కేబుల్ ఆపరేటర్లు మరియు ఇంటర్నెట్ సేవలందించేవారితో విద్యుత్ ఎస్ ఈ సాలియా నాయక్ క్రమబద్ధీకరణ పై చర్చ
జగిత్యాల మే 28 ( ప్రజా మంటలు)
పట్టణంలో పనిచేస్తున్న కేబుల్ ఆపరేటర్లు మరియు ఇంటర్నెట్ సేవల అందించేవారితో సమావేశం నిర్వహించబడింది. ఈ సమావేశంలో పోల్స్ అద్దె (Pole Rentals), అలాగే ఓవర్హెడ్ కేబుళ్ల నిర్వహణ మరియు క్రమబద్ధీకరణ అంశాలపై చర్చించడం జరిగింది.
ఈ సందర్భంగా ఎస్ ఈ మాట్లాడుతూ, పట్టణంలో భద్రత మరియు నిర్వహణ సౌలభ్యం దృష్ట్యా, అన్ని సేవలందించేవారు తమ ఓవర్హెడ్ కేబుళ్లను ఏరియల్ బంచ్డ్ కేబుళ్ల (ABC) తరహాలో క్రమబద్ధంగా బంచ్ చేసి, క్లాంప్స్ ద్వారా అమర్చాలి అని సూచించారు.
దీని ద్వారా ప్రజలకు భద్రత మెరుగవడం, పట్టణంలో కేబుళ్ల లాంటి వదులుబడిని నివారించడం, అలాగే మరమ్మతుల సమయంలో సులభత సాధ్యపడుతుందని తెలిపారు.
ఇట్టి విషయంలో కేబుల్ ఆపరేటర్లు మరియు ఇంటర్నెట్ సేవల ఆపరేటర్లు సానుకూలంగా స్పందిస్తూ ఎస్ ఈ చెప్పిన విషయాలను తప్పకుండా పాటిస్తామని తెలిపారు.
ఈ సమావేశంలో జగిత్యాల టౌన్ సబ్ డివిజన్ ఏఈలు, ఏడిఈ, డిఈ మరియు జగిత్యాల టౌన్ సబ్ డివిజన్ పరిధిలోని కేబుల్ ఆపరేటర్లు, ఇంటర్నెట్ సేవల ఆపరేటర్లు 30 మంది వరకు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
మహిళను హత్య చేసిన కేసులో నిందితునికి జీవిత ఖైదు
.jpeg)
కూకట్పల్లి అంకుర్ ఆసుపత్రిలో మరో ఘటన

అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే డా. సంజయ్

మాజీ మంత్రి సహాయకులు టి.రవీందర్ రెడ్డి కన్నుమూత

సీపీఆర్ పై అవగాహన ఉంటే ప్రాణం కాపాడవచ్చు

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ఉన్న ధాన్యము వేగవంతంగా కొనుగోలు చేయాలి_ జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్.

గాంధీ ఆసుపత్రిని సందర్శించిన జాతీయ వైద్య బృందం

రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు. అదనపు కలెక్టర్ బి.ఎస్ లత.

కార్పోరేట్ ఉద్యోగాలకు ఎన్.యస్.వి. విద్యార్థుల ఎంపిక

టీపీసీసీ రాష్ట్ర సలహా కమిటీ లో జగిత్యాల టైగర్ టి. జీవన్ రెడ్డి కి చోటు.
.jpeg)
ఇందిరానగర్ బస్తి దవాఖానాలో మెరుగైన వైద్య సేవలు – డాక్టర్ మిట్టపల్లి సృజల

రూ.వంద కోట్లతో రాంగోపాల్ పేట డివిజన్ ను అభివృద్ది చేశాం
