లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఎస్సీ ఎస్టీ మైనార్టీ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
జగిత్యాల/ ధర్మపురి/ రాయికల్ జగిత్యాల ఆగస్ట్ 28 (ప్రజా మంటలు)
లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..
గోదావరి నది భారీగా ప్రవహిస్తున్నందున తగిన జాగ్రత్తలు తీసుకోవాలి..
అధికారులు నిరంతరం అందుబాటులో ఉండాలి..
ఇక్కడ ఏ చిన్న సమస్య వచ్చినా వెంటనే స్పందించాలి..
ఆస్తి ప్రాణనష్టం జరగకుండా చర్యలు వేగంగా చేపట్టాలి..
ప్రభుత్వం ప్రజలకు ఎల్లవేళలా అండగా ఉంటుందనీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్ అన్నారు.
జగిత్యాల జిల్లాలో బుధవారం నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పేర్కొన్నారు.అధికారులు ఎక్కడ ఎలాంటి సమస్య రాకుండా ఎప్పటికప్పుడు సత్వరమే స్పందించాలని ఆదేశించారు. ఎలాంటి ఆస్తి ప్రాణనష్టం జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని సూచించారు.
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరికి వస్తున్న భారీ వరద దృష్ట్యా గురువారం ధర్మపురి గోదావరి నది, ధర్మపురి మండలం నేరెళ్లలో లో జగిత్యాల మండలం అనంతారం బ్రిడ్జి రాయికల్ మండలం రామోజీపేట బ్రిడ్జి ఇటిక్యాలలో లో లెవెల్ బ్రిడ్జి ని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్, జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో ప్రజలను అలర్ట్గా ఉంచాలని అధికారులకు సూచించారు. ముందు జాగ్రత్తగా చెప్పడాల్సిన చర్యలపై మంత్రి అధికారులకు కీలక సూచనలు చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఎస్ ఆర్ ఎస్ పి నుండి 39 గేట్లు నుండి.నీటిని గోదావరి నదిలోకి వదిలారనీ పేర్కొన్నారు. కడెం ప్రాజెక్టు నుండి 6 గేట్ల ద్వారా గోదావరి నదిలోకి నీటిని వదిలారనీ, గోదావరి నది భారీగా నీటి ప్రవాహం వస్తున్నందున గోదావరి నది తీర ప్రాంతాలలో లోతట్టు తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలనీ సూచనలు చేశారు. ఆయా ప్రాంతాల్లో ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు.
ఎగువ ప్రాంతాల్లో గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో ఎస్ ఆర్ ఎస్ పి. మరియు కడెం ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో గోదావరిలోకి నీటి ప్రవాహం ఎక్కువ ఉన్నందున గోదావరిలో భారీగా వరద వస్తున్న దృష్ట్యా జిల్లా అధికార యంత్రాంగంతో తో కలిసి గోదావరి నది పరివాహక ప్రాంతాన్ని పరిశీలించామని తెలిపారు.. గత 15 రోజులుగా ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి వరద పై రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల అధికారులతో సమీక్ష నిర్వహించారని పేర్కొన్నారు.
లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులకు సూచించడం జరిగిందని,ప్రజలు ఎవ్వరు ఆందోళన పడాల్సిన అవసరం లేదని,ఎప్పటికప్పుడు జిల్లా అధికారులు,పోలీసులు అందుబాటులో ఉంటారని, అధికారులకు కూడా తీర ప్రాంత ప్రజలు సహకరించాలని మంత్రి లక్ష్మణ్ కుమార్ సూచించారు.
ప్రజలంతా ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం ప్రజలకు అండగా ఉంటుందని పేర్కొన్నారు. ఎక్కడ ఏ అవసరం వచ్చినా అధికారులను తమను సంప్రదించవచ్చని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జగిత్యాల ఆర్డీవో మధుసూదన్, నీటిపారుదల శాఖ అధికారులు మున్సిపల్ కమిషనర్ ఎంపీడీవో తహసీల్దారులు, పోలీస్ సిబ్బంది సిఐఎస్ఐ మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
జగిత్యాల శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో ఘనంగా శ్రీ గోదా రంగనాయకుల కళ్యాణ వేడుకలు
జగిత్యాల జనవరి 14 (ప్రజా మంటలు) జిల్లా కేంద్రంలోని బ్రాహ్మణ వీధి శ్రీ రుక్మిణి సత్యభామ సమేత మధన వేణుగోపాలస్వామి ఆలయంలో బుధవారం సాయంత్రం అంగరంగ వైభవంగా శ్రీ గోదా రంగనాయకుల కళ్యాణ వేడుకలు నిర్వహించారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రత్యేక వేదికను అలంకరింపజేసి ఉత్సవ మూర్తులను వేదికపై ఉంచి కళ్యాణాన్ని... ఎన్ టివి జర్నలిస్టుల అక్రమ అరెస్టులను ఖండిస్తూ జగిత్యాలలో నిరసన
జగిత్యాల జనవరి 14 (ప్రజా మంటలు)
ఎన్ టివి ఇన్పుట్ ఎడిటర్ దొంతు రమేష్, రిపోర్టర్లు చారి, సుధీర్లను అర్ధరాత్రి అక్రమంగా అరెస్టు చేయడాన్ని ఖండిస్తూ జగిత్యాల పట్టణంలో టి యు డబ్ల్యూ జే (ఐ జె యు) ఆధ్వర్యంలో జర్నలిస్టులు నిరసన కార్యక్రమం చేపట్టారు. జిల్లా కేంద్రంలోని తహసీల్దార్ చౌరస్తా వద్ద నిర్వహించిన ఈ... గంజాయి పట్టివేత యువత పై కేసు నమోదు
గొల్లపల్లి జనవరి 14 (ప్రజా మంటలు )
గొల్లపల్లి మండలం లోనీ చందోలి గ్రామ శివారులో యువకుడు గంజాయితో వెళుతున్నాడని పక్క సమాచారం మేరకు చందోలి శివారులో పోలీసులు వాహనాల తనిఖీలో భాగంగా యువకుడిని అదుపులోకి తీసుకొని తనిఖీ చేయగా అతడి వద్ద 89 గ్రాముల గంజాయి లభించగా వివరాల్లోకెళ్తే వెల్గటూర్ మండలo ఆకట్టుకున్న సందేశాత్మక ముగ్గు
జగిత్యాల జనవరి 14 (ప్రజా మంటలు):
సంక్రాంతి పండుగను పురస్కరించుకుని మంగళవారం జగిత్యాలలో నిర్వహించిన ముగ్గుల పోటీల్లో జగిత్యాలకు చెందిన యూట్యూబ్ స్టార్ దేశవేని మమత వేసిన సందేశాత్మక ముగ్గు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
“రైతు లేనిదే రాజ్యం లేదు… జవాన్ లేకపోతే దేశానికి రక్షణ లేదు” అనే నినాదంతో, పలు రకాల అందమైన రంగులను... హైదరాబాద్లో జర్నలిస్టుల అరెస్టులు
హైదరాబాద్ జనవరి 14 (ప్రజా మంటలు):
హైదరాబాద్లో జర్నలిస్టుల వరుస అరెస్టుల వ్యవహారంపై మాజీ మంత్రి హరీశ్ రావు డీజీపీతో ఫోన్లో మాట్లాడారు. పండుగ పూట అర్ధరాత్రి జర్నలిస్టుల ఇళ్లకు వెళ్లి తలుపులు పగలగొట్టి అరెస్టులు చేయడం అవసరమా? అని ప్రశ్నించారు.
నోటీసులు ఇవ్వకుండా, చట్టపరమైన ప్రొసీజర్ అనుసరించకుండా జర్నలిస్టులను అరెస్టు చేయడం సరికాదని హరీశ్... జగిత్యాల ప్రభుత్వ నర్సింగ్ హాస్టల్లో కలకలం
జగిత్యాల జనవరి 14 (ప్రజా మంటలు):
జగిత్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ నర్సింగ్ కాలేజ్ హాస్టల్లో విద్యార్థినుల మొబైల్ ఫోన్లు లాక్కొని, సంక్రాంతి పండుగకు ఇంటికి పంపించకుండా గదుల్లో నిర్బంధించారన్న ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటన జిల్లాలో తీవ్ర కలకలం రేపింది.
హాస్టల్లో సెలవులపై ముందస్తు ప్రకటన లేకుండా విద్యార్థినుల వ్యక్తిగత కమ్యూనికేషన్ను ఆపివేయడం,... జగిత్యాల జిల్లా కలెక్టరేట్ లో వైభవంగా ముగ్గుల పోటీలు _ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్
జగిత్యాల జనవరి 13 ( ప్రజా మంటలు)జిల్లా కలెక్టరేట్ కార్యాలయ ఆవరణలో జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్, అధ్యక్షతన మహిళా శిశు సంక్షేమ శాఖ ద్వారా సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఏర్పాటుచేసిన మహిళా ఉద్యోగులకు ముగ్గుల పోటీల కార్యక్రమంలో టిఎన్జీవో జిల్లా అధ్యక్షులు మిర్యాల నాగేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఉద్యోగులు హాజరైనారు. జగిత్యాల జిల్లా లోని... జగిత్యాల ,రాయికల్ మున్సిపాలిటీ పై బీజేపీ జెండా ఎగరవేయడమే మా లక్ష్యం బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డా బోగ శ్రావణి ప్రవీణ్
జగిత్యాల జనవరి 13 (ప్రజా మంటలు)నియోజక వర్గంలోని జగిత్యాల, రాయికల్ రెండు మున్సిపాలిటీల్లో కాషాయ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా బిజెపి పార్టీ పని చేస్తుందని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డా భోగ శ్రావణి ప్రవీణ్ అన్నారు
జగిత్యాల నియోజకవర్గం కార్యాలయము కమలా నిలయంలో మీడియా సమావేశంలో బిజెపి పార్టీ శ్రేణులతో కలిసి ఆమె... తలసాని వ్యాఖ్యలకు వ్యతిరేకంగా పీఎస్ లో కాంగ్రెస్ నేతల ఫిర్యాదు
సికింద్రాబాద్, జనవరి 13 ( ప్రజామంటలు ):
బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ రెండు రోజుల క్రితం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా బన్సీలాల్పేట్ డివిజన్ కాంగ్రెస్ నాయకులు గాంధీనగర్ పోలీస్ స్టేషన్లో మంగళవారం ఫిర్యాదు చేశారు.తలసాని చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరమని పేర్కొన్న కాంగ్రెస్ నేతలు, వాటిని... సీనియర్ సిటీజేన్స్ ఆధ్వర్యంలో సంక్రాంతి పురస్కారాలు
జగిత్యాల జనవరి 13 (ప్రజా మంటలు):
తెలంగాణ ఆల్ సీనియర్ సిటీజేన్స్ అసోసియేషన్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు హరి అశోక్ కుమార్ ఆధ్వర్యంలో వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన సీనియర్ సిటీజెన్లకు సంక్రాంతి పురస్కారాలను , ముగ్గుల పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. మంగళవారం జిల్లా సీనియర్ సిటీజేన్స్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో... మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ను కలిసిన జగిత్యాల ఎమ్మెల్యే
హైదరాబాద్, జనవరి 13 (ప్రజా మంటలు):
ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ను హైదరాబాద్లోని ఆయన కార్యాలయంలో జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ కలిసి వినతి పత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా జగిత్యాల నియోజకవర్గానికి యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ రెసిడెన్షియల్ స్కూల్, కేంద్రీయ విద్యాలయం, మినీ స్టేడియం మంజూరైనప్పటికీ... సంక్రాంతి – ముగ్గులు ::సంప్రదాయం, శాస్త్రం, స్త్రీశక్తి
ముగ్గులు ఏ ప్రదేశాన్నైనా సౌందర్యవంతంగా మార్చడమే కాక, ఆ ఇంటిని లక్ష్మీ నివాసంగా మలిచే పవిత్ర చిహ్నాలు. రంగురంగుల డిజైన్లు మాత్రమే కాదు, ప్రతి ముగ్గు వెనుక దాగి ఉన్న శాస్త్రీయత, ఆధ్యాత్మిక భావన, సామాజిక ఉద్దేశం చాలా లోతైనవి. రోజూ మనం చూసే ఒక సాధారణ ముగ్గుకే ప్రత్యేక అర్థం ఉంది. ఆ అర్థం,... 