జాతీయ రహదారి "563", జగిత్యాల నుండి కరీంనగర్ వరకు గల రోడ్డు విస్తరించండి - జయశ్రీ హనుమండ్ల,
జగిత్యాల జూలై 24 (ప్రజా మంటలు):
జగిత్యాల - కరీంనగర్ జాతీయ రహదారి 563 నాలుగు లైన్ల విస్తరణకు ప్రకటన చేసి నాలుగే ఏళ్లు ఇప్పటి వరకు ఎలాంటి పనులు చేపట్టలేదని, వెంటనే పనులు చేపట్టాలని మున్సిపల్ మాజీ కౌన్సిలర్ హనుమండ్ల జయశ్రీ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ను కోరారు.
ఆమె మంత్రికి రాసిన వినతిపత్రంలో..జాతీయ రహదారి "563" కోరకు జగిత్యాల జిల్లా పరిదిలోని "0 Km to 26.3 Km" వరకు మరియు కరీంనగర్ జిల్లా పరిదిలోని "26.3 km to 59.353 km" వరకు నాలుగు లైన్ల రహదారి కొరకు కేంద్ర ప్రభుత్వం తేది: 24/11/2021 రోజున భారత ప్రభుత్వ రాజపత్రం (The Gazette of India) SO. No. 4847 [E] జారీ చేసి భూసేకరణకు సంబందించి భూములు కోల్పోతున్న రైతుల వివరాలు మరియు వారు కోల్పోతున్న భూమి వివరాలను పొందు పరుస్తూ " పత్రికాప్రకటన " చేయగా అందులో కొందరు రైతులు అభ్యంతరాలు తెలియచేయగా వాటిని సవరణ చేసి తిరిగి కేంద్ర ప్రభుత్వం మరొక "రాజపత్రం" (Gezette) నెంబర్ SO.No. 5042 (E) తేది: 27/10/2022 రోజున జారీ చేసి తిరిగి పూర్తి వివరాలతో మళ్ళీ పేపరు ప్రకటన చేయడం జరిగిందనిపేర్కొన్నారు.
ఈ పేపర్ ప్రకటనలో రైతుల వివరాలు మరియు వారు కోల్పోతున్న భూముల వివరాలు పొందుపర్చి ఇవ్వడం జరిగింది. కాని, ఇప్పటి వరకు దాదాపు 2 సంవత్సరాల 9 నెలలు గడిచిన ఒక్క రైతు వద్ద భూసేకరణ చేయలేదు. రైతుకు నష్ట పరిహారం కూడ అందించలేక పోయారు. "అత్యంత ప్రమాదకర" రహదారులలో ఒక్కటి అయిన ఈ రహదారి పైన భూసేకరణ చేయకపోవడం చాల శోచనీయం. "నరేంద్రమోడీ" గారు మూడవ సారి ప్రదాన మంత్రి ఆయిన తరువాత అత్యంత ప్రమాదకర రహదారులను "100" రోజులలో మొదలు పెట్టాలని గుర్తించిన రహదారుల లో "563" రహదారి ఒక్కటి. " నరేంద్ర మోడీ " ప్రమాణ స్వీకారం చేసి దాదాపు "400 రోజులు" అయిన ఇప్పటివరకు భూసేకరణ అనేది ఆరంభమే కాలేదను, వెంటనే భూసేకరణ ప్రారంభించాలని ఆమె కోరారు.
ఈ రోడ్డు మీద నిత్యం ఒక యాక్సిడెంట్ తో నెత్తూరోడుతున్న, పట్టించుకోని అధికారుల వల్ల ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి పెద్ద దిక్కులను కోల్పోయి, మరి కొన్ని కుటుంబాలలో వికలాంగులుగా మారిన పరిస్థితి అయిన ఇప్పటి వరకు అదికారులు ఈ రోడ్డు విషయం సిరియస్ గా తీసుకో కపోవడం భాదాకరం.
తెలంగాణ లోని అత్యంత ప్రమాదకర రహదారి అయిన "563"ను నిర్మించుకోకపోవడం మరియు ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంట్ సభ్యులు అయిన బండి సంజయ్ గార్కి దాదాపు 45 కి.మీ లు ఆయన పరిదిలో ఉండటం వల్ల వారికి కూడ గతంలో ఈ రోడ్డు గురించి లేఖ రాయడం జరిగింది. ఇప్పటికైనా మీరు దీని పైన దృష్టి వహించి పూర్తి వివరాలు తీసుకుని వెనువెంటనే రోడ్డు నిర్మాణం అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.
కేంద్ర మంత్రిగా,నితిన్ గడ్కరీ ఇప్పటికైనా జగిత్యాల నుండి కరీంనగర్ వెళ్ళె రహదారిని, వెను వెంటనే భూసేకరణ పూర్తి చేసి, రోడ్డు కొరకు టెండర్ పిలుస్తూ మా ప్రజలందరి కల అయిన ఈ రోడ్డును వెంటనే ప్రారంబించాలని జగిత్యాల నుండి కరీంనగర్ వరకు మద్యలో నివసించే కుటుంబ సభ్యుల పక్షాన, నిత్యం ఈ రోడ్డు పైన ప్రయాణిస్తున్న ప్రజలందరి పక్షాన కోరుతున్నానని తాజా మాజీ కౌన్సిలర్ హనుమండ్ల జయశ్రీ అన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
లంచం డిమాండ్ చేసిన పారిశుద్ధ్య కార్మికుల ను విధుల నుంచి తోలగించిన జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష

భరోసా సెంటర్ ద్వారా బాధిత మహిళలకు రక్షణ, భరోసా: జిల్లా ఎస్పి అశోక్ కుమార్

కార్గిల్ విజయ్ దివస్ యుద్ధంలో అమరులైన వారికి ఘన నివాళులు

ఐజేయు 143 జిల్లా ఉపాధ్యక్షునికి సన్మానం,

హరిహరాలయంలో ఘనంగా శ్రావణమాస అభిషేక ఉత్సవాలు

మున్నూరు కాపు సంఘాల ఆధ్వర్యంలో భారీ కార్ల ర్యాలీ - రెండు వందల కార్లు , బస్సులతో హైదరాబాద్ నుంచి వేములవాడకు

పట్టణంలోని పలు వార్డులలో అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

ఉజ్జయిని మహకాళీ ఆలయంలో జనసేన నేతలు *హరిహర వీరమల్లు సినిమా సక్సెస్ పూ జలు

విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలనీ ప్రదర్శన

నూతనంగా మున్సిపల్ డి ఈ గా బాధ్యతలు స్వీకరించి ఎమ్మెల్యేను కలిసిన ఆనంద్ కుమార్

రేషన్ కార్డు అనేది పేదల ఆత్మ గౌరవం సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి

కోటిలింగాల శ్రీ పార్వతీ కోటేశ్వర స్వామీ ఆలయ కమిటీ చైర్మన్ గా పూదరి రమేష్
