిక్షణా కార్యక్రమాలు నిర్వహించారు.
  • ఐఐటీ గాంధీనగర్, లారస్ ల్యాబ్స్, ఎంఆర్ఎఫ్, సాండ్‌విక్, హెరిటేజ్, మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్, నిర్మాణ జాతీయ అకాడమీ, లోయోలా అకాడమీ, TSRTC, వ్యవసాయ శాఖ, ఎయిర్ ఫోర్స్ పాఠశాలలు వంటి పలు సంస్థల్లో కార్పొరేట్ శిక్షణలు అందిస్తూ, జీవిత నైపుణ్యాల పరంగా ఎంతో మందికి మార్గదర్శకుడిగా నిలిచారు.
  • కొన్ని జాతీయ, అంతర్జాతీయ ప్రచురణ సంస్థలతో భాగస్వామ్యంగా, దేశవ్యాప్తంగా ఉన్న 1,00,000 మందికి పైగా ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చారు.
  • దేశవ్యాప్తంగా ఉన్న పాఠశాలలు, కళాశాలల్లో శిక్షణలు అందిస్తూ, వేలాది విద్యార్థులలో ఆత్మవిశ్వాసం నింపుతూ వారి భవిష్యత్తును ప్రభావితం చేస్తున్నారు.

ప్రామాణికతలు : 

డాక్టర్ రామకృష్ణ నాబెట్ నుండి సర్టిఫైడ్ సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్గా, అమెరికా సంస్థల ద్వారా ఇంటర్నేషనల్ సర్టిఫైడ్ ట్రైనర్ మరియు ఎగ్జిక్యూటివ్ లైఫ్ కోచ్గా గుర్తింపు పొందారు.

సమాజ సేవ : 

  • వృత్తిపరమైన విజయాలతో పాటు, డాక్టర్ రామకృష్ణ సామాజ సేవలోనూ ముందున్నారు.
  • ఆర్థికంగా బలహీన వర్గాల జీవితాన్ని మెరుగుపరిచేందుకు ఆయన పలు కార్యక్రమాలు చేపట్టారు.
  • నిత్యావసర వస్తువుల విరాళం, ఆర్థికంగా వెనుకబడిన పిల్లలకు విద్యా సహాయం, ఆహార పంపిణీ వంటి కార్యక్రమాల ద్వారా ఆయన అనేక మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు.

అవార్డులు,పురస్కారాలు : 

  • హానరరీ డాక్టరేట్ (డాక్టర్ ఆఫ్ హ్యూమానిటీ), 2019
  • సేవా రత్న అవార్డు – 2019
  • ఇండియన్ గ్లోరీ అవార్డు, 2019
  • ఉగాది నంది అవార్డు (2023)
  • ప్రైడ్ ఆఫ్ ఇండియా అవార్డు (2025)
  • వాయుసేన నుండి లాంగ్ సర్వీస్ మెడల్, సైన్య సేవా మెడల్.

IMG-20250725-WA0007

మాటల ద్వారా మార్పు : 

  • " మాటల్లో మార్పు ఉంది. మార్పుతో ఎదుగుదల ఉంది" అనే నినాదంతో, ఆయన ప్రసంగాలు విన్న ప్రతివారు ఒక మెట్టు పైకి ఎక్కుతున్నారు.
  • తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, ఒడిషా, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో ఆయన వాణి మార్గదర్శకంగా నిలుస్తోంది.

వ్యక్తిగత వివరాలు : 

  • తెలుగు, హిందీ, ఆంగ్ల భాషలపై డాక్టర్ రామకృష్ణకు పూర్తి పట్టు ఉంది.
  • హైదరాబాద్‌లో నివసిస్తూ దేశవ్యాప్తంగా సేవలు అందిస్తున్నారు.
  • ఎప్పటికీ నేర్చుకుంటూ, నేర్పిస్తూ, మార్పుకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నారు.

సంక్షిప్తంగా : 

  • డాక్టర్ యెలమంచి రామకృష్ణ — ఒక సైనికుడిగా ప్రారంభమై, లక్షల మందికి జీవిత మార్గదర్శిగా మారిన శిక్షకుడు, రచయిత, ప్రేరణాత్మక నిర్దేశకుడు.

యూట్యూబ్ ఛానల్ – Redefine Life with Dr RK

ఫోన్ నంబర్: 9958361110

ఇమెయిల్: drramakrishna02@gmail.com.

IMG-20250725-WA0004

Tags
Join WhatsApp

More News...

Local News 

నిమజ్జనోత్సవానికి ఏర్పాట్లు పూర్తి చేయాలి - జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ 

నిమజ్జనోత్సవానికి ఏర్పాట్లు పూర్తి చేయాలి  - జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్        జగిత్యాల జిల్లా ప్రతినిధి, ( ప్రజా మంటలు) సెప్టెంబర్ 19: గణేశ్ నిమజ్జనo శాంతియుతంగా, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా సజావుగా జరిగేలా అన్ని విభాగాలు సమన్వయంతో కట్టుదిట్టమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ అన్నారు. శనివారం జిల్లా ఎస్పి అశోక్ కుమార్ తో కలిసి గణేష్ నిమజ్జన ప్రాంతాలైన జగిత్యాలలో...
Read More...
Local News 

వర్ష కొండలో గణపతి నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన అధికారులు,

వర్ష కొండలో గణపతి నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన అధికారులు,   ఇబ్రహీంపట్నం సెప్టెంబర్ 19 (ప్రజా మంటలు దగ్గుల అశోక్ )   ఇబ్రహీంపట్నం మండలంలోని వర్షకొండ గ్రామంలో పెద్ద చెరువు వద్ద గణపతి నిమజ్జన ఏర్పాట్లను తహసిల్దార్ వరప్రసాద్,ఎస్ఐ నవీన్ పరిశీలించినరు,   గంగమ్మ గుడి కట్టపైన నుండి  చిన్న గణపతులు నిమజ్జనం, గంగపుత్ర సంఘ భవనం వద్ద నుండి పెద్ద గణపతులు నిమగ్నం చేసుకోవడానికి అనుకూలంగా ఉన్నట్లు...
Read More...
Local News 

మహాత్మ జ్యోతిరావ్ ఫూలే స్కూల్ ని ఆకష్మిక తనిఖీ చేసిన సీనియర్ సివిల్ జడ్జి.-ఆర్. అజయ్ కుమార్

మహాత్మ జ్యోతిరావ్ ఫూలే స్కూల్ ని ఆకష్మిక తనిఖీ చేసిన సీనియర్ సివిల్ జడ్జి.-ఆర్. అజయ్ కుమార్   మెట్టుపల్లి సెప్టెంబర్ 19 (ప్రజా మంటలు  దగ్గుల అశోక్ ) మెట్ పల్లి మండల లీగల్ సర్వీసెస్ ఛైర్మన్, సీనియర్ సివిల్ జడ్జి ఆర్. అజయ్ కుమార్, శనివారం పట్టణంలోని మహాత్మ జ్యోతిరావ్ పూలే బాలుర హాస్టల్, బీర్పూర్ ఎట్ మెట్ పల్లిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా హాస్టల్లో ఉన్న కిచెన్, బాత్రూం,...
Read More...
Local News 

చేనేత కార్మికులందరికీ ‘చేయూత’ పెన్షన్ వర్తింపజేయాలి : ఎల్ రమణ

చేనేత కార్మికులందరికీ ‘చేయూత’ పెన్షన్ వర్తింపజేయాలి : ఎల్ రమణ    హైదరాబాద్ సెప్టెంబర్ 19 (ప్రజా మంటలు): చేనేత వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న అర్హులైన ప్రతి కార్మికుడికి ‘చేయూత’ పెన్షన్ పథకం వర్తించేలా అర్హత ప్రమాణాలను విస్తరించాలని బీఆర్‌ఎస్‌ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, ఎమ్మెల్సీ ఎల్. రమణ ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డికి వినతిపత్రం సమర్పించారు. ప్రస్తుతం జియో ట్యాగింగ్ ద్వారా గుర్తింపు...
Read More...
Local News  State News 

రేవంత్‌రెడ్డికి సీఎంగా కొనసాగే నైతిక హక్కు లేదు: మాజీ మంత్రి జీవన్‌రెడ్డి

రేవంత్‌రెడ్డికి సీఎంగా కొనసాగే నైతిక హక్కు లేదు: మాజీ మంత్రి జీవన్‌రెడ్డి పాలన చేతగాక.. రేవంత్ డైవర్షన్ పాలిటిక్స్ హైకోర్టు తీర్పు పార్టీ ఫిరాయింపుల విషయంలో ప్రభుత్వానికి గుణపాఠం జగిత్యాల, సెప్టెంబర్ 19 (ప్రజా మంటలు): పాలనలో వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్‌రెడ్డి ఆరోపించారు. రైతుల సమస్యలు, ఆరు గ్యారంటీల అమలు వంటి...
Read More...
Local News 

కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా అమన్ జిత్ సింగ్

కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా అమన్ జిత్ సింగ్ కరీంనగర్, సెప్టెంబర్ 19 (ప్రజా మంటలు): కరీంనగర్ పట్టణంలోని సిక్కు వాడకు చెందిన కాంగ్రెస్ నాయకుడు అమన్ జిత్ సింగ్ను జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. చొప్పదండి ఎమ్మెల్యే, DCC అధ్యక్షుడు డాక్టర్ మేడిపల్లి సత్యం రేకుర్తి క్యాంపు కార్యాలయంలో ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మేడిపల్లి సత్యం మాట్లాడుతూ కాంగ్రెస్...
Read More...
State News 

రేపే కొడంగల్ గడ్డపై కల్వకుంట్ల కవిత పాంచజన్య శంఖారావం

రేపే  కొడంగల్ గడ్డపై కల్వకుంట్ల కవిత పాంచజన్య శంఖారావం కొడంగల్–కోస్గి సెప్టెంబర్ 19 (ప్రజా మంటలు):: తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు కోస్గి కాలేజీ గ్రౌండ్‌లో పాంచజన్య సంకల్ప సభ నిర్వహించనున్నారు. సభకు పార్టీ నాయకులు భారీ ఏర్పాట్లు చేశారు. 120 అడుగుల పొడవు, 40 అడుగుల వెడల్పుతో సభా వేదికను ఏర్పాటు చేయగా, సుమారు...
Read More...
Local News 

మున్సిపల్ లో గణనాథునుకి ఉత్తర పూజలు 

మున్సిపల్ లో గణనాథునుకి ఉత్తర పూజలు  జగిత్యాల, సెప్టెంబర్ 19 (ప్రజా మంటలు): వినాయక నవరాత్రుల సందర్భంగా జగిత్యాల మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన గణనాథునికి మున్సిపల్ చైర్‌పర్సన్ సమీండ్ల వాణి శ్రీనివాస్, కమిషనర్ సత్య ప్రణవ్, కౌన్సిలర్లు, అధికారులు, సిబ్బంది ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఉత్తర పూజలు చేసి అన్నదానం నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయం నుంచి భక్తిశ్రద్ధలతో శోభాయాత్ర చేపట్టారు....
Read More...
Local News 

సింహాచలం జగన్ కుటుంబాన్ని పరామర్శించిన బీఆర్‌ఎస్ నేతలు

సింహాచలం జగన్ కుటుంబాన్ని పరామర్శించిన బీఆర్‌ఎస్ నేతలు ఎండపెల్లి సెప్టెంబర్ 19 (ప్రజా మంటలు): జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గం ఎండపెల్లి మండల బీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు సింహాచలం జగన్ ఇటీవల ఆత్మహత్యకు పాల్పడి మృతి చెందారు. ఈ నేపథ్యంలో శనివారం ఆయన కుటుంబ సభ్యులను జగిత్యాల జిల్లా బీఆర్‌ఎస్ అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, జిల్లా తొలి జడ్పీ చైర్‌పర్సన్ దావ వసంత...
Read More...
Local News 

రాయికల్‌లో లో-వోల్టేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం : ఎమ్మెల్యే సంజయ్

రాయికల్‌లో లో-వోల్టేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం : ఎమ్మెల్యే సంజయ్ రాయికల్, సెప్టెంబర్ 19 (ప్రజా మంటలు): రాయికల్ పట్టణ ప్రజలు ఎదుర్కొంటున్న లో-వోల్టేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు రూ.30 లక్షల వ్యయంతో నాలుగు డీటీఆర్‌లు ఏర్పాటు చేసినట్లు జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం పేద, మధ్యతరగతి ప్రజల సంక్షేమానికి పలు కార్యక్రమాలను అమలు చేస్తోందని అన్నారు. గృహజ్యోతి పథకం...
Read More...
State News 

రాయికల్ లో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ

రాయికల్ లో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ రాయికల్, సెప్టెంబర్ 18 (ప్రజా మంటలు): రాయికల్ పట్టణంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వీరనాయకుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ ఆవిష్కరించారు. ఈ విగ్రహాన్ని వేముల ప్రభాకర్ బహుకరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్ రెడ్డి, జగిత్యాల జిల్లా...
Read More...
Local News 

శ్రీ గౌరీ ప్రియ నగర వెల్ఫేర్ అసోసియేషన్ గణేష్ మండపం వద్ద కొనసాగుతున్న ఆధ్యాత్మిక కార్యక్రమాలు

శ్రీ గౌరీ ప్రియ నగర వెల్ఫేర్ అసోసియేషన్ గణేష్ మండపం వద్ద కొనసాగుతున్న ఆధ్యాత్మిక కార్యక్రమాలు    కీసర సెప్టెంబర్ 17 ( ప్రజా మంటలు)కుందన్ పల్లి లోని శ్రీ గౌరీ ప్రియ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ గణేష్ మండపం వద్ద నవరాత్రి ఉత్సవాలలో భాగంగా వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రతినిత్యం కొనసాగుతున్నాయి. దీనిలో భాగంగా గణేష్ హోమము మాతలచే సామూహిక కుంకుమార్చనలు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు భజనలు వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలకు...
Read More...