అమర్ నాథ్ యాత్రికులకు గాంధీలో ఫిట్ నెస్ సర్టిఫికెట్లు - ఈనెల 21 నుంచి దృవపత్రాల జారీ
సికింద్రాబాద్, ఏప్రిల్ 17 ( ప్రజామంటలు):
అమర్ నాథ్ యాత్రకు వెళ్లే వారికి సికింద్రాబాద్ లోని గాంధీ ఆసుపత్రిలో ఫిట్ నెస్ సర్టిఫికెట్లను ఉచితంగా జారీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. సోమవారం ఏప్రిల్ 21వ తేదీ నుండి ప్రతి సోమ బుధ, శుక్ర వారాలలో ఉదయం 10:30 గంటలకు ప్రధాన భవనం, మొదటి అంతస్తులోని మెడికల్ రికార్డ్స్ డిపార్ట్ మెంట్ లో ఈ సర్టిఫికెట్ లు పొందవచ్చు. ఇందుకోసం దరఖాస్తు తో పాటు రక్త పరీక్షలు, ఛాతి ఎక్స్ రే, బ్లడ్ గ్రూపు పరీక్షల రిపోర్ట్ లను తీసుకుని రావాలని, 50 ఏళ్ల వయస్సు పైబడిన వాళ్లు మాత్రం తప్పనిసరిగా రెండు మోకాళ్ళ ఎక్స్రేలను తీసుకొని రావాలని అధికారులు తెలిపారు. సర్టిఫికెట్ల జారీ కోసం డీఎంఈ పర్యవేక్షణలో డాక్టర్ బి.కిరణ్ (ఆర్థోపెడిక్), డాక్టర్ జగదీశ్వర్ రెడ్డి (కార్డియాలజీ), డాక్టర్ భానుప్రియ (పల్మానాలజీ), డాక్టర్ కృష్ణ నాయక్ (జనరల్ మెడిసిన్) వైద్యుల బృందం నియమించారని తెలిపారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
బడ్జెట్ పాఠశాలల సమస్యలపై సబ్ కమిటీకి విజ్ఞాపన

బైక్ ను ఢీకొట్టిన కారు... వ్యక్తితో పాటు చిన్నారి మృతి.

విద్యార్థులు, యాజమాన్యం పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం సరికాదు. డిగ్రీ పరీక్షల నిర్వహణ పై పునరాలోచన చేయాలి జిల్లా పరిషత్ తొలి ఛైర్ పర్సన్ దావ వసంత సురేష్

నర్సింగ్ సిబ్బంది సేవలు అభినందనీయం - గాంధీ సూపరింటెండెంట్ డా.రాజకుమారి

ఫైర్ యాక్సిడెంట్లపై పోలీసుల అవగాహన

కేంద్ర ప్రభుత్వం మావోయిస్టు పార్టీతో శాంతి చర్చలు జరపాలి - పౌరహక్కుల సంఘం

సమస్యల పరిష్కార ధ్యేయమే విద్యుత్ ప్రజావాణి ఎస్ ఈ సాలియా నాయక్

కాటమయ్య రక్షణ కిట్ల కోసం ఎమ్మెల్యేకు వినతి

గ్రీవెన్స్ డే – బాధితుల సమస్యల పరిష్కారానికి చర్యలు: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్,

తెలంగాణ రాష్ట్రంలోనే జగిత్యాల జిల్లాను అత్యుత్తమ హెల్త్ కేర్ హబ్ గా తీర్చిదిద్దటానికి అన్ని చర్యలు తీసుకుంటాము - దామోదర్ రాజా నరసింహ - రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి.

పావని కంటి ఆసుపత్రిలో ఉచిత కంటి శస్త్ర చికిత్సలు

అయ్యప్ప ఆలయంలో భారత దేశం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు
