ఆడబిడ్డలను గౌరవించే తెలంగాణలో ఇలాంటి వ్యాఖ్యలేంటి- మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే వాళ్లు రాజకీయాల్లోకి ఎలా వస్తరు?

On
ఆడబిడ్డలను గౌరవించే తెలంగాణలో ఇలాంటి వ్యాఖ్యలేంటి- మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే వాళ్లు రాజకీయాల్లోకి ఎలా వస్తరు?

నిరసన తెలిపేందుకు వెళ్లిన జాగృతి కార్యకర్తలపై కాల్పులేంటి?
- తీన్మార్ మల్లన్నను ఎమ్మెల్సీ పదవి నుంచి తప్పించాలి*
తీన్మార్ మల్లన్నపై శాసన మండలి చైర్మన్, డీజీపీకి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఫిర్యాదు

హైదరాబాద్ జూలై 13:
ఆడబిడ్డలను ఎంతగానో గౌరవించే తెలంగాణలో చట్టసభలో సభ్యుడిగా ఉన్న వ్యక్తి హేయమైన వ్యాఖ్యలు చేయడం దారుణమని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆందోళన వ్యక్తం చేశారు. తన వ్యక్తిత్వాన్ని కించపరిచేలా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పై చర్యలు తీసుకోవాలని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఆదివారం జూబ్లీహిల్స్ లోని చైర్మన్ నివాసంలో గుత్తా సుఖేందర్ రెడ్డిని కలిసి ఫిర్యాదు లేఖతో పాటు తనపై ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలతో కూడిన పెన్ డ్రైవ్ అందజేశారు.

చైర్మన్ కు ఉన్న విచక్షణ అధికారాలను ఉపయోగించి తీన్మార్ మల్లన్న సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తీన్మార్ మల్లన్న తనపై చేసిన వ్యాఖ్యలను శాసన మండలి ఎథిక్స్ కమిటీకి రిఫర్ చేయాలని కోరారు.

తెలంగాణ ఉద్యమంలోనూ కాల్పులు జరపలే
తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున సాగుతోన్న రోజుల్లోనూ పోలీసులు, నాయకుల గన్ మెన్లు ఏ ఒక్క రోజు కాల్పులు జరిపిన దాఖలాలు లేవని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఆదివారం మండలి చైర్మన్ ను కలిసి ఫిర్యాదు చేసిన అనంతరం ఆయన నివాసం ఎదుట మీడియాతో మాట్లాడారు. తీన్మార్ మల్లన్న తనపై చేసిన వ్యాఖ్యలపై నిరసన తెలిపేందుకు జాగృతి కార్యకర్తలు ఆయన కార్యాలయానికి వెళ్లారని తెలిపారు.

వాళ్లు దాడి చేస్తేనే తమ వాళ్లు ప్రతిదాడి చేశారని.. ఇంతమాత్రానికే గన్ ఫైర్ చేస్తారా అని ప్రశ్నించారు. ఒక ఆడబిడ్డ ప్రశ్నిస్తే సహించలేకపోతున్నారా అని నిలదీశారు. తాను ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరుకోబోనని తేల్చిచెప్పారు. తాను మామూలు ఆడబిడ్డను కాదు.. అగ్గిరవ్వను అని హెచ్చరించారు.
సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులను సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారని ఇద్దరు  మహిళా జర్నలిస్టులను అరెస్టు చేశారని.. తనపై తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలు చేసినా సీఎం ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. తన కుటుంబ సభ్యులపై ఒకతీరు.. తెలంగాణ ఆడబిడ్డనైన తన వ్యక్తిత్త హననానికి పాల్పడ్డ వారిపై మరోలా వ్యవహరిస్తారా అని నిలదీశారు. తీన్మార్ మల్లన్నపై సీఎం చర్యలు తీసుకోకపోతే ఈ వ్యాఖ్యలు వెనుక ఆయన ఉన్నారని భావించాల్సి వస్తుందన్నారు. జాగృతి కార్యకర్తలపై కాల్పుల ఘటనను సీరియస్ గా తీసుకోవాలన్నారు.

సీఎం, డీజీపీ వెంటనే స్పందించి సమగ్ర దర్యాప్తునకు ఆదేశించాలన్నారు. ఎమ్మెల్సీనైనా తనపై చేసిన వ్యాఖ్యలనే పట్టించుకోకపోతే సాధారణ మహిళల పరిస్థితి ఏమిటన్నారు. తాను ఏడాదిన్నరగా బీసీల కోసం ఉద్యమిస్తున్నానని.. ఏ ఒక్కరోజు కూడా తాను తీన్మార్ మల్లన్నను ఒక్కమాట కూడా అనలేదన్నారు. అలాంటప్పుడు తనపై అనుచిత వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించారు. ఇలాంటి వ్యాఖ్యలతో రాజకీయాల్లోకి రావాలంటేనే మహిళలు భయపడే పరిస్థితి ఇలాంటి ఘటనలతో ఉత్పన్నమవుతుందన్నారు. తీన్మార్ మల్లన్న బీసీ కాబట్టి ఏది పడితే అది మాట్లాడితే చెల్లుతుందని అనుకోవడం సరికాదన్నారు.

కాల్పుల ఘటన వెనుక ప్రభుత్వమే ఉంది
తెలంగాణ జాగృతి కార్యకర్తల ఘటన వెనుక ప్రభుత్వ హస్తం ఉందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. జాగృతి కార్యకర్తలపై కాల్పులు, దాడి, తన వ్యక్తిత్తాన్ని హననం చేసేలా వ్యాఖ్యలు చేసిన తీన్మార్ మల్లన్నపై చర్యలు తీసుకోవాలని కోరుతూ డీజీపీ ఆఫీస్ లో ఫిర్యాదు చేశారు. ఆదివారం లా అండ్ ఆర్డర్ అడిషనల్ ఐజీ రమణ కుమార్ ను కలిసి ఫిర్యాదు అందజేశారు. అనంతరం ఎమ్మెల్సీ కవిత మీడియాతో మాట్లాడుతూ, తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన తీన్మార్ మల్లన్నపై కంప్లైంట్ చెయ్యడానికి డీజీపీ ఆఫీసుకు వచ్చాన్నారు. జాగృతి కార్యకర్తలపై తొపాకులతో కాల్పులు జరిపించింది  తీన్మార్ మల్లన్న నా? లేక ప్రభుత్వమా? అనేది తెలియాలన్నారు. సమగ్ర విచారణ చేయాలని డిమాండ్ చేస్తున్నానని తెలిపారు. ఇంత పెద్ద ఘటనపై ఫిర్యాదు చేయడానికి వస్తే డీజీపీ ఆఫీస్ కు రాలేదు అంటే దీని వెనుక ప్రభుత్వమే ఉందన్న అనుమానం కలుగుతుందన్నారు. తీన్మార్ మల్లన్న ఆదేశాలతోనే గన్ మెన్ కాల్పులు జరిపారని.. గన్ మెన్లను వెంటనే డిస్మిస్ చేయాలని డమాండ్ చేశారు.

Tags

More News...

Local News  State News 

ఆడబిడ్డలను గౌరవించే తెలంగాణలో ఇలాంటి వ్యాఖ్యలేంటి- మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే వాళ్లు రాజకీయాల్లోకి ఎలా వస్తరు?

ఆడబిడ్డలను గౌరవించే తెలంగాణలో ఇలాంటి వ్యాఖ్యలేంటి- మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే వాళ్లు రాజకీయాల్లోకి ఎలా వస్తరు? నిరసన తెలిపేందుకు వెళ్లిన జాగృతి కార్యకర్తలపై కాల్పులేంటి? - తీన్మార్ మల్లన్నను ఎమ్మెల్సీ పదవి నుంచి తప్పించాలి* తీన్మార్ మల్లన్నపై శాసన మండలి చైర్మన్, డీజీపీకి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఫిర్యాదు హైదరాబాద్ జూలై 13:ఆడబిడ్డలను ఎంతగానో గౌరవించే తెలంగాణలో చట్టసభలో సభ్యుడిగా ఉన్న వ్యక్తి హేయమైన వ్యాఖ్యలు చేయడం దారుణమని ఎమ్మెల్సీ కల్వకుంట్ల...
Read More...
Local News 

వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జర్నలిస్టు యూనియన్ నాయకులకు సన్మానం.

వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జర్నలిస్టు యూనియన్ నాయకులకు సన్మానం. జగిత్యాల జూలై 13(ప్రజా మంటలు) తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు యూనియన్ జిల్లా శాఖ ఎన్నికల్లో గెలుపొందిన నూతన కార్యవర్గాన్ని ధరూర్ క్యాంపు వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ఆదివారం ఘనంగా సన్మానించారు.   హౌసింగ్ బోర్డ్ గ్రౌండ్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ జిల్లా అధ్యక్షులు చీటి శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి బెజ్జంకి సంపూర్ణ...
Read More...
Local News 

అచ్చుబండ పోచమ్మ తల్లి బోనాల జాతర  - ప్రైమ్ ఫైట్స్ ఆధ్వర్యంలో ఘనంగా బోనాల పండుగ

అచ్చుబండ పోచమ్మ తల్లి బోనాల జాతర  - ప్రైమ్ ఫైట్స్ ఆధ్వర్యంలో ఘనంగా బోనాల పండుగ    జగిత్యాల జులై 13 (ప్రజా మంటలు): ఆషాడమాసమును పురస్కరించుకుని పట్టణంలోని ధరూర్ క్యాంప్ లో గల అచ్చుబండ పోచమ్మ తల్లికి ప్రైమ్ హైట్స్ కుటుంబ సభ్యులు ఆదివారం అత్యంత ఘనంగా బోనాల జాతర నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు బోనాలను ఎత్తుకొని డప్పుల చప్పట్లతో నడుచుకుంటూ వెళ్లి అమ్మలగన్న అమ్మ పోచమ్మ తల్లికి బోనాలను సమర్పించి...
Read More...
Local News  State News 

బోనమెత్తిన లష్కర్. - అంగరంగ వైభవంగా ఆషాడ బోనాల వేడుకలు

బోనమెత్తిన లష్కర్. - అంగరంగ వైభవంగా ఆషాడ బోనాల వేడుకలు - అమ్మవార్లకు పట్టు వస్ర్తాలు సమర్పించిన సీఎం రేవంత్ రెడ్డి- భక్తులతో కిక్కిరిసిన ఉజ్జయిని మహాకాళి ఆలయ పరిసరాలు - పోలీసుల భారీ బందోబస్తు సికింద్రాబాద్, జూలై 13 (ప్రజామంటలు): లష్కర్ లో బోనాల పండుగ ఆదివారం అంగరంగ వైభవంగా సాగింది. ఉదయం నుంచి రాత్రి వరకు వేలాది మంది భక్త జన కోటి...
Read More...
Local News 

ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన తీన్మార్ మల్లన్న పై పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసిన తొలి జెడ్పి చైర్పర్సన్ వసంత

ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన తీన్మార్ మల్లన్న పై పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసిన తొలి జెడ్పి చైర్పర్సన్ వసంత జగిత్యాల జులై 13 (ప్రజా మంటలు) తీన్మార్ మల్లన్న ఒక ప్రజాస్వామ్య పదవిలో ఉన్నావు నోరు  జాగ్రత్తగా పెట్టుకోకవితక్క కి ముక్కు నెలకు రాసి క్షమాపణ చెప్పాలికల్వకుంట్ల కవితక్క పై అనుచిత వాక్యాలు చేసిన తీన్మార్ మల్లన్న పై చర్యలు తీసుకోవాలని జగిత్యాల పట్టణ పోలీస్ స్టేషన్ లో జగిత్యాల నియోజకవర్గం మహిళ...
Read More...
Local News 

సీనియర్ సినీ నటుడు కోట శ్రీనివాసరావు కు నివాళి

సీనియర్ సినీ నటుడు కోట శ్రీనివాసరావు కు నివాళి    వేములకుర్తి గ్రామంలో కోట శ్రీనివాసరావు మృతి నివాలి లో  తెలంగాణ రాష్ట్ర సినీ నిర్మాత భరత్ కుమార్ అంకతి ఇబ్రహీంపట్నం జూన్ 12 (ప్రజా మంటలు దగ్గుల అశోక్): పదశ్రీ అవార్డు గహిత,విలక్షణ సీనియర్ సినీ నటుడు,ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ఎమ్మెల్యే కోట శ్రీనివాసరావు ప్రజల మదిలో అయన  చిరస్మరణీయం గా తెలుగు ప్రజల గుండెల్లో...
Read More...
National  Filmi News  State News 

విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు కన్నుమూత.

విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు కన్నుమూత. హైదరాబాద్ జూలై 13: విలక్షణ నటుడు, 750 చిత్రాలలో నటించిన కోట శ్రీనివాస్ రావు (1942 జులై 10 - 2025 జులై 13) కన్నుమూశారు..  కృష్ణా జిల్లా కంకిపాడులో 1942, జులై 10న జన్మించిన కోట శ్రీనివాసరావు.. 1978లో ప్రాణం ఖరీదు సినిమాతో సినీరంగ ప్రవేశం చేసిన కోట శ్రీనివాసరావు.. ఆహా నా పెళ్లంట...
Read More...
Local News 

మాజీ మంత్రి రాజేశం గౌడ్  మనమరాలి జన్మదిన సందర్భంగా వాల్మీకి ఆవాసంలో  విద్యార్థులకు విందు భోజనం ఏర్పాటు

మాజీ మంత్రి రాజేశం గౌడ్  మనమరాలి జన్మదిన సందర్భంగా వాల్మీకి ఆవాసంలో  విద్యార్థులకు విందు భోజనం ఏర్పాటు జగిత్యాల జులై 12(ప్రజా  పట్టణంలో శ్రీ వాల్మీకి ఆవాసం సేవ భారతి లో మాజీ మంత్రివర్యులు రాజేశం గౌడ్  మనుమరాలు సమీరా 8వ పుట్టినరోజు వేడుకల సందర్భంగా ఆవాసం విద్యార్థులకు ఒక రోజు భోజనం వసతి కల్పించగా ముఖ్య అతిథిగా హాజరై   ఆవాసం విద్యార్థులకు భోజనం వడ్డించిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ ఈ...
Read More...
Local News 

బోనాల పండుగ నిర్వహణకు చెక్కుల పంపిణీ

బోనాల పండుగ నిర్వహణకు చెక్కుల పంపిణీ సికింద్రాబాద్ జూలై 12 (ప్రజామంటలు): బోనాల పండుగను పురస్కరించుకుని తెలంగాణ ప్రభుత్వం అందించే ఆర్థిక సహాయం కింద సికింద్రాబాద్  నియోజకవర్గం  పరిధిలోని 212  దేవాలయాలకు రూ కోటి 12  లక్షల రూపాయలను ప్రభుత్వం చెక్కుల రూపంలో అందజేసింది ఈ మేరకు శనివారం  సీతాఫల్మండి లోని మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్ లో ప్రభుత్వ సలహాదారుడు వేం...
Read More...
Local News 

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై ఆర్డినెన్స్ నిర్ణయంపై ప్రభుత్వంకు కృతజ్ఞతలు.  

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై ఆర్డినెన్స్ నిర్ణయంపై ప్రభుత్వంకు కృతజ్ఞతలు.     -టీబీసీ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్.    జగిత్యాల జులై 12: విద్యా,ఉద్యోగ,స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై ఆర్డినెన్స్ జారీకి రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించడం పట్ల  టీ బీసీ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు.ఆదివారం జిల్లా కేంద్రంలో టీ బీసీ జేఏసీ జిల్లా శాఖ...
Read More...
Local News 

హత్య కేసులో నిందితుల అరెస్ట్ - రిమాండ్ కి తరలింపు - సీఐ,రామ్ నరసింహ రెడ్డి 

హత్య కేసులో నిందితుల అరెస్ట్ - రిమాండ్ కి తరలింపు - సీఐ,రామ్ నరసింహ రెడ్డి  గొల్లపల్లి (ధర్మపురి) జూలై 12 (ప్రజా మంటలు): ధర్మపురి మండలం ధోనూర్ చెందిన గొల్లెన రవి, గొల్లెన నాగరాజుల కుటుంబాలు గత కొన్ని సంవత్సరాలు నుండి పక్క పక్కన నివసిస్తున్నాయి. రెండు కుటుంబాల మధ్య ఇంటి స్థలం గెట్టు  విషయంలో గొడవలు జరుగుతున్నప్పటికీ ఈమధ్య మృతుడు గోల్లెన రవి, కొత్త ఇంటి  ఇంటి నిర్మాణం  చేపట్టి...
Read More...
Local News 

మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి - వేలేరు ఎస్ఐ సురేష్

మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి - వేలేరు ఎస్ఐ సురేష్ మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి - వేలేరు ఎస్ఐ సురేష్ ఒంటరిగా ఉన్న మహిళ ఇంటిపై దాడి – బంగారం, నగదు అపహరణ వేలేరు, జూలై 11 (ప్రజా మంటలు)నెక్కొండ మండలంలోని పనికర గ్రామం అవతల ఒంటరిగా ఉన్న మహిళ ఇంటిలో శుక్రవారం ఉదయం 11:30 గంటల సమయంలో గుర్తుతెలియని ఇద్దరు దుండగులు దొంగతనానికి...
Read More...