తీన్మార్ మల్లన్నపై కఠిన చర్యలు తీసుకోవాలి- మహిళా కమిషన్ కు తెలంగాణ జాగృతి నాయకుల ఫిర్యాదు
మహిళా కమిషన్ కార్యాలయం ఎదుట నాయకుల ఆందోళన
హైదరాబాద్ జూలై 14: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ జాగృతి మహిళా నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం మధ్యాహ్నం తెలంగాణ మహిళా కమిషన్ కార్యాలయంలో ఈమేరకు ఫిర్యాదు చేశారు.
చైర్ పర్సన్ నేరెళ్ల శారద అందుబాటులో లేకపోవడంతో కమిషన్ సభ్యులు సుదం లక్ష్మీ, రేవతి రావు, ఉమ, అప్రోజ్ సహీనాకు ఫిర్యాదు అందజేశారు. ముందస్తు సమాచారం ఇచ్చినా చైర్మన్ అందుబాటులో లేకపోవడంపై జాగృతి నాయకులు అసహనం వ్యక్తం చేశారు. చైర్ పర్సన్ అందుబాటులో లేరని చెప్తూ సెక్రటరీ సైతం ఫిర్యాదు లేఖను తీసుకోవడానికి అంగీకరించలేదని.. మహిళలను కించపరిచే వ్యక్తుల విషయంలో ఇలాంటి వైఖరి మంచిది కాదన్నారు. సభ్యులు స్పందించి ఫిర్యాదును చైర్ పర్సన్ దృష్టికి తీసుకెళ్లి తీన్మార్ మల్లన్నపై చర్యలు తీసుకునేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఫిర్యాదు చేసిన వారిలో మహిళా జాగృతి అధ్యక్షురాలు మరిపల్లి మాధవి, సీనియర్ నాయకులు వరలక్ష్మీ, పడాల మనోజ, దేశపాక సుచిత్ర, సంధ్య రెడ్డి, షాహీన్, పరమేశ్వరి, కుసుమ రజిత, రజితా రెడ్డి తదితరులు ఉన్నారు.
మహిళా కమిషన్ ఎదుట నాయకుల ఆందోళన
తీన్మార్ మల్లన్నపై ఫిర్యాదు చేసేందుకు వచ్చిన తమను కమిషన్ లోపలికి అనుమతించకపోవడంపై తెలంగాణ మహిళా జాగృతి నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకు కమిషన్ గేట్లు మూసేశారని, తమను ఎందుకు అనుమతించడం లేదని నిలదీశారు. రెండు గంటల పాటు మహిళా కమిషన్ కార్యాలయం ఎదుట ఎండలో బైఠాయించి ఆందోళనకు దిగారు. మహిళలను కించపరిచిన వ్యక్తులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందా అని ప్రశ్నించారు. కమిషన్ చైర్ పర్సన్ జోక్యం చేసుకొని కొందరు నాయకులను లోపలికి అనుమతించడంతో ఆందోళన విరమించారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
అహ్మాదీయ ముస్లిం కమ్యూనిటీ మహిళా విభాగం ఆధ్వర్యంలో బ్లడ్ డోనేషన్

జర్నలిస్టుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేయాలి.

బోనాల జాతరలో భక్తులకు సేవ చేయడం అదృష్టం

రాసుల కొద్దీ తెప్పించుకుంటున్నారు...కాని తనకు గోరంత కూడ దక్కడం లేదు- రంగంలో భవిష్య వాణి వినిపించిన స్వర్ణలత

వేలేరు మాజీ జడ్పిటిసి చాడ సరిత అంత్యక్రియల్లో పాల్గొన్న ప్రముఖులు

ఇప్పుడే బుగ్గారం పంచాయతీ ఎన్నికలు వద్దు

తీన్మార్ మల్లన్నపై కఠిన చర్యలు తీసుకోవాలి- మహిళా కమిషన్ కు తెలంగాణ జాగృతి నాయకుల ఫిర్యాదు

ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి-పీ ఆర్ టీ యు జిల్లా ప్రధాన కార్యదర్శి అమర్ నాథ్ రెడ్డి

ఫుట్ పాత్ అనాధలను ప్రభుత్వం ఆదుకోవాలి

గంగపుత్ర సంఘానికి రూ.4 లక్షల ఎంపీ నిధుల కేటాయింపు

ప్రముఖ నటి బి.సరోజాదేవి కన్నుమూత
.jpg)
ఆడబిడ్డలను గౌరవించే తెలంగాణలో ఇలాంటి వ్యాఖ్యలేంటి- మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే వాళ్లు రాజకీయాల్లోకి ఎలా వస్తరు?
