ప్రభుత్వ వైద్యుల సమస్యలు పరిష్కరించాలి
తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం డిమాండ్
సికింద్రాబాద్, ఆగస్ట్ 26 (ప్రజామంటలు):
తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం గాంధీ యూనిట్ సర్వ సభ్య సమావేశం మంగళ వారం గాంధీ ఫోరెన్సిక్ లెక్చర్ హాల్ లో నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర అధ్యక్ష,కార్యదర్శులు డాక్టర్ నరహరి, డాక్టర్ లాలు ప్రసాద్ రాథోడ్ లు హాజరయ్యారు. ఈ సమావేశంలో గాంధీ ఆసుపత్రి లో వైద్యులు పడుతున్న ఇబ్బందులపై చర్చించారు.
ఈ సందర్భంగా డాక్టర్ బి. నరహరి అధ్యక్షుడు , డాక్టర్ డా. లాలు ప్రసాద్ రాథోడ్ ప్రధాన కార్యదర్శి, డాక్టర్ ఎం.కె. రౌఫ్ ట్రెజరర్ లు మాట్లాడుతూ..డాక్టర్స్ కు సంబంధించిన ముఖ్యంగా ప్రొఫెసర్ పోస్టులు భర్తీ చేయాలని కోరారు. గాంధీ ఆస్పత్రిలో ఉన్న ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని,కెరీర్ అడ్వాన్స్మెంట్ స్కీం అమలు చేయాలని డిమాండ్ చేశారు.TVVPలో ప్రధాన సమస్యలైన డైరెక్టర్ ఆఫ్ సెకండ్ హెల్త్ సర్వీసెస్ గా మార్చడం, TVVPను గ్రాంట్ ఇన్ ఎయిడ్ నుండి డైరెక్టరేట్గా (DSH) మార్చే ఫైల్, అలాగే ఆసుపత్రుల పునర్వ్యవస్థీకరణ ఫైల్ రెండూ ఎటువంటి ఆర్థిక భారమూ లేకపోయినా ఏడాది రోజులుగా పెండింగ్లోనే ఉన్నాయని అన్నారు.
సివిల్ అసిస్టెంట్ సర్జన్ (స్పెషలిస్ట్) నియామకాలు కొరకు నోటిఫికేషన్ విడుదల చేయడం స్వాగతిస్తున్నామని అన్నారు. DYCS, CSS ప్రమోషన్ల కొరకు ఆప్షన్స్ అడగడం శుభపరిణామమని తెలిపారు. అలాగే ఇతర సమస్యలు కూడా ప్రభుత్వం పరిష్కరించాల్సింది అన్నారు. తెలంగాణ ఏర్పాటైనప్పటి నుండి Programme Officers (DCHS) ప్రమోషన్లు జరగలేదని అన్నారు. Directorate of Health (DH)లో సమస్యలైన G.O. 142 సవరణ ఇప్పటికీ పెండింగ్లో ఉందని తెలిపారు.
DH డెంటల్ వైద్యులకు పదోన్నతి మార్గం లేకుండా పదవీవిరమణ జరుగుతోందని ఇది తక్షణమే పరిష్కరించాలని కోరారు. బోధనేతర వైద్యులకు కనీసం Career Advancement Scheme (CAS) రూపంలో టైమ్ బౌండ్ ప్రమోషన్లు ఇవ్వాలని, వారికి తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.ఆరోగ్య శాఖ తనే ఆధారంగా ఉన్న వైద్యులకు టైం బౌండ్ ప్రమోషన్స్ ద్వారా న్యాయం జరిగేలా చూడాలని కోరారు. గాంధీ ఆసుపత్రి అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ భూపేందర్ సింగ్ రాథోడ్, డాక్టర్ అబ్బయ్య లు మాట్లాడుతూ.. గాంధీ లో వైద్యుల సేవలు గుర్తించాలని కోరారు. రాష్ట్రం లో అతి పెద్ద ఆసుపత్రి గా చరిత్ర ఉన్న గాంధీ ఆసుపత్రి పేదలకు వైద్యం అందించడం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేస్తున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు డాక్టర్ మురళి, డాక్టర్ రవి, డాక్టర్ కృపాల్ సింగ్, డాక్టర్ కళ్యాణ్, సీనియర్ వైద్యులు సుబోధ్ , డాక్టర్ నాగార్జున, ఉస్మానియా యూనిట్ అధ్యక్షులు డాక్టర్ వినోద్, గాంధీ కార్యవర్గ బృందం డాక్టర్ రాజేష్, డాక్టర్ అనిల్, డాక్టర్ రమేశ్, డాక్టర్ వెంకట మణి , డాక్టర్ రాజశేఖర్, డాక్టర్ రవితేజ, డాక్టర్ దీనదయాళ్, డాక్టర్ సుధాకర్, డాక్టర్ వినోద్, సూపరింటెండెంట్ డాక్టర్ రాజ కుమారి, ప్రిన్సిపాల్ డాక్టర్ ఇందిర, ఆర్ యం ఓ డాక్టర్ శేషాద్రి, సుధార్ సింగ్, డాక్టర్ రజని, మీనాక్షి, నజీం, బ్రహ్మేశ్వర్, యోగేందర్ , రాజు తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
జగిత్యాల శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో ఘనంగా శ్రీ గోదా రంగనాయకుల కళ్యాణ వేడుకలు
జగిత్యాల జనవరి 14 (ప్రజా మంటలు) జిల్లా కేంద్రంలోని బ్రాహ్మణ వీధి శ్రీ రుక్మిణి సత్యభామ సమేత మధన వేణుగోపాలస్వామి ఆలయంలో బుధవారం సాయంత్రం అంగరంగ వైభవంగా శ్రీ గోదా రంగనాయకుల కళ్యాణ వేడుకలు నిర్వహించారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రత్యేక వేదికను అలంకరింపజేసి ఉత్సవ మూర్తులను వేదికపై ఉంచి కళ్యాణాన్ని... ఎన్ టివి జర్నలిస్టుల అక్రమ అరెస్టులను ఖండిస్తూ జగిత్యాలలో నిరసన
జగిత్యాల జనవరి 14 (ప్రజా మంటలు)
ఎన్ టివి ఇన్పుట్ ఎడిటర్ దొంతు రమేష్, రిపోర్టర్లు చారి, సుధీర్లను అర్ధరాత్రి అక్రమంగా అరెస్టు చేయడాన్ని ఖండిస్తూ జగిత్యాల పట్టణంలో టి యు డబ్ల్యూ జే (ఐ జె యు) ఆధ్వర్యంలో జర్నలిస్టులు నిరసన కార్యక్రమం చేపట్టారు. జిల్లా కేంద్రంలోని తహసీల్దార్ చౌరస్తా వద్ద నిర్వహించిన ఈ... గంజాయి పట్టివేత యువత పై కేసు నమోదు
గొల్లపల్లి జనవరి 14 (ప్రజా మంటలు )
గొల్లపల్లి మండలం లోనీ చందోలి గ్రామ శివారులో యువకుడు గంజాయితో వెళుతున్నాడని పక్క సమాచారం మేరకు చందోలి శివారులో పోలీసులు వాహనాల తనిఖీలో భాగంగా యువకుడిని అదుపులోకి తీసుకొని తనిఖీ చేయగా అతడి వద్ద 89 గ్రాముల గంజాయి లభించగా వివరాల్లోకెళ్తే వెల్గటూర్ మండలo ఆకట్టుకున్న సందేశాత్మక ముగ్గు
జగిత్యాల జనవరి 14 (ప్రజా మంటలు):
సంక్రాంతి పండుగను పురస్కరించుకుని మంగళవారం జగిత్యాలలో నిర్వహించిన ముగ్గుల పోటీల్లో జగిత్యాలకు చెందిన యూట్యూబ్ స్టార్ దేశవేని మమత వేసిన సందేశాత్మక ముగ్గు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
“రైతు లేనిదే రాజ్యం లేదు… జవాన్ లేకపోతే దేశానికి రక్షణ లేదు” అనే నినాదంతో, పలు రకాల అందమైన రంగులను... హైదరాబాద్లో జర్నలిస్టుల అరెస్టులు
హైదరాబాద్ జనవరి 14 (ప్రజా మంటలు):
హైదరాబాద్లో జర్నలిస్టుల వరుస అరెస్టుల వ్యవహారంపై మాజీ మంత్రి హరీశ్ రావు డీజీపీతో ఫోన్లో మాట్లాడారు. పండుగ పూట అర్ధరాత్రి జర్నలిస్టుల ఇళ్లకు వెళ్లి తలుపులు పగలగొట్టి అరెస్టులు చేయడం అవసరమా? అని ప్రశ్నించారు.
నోటీసులు ఇవ్వకుండా, చట్టపరమైన ప్రొసీజర్ అనుసరించకుండా జర్నలిస్టులను అరెస్టు చేయడం సరికాదని హరీశ్... జగిత్యాల ప్రభుత్వ నర్సింగ్ హాస్టల్లో కలకలం
జగిత్యాల జనవరి 14 (ప్రజా మంటలు):
జగిత్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ నర్సింగ్ కాలేజ్ హాస్టల్లో విద్యార్థినుల మొబైల్ ఫోన్లు లాక్కొని, సంక్రాంతి పండుగకు ఇంటికి పంపించకుండా గదుల్లో నిర్బంధించారన్న ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటన జిల్లాలో తీవ్ర కలకలం రేపింది.
హాస్టల్లో సెలవులపై ముందస్తు ప్రకటన లేకుండా విద్యార్థినుల వ్యక్తిగత కమ్యూనికేషన్ను ఆపివేయడం,... జగిత్యాల జిల్లా కలెక్టరేట్ లో వైభవంగా ముగ్గుల పోటీలు _ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్
జగిత్యాల జనవరి 13 ( ప్రజా మంటలు)జిల్లా కలెక్టరేట్ కార్యాలయ ఆవరణలో జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్, అధ్యక్షతన మహిళా శిశు సంక్షేమ శాఖ ద్వారా సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఏర్పాటుచేసిన మహిళా ఉద్యోగులకు ముగ్గుల పోటీల కార్యక్రమంలో టిఎన్జీవో జిల్లా అధ్యక్షులు మిర్యాల నాగేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఉద్యోగులు హాజరైనారు. జగిత్యాల జిల్లా లోని... జగిత్యాల ,రాయికల్ మున్సిపాలిటీ పై బీజేపీ జెండా ఎగరవేయడమే మా లక్ష్యం బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డా బోగ శ్రావణి ప్రవీణ్
జగిత్యాల జనవరి 13 (ప్రజా మంటలు)నియోజక వర్గంలోని జగిత్యాల, రాయికల్ రెండు మున్సిపాలిటీల్లో కాషాయ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా బిజెపి పార్టీ పని చేస్తుందని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డా భోగ శ్రావణి ప్రవీణ్ అన్నారు
జగిత్యాల నియోజకవర్గం కార్యాలయము కమలా నిలయంలో మీడియా సమావేశంలో బిజెపి పార్టీ శ్రేణులతో కలిసి ఆమె... తలసాని వ్యాఖ్యలకు వ్యతిరేకంగా పీఎస్ లో కాంగ్రెస్ నేతల ఫిర్యాదు
సికింద్రాబాద్, జనవరి 13 ( ప్రజామంటలు ):
బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ రెండు రోజుల క్రితం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా బన్సీలాల్పేట్ డివిజన్ కాంగ్రెస్ నాయకులు గాంధీనగర్ పోలీస్ స్టేషన్లో మంగళవారం ఫిర్యాదు చేశారు.తలసాని చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరమని పేర్కొన్న కాంగ్రెస్ నేతలు, వాటిని... సీనియర్ సిటీజేన్స్ ఆధ్వర్యంలో సంక్రాంతి పురస్కారాలు
జగిత్యాల జనవరి 13 (ప్రజా మంటలు):
తెలంగాణ ఆల్ సీనియర్ సిటీజేన్స్ అసోసియేషన్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు హరి అశోక్ కుమార్ ఆధ్వర్యంలో వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన సీనియర్ సిటీజెన్లకు సంక్రాంతి పురస్కారాలను , ముగ్గుల పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. మంగళవారం జిల్లా సీనియర్ సిటీజేన్స్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో... మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ను కలిసిన జగిత్యాల ఎమ్మెల్యే
హైదరాబాద్, జనవరి 13 (ప్రజా మంటలు):
ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ను హైదరాబాద్లోని ఆయన కార్యాలయంలో జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ కలిసి వినతి పత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా జగిత్యాల నియోజకవర్గానికి యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ రెసిడెన్షియల్ స్కూల్, కేంద్రీయ విద్యాలయం, మినీ స్టేడియం మంజూరైనప్పటికీ... సంక్రాంతి – ముగ్గులు ::సంప్రదాయం, శాస్త్రం, స్త్రీశక్తి
ముగ్గులు ఏ ప్రదేశాన్నైనా సౌందర్యవంతంగా మార్చడమే కాక, ఆ ఇంటిని లక్ష్మీ నివాసంగా మలిచే పవిత్ర చిహ్నాలు. రంగురంగుల డిజైన్లు మాత్రమే కాదు, ప్రతి ముగ్గు వెనుక దాగి ఉన్న శాస్త్రీయత, ఆధ్యాత్మిక భావన, సామాజిక ఉద్దేశం చాలా లోతైనవి. రోజూ మనం చూసే ఒక సాధారణ ముగ్గుకే ప్రత్యేక అర్థం ఉంది. ఆ అర్థం,... 