గొల్లపల్లి మండల కేంద్రంలో తిరంగా యాత్ర...
ప్రతి భారతీయుడు సైనికులకు మద్దతుగా నిలవాలి..
బీజేపీ జిల్లా అధ్యక్షులు యాదగిరి బాబు
గొల్లపల్లి మే 28 (ప్రజా మంటలు):
పహాల్గామ్ సంఘటన విషయంలో పాకిస్తాన్ తో జరిగిన యుద్ధంలో భారత్ సైనికులు సాదించిన విజయానికి సంఘీభావం తెలుపుతూ గొల్లపల్లి మండల కేంద్రంలో సంఘభావంగా ర్యాలీ నిర్వహించారు. ఈసందర్బంగా బిజెపి జిల్లా అధ్యక్షులు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ భారతదేశ చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ ప్రేరేపిత తీవ్రవాద సంస్థలు అయిన జైష్ ఏ మహమ్మద్, ఐసిస్ లాంటి తీవ్రవాద సంస్థలు పహాల్గామ్ లో హిందూ పర్యాటకుల మీద దాడి చేయడం హేయమైన చర్య అని దానికి ప్రతీకారంగా భారత ప్రభుత్వం పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాలను, ఎయిర్ బేస్ లను పేల్చేయడం శుభపరిణామం అని తీవ్రవాదాన్ని మట్టుబెట్టడంలో భారత ప్రభుత్వం సైనికులకు పూర్తి స్వేచ్ఛను ఇవ్వడం వల్లనే 170 మంది ఉగ్రవాదులను, నలభై రెండు మంది పాక్ సైనికులను మట్టుబెట్టారని అన్నారు.
భారత సైన్యంలో ఇద్దరు మహిళా కమండోలు చూపిన తెగువ అనిర్వచనీయం అని పాకిస్తాన్ ను అంతమోందించడానికి ఇద్దరు మహిళలు సోఫియా ఖురేషి, వ్యోమిక సింగ్ లు కాళికదేవి అవతారం ఎత్తితేనే ఇంతగా ఉంటే ప్రతి భారతీయుడు పరశరాముని అవతారం ఎత్తితే పాకిస్తాన్ దేశం ప్రపంచం పటంలో కనిపించదని అన్నారు. భారత సైనికులకు భారతీయుల మద్దతు ఎల్లవేళలా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షులు చెవులమద్ది శేఖర్ బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ కొమ్ము రాంబాబు, పిల్లి శ్రీనివాస్
బీజేపీ మాజీ మండల అధ్యక్షులు కట్ట మహేష్ బీజేవైఎం మండల అధ్యక్షులు లక్క కుల వెంకటేష్, పట్టణ అధ్యక్షులు సంగెం కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు..
More News...
<%- node_title %>
<%- node_title %>
మహిళను హత్య చేసిన కేసులో నిందితునికి జీవిత ఖైదు
.jpeg)
కూకట్పల్లి అంకుర్ ఆసుపత్రిలో మరో ఘటన

అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే డా. సంజయ్

మాజీ మంత్రి సహాయకులు టి.రవీందర్ రెడ్డి కన్నుమూత

సీపీఆర్ పై అవగాహన ఉంటే ప్రాణం కాపాడవచ్చు

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ఉన్న ధాన్యము వేగవంతంగా కొనుగోలు చేయాలి_ జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్.

గాంధీ ఆసుపత్రిని సందర్శించిన జాతీయ వైద్య బృందం

రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు. అదనపు కలెక్టర్ బి.ఎస్ లత.

కార్పోరేట్ ఉద్యోగాలకు ఎన్.యస్.వి. విద్యార్థుల ఎంపిక

టీపీసీసీ రాష్ట్ర సలహా కమిటీ లో జగిత్యాల టైగర్ టి. జీవన్ రెడ్డి కి చోటు.
.jpeg)
ఇందిరానగర్ బస్తి దవాఖానాలో మెరుగైన వైద్య సేవలు – డాక్టర్ మిట్టపల్లి సృజల

రూ.వంద కోట్లతో రాంగోపాల్ పేట డివిజన్ ను అభివృద్ది చేశాం
