డెంగ్యూ, మలేరియా వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
డెంగ్యూ, మలేరియా వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
కోరుట్ల ఆగస్టు 30 :
ప్రస్తుత వర్షాకాలంలో డెంగ్యూ, మలేరియా వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగరావు అన్నారు.
ప్రస్తుత వర్షాకాలంలో వాతావరణంలో చోటు చేసుకునే మార్పుల ఫలితంగా సీజనల్ వ్యాధులైన మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్, చికెన్ గునియా వంటి వ్యాధులతోపాటు విష జ్వరాలు ప్రబలే అవకాశం అధికంగా ఉంటుందని ఆయన తెలిపారు.
ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆయన కోరారు.
ఆరోగ్యం కాపాడుకోవడానికి ప్రజలు కాచి వడబోసిన నీటిని తీసుకోవడం మంచిదని ఆయన సూచించారు.
దోమలు కుట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పల్లెలు, పట్టణాల్లో ఓవర్ హెడ్ ట్యాంకులను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ, బ్లీచింగ్ పౌడర్, క్లోరినేషన్ చేయాలన్నారు.
పరిసరాలను పరిశుభ్రత పాటిస్తే వ్యాధులను అరికట్టవచ్చని ఆయన పేర్కొన్నారు.
వర్షపు నీరు నిల్వ ఉన్నచోట ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని ఆయన సూచించారు.
మున్సిపల్, గ్రామపంచాయతీ అధికారులు పట్టణం, గ్రామాల్లోని అన్ని వార్డుల్లో డ్రైనేజీలు, ఖాళీ స్థలంలో చెత్త చెదారం శుభ్రపరిచి ప్రజలు ప్లాస్టిక్ కవర్లు వాడకుండా నివారించాలని, బ్లీచింగ్ ఫంగింగ్ చేపట్టాలని, మున్సిపల్ అధికారులు సమన్వయంతో పనిచేసి సీజనల్ వ్యాధులు అరికట్టేందుకు తగు చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు.
అదేవిధంగా విష జ్వరాలు ప్రబలకుండా వైద్యశాఖ అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
ఎప్పటికప్పుడు ప్రజల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని, అవసరమైన వారికి మందులను పంపిణీ చేయాలని నర్సింగరావు కోరారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
అపర ఏకాదశి.- వైశాఖ బహుళ ఏకాదశి

తాట్లవాయి హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు

భూకబ్జాదారులపై గాంధీనగర్ పీఎస్ లో కాంగ్రెస్ నేత ఫిర్యాదు

తార్నాక లో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు

జీహెచ్ఎమ్సీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా నేతలు కార్యకర్తలు పని చేయాలి.

శ్రీ భక్తాంజనేయ స్వామి హనుమాన్ జయంతి వేడుకలు

చిలకలగూడ ఏసీపీగా శశాంక్ రెడ్డి బాధ్యతల స్వీకరణ

భాగ్య రెడ్డి వర్మ పోరాట స్ఫూర్తి మనందరికీ ఆదర్శం. కలెక్టర్ బి. సత్య ప్రసాద్

త్వరితగతంగా అభివృద్ధి పనులు పూర్తి చేయాలి ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్

హనుమాన్ పెద్ద జయంతి ఉత్సవాలలో అర్ధరాత్రి సమయంలో క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ అధికారులను, సిబ్బందిని సమన్వయ పరుస్తూ సూచనలు చేస్తున్న జిల్లా ఎస్పీ

జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా భాగ్యరెడ్డి వర్మ జయంతి వేడుకలు

టెక్నాలజీ రంగంలో రాజీవ్ గాంధీ సేవలు చిరస్మరణీయం
