మండల విద్యాశాఖ ఆధ్వర్యంలో వివిధ శిక్షణలు
గొల్లపల్లి, జూన్ 11 (ప్రజా మంటలు):
గొల్లపల్లి మండల కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాలలో బుధవారం వివిధ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల వివిధ సిబ్బందికి వేరువేరు రకాల ఓరియంటేషన్ కార్యక్రమాలు నిర్వహించారు.
గొల్లపల్లి మండల కేంద్రంలో వివిధ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలలో పనిచేస్తున్న పారిశుద్ధ్య సిబ్బంది (స్కావెంజర్) లకు ఒక రోజు ఓరియంటేషన్ శిక్షణ కార్యక్రమం బాలికల ఉన్నత పాఠశాలలో జరిగింది. ఇట్టి కార్యక్రమానికి రిసోర్స్ పర్సన్ గా రాయి శ్రీనివాస్ వ్యవహరించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మండల విద్యాధికారి జమున దేవి మాట్లాడుతూ పాఠశాల పరిసరాలు మొత్తం బోధనాభ్యసనకు అనుకూలంగా ఉండడమనేది కేవలం పాఠశాల స్వచ్ఛంగా ఉన్నప్పుడు మాత్రమే జరుగుతుందని, అట్టి ప్రధానమైన బాధ్యతను స్కావెంజర్లు నిర్వర్తిస్తున్నారని అన్నారు. ముఖ్యంగా సీజనల్ వ్యాధులు ప్రబలే ఈ సమయంలో పాఠశాల పున ప్రారంభం అవుతున్న దృష్ట్యా స్కావెంజర్ లు మరింతగా తమ బాధ్యతను పెంపొందించుకొని పాఠశాలను మరియు పరిసరాలను స్వచ్ఛగా ఉంచాలని, తద్వారా విద్యార్థులకు ఏ విధమైన వ్యాధులు ప్రబలకుండా నివారించినట్లు అవుతుందని అన్నారు.
ఈ సందర్భంగా రిసోర్స్ పర్సన్ రాయి శ్రీనివాస్ స్వచ్ఛత, పరిశుభ్రత, పారిశుద్ధ్యం అనే అంశాలలో వివిధ పద్ధతులు మరియు స్కావెంజర్ లు పాటించవలసిన విధివిధానాలను వివరించారు.
మండల విద్యాశాఖ పరిధిలోని అన్నిపాఠశాలలలో పనిచేసే ఉపాధ్యాయులకు FLN పైన శిక్షణ ఇచ్చి ఈ విద్యాసంవత్సరం లో సాధించబోయే అభ్యసన సామర్థ్యాలు మరియు పెట్టుకోవలసిన టార్గెట్ లు అనే దానిపై ఎం ఎన్ ఓ చెరుకు రాజన్న అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మండలంలోని ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత 72 గంటల నిరాహార దీక్షకు పోలీసుల అడ్డంకి

మున్సిపల్ సమస్యలపై జోనల్ కమీషనర్ కలిసిన బీజేపీ నేత మర్రి

ప్రభుత్వ టీచర్లకు ఎఫ్ఆర్ఎస్ అటెండెన్స్ ప్రారంభం

అంగన్వాడి సెంటర్లో తల్లిపాలవారోత్సవాలు
.jpg)
బీఆర్ఎస్సోళ్ళు ఉప ఎన్నికలు వస్తేనే స్కీం లు ఇచ్చేవాళ్ళు - మంత్రి పొన్నం

యూనియన్ బ్యాంక్ హెడ్ క్యాషియర్ కు కళాశాల ప్రిన్సిపల్ చే సత్కారం

అన్ని శాఖల సమన్వయంతో ఆపరేషన్ ముస్కాన్-XI విజయవంతం. జిల్లా లో 36 మoది బాల కార్మికులకు విముక్తి జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

సారంగాపూర్ మండలం కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం పరిశీలించిన జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్.

ఎస్సారెస్పీ కెనాల్ నీటిని సకాలంలో విడుదల చేసి ఆయకట్టు రైతాంగాన్ని ఆదుకోవాలి..... తెలంగాణ రైతు ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు శేర్ నర్సారెడ్డి

యూరియా పంపిణీపై కల్వకుంట్ల సంజయ్ బహిరంగ చర్చకు రావాలి

హమాలి బస్తీలో తల్లిపాల వారోత్సవాలు

ధర్మపురిలో ఘనంగా శ్రావణ శుక్రవార వేడుకలు
