ఆడబిడ్డలను గౌరవించే తెలంగాణలో ఇలాంటి వ్యాఖ్యలేంటి- మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే వాళ్లు రాజకీయాల్లోకి ఎలా వస్తరు?
నిరసన తెలిపేందుకు వెళ్లిన జాగృతి కార్యకర్తలపై కాల్పులేంటి?
- తీన్మార్ మల్లన్నను ఎమ్మెల్సీ పదవి నుంచి తప్పించాలి*
తీన్మార్ మల్లన్నపై శాసన మండలి చైర్మన్, డీజీపీకి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఫిర్యాదు
హైదరాబాద్ జూలై 13:
ఆడబిడ్డలను ఎంతగానో గౌరవించే తెలంగాణలో చట్టసభలో సభ్యుడిగా ఉన్న వ్యక్తి హేయమైన వ్యాఖ్యలు చేయడం దారుణమని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆందోళన వ్యక్తం చేశారు. తన వ్యక్తిత్వాన్ని కించపరిచేలా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పై చర్యలు తీసుకోవాలని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఆదివారం జూబ్లీహిల్స్ లోని చైర్మన్ నివాసంలో గుత్తా సుఖేందర్ రెడ్డిని కలిసి ఫిర్యాదు లేఖతో పాటు తనపై ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలతో కూడిన పెన్ డ్రైవ్ అందజేశారు.
చైర్మన్ కు ఉన్న విచక్షణ అధికారాలను ఉపయోగించి తీన్మార్ మల్లన్న సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తీన్మార్ మల్లన్న తనపై చేసిన వ్యాఖ్యలను శాసన మండలి ఎథిక్స్ కమిటీకి రిఫర్ చేయాలని కోరారు.
తెలంగాణ ఉద్యమంలోనూ కాల్పులు జరపలే
తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున సాగుతోన్న రోజుల్లోనూ పోలీసులు, నాయకుల గన్ మెన్లు ఏ ఒక్క రోజు కాల్పులు జరిపిన దాఖలాలు లేవని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఆదివారం మండలి చైర్మన్ ను కలిసి ఫిర్యాదు చేసిన అనంతరం ఆయన నివాసం ఎదుట మీడియాతో మాట్లాడారు. తీన్మార్ మల్లన్న తనపై చేసిన వ్యాఖ్యలపై నిరసన తెలిపేందుకు జాగృతి కార్యకర్తలు ఆయన కార్యాలయానికి వెళ్లారని తెలిపారు.
వాళ్లు దాడి చేస్తేనే తమ వాళ్లు ప్రతిదాడి చేశారని.. ఇంతమాత్రానికే గన్ ఫైర్ చేస్తారా అని ప్రశ్నించారు. ఒక ఆడబిడ్డ ప్రశ్నిస్తే సహించలేకపోతున్నారా అని నిలదీశారు. తాను ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరుకోబోనని తేల్చిచెప్పారు. తాను మామూలు ఆడబిడ్డను కాదు.. అగ్గిరవ్వను అని హెచ్చరించారు.
సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులను సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారని ఇద్దరు మహిళా జర్నలిస్టులను అరెస్టు చేశారని.. తనపై తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలు చేసినా సీఎం ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. తన కుటుంబ సభ్యులపై ఒకతీరు.. తెలంగాణ ఆడబిడ్డనైన తన వ్యక్తిత్త హననానికి పాల్పడ్డ వారిపై మరోలా వ్యవహరిస్తారా అని నిలదీశారు. తీన్మార్ మల్లన్నపై సీఎం చర్యలు తీసుకోకపోతే ఈ వ్యాఖ్యలు వెనుక ఆయన ఉన్నారని భావించాల్సి వస్తుందన్నారు. జాగృతి కార్యకర్తలపై కాల్పుల ఘటనను సీరియస్ గా తీసుకోవాలన్నారు.
సీఎం, డీజీపీ వెంటనే స్పందించి సమగ్ర దర్యాప్తునకు ఆదేశించాలన్నారు. ఎమ్మెల్సీనైనా తనపై చేసిన వ్యాఖ్యలనే పట్టించుకోకపోతే సాధారణ మహిళల పరిస్థితి ఏమిటన్నారు. తాను ఏడాదిన్నరగా బీసీల కోసం ఉద్యమిస్తున్నానని.. ఏ ఒక్కరోజు కూడా తాను తీన్మార్ మల్లన్నను ఒక్కమాట కూడా అనలేదన్నారు. అలాంటప్పుడు తనపై అనుచిత వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించారు. ఇలాంటి వ్యాఖ్యలతో రాజకీయాల్లోకి రావాలంటేనే మహిళలు భయపడే పరిస్థితి ఇలాంటి ఘటనలతో ఉత్పన్నమవుతుందన్నారు. తీన్మార్ మల్లన్న బీసీ కాబట్టి ఏది పడితే అది మాట్లాడితే చెల్లుతుందని అనుకోవడం సరికాదన్నారు.
కాల్పుల ఘటన వెనుక ప్రభుత్వమే ఉంది
తెలంగాణ జాగృతి కార్యకర్తల ఘటన వెనుక ప్రభుత్వ హస్తం ఉందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. జాగృతి కార్యకర్తలపై కాల్పులు, దాడి, తన వ్యక్తిత్తాన్ని హననం చేసేలా వ్యాఖ్యలు చేసిన తీన్మార్ మల్లన్నపై చర్యలు తీసుకోవాలని కోరుతూ డీజీపీ ఆఫీస్ లో ఫిర్యాదు చేశారు. ఆదివారం లా అండ్ ఆర్డర్ అడిషనల్ ఐజీ రమణ కుమార్ ను కలిసి ఫిర్యాదు అందజేశారు. అనంతరం ఎమ్మెల్సీ కవిత మీడియాతో మాట్లాడుతూ, తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన తీన్మార్ మల్లన్నపై కంప్లైంట్ చెయ్యడానికి డీజీపీ ఆఫీసుకు వచ్చాన్నారు. జాగృతి కార్యకర్తలపై తొపాకులతో కాల్పులు జరిపించింది తీన్మార్ మల్లన్న నా? లేక ప్రభుత్వమా? అనేది తెలియాలన్నారు. సమగ్ర విచారణ చేయాలని డిమాండ్ చేస్తున్నానని తెలిపారు. ఇంత పెద్ద ఘటనపై ఫిర్యాదు చేయడానికి వస్తే డీజీపీ ఆఫీస్ కు రాలేదు అంటే దీని వెనుక ప్రభుత్వమే ఉందన్న అనుమానం కలుగుతుందన్నారు. తీన్మార్ మల్లన్న ఆదేశాలతోనే గన్ మెన్ కాల్పులు జరిపారని.. గన్ మెన్లను వెంటనే డిస్మిస్ చేయాలని డమాండ్ చేశారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ట్రాఫిక్ సిబ్బంది ఆరోగ్య రక్షణకు ప్రత్యేక చర్యలు ట్రాఫిక్ సిబ్బందికి కూలింగ్ గాగుల్స్, వాటర్ ఫ్లాస్క్స్ పంపిణీ చేసిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
జగిత్యాల మే 25(ప్రజా మంటలు) జిల్లాలో పెరుగుతున్న ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ట్రాఫిక్ విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బంది ఆరోగ్య రక్షణ కోసం జిల్లా పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా స్థానిక ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ట్రాఫిక్ సిబ్బందికి కూలింగ్ గాగుల్స్ మరియు వాటర్... శాంతి కళ్యాణంతో ఘనంగా ముగిసిన విష్ణు పురాణ ప్రవచన సప్తాహం
జగిత్యాల మే 24 ( ప్రజా మంటలు)జిల్లా కేంద్రం కృష్ణ నగర్ లోని ఉమా శంకర్ గార్డెన్స్ లో గత వారం రోజులుగా ప్రముఖ పౌరాణిక వేద పండితులు బుర్రా భాస్కర శర్మ చే అంగ రంగ వైభవంగా జరిగిన శ్రీ మహా విష్ణు పురాణం ప్రవచనం సమాప్తి సందర్బంగా శ్రీ లక్ష్మి నారాయణుల... చదువుతోనే చక్కటి జీవితం జగిత్యాల జిల్లా అడిషనల్ కలెక్టర్ రాజా గౌడ్
జగిత్యాల మే 24 (ప్రజా మంటలు)చదువుతోనే సమాజంలో గుర్తింపు, చక్కటి జీవితం లభిస్తుందని జగిత్యాల జిల్లా అడిషనల్ కలెక్టర్ రాజా గౌడ్ అన్నారు పట్టణంలోని ఎల్ ఎల్ గార్డెన్స్ లో జరిగిన గౌడ ప్రొఫెషనల్ అండ్ అఫీషియల్స్ అసోసియేషన్ (గోప) జగిత్యాల జిల్లా కమిటీ నిర్వహించిన ప్రతిభ పురస్కారాల అవార్డ్స్ మహోత్సవంలో ఆయన ముఖ్య... భాగవత ప్రవచకునికి భాగవత చూర్ణిక అందజేత
జగిత్యాల మే 24 (ప్రజా మంటలు)జిల్లా కేంద్రంలోని గీత భవన్ లో ఖండవల్లి ఆదిత్య శర్మచే శ్రీమద్ భాగవత సప్తాహం కొనసాగుతుండగా ఆదివారం ఉదయము కీ"శే " సరాబు మందిరం వెంకటేశ్వర శర్మచే తెలుగులో అనువదించబడిన భాగవత సప్తాహ చూర్ణిక పుస్తకాలను వెంకటేశ్వర శర్మ కుమారుడు భారవిశర్మ పురాణ ప్రవచకులు ఆదిత్య శర్మకు అందజేశారు. ... ఆరవ రోజు కొనసాగుతున్న విష్ణు పురాణం
జగిత్యాల మే 23(ప్రజా మంటలు) జిల్లా కేoద్రం కృష్ణా నగర్ లోని ఉమా శంకర్ గార్డెన్స్ లో, ప్రముఖ పౌరాణిక, వేద, పండితులు, మంచిర్యాల వాస్తవ్యులు, బహ్మ శ్రీ బుర్రా భాస్కర శర్మ చే, ఎంతో వైభవంగా ,జరుగుతున్న విష్ణు పురాణం శనివారం 6వ రోజు కు చేరింది. సామూహిక శ్రీ విష్ణు స హస్ర... క్రీడల్లో ప్రతిభ కనబరిచిన వారికి జ్ఞాపికలు, అందజేసిన అదనపు కలెక్టర్ బి రాజా గౌడ్
జగిత్యాల మే 23(ప్రజా మంటలు)జిల్లా యువజన మరియు క్రీడల శాఖ ఆధ్వర్యంలో వారం రోజుల పాటు నిర్వహించిన “99 రోజుల యాక్షన్ ప్లాన్ – ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక” ముగింపు కార్యక్రమం జిల్లా యువజన మరియు క్రీడల శాఖ స్వామి వివేకానంద ఇండోర్ మినీ స్టేడియంలో ఘనంగా నిర్వహించబడింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య... తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయాలు - 23.05.2026
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
హైదరాబాద్ 23 మే (ప్రజా మంటలు) :
తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయాలు మరియు హైలైట్స్.
1. రాష్ట్రంలో రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరుకు రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది.
మొత్తం 2 లక్షల 50 వేల మంది పేద కుటుంబాల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి... గొల్లపల్లి మండల కేంద్రంలో ట్రెయిన్డ్ డాగ్స్ నారకోటిక్ నిషేధిత గంజాయి మధిక ద్రవ్యాల ప్రత్యేక తనిఖీలు
గొల్లపల్లి మే 22 (ప్రజా మంటలు):
జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు, డీఎస్పీ పురుషోత్తం రెడ్డి ధర్మపురి సర్కిల్ రామ్ నరసింహ రెడ్డి ఆధ్వర్యంలో ఎస్ఐ, కృష్ణ సాగర్ రెడ్డి పోలీస్ సిబ్బంది ట్రెయిన్డ్ డాగ్ స్క్వాడ్ తో గంజాయి నిషేధిత మాదక ద్రవ్యాల కోసం విస్తృత తనిఖీలు చేపట్టారు. మాదక... ఘనంగా ప్రారంభమైన శ్రీమద్ భాగవత సప్తాహ జ్ఞాన యజ్ఞం
జగిత్యాల మే 21 (ప్రజా మంటలు) జిల్లా కేంద్రంలోని గీత భవన్ లో పండిత శిరోమణి బ్రహ్మశ్రీ ఖండవల్లి ఆదిత్య శర్మ చే శ్రీమద్భాగవత సప్తాహ జ్ఞాన యజ్ఞము గురువారం ప్రారంభమైంది. ఉదయము 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు తిరిగి సాయంత్రం 3_30 నుండి 6_30 వరకు కొనసాగుచున్నది.
ఈనెల 27వ... ధర్మపురి పట్టణ లో ట్రెయిన్డ్ డాగ్స్ సహాయంతో నారకోటిక్ నిషేధిత గంజాయి మధిక ద్రవ్యాల ప్రత్యేక తనిఖీలు
గొల్లపల్లి మే 21 (ప్రజా మంటలు)
జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు, డీఎస్పీ పురుషోత్తం రెడ్డి సూచనలతో, ధర్మపురి సర్కిల్ రామ్ నరసింహ రెడ్డి ఆధ్వర్యంలో ఎస్సై మహేష్ పోలీస్ సిబ్బంది ట్రెయిన్డ్ డాగ్ స్క్వాడ్ సహాయంతో గంజాయి నిషేధిత మాదక ద్రవ్యాల కోసం విస్తృత తనిఖీలు చేపట్టారు. జగిత్యాల జిల్లా... కుత్బుల్లాపూర్లో తెలంగాణ రక్షణ సేన జెండా ఆవిష్కరణ: ప్రభుత్వానికి కల్వకుంట్ల కవిత అల్టిమేటం
కుత్బుల్లాపూర్, హైదరాబాద్ | మే 21 (ప్రజా మంటలు):
తెలంగాణ ప్రజల హక్కులు, ఆత్మగౌరవ పరిరక్షణ కోసం తెలంగాణ రక్షణ సేన పార్టీ ఏర్పాటైందని కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో జరిగిన పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ పలు రాజకీయ, సామాజిక అంశాలపై ప్రభుత్వానికి డెడ్లైన్ విధించారు.
జూన్ 2లోగా హామీలు... అనుమానాస్పద వ్యక్తులకు లాడ్జ్ గదులు ఇవ్వొద్దు, గుర్తింపు పత్రాలు తప్పనిసరి: టౌన్ ఇన్స్పెక్టర్ కరుణాకర్
జగిత్యాల మే 20(ప్రజా మంటలు)
చుక్క గంగారెడ్డి ప్రతినిధి
పట్టణంలో శాంతి భద్రతల పరిరక్షణ, నేర నియంత్రణ మరియు ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని పట్టణ పోలీస్ స్టేషన్ పరిదిలోని లాడ్జ్ యజమానులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. నిర్వాహకులు తప్పనిసరిగా పాటించవలసిన భద్రత నిబంధనలు మరియు మార్గదర్శకాలపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ,... 