ప్రభుత్వ వైద్యుల సమస్యలు పరిష్కరించాలి
తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం డిమాండ్
సికింద్రాబాద్, ఆగస్ట్ 26 (ప్రజామంటలు):
తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం గాంధీ యూనిట్ సర్వ సభ్య సమావేశం మంగళ వారం గాంధీ ఫోరెన్సిక్ లెక్చర్ హాల్ లో నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర అధ్యక్ష,కార్యదర్శులు డాక్టర్ నరహరి, డాక్టర్ లాలు ప్రసాద్ రాథోడ్ లు హాజరయ్యారు. ఈ సమావేశంలో గాంధీ ఆసుపత్రి లో వైద్యులు పడుతున్న ఇబ్బందులపై చర్చించారు.
ఈ సందర్భంగా డాక్టర్ బి. నరహరి అధ్యక్షుడు , డాక్టర్ డా. లాలు ప్రసాద్ రాథోడ్ ప్రధాన కార్యదర్శి, డాక్టర్ ఎం.కె. రౌఫ్ ట్రెజరర్ లు మాట్లాడుతూ..డాక్టర్స్ కు సంబంధించిన ముఖ్యంగా ప్రొఫెసర్ పోస్టులు భర్తీ చేయాలని కోరారు. గాంధీ ఆస్పత్రిలో ఉన్న ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని,కెరీర్ అడ్వాన్స్మెంట్ స్కీం అమలు చేయాలని డిమాండ్ చేశారు.TVVPలో ప్రధాన సమస్యలైన డైరెక్టర్ ఆఫ్ సెకండ్ హెల్త్ సర్వీసెస్ గా మార్చడం, TVVPను గ్రాంట్ ఇన్ ఎయిడ్ నుండి డైరెక్టరేట్గా (DSH) మార్చే ఫైల్, అలాగే ఆసుపత్రుల పునర్వ్యవస్థీకరణ ఫైల్ రెండూ ఎటువంటి ఆర్థిక భారమూ లేకపోయినా ఏడాది రోజులుగా పెండింగ్లోనే ఉన్నాయని అన్నారు.
సివిల్ అసిస్టెంట్ సర్జన్ (స్పెషలిస్ట్) నియామకాలు కొరకు నోటిఫికేషన్ విడుదల చేయడం స్వాగతిస్తున్నామని అన్నారు. DYCS, CSS ప్రమోషన్ల కొరకు ఆప్షన్స్ అడగడం శుభపరిణామమని తెలిపారు. అలాగే ఇతర సమస్యలు కూడా ప్రభుత్వం పరిష్కరించాల్సింది అన్నారు. తెలంగాణ ఏర్పాటైనప్పటి నుండి Programme Officers (DCHS) ప్రమోషన్లు జరగలేదని అన్నారు. Directorate of Health (DH)లో సమస్యలైన G.O. 142 సవరణ ఇప్పటికీ పెండింగ్లో ఉందని తెలిపారు.
DH డెంటల్ వైద్యులకు పదోన్నతి మార్గం లేకుండా పదవీవిరమణ జరుగుతోందని ఇది తక్షణమే పరిష్కరించాలని కోరారు. బోధనేతర వైద్యులకు కనీసం Career Advancement Scheme (CAS) రూపంలో టైమ్ బౌండ్ ప్రమోషన్లు ఇవ్వాలని, వారికి తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.ఆరోగ్య శాఖ తనే ఆధారంగా ఉన్న వైద్యులకు టైం బౌండ్ ప్రమోషన్స్ ద్వారా న్యాయం జరిగేలా చూడాలని కోరారు. గాంధీ ఆసుపత్రి అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ భూపేందర్ సింగ్ రాథోడ్, డాక్టర్ అబ్బయ్య లు మాట్లాడుతూ.. గాంధీ లో వైద్యుల సేవలు గుర్తించాలని కోరారు. రాష్ట్రం లో అతి పెద్ద ఆసుపత్రి గా చరిత్ర ఉన్న గాంధీ ఆసుపత్రి పేదలకు వైద్యం అందించడం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేస్తున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు డాక్టర్ మురళి, డాక్టర్ రవి, డాక్టర్ కృపాల్ సింగ్, డాక్టర్ కళ్యాణ్, సీనియర్ వైద్యులు సుబోధ్ , డాక్టర్ నాగార్జున, ఉస్మానియా యూనిట్ అధ్యక్షులు డాక్టర్ వినోద్, గాంధీ కార్యవర్గ బృందం డాక్టర్ రాజేష్, డాక్టర్ అనిల్, డాక్టర్ రమేశ్, డాక్టర్ వెంకట మణి , డాక్టర్ రాజశేఖర్, డాక్టర్ రవితేజ, డాక్టర్ దీనదయాళ్, డాక్టర్ సుధాకర్, డాక్టర్ వినోద్, సూపరింటెండెంట్ డాక్టర్ రాజ కుమారి, ప్రిన్సిపాల్ డాక్టర్ ఇందిర, ఆర్ యం ఓ డాక్టర్ శేషాద్రి, సుధార్ సింగ్, డాక్టర్ రజని, మీనాక్షి, నజీం, బ్రహ్మేశ్వర్, యోగేందర్ , రాజు తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
సైకత వెంకటేశ్వర స్వామి సన్నిధిలో హోలీ వేడుకలు
జగిత్యాల మార్చి 4 (ప్రజా మంటలు) జిల్లా కేంద్రం కరీంనగర్ రోడ్ లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్ స్థలంలో, గత నెల 5వ తేదీన స్థాపించిన 21 అడుగుల ఎత్తైన సైకత శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో, నిర్వాహకులు వేముల ఉమారాణి, కొండ్ర రమాదేవి,గార్లు బుధవారం హోలీ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఒకరికొకరు రంగులు పులుము మల్యాల మండలంలో పరీక్ష కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బి. ఎస్ లత
మల్యాల మార్చి 4 ( ప్రజా మంటలు)ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల సందర్భంగా బుధవారం మల్యాల మండలంలో పరీక్ష కేంద్రాన్ని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బి. ఎస్ లత పరిశీలించారు.
పరీక్షా కేంద్రంలో నిర్వహణ విధానం, ప్రశ్నపత్రాల భద్రత, హాల్ టికెట్ల పరిశీలన ప్రక్రియలను ప్రత్యేకంగా పరిశీలించారు.
ఈ సందర్బంగా జిల్లా అదనపు కలెక్టర్... కల్వకుంట్ల కవిత అరెస్ట్ : నర్సింగిలో అక్రమ కట్టడాలకు వ్యతిరేక ఆందోళన
హైదరాబాద్ మార్చ్ 03 (ప్రజా మంటలు):నార్సింగిలో మూసీ నదిని ఆక్రమించి అక్రమంగా నిర్మిస్తున్న భవనాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్థానికులతో కలిసి ఈ రోజు సాయంత్రం 4 గంటల నుంచి ధర్నాకు దిగారు.
హైడ్రా బుల్డోజర్లు అక్కడికి వచ్చే వరకు ఆందోళన విరమించబోమని కవిత బైఠాయించారు.... నర్సింగిలో మూసీ ఆక్రమణపై కవిత ఆందోళన – అక్రమ రియల్ ఎస్టేట్ వెంచర్పై చర్యలు డిమాండ్
హైదరాబాద్, మార్చ్ 03 (ప్రజా మంటలు):
హైదరాబాద్ పరిధిలోని నర్సింగిలో మూసీ నదిని ఆక్రమించి నిర్మిస్తున్న భారీ రియల్ ఎస్టేట్ వెంచర్పై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కల్వకుంట్ల కవిత స్థానికులతో కలిసి ఆందోళన చేపట్టారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలిగా ఆమె ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
గాంధీ సరోవర్ ప్రాజెక్టు పేరుతో పేదల... ధరూర్ క్యాంపు వాకర్స్ అసోసియేషన్ హోలీ సంబరాల్లో పాల్గొన్న తొలి జెడ్పి చైర్ పర్సన్ వసంత
జగిత్యాల మార్చి 3(ప్రజా మంటలు) పట్టణ ధరూర్ క్యాంప్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఐల్నేని వెంకటేశ్వర్ రావు ఆధ్వర్యంలో నిర్వహించిన హోలీ సంబరాల కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా తొలి జడ్పీ చైర్మన్ దావ వసంత సురేష్ .
శాంతికి, సౌభ్రాతృత్వానికి ప్రతీక హోలీ అని,అన్ని వర్గాల ప్రజలను ఏకం చేసే వేడుక,ఈ రంగుల పండుగ... జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా హోలీ వేడుకలు
జగిత్యాల మార్చి 3 (ప్రజా మంటలు)జిల్లా ప్రజలకు ,పోలీసు అధికారులకు, సిబ్బందికి హోలీ పండుగ శుభాకాంక్షలు: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
జిల్లా పోలీస్ కార్యాలయంలో హోళీ పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. పోలీస్ అధికారులు మరియు సిబ్బంది తో ఉత్సహంగా, సంతోషంగా హోళీ వేడుకలు నిర్వహించడం జరిగింది.
హోళీ సందర్భంగా... దుబాయ్ నుంచి తొలి ప్రత్యేక విమానం – 149 మంది ఢిల్లీకి చేరిక
న్యూ ఢిల్లీ మార్చి 03 (ప్రజా మంటలు):
పశ్చిమ ఆసియా ఉద్రిక్తతల నేపథ్యంలో Air India దుబాయ్ నుంచి ఢిల్లీకి తొలి ప్రత్యేక విమానాన్ని నడిపింది. ఇందులో షేటిల్ బాడ్మెంటను క్రీడాకారిణి పీవీ సింధు తో పాటు ప్రముఖులు ఉన్నారు.
AI916D ఫ్లైట్ ద్వారా 149 మంది భారతీయులు సురక్షితంగా ఢిల్లీ Indira Gandhi International... జగిత్యాలలో యువతి ఆత్మహత్య
జగిత్యాల, మార్చ్ 03 (ప్రజా మంటలు):
స్థానిక పోచమ్మవాడకు చెందిన ములస్థం ప్రణవి (25) ఆత్మహత్యకు పాల్పడింది. ప్రణవి బీటెక్ పూర్తి చేసి ఇంటి వద్దే ఉంటూ, విదేశాలకు వెళ్లాలని ఆసక్తి వ్యక్తం చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.ఇటీవల పెళ్లి సంబంధాలు వస్తున్న నేపథ్యంలో తండ్రి పెళ్లి గురించి మాట్లాడినట్లు సమాచారం. పెళ్లి... డీడీఎన్ జగిత్యాల జిల్లా సమావేశం పాల్గొన్న రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ఉపేందర్ శర్మ
జగిత్యాల మార్చి 2 (ప్రజా మంటలు)దూప, దీప నైవేద్య జగిత్యాల జిల్లా సర్వ సభ్య సమావేశం స్థానిక ఎస్ వి ఎల్ ఆర్ గార్డెన్ లో జరిగింది. ఈ సమావేశం లో పాల్గొన్న డీడీఎన్ గౌరవ అధ్యక్షులు గంగు ఉపేంద్ర శర్మ మాట్లాడుతూ డీడిఎన్ అర్చకుల సమస్యలు పరిష్కారం చేసే దిశగా ప్రయత్నం చేస్తానని... ప్రభుత్వ రిటైర్డ్ ఎంప్లాయిస్ కు మెడి విజన్ ఐ కేర్ సెంటర్ హైదరాబాద్ వారిచే ఉచిత కంటి వైద్య శిబిరం
జగిత్యాల మార్చి 2 (ప్రజా మంటలు)ప్రభుత్వ రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ భవనంలో సోమవారం రిటైర్డ్ ఉద్యోగుల సంఘం జిల్లా శాఖ ,జగిత్యాల అర్బన్ యూనిట్ ఆధ్వర్యంలో మెడి విజన్ ఐ కేర్ సెంటర్ హైదరాబాద్ వారిచే ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు.
ఈ సందర్భంగా వైద్య పరీక్షలు నిర్వహించారు. దాదాపు 15 మందికి... దుద్దిళ్ల శ్రీపాద రావు 89వ జయంతి: స్పీకర్ వ్యవస్థకు వన్నె తెచ్చిన విలువల శిఖరం – యూటీ ఖాదర్ ఫరీద్
హైదరాబాద్, మార్చ్ 03 (ప్రజా మంటలు):
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు 89వ జయంతి సందర్భంగా హైదరాబాద్ హైటెక్ సిటీలోని శిల్పాకళా వేదికలో ఘన కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ భాషా, సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ U. T. ఖాదర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ... ఉచిత శిక్షణతో ఉపాధి అవకాశాలు పెంచుకోవాలి. జగిత్యాల ఆర్డీవో మధుసూదన్
జగిత్యాల, మార్చి 2(. ప్రజా మంటలు)
వాల్మీకి ఆవాసం సేవా భారతి ద్వారా అందిస్తున్న ఉచిత శిక్షణ ను ఉపయోగించుకుని ఉపాధి అవకాశాలు మెరుగు పరుచుకోవాలని జగిత్యాల ఆర్డీవో మధుసూదన్ గౌడ్ అన్నారు. వాల్మీకి ఆవాసం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత కుట్టు శిక్షణ కేంద్రం, కంప్యూటర్ శిక్షణ కేంద్రం లో శిక్షణ పూర్తి చేసుకున్న వారికి... 