తెలంగాణకు అన్యాయం చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి - ఎమ్మెల్సీ కవిత 

On
తెలంగాణకు అన్యాయం చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి - ఎమ్మెల్సీ కవిత 

నిన్నటి డిల్లీ సమావేశంలో ఎజెండాలో మొదటి అంశమే బనకచర్ల.ముఖ్యమంత్రి, మంత్రి ఉత్తమ్ సిగ్గులేకుండా గోదావరి జలాలను చంద్రబాబు చేతిలో పెట్టారు.
బనకచర్లపై చర్చే జరగలేదని రేవంత్ రెడ్డి బుకాయిస్తున్నాడు - తెలంగాణ హక్కులను కాలరాసిన నాన్ సీరియస్ ముఖ్యమంత్రి తన పదవి రాజీనామా చేయాలి.
బనకచర్ల ప్రాజెక్టు కాంట్రాక్టర్లు,
కమీషన్ల కోసమే కడుతున్నారు
- ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత

హైదరాబాద్ జూలై 17:

సీఎం రేవంత్ రెడ్డి బనకచర్లపై బుకాయిస్తున్నారు.సీఎం రేవంత్ రెడ్డికి పాలించే హక్కు లేదు.తక్షణమే సీఎం పదవికి రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి విలేఖరుల సమావేశంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు.

ఈరోజు ఆమె నివాసంలో జరిగిన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడిన కవిత, బనకచర్ల వల్ల ఆంధ్రా ప్రజలకు ఏమి లాభం లేదు.కాంట్రాక్టర్లు, కమిషన్ల కోసం బనకచర్ల కడుతున్నారు.ముఖ్యమంత్రి మెగా కంపెనీ వాటా కోసమే డిల్లీకి వెళ్లారనీ ఆరోపించారు.

IMG-20250717-WA0003

చంద్రబాబు ఎజెండాలో భాగంగానే సీఎం డిల్లీకి వెళ్ళాడు..బనకచర్ల ఆపకపోతే న్యాయపోరాటం చేస్తాం పార్లమెంట్ సమావేశాలు జరగబోతున్న నేపధ్యంలో ముఖ్యమంత్రి అఖిలపక్షాన్ని డిల్లీకి తీసుకువెళ్లాలనీ కవిత డిమాండ్ చేశారు.

ఇంకా కవిత ఇలా అన్నారు:

తన స్కూల్ బీజేపీ, కాలేజీ టీడీపీ, ఉద్యోగం కాంగ్రెస్ లో అని సీఎం చెప్తుంటారు.ముఖ్యమంత్రి ఇంకా కాలేజ్ లోనే  ఉన్నానని  అనుకుంటున్నారు. అందుకే గోదావరి నీళ్లను చంద్రబాబు కు గిఫ్టుగా ఇచ్చారు*

ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను జనాభా లెక్కలోనుంచి తీసేసా. ఆయన ఎవరో నాకు తెలియదు.సీఎం రేవంత్ రెడ్డి, ఇరిగేషన్ శాఖామంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చంద్రబాబును ఎదుర్కొని సన్మానం చేశారు

సీఎం రేవంత్ రెడ్డి,ఉత్తమ్ కుమార్ రెడ్డి సిగ్గులేకుండా బనకచర్ల ప్రాజెక్టును చంద్రబాబుకు అప్పనంగా అప్పగించారు.నాలుగు విజయాలు సాధించామని సీఎం రేవంత్ రెడ్డి గొప్పలు చెప్పుకుంటున్నారు

కృష్ణానది బోర్డును అమరావతిలో పెట్టడం అనేది ఏపీ విభజన చట్టంలో ఉంది. తెలంగాణ ప్రజల హక్కులను చంద్రబాబునాయుడు కాళ్ళ దగ్గర తాకట్టుపెట్టారు. బనకచర్ల ప్రాజెక్టు ద్వారా ఏపీ ప్రజలకు ఉపయోగం లేదు.ఏపీలో నీళ్లు రాని ప్రాంతాలకు ప్రాజెక్టులు కట్టి నీళ్లు తీసుకుపోతే నేను స్వాగతిస్తా

బనకచర్ల ప్రాజెక్టు కాంట్రాక్టర్లు,
కమీషన్ల కోసమే కడుతున్నారు

మెగా కంపెనీకి బనకచర్ల ప్రాజెక్టును అప్పగించే కుట్ర జరుగుతోంది. రేవంత్ రెడ్డి చంద్రబాబు  నాయుడుకు సద్ది మోస్తున్నారు.తెలంగాణ జాగృతి తరపున బనకచర్ల ప్రాజెక్టుపై న్యాయ పోరాటం చేస్తాము.

IMG-20250717-WA0001

కచ్చితంగా బనకచర్లను 
ఆపి తీరుతాము

పార్లమెంట్ సమావేశాల సందర్భంగా ప్రభుత్వం ఢిల్లీకి అఖిలపక్షం తీసుకువెళ్లి బీసీ బిల్లు,బనకచర్లపై
కేంద్రంతో మాట్లాడాలి.తుపాకులగూడెం నుంచి 
నదుల అనుసంధానం జరిగితే తెలంగాణ,ఆంధ్రాకు 
న్యాయం జరుగుతుంది

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అచేతనస్థితికి మేము బాధపడుతున్నాం.సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి అఖిలపక్షం తీసుకువెల్లకపోతే మేము జాగృతి తరపున ఢిల్లీకి కలిసివచ్చే వాళ్ళతో ఢిల్లీలో పోరాటం చేస్తాము. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు బనకచర్లపై అసలు చర్చ జరగలేదు

కొప్పుల ఈశ్వర్ స్వయంగా బొగ్గుగని కార్మికుడు వారికి బొగ్గుగని కార్మిక సంఘం భాద్యతలు అప్పగించడాన్ని స్వాగతిస్తున్నా

 

Tags

More News...

Local News 

సికింద్రాబాద్ కంటోన్మెంట్ కు స్వచ్చ్ సర్వేక్షన్ అవార్డు

సికింద్రాబాద్ కంటోన్మెంట్ కు స్వచ్చ్ సర్వేక్షన్ అవార్డు మంత్రి చేతుల మీదుగా అవార్డును అందుకున్న బోర్డు సీఈఓ మధుకర్ నాయక్... సికింద్రాబాద్, జూలై 17 (ప్రజామంటలు) :   పరిసరాల పరిశుభ్రత, మౌళిక సదుపాయాల కల్పనపై కేంద్రప్రభుత్వం ఇచ్చే స్వచ్చ్ సర్వేక్షన్ మినిస్టీరియల్ అవార్డును  సికింద్రాబాద్ కంటోన్మెంట్ దక్కించుకుంది.  ఈ మేరకు ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో జరిగిన పత్ర్యేక కార్యక్రమంలో గృహనిర్మాణం  
Read More...

వ్యభిచార గృహం పై  సి సిఎస్   పోలీసుల దాడి పోలీసుల అదుపులో  ఇద్దరు మహిళలు, ఇద్దరు యువకులు, పరారీలో నిర్వాహకురాలు

వ్యభిచార గృహం పై  సి సిఎస్   పోలీసుల దాడి  పోలీసుల అదుపులో  ఇద్దరు మహిళలు, ఇద్దరు యువకులు, పరారీలో నిర్వాహకురాలు జగిత్యాల జులై 17 ( ప్రజా మంటలు) జిల్లా కేంద్రంలో ఒక ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్నారని సమాచారం మేరకు సిసిఎస్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఎస్సై రాజు తమ సిబ్బందితో కలిసి  ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ యొక్క తనిఖీలు ఇద్దరు మహిళలు ఇద్దరు యువకుల ను  అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి నాలుగు...
Read More...
Local News 

ఫుడ్ పాయిజన్ తో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించిన మాజీ జడ్పీ చైర్పర్సన్ వసంత

ఫుడ్ పాయిజన్ తో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించిన మాజీ జడ్పీ చైర్పర్సన్ వసంత జగిత్యాల రూరల్ జూలై 17 (ప్రజా మంటలు)   లక్ష్మీపూర్ గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ తో మాత శిశు హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న విద్యార్థులను బి ఆర్ ఎస్ నాయకులతో కలిసి పరామర్శించిన జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్  ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ....  లక్ష్మీపూర్ గురుకుల లో*...
Read More...
State News 

జగిత్యాల జిల్లా లక్ష్మీపూర్ గురుకుల ఘటనపై ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పందన

జగిత్యాల జిల్లా లక్ష్మీపూర్ గురుకుల ఘటనపై ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పందన హైదరాబాద్ జూలై 17: జగిత్యాల జిల్లా లక్ష్మీపూర్ గురుకుల ఘటనపై ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత  సోషల్ మీడియా వేదికగా ట్వీట్ పెట్టారు. 'అరాచక కాంగ్రెస్ పాలనలో దయనీయంగా గురుకులాలు.. జగిత్యాల జిల్లా లక్ష్మీపూర్ గురుకులంలో ఫుడ్ పాయిజన్తో 30 మందికి పైగా విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురికావడంతో మరోసారి ప్రభుత్వ చేతగానితనం...
Read More...
Local News 

మహాత్మా జ్యోతిబాపూలే బాలికల గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కలకలం_ పలువురికి అస్వస్థత_ మాతా శిశు కేంద్రానికి తరలింపు_ విద్యార్థుల పరిస్థితి పరిశీలించిన జిల్లా కలెక్టర్

మహాత్మా జ్యోతిబాపూలే బాలికల గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కలకలం_ పలువురికి అస్వస్థత_ మాతా శిశు కేంద్రానికి తరలింపు_ విద్యార్థుల పరిస్థితి పరిశీలించిన జిల్లా కలెక్టర్    జగిత్యాల రూరల్ జూలై17(ప్రజా మంటలు) మండలంలోని లక్ష్మీపూర్ మహాత్మ జ్యోతిబాపూలే బాలికల గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది.. నిన్న బోనాల పండుగ సందర్భంగా ఏర్పాటు చేసిన విందులో తిన్న విద్యార్థినిలు అస్వస్థతకు  గురయ్యారు.. పాఠశాలలో 350 కి మంది పైగా విద్యార్థినిలు ఉండగా సుమారు 30 మంది అయితే కడుపునొప్పి, విరేచనాలతో బాధపడ్డారు......
Read More...
Local News 

మెట్టుగూడ స్మశాన వాటికలో సమస్యల తిష్ట - కనీస వసతులు కరువు

మెట్టుగూడ స్మశాన వాటికలో సమస్యల తిష్ట - కనీస వసతులు కరువు సికింద్రాబాద్, జూలై 17 (ప్రజామంటలు): సికింద్రాబాద్ మెట్టుగూడ స్మశాన వాటికలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కారించాలని స్థానికులు కోరుతున్నారు. ఇక్కడ అంత్యక్రియలు ముగిసిన తర్వాత స్నానం  చేయడానికి కనీసం నీటి వసతి లేదని వారు వాపోయారు. అంత్యక్రియం ఖర్చుకోసం రూ 10 వేలు వసూలు చేస్తున్నప్పటికీ కనీస సౌకర్యాలు లేవన్నారు. ఇక్కడున్న 150 చరిత్ర కలిగిన...
Read More...
Local News 

వెల్గటూర్ మండల బడులలో PRTU సభ్యత్వ నమోదు

వెల్గటూర్ మండల బడులలో PRTU  సభ్యత్వ నమోదు వెల్గటూర్ జూలై 17: పిఆర్టియుటిఎస్ వెల్గటూర్ మండల శాఖ ఆధ్వర్యంలో మండలంలోని పాఠశాలల్లో సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చింతపండు నర్సింగం మరియు శ్రీధర్ రెడ్డి గార్లు మాట్లాడుతూ ప్రతి ప్రాథమిక పాఠశాలకు ఒక ఎల్ ఎఫ్ ఎల్ హెచ్ఎం తోపాటు తరగతికి ఒక ఉపాధ్యాయుడు...
Read More...
Local News 

రోడ్డు ప్రమాదాల నివారణలో ప్రజలు భాగస్వాములు కావాలి  జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ 

రోడ్డు ప్రమాదాల నివారణలో ప్రజలు భాగస్వాములు కావాలి  జిల్లా ఎస్పీ అశోక్ కుమార్  జూలై 17(ప్రజా మంటలు) రోడ్డు ప్రమాదాల నివారణలో ప్రజలు భాగస్వాములు కావాలని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు.జిల్లా లో రోడ్డు ప్రమాదాల నివారణనే లక్ష్యంగా జిల్లా ఎస్పి  అశోక్ కుమార్  ప్రతిష్టాత్మకంగా చేపట్టిన *”సురక్షిత ప్రయాణం”* అనే కార్యక్రమo లో బాగంగా జగిత్యాల పట్టణం లోని నటరాజ్  థియేటర్   రోడ్డు నుoడి వాహనాలు...
Read More...
Local News  Crime 

నాగులపేట పేకాట స్థావరంపై CCS పోలీసుల దాడి

నాగులపేట పేకాట స్థావరంపై CCS పోలీసుల దాడి పోలీసుల అదుపులో 7 గురు, 3670/- రూపాయలు స్వాదీనం కోరుట్ల జూలై 17 (ప్రజా మంటలు): కోరుట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగులపేట గ్రామ శివారులో పేకాట ఆడుతున్నారన్న సమాచారంతో CCS పోలీసులు దాడి చేశారు. పేకాట ఆడుతున్న 7 గురుని అదుపులోకి  తీసుకొని, వారి వద్ద నుంచి  రూ.3670/-, 7 మొబైల్ ఫోన్స్, 7...
Read More...
Local News 

చిట్టీల పేరిట ఘరానా మోసం..దంపతులకు జైలు శిక్ష   - పదేండ్ల తర్వాత కోర్టు తీర్పు..

చిట్టీల పేరిట ఘరానా మోసం..దంపతులకు జైలు శిక్ష   - పదేండ్ల తర్వాత కోర్టు తీర్పు.. ఏడాది జైలు శిక్షతో పాటు జరిమాన- బాధితుల్లో హర్షం.. సికింద్రాబాద్, జూలై 17 ( ప్రజామంటలు): చిట్టీల పేరిట మోసం చేసిన దంపతులకు జైలుశిక్ష, జరిమాన విధిస్తూ  న్యాయమూర్తి తీర్పు చెప్పారు. పదేళ్ల తర్వాత నిందితులు కటకటాల్లోకి వెళ్ళడంతో బాధితులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చిలకలగూడ ఏపీసీ శశాంక్‌రెడ్డి, ఎస్‌హెచ్‌ఓ అనుదీప్‌లు తెలిపిన వివరాల...
Read More...
Local News 

సిప్‌ అబాకస్‌ పోటీల్లో మెరిసిన పద్మారావునగర్‌ విద్యార్థులు 

సిప్‌ అబాకస్‌ పోటీల్లో మెరిసిన పద్మారావునగర్‌ విద్యార్థులు  సికింద్రాబాద్  జూలై 17 (ప్రజా మంటలు): సిప్‌అబాకస్‌ రీజనల్‌ ప్రోడిజీ పోటీల్లో విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ ప్రదర్శించి పలు బహుమతులు గెలుచుకున్నారని పద్మారావునగర్‌ ప్రాంచైజీ నిర్వాహకురాలు అనురాధ రజనీకాంత్‌ తెలిపారు. ఈమేరకు గురువారం పద్మారావునగర్‌ సెంటర్‌లో జరిగిన  కార్యక్రమంలో ప్రతిభ ప్రదర్శించిన విద్యార్థులను అభినందించారు.  సిప్‌ అబాకస్‌ రీజనల్‌ ప్రోడిజీ–2025 పేరిట ఇటీవల కాంపిటీషన్‌ నిర్వహించగా...
Read More...
Local News 

మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు సీనియర్ సిటీజేన్స్ వినతిపత్రం

మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు సీనియర్ సిటీజేన్స్ వినతిపత్రం జగిత్యాల  జులై 17: సీనియర్ సిటీజేన్స్ సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర ఎస్సీ,ఎస్టీ,మైనార్టీ,సీనియర్ సిటీజేన్స్,వికలాంగుల సంక్షేమ మంత్రి అడ్లూరి లక్ష్మన్ కుమార్ కు తెలంగాణ ఆల్  సీనియర్ సిటీజేన్స్  అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి,జగిత్యాల జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ ఆధ్వర్యంలో సంఘ జిల్లా  ప్రతినిధులు వినతిపత్రం సమర్పించారు.గురువారం ధర్మపురి లో మంత్రి క్యాంపు కార్యాలయంలో మంత్రికి...
Read More...

Latest Posts

సికింద్రాబాద్ కంటోన్మెంట్ కు స్వచ్చ్ సర్వేక్షన్ అవార్డు
వ్యభిచార గృహం పై  సి సిఎస్   పోలీసుల దాడి పోలీసుల అదుపులో  ఇద్దరు మహిళలు, ఇద్దరు యువకులు, పరారీలో నిర్వాహకురాలు
ఫుడ్ పాయిజన్ తో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించిన మాజీ జడ్పీ చైర్పర్సన్ వసంత
జగిత్యాల జిల్లా లక్ష్మీపూర్ గురుకుల ఘటనపై ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పందన
మహాత్మా జ్యోతిబాపూలే బాలికల గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కలకలం_ పలువురికి అస్వస్థత_ మాతా శిశు కేంద్రానికి తరలింపు_ విద్యార్థుల పరిస్థితి పరిశీలించిన జిల్లా కలెక్టర్