బోనాల జాతరలో భక్తులకు సేవ చేయడం అదృష్టం
మక్తల ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు జలంధర్ గౌడ్
సికింద్రాబాద్, జులై 14 (ప్రజామంటలు)
సికింద్రాబాద్ లష్కర్ శ్రీ ఉజ్జయిని మహాకాళి అమ్మవారి బోనాల జాతర సందర్భంగా, శుక్రవారం మినీ జాతరగా తలపించే రోజు తోపాటు ఆదివారం బోనాల పండుగ సందర్భంలో, సోమవారం రంగం, అంబారి ఊరేగింపులో తమదైన శైలిలో భక్తి పరవశంతో క్రమం తప్పకుండా మక్తల ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు జలంధర్ గౌడ్ ఆధ్వర్యంలో 48 మంది బృందాలుగా ఈ జాతరకు లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు సేవలను తమ అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు.
క్యూ లైన్ లో ఉన్న భక్తులకు వాలంటరీలకు సిబ్బందికి వాటర్ మంచినీళ్ల బాటలను మంచి నీటి ప్యాకెట్లను అందించడంతోపాటు దర్శనానికి విచ్చేసే భక్తులకు క్యూ లైన్ ల పై అవగాహన కల్పిస్తూ బోనాలు ఎత్తుకొని వచ్చే మహిళలకు ఇబ్బందులు కలగకుండా అండగా ఓపికగా నిలబడి అమ్మవారిని దర్శించుకోవాలని చెబుతూ వారి ఆరోగ్య పరిస్థితిని గమనిస్తూ ఎప్పటికప్పుడు స్థానిక సమస్యలను వివిధ అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో పాటు ఆలయ చుట్టుపక్కల ప్రాంతాలలో రూట్ మ్యాప్ లను బ్యానర్లను పోలీసు ఉన్న అధికారుల సూచన మేరకు ఆదేశాల మేరకు ఏర్పాటు చేశారు. అంతేకాకుండా తమదైన శైలిలో పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలి అనే టీ షర్టులను ధరించి ప్రచారం చేస్తూ సేవలు అందించడం గమనార్ధం. వికలాంగులకు వయోవృద్ధులకు కూడా తమదైన శైలిలో సేవలు అందిస్తూ జాతరలో ముందుకు సాగారు.
వారి సేవలను గుర్తించిన ఉజ్జయిని మహాకాళి ఆలయ ఈ.వో మనోహర్ రెడ్డి జలంధర్ గౌడ్ తో పాటు వారి బృందాన్ని ఆయన కార్యాలయంలో సత్కరించి అమ్మవారి చీరలను అందజేశారు. ఆయనతోపాటు సేవ కార్యక్రమంలో ఆయన బృందం సభ్యులు నరసింహ చారి, శివ రతన్, అర్చన, నిఖిత, శివకుమార్, కే.వేణు, కే. వెంకటేష్, ఎం.శేఖర్ గౌడ్, పూర్ణచందర్, వెంకటాచారి, రాజశేఖర్, బాలరాజ్, ఎం. శశాంక్, కృష్ణ, రజిత, రాధిక, పి.సాయి ప్రియ, పి. వెంకట సాయి, మణిదీప్, అంజి, వై శ్రీలత, వి.ప్రణవ్ సాయి, నిఖిత్ తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
అహ్మాదీయ ముస్లిం కమ్యూనిటీ మహిళా విభాగం ఆధ్వర్యంలో బ్లడ్ డోనేషన్

జర్నలిస్టుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేయాలి.

బోనాల జాతరలో భక్తులకు సేవ చేయడం అదృష్టం

రాసుల కొద్దీ తెప్పించుకుంటున్నారు...కాని తనకు గోరంత కూడ దక్కడం లేదు- రంగంలో భవిష్య వాణి వినిపించిన స్వర్ణలత

వేలేరు మాజీ జడ్పిటిసి చాడ సరిత అంత్యక్రియల్లో పాల్గొన్న ప్రముఖులు

ఇప్పుడే బుగ్గారం పంచాయతీ ఎన్నికలు వద్దు

తీన్మార్ మల్లన్నపై కఠిన చర్యలు తీసుకోవాలి- మహిళా కమిషన్ కు తెలంగాణ జాగృతి నాయకుల ఫిర్యాదు

ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి-పీ ఆర్ టీ యు జిల్లా ప్రధాన కార్యదర్శి అమర్ నాథ్ రెడ్డి

ఫుట్ పాత్ అనాధలను ప్రభుత్వం ఆదుకోవాలి

గంగపుత్ర సంఘానికి రూ.4 లక్షల ఎంపీ నిధుల కేటాయింపు

ప్రముఖ నటి బి.సరోజాదేవి కన్నుమూత
.jpg)
ఆడబిడ్డలను గౌరవించే తెలంగాణలో ఇలాంటి వ్యాఖ్యలేంటి- మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే వాళ్లు రాజకీయాల్లోకి ఎలా వస్తరు?
