మండలంలో కట్ట మహేష్ ప్రజాదరణ చూసి ఓర్వలేకనే భౌతిక దాడి చేసిన కాంగ్రెస్ నాయకులు -బీజేపీ ఆరోపణ
బీజేపీ జిల్లా అధ్యక్షులు యాదగిరి బాబు
గొల్లపల్లి ఎప్రిల్ 14 (ప్రజా మంటలు):
గొల్లపల్లి మండల కేంద్రంలో నిన్నటి రోజున కాంగ్రెస్ నాయకుల దాడికి గురైనకట్ట మహేష్ ఇంటినీ పరిశీలించి, పార్టీ కార్యకర్తలను బీజేపీ జిల్లా అధ్యక్షులు యాదగిరిబాబు పరామర్శించారు.
అనంతరం విలేకరులతో మాట్లాడుతూ కట్ట మహేష్ ఇంటి మీద జరిగిన దాడిని బీజేపీ జిల్లా శాఖ తీవ్రంగా ఖండిస్తుందని అన్నారు.తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం యొక్క వైఫల్యాలు మరియు మండల కేంద్రం లో జరుగుతున్న దౌర్జన్యాలను అక్రమాలను ప్రశ్నిస్తూ నిరంతరం ప్రజల పక్షాన పోరాడుతున్న కట్ట మహేష్ మరియు కార్యకర్తలు అయినా కళ్యాణ్,వెంకటేష్ లపైన దాడి చేసి తీవ్రంగా కొట్టడం జరిగింది.అలాగే ఇంట్లో ఆడవాళ్ళను కూడా చూడకుండా చేయి చేసుకోవడం వారి యొక్క ఈర్ష్య, అహంకరాలను ప్రతీక అని అన్నారు.ఇంకోసారి భాజపా నాయకులు,కార్యకర్తల మీద దాడి చేస్తే రాబోవు రోజుల్లో పరిణామాలు తీవ్రంగా ఉంటాయి అని హెచ్చరించారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పోలీస్ శాఖ తీవ్రంగా చర్యలు తీసుకోవాలి అని కోరారు..
ఈ కార్యక్రమంలో బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ కొమ్ము రాంబాబు, మాజీ కన్వీనర్ కస్తూరి సత్యం, ఓరుగంటి చంద్ర శేఖర్ మర్రిపెల్లి సత్యం తదితరులు పాల్గొన్నారు
More News...
<%- node_title %>
<%- node_title %>
బడ్జెట్ పాఠశాలల సమస్యలపై సబ్ కమిటీకి విజ్ఞాపన

బైక్ ను ఢీకొట్టిన కారు... వ్యక్తితో పాటు చిన్నారి మృతి.

విద్యార్థులు, యాజమాన్యం పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం సరికాదు. డిగ్రీ పరీక్షల నిర్వహణ పై పునరాలోచన చేయాలి జిల్లా పరిషత్ తొలి ఛైర్ పర్సన్ దావ వసంత సురేష్

నర్సింగ్ సిబ్బంది సేవలు అభినందనీయం - గాంధీ సూపరింటెండెంట్ డా.రాజకుమారి

ఫైర్ యాక్సిడెంట్లపై పోలీసుల అవగాహన

కేంద్ర ప్రభుత్వం మావోయిస్టు పార్టీతో శాంతి చర్చలు జరపాలి - పౌరహక్కుల సంఘం

సమస్యల పరిష్కార ధ్యేయమే విద్యుత్ ప్రజావాణి ఎస్ ఈ సాలియా నాయక్

కాటమయ్య రక్షణ కిట్ల కోసం ఎమ్మెల్యేకు వినతి

గ్రీవెన్స్ డే – బాధితుల సమస్యల పరిష్కారానికి చర్యలు: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్,

తెలంగాణ రాష్ట్రంలోనే జగిత్యాల జిల్లాను అత్యుత్తమ హెల్త్ కేర్ హబ్ గా తీర్చిదిద్దటానికి అన్ని చర్యలు తీసుకుంటాము - దామోదర్ రాజా నరసింహ - రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి.

పావని కంటి ఆసుపత్రిలో ఉచిత కంటి శస్త్ర చికిత్సలు

అయ్యప్ప ఆలయంలో భారత దేశం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు
