మెరుగైన ప్రమాణాలతో విద్య బోధన, క్రీడలలో ఆసక్తి పెంచాలి - సీఎం రేవంత్ రెడ్డి

On
మెరుగైన ప్రమాణాలతో విద్య బోధన, క్రీడలలో ఆసక్తి పెంచాలి - సీఎం రేవంత్ రెడ్డి

బాలిక‌ల‌కు వివిధ అంశాల‌పై కౌన్సెలింగ్

పాఠ‌శాల‌లో క్రీడ‌ల‌కు ప్రాధాన్యం

ప్ర‌భుత్వ విద్యా సంస్థ‌ల్లో చదువుతున్న వారిలో 90 శాతానికి పైగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలే

విద్యాశాఖపై ముఖ్యమంత్రి సమీక్ష

హైదరాబాద్ ఆగస్ట్ 29 (ప్రజా మంటలు):

పాఠ‌శాల‌లు మొద‌లు విశ్వవిద్యాల‌యాల వ‌ర‌కు ప్ర‌తి విద్యా సంస్థ‌లోనూ మెరుగైన విద్యా బోధ‌న, బోధ‌న‌లో నాణ్య‌తా  ప్ర‌మాణాలు మ‌రింత‌గా పెంచాల‌ని ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆదేశించారు. పాఠ‌శాల‌లు, క‌ళాశాల‌లు, ప్రొఫెషన‌ల్ కాలేజీల్లో విద్యార్థులు, బోధ‌న సిబ్బందికి ఫేషియ‌ల్ రిక‌గ్నేష‌న్ త‌ప్ప‌నిస‌రి చేయాల‌ని చెప్పారు. ముఖ గుర్తింపుతో హాజరు శాతం మెరుగుపడటంతో పాటు లోటుపాట్ల‌ను అరిక‌ట్ట‌వ‌చ్చ‌ని అన్నారు.

 ఐసీసీసీ (ICCC)లో ముఖ్యమంత్రి విద్యా శాఖలపై సమీక్షించారు. విద్యా శాఖ ప‌రిధిలో అద‌న‌పు గ‌దులు, వంట గ‌దులు, మూత్ర‌శాల‌లు, మ‌రుగుదొడ్లు, ప్ర‌హారీల నిర్మాణం వివిధ విభాగాలు చేప‌ట్ట‌డం స‌రికాద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. ఈ నిర్మాణాల‌ నాణ్య‌త‌ ప్ర‌మాణాలు, నిర్మాణ ప‌ర్య‌వేక్ష‌ణ‌, నిధుల మంజూరు, జ‌వాబుదారీత‌నానికి గానూ ఒకే విభాగం కింద ఉండాల‌న్నారు.

యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియ‌ల్ స్కూళ్ల నిర్మాణాన్ని ప‌ర్య‌వేక్షిస్తున్న విద్యా, సంక్షేమ వ‌స‌తుల అభివృద్ధి సంస్థ (EWIDC) కింద‌నే రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థ‌ల నిర్మాణాలు కొన‌సాగాల‌ని ఆదేశించారు. ఈ సంస్థ‌కు అవ‌స‌ర‌మైన ఇంజినీరింగ్‌, ఇత‌ర సిబ్బందిని ఇత‌ర విభాగాల నుంచి వెంట‌నే డిప్యూటేష‌న్‌పై తీసుకోవాల‌ని సూచించారు. ఈ సమీక్ష సందర్భంగా ముఖ్యమంత్రి అధికారులకు పలు సూచనలు చేశారు.IMG-20250829-WA0022

▪️మ‌ధ్యాహ్న భోజ‌న బిల్లుల చెల్లింపును గ్రీన్ ఛాన‌ల్‌లో చేప‌ట్టాలి. ఈ విష‌యంలో ఎలాంటి అల‌స‌త్వం చూపొద్దు.

▪️తెలంగాణ‌లోని మ‌హిళా కళాశాల‌లు, బాలికల పాఠ‌శాల‌ల్లో మూత్ర‌శాల‌లు, మ‌రుగుదొడ్లు, ప్ర‌హ‌రీల నిర్మాణాన్ని వేగ‌వంతం చేయాలి.

 ▪️కంటైన‌ర్ కిచెన్ల‌కు ప్రాధాన్య‌మివ్వాలి.  వాటిపై సోలార్ ప్యానెళ్ల‌తో అవ‌స‌ర‌మైన విద్యుత్ వినియోగించుకోవ‌చ్చు.

▪️ప్ర‌తి పాఠ‌శాల‌లో క్రీడ‌ల‌కు ప్రాధాన్యం ఇవ్వాలి. అవ‌స‌ర‌మైతే కాంట్రాక్ట్ ప‌ద్ధ‌తిన వ్యాయామ ఉపాధ్యాయుల‌ను నియ‌మించే అంశాన్ని ప‌రిశీలించాలి.

▪️అమ్మ ఆద‌ర్శ పాఠ‌శాల‌ల కింద పాఠ‌శాల‌ల్లో పారిశుద్ధ్య ప‌నులకు సంబంధించిన బిల్లులు త‌క్ష‌ణ‌మే విడుద‌ల చేయాలి.

▪️సంక్షేమ గురుకుల పాఠ‌శాల‌ల్లోని బాలిక‌ల‌కు వివిధ అంశాల‌పై కౌన్సెలింగ్ ఇచ్చేందుకు మ‌హిళా కౌన్సెల‌ర్ల‌ను నియ‌మించాలి.

విద్యా రంగంపై పెడుతున్న ఖ‌ర్చును తాము ఖ‌ర్చుగా కాకుండా పెట్టుబ‌డిగా చూస్తున్నామ‌ని ముఖ్యమంత్రి తెలిపారు. యంగ్ ఇండియా ఇంటెగ్రేటెడ్ రెసిడెన్షియ‌ల్స్ స్కూళ్ల‌తో పాటు విద్యా రంగం అభివృద్ధికి తీసుకునే రుణాల‌ను ఎఫ్ఆర్‌బీఎం ప‌రిమితిలో లేకుండా చూడాల‌ని ఉప ముఖ్య‌మంత్రి మల్లు భట్టి విక్రమార్క, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్‌ కు విజ్ఞ‌ప్తి చేశార‌ని తెలిపారు.

ప్ర‌భుత్వ విద్యా సంస్థ‌ల్లో చదువుతున్న వారిలో 90 శాతానికి పైగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలే ఉన్నార‌ని, ఈ విష‌యాన్ని నిర్ధారించేందుకు గ‌త ప‌దేళ్ల‌లో ప్ర‌భుత్వ విద్యా సంస్థ‌ల్లో చ‌దివిన వారి వివ‌రాల‌పై నివేదిక రూపొందించాల‌ని ముఖ్యమంత్రి ఆదేశించారు.

 ఈ సమావేశంలో ముఖ్య‌మంత్రి స‌ల‌హాదారు వేం నరేందర్ రెడ్డి గారు, ముఖ్య‌మంత్రి ప్ర‌త్యేక కార్య‌ద‌ర్శి అజిత్ రెడ్డి గారు, ముఖ్య‌మంత్రి ఓఎస్డీ వేములు శ్రీ‌నివాసులు గారు, విద్యా శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి యోగితా రాణా గారు, ఉన్న‌త విద్యా మండ‌లి ఛైర్మ‌న్ ప్రొఫెస‌ర్ బాల‌కిష్టారెడ్డి గారు, సాంకేతిక విద్యా శాఖ క‌మిష‌న‌ర్ శ్రీ‌దేవ‌సేన‌ గారు, పాఠ‌శాల విద్యా శాఖ సంచాల‌కుడు న‌వీన్ నికోల‌స్ గారితో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.

Tags
Join WhatsApp

More News...

జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ ని ఆయన నివాసం లో కలిసిన నూతనంగా ఎన్నికైన తపస్ రాష్ట్ర అధ్యక్షులు.

జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ ని ఆయన నివాసం లో కలిసిన నూతనంగా ఎన్నికైన తపస్ రాష్ట్ర అధ్యక్షులు. జగిత్యాల జనవరి 15 (ప్రజా మంటలు)తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం తపస్ రాష్ట్ర అధ్యక్షుడిగా వొడ్నాల రాజశేఖర్  ఏకగ్రీవంగా ఎన్నికయిన సందర్భంలో జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ ని వారి నివాసం లో మర్యాద పూర్వకంగా కలిసిన వోడ్నా ల రాజశేఖర్ .ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపి శాలువా తో సత్కరించారు జగిత్యాల...
Read More...

ధనుర్మాస కొఠారి ఉత్సవాలలో భాగంగా ఘనంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి రథోత్సవము 

ధనుర్మాస కొఠారి ఉత్సవాలలో భాగంగా ఘనంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి రథోత్సవము  నిజామాబాద్ జనవరి 15 (ప్రజా మంటలు) నిజామాబాద్ లోని బ్రహ్మపురిలో గల శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ రథోత్సవం గురువారం మధ్యాహ్నం నిర్వహించారు. .ప్రతి ఏట సంక్రాంతి పర్వదినం నాడు స్వామివారి రథోత్సవం నిర్వహిస్తారు . రథము చక్రం గుడి నుండి బయలుదేరి గాజులపేట, పెద్ద బజారు, మీదుగా ఆలయం చేరుకుంది ....
Read More...

జగిత్యాల కురుమ సంఘం ఆధ్వర్యంలో బీరయ్య, అక్క మహంకాళికి బోనాల సమర్పణ 

జగిత్యాల కురుమ సంఘం ఆధ్వర్యంలో బీరయ్య, అక్క మహంకాళికి బోనాల సమర్పణ  జగిత్యాల జనవరి 15 (ప్రజా మంటలు) జగిత్యాల కురుమ సంఘం ఆధ్వర్యంలో సంక్రాంతి పర్వదినం సందర్భంగా బీరయ్య ,అక్క మహంకాళి మాతకు కుల బాంధవులు గురువారం బోనాల సమర్పించారు .కొత్తగా వచ్చిన ధాన్యంతో స్వామివారికి బోనాలను నివేదించారు. పిల్లాపాపలతో పాటు పశుసంపద ,గొర్రెలు, మేకలు,పాడిపంటలతో చల్లంగా ఉండాలని మొక్కుకున్నారు .ఒగ్గు కళాకారుల డోలు చప్పులతో ఆలయానికి...
Read More...

తెలంగాణ ప్రభుత్వం–భారత ఆర్మీ మధ్య సమస్యలు చర్చల ద్వారానే పరిష్కారం: సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ ప్రభుత్వం–భారత ఆర్మీ మధ్య సమస్యలు చర్చల ద్వారానే పరిష్కారం: సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్, జనవరి 15 (ప్రజా మంటలు): తెలంగాణ ప్రభుత్వం, భారత ఆర్మీకి మధ్య ఉన్న వివిధ సమస్యలు నిరంతర చర్చల ద్వారానే పరిష్కారమవుతాయని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. పెండింగ్‌లో ఉన్న భూ సమస్యలు, ఇతర పరిపాలనా అంశాల సత్వర పరిష్కారానికి ఆర్మీ తరఫున ప్రత్యేక అధికారులను నియమించాలని ఆయన సూచించారు. హైదరాబాద్...
Read More...
National  State News  Crime 

“ఒక్క క్లిక్… మీ కష్టార్జీతం మాయం!”

“ఒక్క క్లిక్… మీ కష్టార్జీతం మాయం!” సికింద్రాబాద్,  జనవరి 15 (ప్రజా మంటలు): వాట్సాప్ గ్రూపులలో ఫోన్ పే పొంగల్ గిఫ్ట్ “5000 రూపాయలు నిజంగా వచ్చాయి” అనే ఆశ చూపించే తప్పుడు సందేశాలతో పాటు లింకులు పంపిస్తూ సైబర్ నేరగాళ్లు అమాయక ప్రజల పొదుపును దోచుకుంటున్నారని స్కై ఫౌండేషన్ ప్రెసిడెంట్ & ఫౌండర్ డాక్టర్ వై. సంజీవ కుమార్ అన్నారు. డబ్బులు...
Read More...

మకర సంక్రాంతి వేడుకల్లో మంత్రి పొన్నం ప్రభాకర్

మకర సంక్రాంతి వేడుకల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ కరీంనగర్, జనవరి 15 (ప్రజా మంటలు): మకర సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గురువారం ఉదయం కరీంనగర్ నగరంలోని కోతిరాంపూర్ ప్రాంతంలో గల గిద్దె పెరుమాండ్ల దేవస్థానాన్ని సందర్శించారు. ఉదయం 8:30 గంటలకు దేవస్థానానికి చేరుకున్న మంత్రి స్వామివారి దర్శనం చేసుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు....
Read More...

మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు: బీసీలకు 3 నగరాలు, 38 పురపాలికలు

మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు: బీసీలకు 3 నగరాలు, 38 పురపాలికలు హైదరాబాద్, జనవరి 15 (ప్రజా మంటలు): తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణ దిశగా కీలక అడుగు పడింది. రాష్ట్ర పురపాలక శాఖ 10 నగరపాలక సంస్థలు, 121 పురపాలక సంఘాలకు సంబంధించి మేయర్లు, ఛైర్‌పర్సన్ల రిజర్వేషన్లను ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా రిజర్వేషన్ల అమలులో పాటించాల్సిన మార్గదర్శకాలను కూడా విడుదల చేసింది....
Read More...

ధర్మపురిలో కాంగ్రెస్‌లో చేరికలు: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ సమక్షంలో బీఆర్ఎస్ నేతల పార్టీలో చేరిక

ధర్మపురిలో కాంగ్రెస్‌లో చేరికలు: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ సమక్షంలో బీఆర్ఎస్ నేతల పార్టీలో చేరిక ధర్మపురి, జనవరి 15 (ప్రజా మంటలు): ధర్మపురి పట్టణంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం దిశగా కీలక పరిణామం చోటుచేసుకుంది. ధర్మపురి పట్టణ మున్సిపాలిటీ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ ఇందారపు రామన్నతో పాటు మాజీ కౌన్సిలర్లు మయూరి వేణు, యూనుస్, సాంబు, స్తంభంకాడి రమేష్ సహా బీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు మంత్రి...
Read More...
State News 

ఫిరాయింపు కేసుల్లో కీలక మలుపు: పోచారం, కాలే యాదయ్యకు స్పీకర్ క్లీన్ చిట్

ఫిరాయింపు కేసుల్లో కీలక మలుపు: పోచారం, కాలే యాదయ్యకు స్పీకర్ క్లీన్ చిట్ హైదరాబాద్, జనవరి 15 (ప్రజా మంటలు): తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ గుర్తుపై గెలిచి కాంగ్రెస్‌లోకి ఫిరాయించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్ రెడ్డి, కాలే యాదయ్యలపై తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గురువారం తుది తీర్పు వెలువరించారు. ఈ ఇద్దరు ఎమ్మెల్యేలకు స్పీకర్ క్లీన్ చిట్...
Read More...
National  Filmi News 

‘జన నాయగన్’ కు ఎదురుదెబ్బ: నిర్మాత పిటిషన్‌ను స్వీకరించని సుప్రీంకోర్టు

‘జన నాయగన్’ కు ఎదురుదెబ్బ: నిర్మాత పిటిషన్‌ను స్వీకరించని సుప్రీంకోర్టు న్యూఢిల్లీ, జనవరి 15 (ప్రజా మంటలు): విజయ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘జన నాయగన్’ సినిమా సర్టిఫికేషన్ అంశానికి సంబంధించి మద్రాస్ హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన స్టే ఉత్తర్వులను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు గురువారం తిరస్కరించింది. ఈ సినిమా నిర్మాతలు తమపై ఆర్థికంగా తీవ్ర ప్రభావం పడిందని, “తాము పూర్తిగా నష్టపోయాం...
Read More...
Local News 

సంక్రాంతి సెలవుల్లో కర్ణాటక రాష్ట్ర పర్యటన చేసిన విద్యార్థులు

సంక్రాంతి సెలవుల్లో కర్ణాటక రాష్ట్ర పర్యటన చేసిన విద్యార్థులు మెట్టుపల్లి, జనవరి 15 (ప్రజా మంటలు – దగ్గుల అశోక్) సంక్రాంతి సెలవుల సందర్భంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వెల్లుల్ల విద్యార్థులు విద్యా, వైజ్ఞానిక, విహార యాత్రలో భాగంగా ఈ నెల 10 నుంచి ఆరు రోజుల పాటు కర్ణాటక రాష్ట్ర పర్యటన చేపట్టారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని ప్రముఖ చారిత్రక, సాంస్కృతిక వారసత్వ...
Read More...

జగిత్యాల శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో ఘనంగా శ్రీ గోదా రంగనాయకుల కళ్యాణ వేడుకలు 

జగిత్యాల శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో ఘనంగా శ్రీ గోదా రంగనాయకుల కళ్యాణ వేడుకలు  జగిత్యాల జనవరి 14 (ప్రజా మంటలు) జిల్లా కేంద్రంలోని బ్రాహ్మణ వీధి శ్రీ రుక్మిణి సత్యభామ సమేత మధన వేణుగోపాలస్వామి ఆలయంలో బుధవారం సాయంత్రం అంగరంగ వైభవంగా శ్రీ గోదా రంగనాయకుల కళ్యాణ వేడుకలు నిర్వహించారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక వేదికను అలంకరింపజేసి ఉత్సవ మూర్తులను వేదికపై ఉంచి కళ్యాణాన్ని...
Read More...