పహాల్గమ్ " ఉగ్రదాడి తీవ్ర విచారకరం *తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం గాంధీ యూనిట్ అధ్యక్షులు డాక్టర్ భూపేందర్ రాథోడ్
సికింద్రాబాద్ ఏప్రిల్ 28 ( ప్రజామంటలు):
జమ్మూ కాశ్మీర్ లోని "పహాల్గం" లో జరిగిన ఉగ్రదాడిని తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం గాంధీ విభాగం, జుడా, టి .యన్.జి .ఓ నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ తీవ్రంగా ఖండించారు. దాడిలో మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.అనంతరం ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ భూపేందర్ రాథోడ్ మాట్లాడుతూ అభం శుభం తెలియని, విదేశీయులు, పర్యాటకులు మరణించడం దురదృష్టకరమని,భారత ప్రభుత్వం తక్షణమే దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం గాంధీ యూనిట్ అధ్యక్షులు డాక్టర్ భూపేందర్ రాథోడ్ భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అనంతరం గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజ్ కుమారి, ప్రిన్సిపాల్ కత్తుల ఇందిర , డాక్టర్ శేషాద్రి, డాక్టర్ సునీల్ తదితరులు మాట్లాడారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం గాంధీ యూనిట్ ప్రతినిధులు డాక్టర్ అబ్బయ్య, డాక్టర్ మురళిధర్,డాక్టర్ రవి, డాక్టర్ కళ్యాణ్, డాక్టర్ మదన్, డాక్టర్ సుబోధ్, డాక్టర్ రాజేష్ , డాక్టర్ వెంకట మణి, డాక్టర్ ఉపేందర్, డాక్టర్ రజని వివిధ శాఖల అధికారులు, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ రవి శేఖర్, డాక్టర్ వసంత్, డాక్టర్ కృష్ణ నాయక్, డాక్టర్ మురళీ కృష్ణ, డాక్టర్ సుధీర్, డాక్టర్ సందీప్ కుమార్ , డాక్టర్ బ్రహ్మేశ్వర, డాక్టర్ అనిల్, డాక్టర్ నాజిం, డాక్టర్ మీనాక్షి, డాక్టర్ సరిత, డాక్టర్ నవీన్, జూడ ప్రతినిధులు డాక్టర్ అజయ్, నర్సింగ్ ఆఫీసర్ ల సంఘం వైద్యులు నాయకులు, ప్రభుత్వ నర్సింగ్ కళాశాల విద్యార్థి విభాగం,వైద్య విద్యార్ధులు , వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఘనంగా శ్రీసాయి సప్తాహం ముగింపువేడుకలు

మృతుల కుటుంబాలను పరామర్శించిన మాజీ శాసనసభ్యులు అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి

నేడు అధికారభాష హిందీ గోల్డెన్ జూబ్లీ వేడుకలు

కిమ్స్-సన్షైన్ హాస్పిటల్స్, బేగంపేటలో కేవలం 3 నెలల్లో 50 రోబోటిక్ సర్జరీలు

ఉద్యోగులు సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ పాల్గొనాలి

ఆరోగ్యవంతులైన బాలికలే దేశ భవిత

మీ హామీలపై చర్చిద్దాం రండి - సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సవాల్

కొండగట్టు 30.వ.గిరిప్రదక్షిణ ఆదివారం మద్యం, మాంసం మానేద్దాం'

కేజీవీలతో ట్రాక్టర్లు తారు రోడ్డుపై తిరిగితే కేసులు నమోదు - ఎస్ఐ, కృష్ణ సాగర్ రెడ్డి

బాల్య వివాహాల నిర్మూలనపై అవగాహన కార్యక్రమం

షిరిడి సాయి మందిరంలో ఘనంగా గురు పూర్ణిమ వేడుకలు

జగిత్యాల జిల్లా జర్నలిస్ట్ సంఘ్ అధ్యక్షునిగా చీటీ శ్రీనివాస్ రావు
