రోడ్డు ప్రమాద బాధితుడికి 1.52 లక్షలు సాయం.
(రామ కిష్టయ్య సంగన భట్ల)
ధర్మపురి జూలై 31:
రోడ్డు ప్రమాదానికి గురై బ్రెయిన్ సర్జరీ కోసం ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న ఓ నిరుపేద యువకుడికి ఫేస్ బుక్ మిత్రులు రూ. 1.52 లక్షలు సాయం అందించి అండగా నిలిచారు.
ధర్మపురికి చెందిన అక్కనపల్లి రాజు అనే యువకుడు 5 ఏళ్ల క్రితం రోడ్డు ప్రమాదానికి గురవడంతో బ్రెయిన్ సర్జరీ చేయించారు. ప్రస్తుతం మరోసారి బ్రెయిన్ సర్జరీ చేయించాల్సి ఉంటుందని వైద్యులు తెలిపారు.
రాజు తండ్రి 5 ఏళ్ల క్రితం మరణించగా తల్లితో కలిసి అదే ఇంట్లో ఉంటున్నాడు. వైద్యం కోసం ఆర్థికంగా ఇబ్బందులు పడుతుండగా, వీరి దీన స్థితిని గమనించిన ధర్మపురికి చెందిన సామాజిక సేవకుడు రేణికుంట రమేష్ స్పందించి జూలై 4 న ఫేస్ బుక్ లో పోస్ట్ చేసి సాయం అందించాలని కోరాడు. ఎన్నారై లు, ఇతర దాతలు రూ.1.52 లక్షలు విరాళాలు రాజు తల్లి అంజలి బ్యాంక్ ఖాతాకు పంపించారు. వాటిని స్థానిక సి ఐ రాం నర్సింహారెడ్డి బాధిత కుటుంబాలకి ఎస్సై ఉదయ్ కుమార్, యూనియన్ బ్యాంక్ మేనేజర్ మాధవ రావ్ తో కలిసి పంపిణీ చేశారు. దాతల సాయంతో వైద్యం చేయిస్తారని రమేష్ తెలిపాడు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత 72 గంటల నిరాహార దీక్షకు పోలీసుల అడ్డంకి

మున్సిపల్ సమస్యలపై జోనల్ కమీషనర్ కలిసిన బీజేపీ నేత మర్రి

ప్రభుత్వ టీచర్లకు ఎఫ్ఆర్ఎస్ అటెండెన్స్ ప్రారంభం

అంగన్వాడి సెంటర్లో తల్లిపాలవారోత్సవాలు
.jpg)
బీఆర్ఎస్సోళ్ళు ఉప ఎన్నికలు వస్తేనే స్కీం లు ఇచ్చేవాళ్ళు - మంత్రి పొన్నం

యూనియన్ బ్యాంక్ హెడ్ క్యాషియర్ కు కళాశాల ప్రిన్సిపల్ చే సత్కారం

అన్ని శాఖల సమన్వయంతో ఆపరేషన్ ముస్కాన్-XI విజయవంతం. జిల్లా లో 36 మoది బాల కార్మికులకు విముక్తి జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

సారంగాపూర్ మండలం కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం పరిశీలించిన జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్.

ఎస్సారెస్పీ కెనాల్ నీటిని సకాలంలో విడుదల చేసి ఆయకట్టు రైతాంగాన్ని ఆదుకోవాలి..... తెలంగాణ రైతు ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు శేర్ నర్సారెడ్డి

యూరియా పంపిణీపై కల్వకుంట్ల సంజయ్ బహిరంగ చర్చకు రావాలి

హమాలి బస్తీలో తల్లిపాల వారోత్సవాలు

ధర్మపురిలో ఘనంగా శ్రావణ శుక్రవార వేడుకలు
