ప్రభుత్వం మారినా...! పాలకులు మారినా.....!!

On
ప్రభుత్వం మారినా...! పాలకులు మారినా.....!!

నిధుల దుర్వినియోగం పై చర్యలు ఏవి...?

 అడ్లూరి లక్ష్మణ్ కుమార్ - టి.జీవన్ రెడ్డి - బాదినేని రాజేందర్ లే బాధ్యత వహించాలి

లోకాయుక్త తీర్పుకు నాలుగు నెలలు

జిల్లా కలెక్టర్ ఉత్తర్వులకు నెల రోజులా...?

అయినా క్రిమినల్ కేసుల నమోదులో చర్యలు శూన్యం

"ఎంపిఓ" నే ప్రభుత్వాన్ని -  న్యాయస్థానాలను మించిన "సుప్రీం"

మీరెందుకు స్పందించడం లేదని సూటిగా ప్రశ్నించిన "చుక్క గంగారెడ్డి
బుగ్గారం ఏప్రిల్ 05:: 

జగిత్యాల జిల్లా బుగ్గారం గ్రామ పంచాయతీలో జరిగిన కోటికి పైగా నిధుల దుర్వినియోగం విషయంలో ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పట్టభద్రుల మాజీ ఎమ్మెల్సీ టి.జీవన్ రెడ్డి, బుగ్గారం మాజీ జడ్పీటిసి బాదినేని రాజేందర్ లే పూర్తి బాధ్యత తీసుకొని దోషులందరిపై క్రిమినల్ కేసులు నమోదు చేయించి మొత్తం ప్రజా ధనాన్ని రికవరీ చేయించాలని తెలంగాణ జన సమితి జగిత్యాల జిల్లా అధ్యక్షులు చుక్క గంగారెడ్డి కోరారు.

శనివారం ఆయన బుగ్గారం గ్రామస్తులతో, విడిసి బృందంతో కలిసి విలేఖరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా చుక్క గంగారెడ్డి మాట్లాడుతూ లోకాయుక్త న్యాయస్థానం నుండి తీర్పు వెలువడి నాలుగు నెలలు, జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేసి నెల రోజులు గడుస్తున్నా క్రిమినల్ కేసులు నమోదు చేయించడంలో పంచాయతీ అధికారులు విఫలం అయ్యారని ఆయన ఆరోపించారు. ఇందుకు భారీ అవినీతితో పాటు, రాజకీయ ఒత్తిల్లే కారణమని ఆయన పలు అనుమానాలను వ్యక్తం చేశారు.


న్యాయస్థానాలను, అధికార పార్టీని, ప్రభుత్వ యంత్రాంగాన్ని మించిన "సుప్రీం" గా బుగ్గారం మండల పంచాయతీ అధికారి "అఫ్జల్ మియా" వ్యవహరిస్తున్నాడని ఆరోపించారు. ఒక ఎంపిఓ ఇంతటి దారుణానికి పాల్పడితే ఇక ప్రభుత్వం గానీ, ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్సీ, జడ్పీటిసి బాదినేని రాజేందర్ లు మౌనం పాటించడంలో ఆంతర్యం ఏమిటని ఆయన ప్రశ్నించారు.


 దీనికి కారకులు ఎవరో మీరే అర్థం చేసుకోవాలని చుక్క గంగారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ భారీ నిధుల దుర్వినియోగం పై ప్రాణాలకు తెగించి, ఎన్నెన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి,  ఐదున్నర సంవత్సరాలుగా ధర్మంగా, న్యాయంగా, చట్ట బద్దంగా, నీతి - నిజాయితీతో పోరాటం చేయడం జరుగుతుందని అన్నారు. జిల్లా ఉన్నతాధికారుల మీద కేసులు వేసి
లోకాయుక్త న్యాయస్థానంలో గెలుపొంది క్రిమినల్ కేసుల నమోదు కు నాలుగు నెలల క్రితమే తీర్పులు తీసుకొస్తే, ప్రస్తుత మీ ప్రభుత్వ హయాంలో పంచాయతీ అధికారులు దాన్ని బేఖాతర్ చేసి అమలు చేయకుండా వ్యవహరించడం ఈ ప్రభుత్వానికి సిగ్గు - చేటు కాదా అని ఆయన ప్రశ్నించారు.


జిల్లా కలెక్టర్ కూడా క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆదేశించి ఉత్తర్వులు జారీ చేస్తే ఏకంగా ఇక జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు కూడా అమలు కాకపోవడంలో ఆంతర్యం ఏమిటో...? ఈ ముగ్గురు సీనియర్ నాయకులే ఆలోచించి మా గ్రామ ప్రజలకు సరైన సమాధానం చెప్పి తగు న్యాయం చేయాలని చుక్క గంగారెడ్డి డిమాండ్ చేశారు.

గత ప్రభుత్వ హయాంలోనే ఈ భారీ నిధుల దుర్వినియోగం జరిగిందన్నారు. ఇంత తీవ్రమైన పోరాటం నేటికీ కొనసాగుతున్నా మీరు ఎందుకు స్పందించడం లేదని చుక్క గంగారెడ్డి అనుమానాలను వ్యక్తం చేశారు.


ఇప్పుడు ప్రభుత్వం మీది, పాలన మీది, అధికారం మీది, రాజ్యమంతా మీదే.... అయినా న్యాయస్థానాల తీర్పులు, జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు కూడా అమలు కావడం లేదంటే.... ఇక మీ పాలన, మీ రాజకీయ పరిపాలనా ఎమౌతున్నట్లూ..., ఎవరి పాలు అవుతున్నట్లూ.... అని ఆయన సందేహాలను వ్యక్తం చేశారు. ఇంత జరిగినా ఇంకా కూడా మీరు స్పందించక పోవడంలో అస్సలు ఆంతర్యం ఏమిటని ఆయన సూటిగా ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులు, మాజీ మంత్రి, తాజా మాజీ ఎమ్మెల్సీ అయిన టి.జీవన్ రెడ్డి, ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్,  బుగ్గారం మాజీ జడ్పీటిసి బాదినేని రాజేందర్ ల పైననే ప్రజలు, మేము ఆధార పడాల్సి వస్తుందని అన్నారు. వాటికి మీరే బాధ్యత వహించాల్సి ఉంటుందని చుక్క గంగారెడ్డి సూచించారు.

IMG-20250405-WA0008 ఇకనైనా మీ ముగ్గురు సీనియర్ నాయకులు స్పందించి వెంటనే లోకాయుక్త న్యాయస్థానం తీర్పును, సమాచార కమీషన్ తీర్పులను, జిల్లా కలెక్టర్ ఆదేశాల ఉత్తర్వులను అమలు పరచి నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డ సర్పంచ్ మూల సుమలత, అందుకు సహకరించిన పాలక వర్గం, బాధ్యులైన అధికారులు అందరిపై క్రిమినల్ కేసులు నమోదు చేయించాలని ఆయన మరొక్క సారి విజ్ఞప్తి చేశారు.
ఈ విలేఖరుల సమావేశంలో గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు నక్క చంద్రమౌళి, ప్రధాన కార్యదర్శి పెద్దనవేణి రాజేందర్, విడిసి కోర్ కమిటీ కోచైర్మన్ పెద్దనవేని రాగన్న, మాజీ ఉప సర్పంచ్ నగునూరి పెద్ద రామ గౌడ్, పెద్దనవేణి మల్లేష్, మాజీ వార్డ్ సభ్యులు గంజి జగన్ తదితరులు పాల్గొన్నారు.

Tags

More News...

Local News 

దేశంలో కుల గణన గొప్ప నిర్ణయం

దేశంలో కుల గణన గొప్ప నిర్ణయం సికింద్రాబాద్,  ఏప్రిల్ 30 (ప్రజా మంటలు):  దేశంలో కుల గణన చేయడం నిర్ణయించిన కేంద్ర ప్రభుత్వ నిర్ణయం  బీసీ కులాలకు అత్యున్నతమైన బహుమతి అని, దేశ చరిత్రలో 1931 తర్వాత తొలిసారి కేంద్ర ప్రభుత్వం కులగన స్పష్టమైన ప్రకటన చేసిందని బిజెపి రాష్ట్ర రజక సెల్ కన్వీనర్ మల్లేశ్వరపు రాజేశ్వరి పేర్కొన్నారు. దేశంలో అనేక వర్గాలకు...
Read More...
Local News 

పది ఫలితాలలో సిద్ధార్థ హై స్కూల్ విద్యార్థుల ప్రభంజనం

పది ఫలితాలలో సిద్ధార్థ హై స్కూల్ విద్యార్థుల ప్రభంజనం హుస్నాబాద్ ప్రజామంటలు న్యూస్: హుస్నాబాద్ లోని శ్రీ సిద్ధార్థ హై స్కూల్ విద్యార్థులు విద్యార్థులు 10వ తరగతి ఫలితాల్లో రాష్ట్రస్థాయి మార్కులు సాధించారు సాధించారు. ఈ సందర్భంగా వారిని పాఠశాల యాజమాన్యం అభినందించారు. ●2025 పదో తరగతి ఫలితాల్లో 564/600 మార్కులు సాధించి కె. సాయి వర్షిత్ రెడ్డి రాష్ట్రస్థాయిలో అత్యున్నత స్థానంలో నిలిచాడు.●100% విద్యార్థులు...
Read More...
Local News 

రాజీవ్ యువ వికాసం ఆన్లైన్ దరఖాస్తులు ఎమ్మార్వో ఆఫీస్ లో ఇవ్వండి

రాజీవ్ యువ వికాసం ఆన్లైన్ దరఖాస్తులు ఎమ్మార్వో ఆఫీస్ లో ఇవ్వండి సికింద్రాబాద్, ఏప్రిల్ 30 (ప్రజా మంటలు): ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నిరుద్యోగుల స్వయం ఉపాధి పథకం రాజీవ్ యువ వికాసం స్కీం కు అప్లై చేసుకున్న యువతీ, యువకులకు సికింద్రాబాద్ తహసీల్దార్ పాండునాయక్ బుధవారం కీలక సూచన చేశారు. తమ ఆన్ లైన్  దరఖాస్తు ఫారాల కాపీలను సికింద్రాబాద్ తహసీల్దార్ కార్యాలయంలో ఉదయం 10 నుంచి...
Read More...
Local News 

SSC - 2025 ఫలితాలలో జగిత్యాల సిద్ధార్థ విద్యా సంస్థల ప్రభంజనం

SSC - 2025 ఫలితాలలో జగిత్యాల సిద్ధార్థ విద్యా సంస్థల ప్రభంజనం (సిరిసిల్ల రాజేందర్ శర్మ) జగిత్యాల ఏప్రిల్ 30 (ప్రజా మంటలు): SSC -2025 ఫలితాలలో సిద్ధార్థ విద్యా సంస్థల జ్యోతి, మానస, సూర్య స్కూల్స్ విద్యార్థులు విజయ ఢంకా మోగించారు. 589 మార్కులతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని అత్యధిక మార్కులు సాధించిన విద్యా సంస్థగా సిద్ధార్థ విద్యా సంస్థ చరిత్ర సృష్టించింది. 580 మార్కుల పైగా...
Read More...
Local News 

మే రెండవ తేదీ నుండి వేసవి శిక్షణ శిబిరం ప్రారంభం 

మే రెండవ తేదీ నుండి వేసవి శిక్షణ శిబిరం ప్రారంభం    ఇబ్రహీంపట్నం ఏప్రిల్ 30 (ప్రజా మంటలు దగ్గుల అశోక్ ) పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నం మండలంలోని జడ్పీహెచ్ఎస్ ఇబ్రహీంపట్నం మరియు జడ్.పి.హెచ్.ఎస్ గోధూర్ పాఠశాలల యందు మే రెండవ తేదీ నుండి వేసవి శిక్షణ శిబిరం ప్రారంభిస్తున్నాం. అన్ని ప్రభుత్వ పాఠశాలలో మోడల్ పాఠశాల మరియు ప్రైవేట్ పాఠశాలలు, కేజీబీవీ పాఠశాలలో 6 నుండి...
Read More...
Local News 

మహాభాగ్యనగర బ్రాహ్మణ సేవా సమితి ఆధ్వర్యంలో ఘనంగా  సామూహిక బ్రాహ్మణ ఉపనయన కార్యక్రమం

మహాభాగ్యనగర బ్రాహ్మణ సేవా సమితి ఆధ్వర్యంలో ఘనంగా  సామూహిక బ్రాహ్మణ ఉపనయన కార్యక్రమం                                   సిరిసిల్ల. రాజేంద్ర శర్మ హైదరాబాద్ ఏప్రిల్ 30 ( ప్రజా మంటలు)  మహాభాగ్యనగర బ్రాహ్మణ సేవాసమితి ఆధ్వర్యంలో జరిగే ధార్మిక కార్యక్రమాలలో భాగంగా బుధవారం స్థానిక ముషీరాబాద్ లో గల భవానీ శంకర దేవాలయం వేదిక గా సామూహిక బ్రాహ్మణ ఉపనయన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో 33 మంది వటువులకు శాస్త్రోక్తంగా నూతన యజ్ఞోపవీత...
Read More...
Local News 

కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు తండ్రి ని పరామర్శించిన జువ్వడి కృష్ణ రావు

కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు తండ్రి ని పరామర్శించిన జువ్వడి కృష్ణ రావు ఇబ్రహీంపట్నం ఏప్రిల్ 30 (ప్రజా మంటలు దగ్గుల అశోక్):    కోరుట్ల నియోజకవర్గం ఇబ్రహీంపట్నం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గూడ శ్రీకాంత్ రెడ్డి తండ్రి ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురై చికిత్స పొందుతుండగా ఈరోజు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వడి కృష్ణారావు ఇబ్రహీంపట్నంలో శ్రీకాంత్ రెడ్డి తండ్రి ని పరామర్శించారు త్వరితగతిన ఈ...
Read More...
Local News 

మహదేవుని అలయ ధ్వజస్తంభ నిర్మాణం కోసం విరాళం

మహదేవుని అలయ ధ్వజస్తంభ నిర్మాణం కోసం విరాళం ఇబ్రహీంపట్నం ఏప్రిల్ 30 (ప్రజా మంటలు దగ్గుల అశోక్ ) జగిత్యాల జిల్లా ఇబ్రహింపట్నం మండలం లోని వేములకుర్తి గ్రామంలో అతిపురతన మహదేవుని శివలయం పున ప్రతిష్ట మహోత్సవం లో భాగంగా నుతనం గా ఎర్పాటు చేస్తున్న ద్వజస్థంబ ఎర్పాటు కు గుడ్ల విజయ్ కుమార్- అనుష దంపతులు బుధవారం రుపాయలు 76 వేల  విరాళం...
Read More...
Local News 

ఉపాధ్యాయుల కృషితోనే ఉత్తమ  ఫలితాలు - జగిత్యాల డీఈవో రాము

ఉపాధ్యాయుల కృషితోనే ఉత్తమ  ఫలితాలు - జగిత్యాల డీఈవో రాము గొల్లపల్లి ఎప్రిల్ 30 (ప్రజా మంటలు): ఉపాధ్యాయుల కృషి వల్లే పదవ తరగతి  పరీక్ష ఫలితాల్లో రాష్ట్రంలో జగిత్యాల జిల్లా నాలుగో స్థానంలో నిలిచిందని డీఈవో కె. రాము అన్నారు.జగిత్యాల జిల్లా 98.2 శాతంతో నాలుగవ స్థానంలో నిలిచిన సందర్భంగా  జిల్లా విద్యాధికారి కె.రాముకిఎస్టియు టీ.ఎస్ జగిత్యాల జిల్లా శాఖ అధ్యక్ష, కార్యదర్శులు  మచ్చ...
Read More...
Local News 

556 మార్కులతో టాపర్ గా నిలిచిన రోహిత్ మిశ్రా

556 మార్కులతో టాపర్ గా నిలిచిన రోహిత్ మిశ్రా సికింద్రాబాద్, ఏప్రిల్ 30 ( ప్రజామంటలు): భోలక్ పూర్ కృష్ణవేణి టాలెంట్ స్కూల్ స్టూడెంట్స్ బుధవారం విడుదల అయిన పదవతరగతి వార్షిక ఫలితాల్లో విజయ కేతనం ఎగురవేశారు. రోహిత్ మిశ్రా అనే విద్యార్థి 600 మార్కులకు గాను 556 మార్కులు సాధించి టాపర్ గా నిలిచారు. తర్వాత ఆర్ .నిహారిక 600 మార్కులకు గాను 533...
Read More...
Local News 

పదో తరగతి ఫలితాలలో మోడల్ స్కూల్ గొల్లపల్లి విద్యార్థుల ప్రభంజనం

పదో తరగతి ఫలితాలలో మోడల్ స్కూల్ గొల్లపల్లి విద్యార్థుల ప్రభంజనం గొల్లపల్లి ఎప్రిల్ 30 (ప్రజా మంటలు):  పదో తరగతి ఫలితాలలో మోడల్ స్కూల్ గొల్లపల్లి విద్యార్థులు 100% ఫలితాలు సాధించి, మండల జిల్లా, రాష్ట్రస్థాయిలో వివిధ ర్యాంకులను సొంతం చేసుకున్నారు. 1. ఎనగందుల వర్షిని 586 2. సట్టా అక్షిత 566 3. జాసియ బేగం 560 4. అనిశ్విక్ 555 5. సైన్ల శ్రేష్ణ...
Read More...
Local News  State News 

జగిత్యాల జిల్లాలో మహాత్మా జ్యోతి పూలే పాఠశాల ఉత్తమ ఫలితాలు

 జగిత్యాల జిల్లాలో మహాత్మా జ్యోతి పూలే పాఠశాల ఉత్తమ ఫలితాలు గొల్లపల్లి ఎప్రిల్ 30 (ప్రజా మంటలు):  పదవ తరగతి విడుదలైన ఎస్సెస్సి ఫలితాలలో మహాత్మా జ్యోతిబా ఫూలే పాఠశాలలకు అత్యుత్తమ ఫలితాలు జగిత్యాల జిల్లాలో ఉన్న మొత్తం 6 మహాత్మా జ్యోతిబా ఫూలే పాఠశాలల నుండి 378 విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. అందరూ ఉత్తీర్ణత సాధించి 100% ఉత్తీర్ణత శాతం సాధించడం విశేషం.ఈ సంవత్సరం అత్యధిక...
Read More...