చిట్టీల పేరిట ఘరానా మోసం..దంపతులకు జైలు శిక్ష - పదేండ్ల తర్వాత కోర్టు తీర్పు..
ఏడాది జైలు శిక్షతో పాటు జరిమాన- బాధితుల్లో హర్షం..
సికింద్రాబాద్, జూలై 17 ( ప్రజామంటలు):
చిట్టీల పేరిట మోసం చేసిన దంపతులకు జైలుశిక్ష, జరిమాన విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. పదేళ్ల తర్వాత నిందితులు కటకటాల్లోకి వెళ్ళడంతో బాధితులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చిలకలగూడ ఏపీసీ శశాంక్రెడ్డి, ఎస్హెచ్ఓ అనుదీప్లు తెలిపిన వివరాల ప్రకారం.. పార్శిగుట్టకు చెందిన డీ రవీందర్, సుజాతలు భార్యభర్తలు. 2015 లో ఇంటివద్ద ఉంటునే చిట్టీల వ్యాపారం ప్రారంభించారు. మొదట్లో తక్కువ మొత్తాలకు చిట్టీలు వేసి సకాలంలో డబ్బులు తిరిగి చెల్లించి స్థానికుల్లో నమ్మకం సంపాదించారు. తర్వాత పెద్దమొత్తంలో చిట్టీలు ప్రారంభించి ఎక్కువ మందిని చేర్చుకున్నారు. కాల పరిమితి ముగిసినప్పటికీ చిట్టీ డబ్బులు చెల్లించకుండా, అధిక మొత్తంలో వడ్డీ ఇస్తామని ఆశ పెట్టారు. 25 నుంచి 40 మంది వద్ద లక్షలాది రూపాయలు వసూలు చేశారు. హఠాత్తుగా ఓ రోజు బోర్డు తిప్పేసి పరారయ్యారు. దీంతో నష్టపోయిన వారంతా లబోదిబో మంటు పోలీసులను ఆశ్రయించారు. బాధితురాలు శాంతితోపాటు పలువురి ఫిర్యాదు మేరకు ఆర్ధిక మోసానికి పాల్పడిన భార్యభర్తలు రవీందర్, సుజాతతోపాటు సహకరించిన శంకర్, రాజేశ్వర్లపై కేసు నమోదు చేశారు. దర్యాప్తు అధికారిగా అప్పటి ఎస్ఐ పెండ్యాల జయశంకర్వ్యవహరించారు. పరారైన నిందితులను అదుపులోకి తీసుకుని కోర్టుకు తరలించారు. పోలీసులు అన్నికోణాల్లో దర్యాప్తు చేపట్టి ఆధారాలను అందించారు.
సుమారు పదేళ్ల పాటు కేసు నడిచింది. వాదోపవాదాలు విన్న తర్వాత సికింద్రాబాద్19వ అడిషనల్చీఫ్జ్యుడిషియల్మెజిస్ట్రేట్అరుణ గురువారం తీర్పు వెలువరించారు. చిట్టీల పేరిట మోసానికి పాల్పడిన భార్యభర్తలు రవీందర్, సుజాతలకు ఏడాది జైలుశిక్ష, రూ. 500 జరిమాన విధిస్తు ఆదేశాలు జారీ చేశారు. వీరికి సహకరించిన శంకర్, రాజేశ్వర్లపై కేసు కొట్టివేశారు. ఈ కేసులో అసిస్టెంట్పబ్లిక్ప్రాసిక్యూటర్గా జే భార్గవి, సీడీఓగా బీ శ్రీనివాస్లు వ్యవహరించారు.ఈకేసు అప్పట్లో స్థానికంగా సంచలనం రేపింది. :
More News...
<%- node_title %>
<%- node_title %>
సికింద్రాబాద్ కంటోన్మెంట్ కు స్వచ్చ్ సర్వేక్షన్ అవార్డు

వ్యభిచార గృహం పై సి సిఎస్ పోలీసుల దాడి పోలీసుల అదుపులో ఇద్దరు మహిళలు, ఇద్దరు యువకులు, పరారీలో నిర్వాహకురాలు

ఫుడ్ పాయిజన్ తో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించిన మాజీ జడ్పీ చైర్పర్సన్ వసంత

జగిత్యాల జిల్లా లక్ష్మీపూర్ గురుకుల ఘటనపై ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పందన

మహాత్మా జ్యోతిబాపూలే బాలికల గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కలకలం_ పలువురికి అస్వస్థత_ మాతా శిశు కేంద్రానికి తరలింపు_ విద్యార్థుల పరిస్థితి పరిశీలించిన జిల్లా కలెక్టర్

మెట్టుగూడ స్మశాన వాటికలో సమస్యల తిష్ట - కనీస వసతులు కరువు

వెల్గటూర్ మండల బడులలో PRTU సభ్యత్వ నమోదు

రోడ్డు ప్రమాదాల నివారణలో ప్రజలు భాగస్వాములు కావాలి జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

నాగులపేట పేకాట స్థావరంపై CCS పోలీసుల దాడి
2.jpeg)
చిట్టీల పేరిట ఘరానా మోసం..దంపతులకు జైలు శిక్ష - పదేండ్ల తర్వాత కోర్టు తీర్పు..

సిప్ అబాకస్ పోటీల్లో మెరిసిన పద్మారావునగర్ విద్యార్థులు

మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు సీనియర్ సిటీజేన్స్ వినతిపత్రం
