ఎవరిది గ్రంథాలయ చైర్మన్ పీఠం"?
"
జగిత్యాల జిల్లా గ్రంధాలయం చైర్మన్ పదవి ఎవరికో అని జగిత్యాల ప్రజలు గుస గుస లాడుతున్నారు. మాజీ మంత్రి జీవన్ రెడ్డి పీసీసీ కార్యదర్శి బండ శంకర్ పేరు సిపారసు చేయగా, ఇటీవలే కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సైతం తన వర్గం నుండి పీసీసీ సభ్యులు గిరి. నాగ భూషణం పేరు సిపారసు చేసినట్టు వినికిడి. ధర్మ పురి నుండి విప్ అడ్లూరి. లక్ష్మన్ కుమార్ అనుచరుడు సంగనబట్ల. దినేష్ సైతం చైర్మన్ పదవి కోసం గట్టిగానే ప్రయత్నం చేస్తున్నట్లు కార్యకర్తలు, ప్రజలు బహిరంగమూగనే అనుకుంటున్నారు.
వీరందరి మధ్యలో మాజీ ఎన్ ఎస్ యు ఐ నాయకుడు, ప్రస్తుత పీసీసీ సేవాదళ్ కార్యదర్శి బీసీ సామాజిక వర్గానికి చెందిన
బోగోజీ. ముకేశ్ ఖన్నా సైతం గ్రంధాలయ చైర్మన్ పధవి కోసం గట్టిగానే ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. ఈ మధ్య నే సీఎం రేవంత్ రెడ్డి ని,పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్,
మాజీ ఎన్ ఎస్ యు ఐ అధ్యక్షులు బల్మూరి. వెంకట్ ని కలిసి అధిష్టానం దృష్టిలో తాను సైతం చైర్మన్ రేసు లో ఉన్నట్టు చెప్పకనే చెప్పినట్టు సమాచారం. 2007 నుండి ఎన్ ఎస్యూ ఐ లో జాతీయ, రాష్ట్ర స్థాయిలో విద్యార్థి ఉద్యమం లో పాల్గొని ఎన్నో కేసులు సైతం ఎదుర్కొని, అప్పటి టీ ఆర్ ఎస్ ప్రభుత్వం మీద పోరాటం చేసి జైలుకు వెళ్లి కొట్లాడిన నాయకుడి గా మంచి గుర్తింపు సైతం ఉండటంతో ముకేశ్ ఖన్నా పేరు కూడా పరిశీలనలో ఉన్నట్టు సమాచారం.
ఏది ఏమైనా చివరకు జీవన్ రెడ్డి ఆశీస్సులు ఎవరికీ ఉంటాయో వారికా ?ప్రస్తుతం ఎమ్మెల్యే గా కాంగ్రెస్ లో కొనసాగుతున్న డా సంజయ్ కుమార్ వర్గీయునకా ? అన్న చర్చ కొనసాగుతున్నది. అంతే కాకుండా ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ కు అన్నిటాతానై ఉన్న సంగనభట్ల దినేష్ కు అవకాశం లేక పోలేదని చర్చలు కొనసాగుతున్నాయి.
ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలోకి ప్రవేశించిన దరిమిలా ఆయనతోనే ఉంటూ పలు కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్న గిరినాగ భూషణంకు పార్టీలకు అతీతంగా గతంలో ఆయన మున్సిపల్ చైర్మన్గా వ్యవహరించిన తీరు అంతేగాక సౌమ్యుడుగా మంచి పేరు ఉన్న గిరి నాగభూషణం గ్రంథాలయ చైర్మన్ పదవికి ప్రత్యక్షంగా ఆయన ప్రయత్నాలు చేయనప్పటికీ ఎమ్మెల్యే సంజయ్ దృష్టిలో మొదటి నుండి గిరి నాగభూషణంకు అవకాశం కల్పించాలన్న ఆలోచన ఉన్నట్లు పలువురు చర్చించుకుంటున్నారు.
ఇకపోతే యువజన కాంగ్రెస్ లో ఎన్నో సంవత్సరాలుగా జీవన్ రెడ్డికి నిరంతరం అందుబాటులో ఉంటూ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న బండ శంకర్ కు సైతం అవకాశాలు ఉంటాయని కాంగ్రెస్ శ్రేణుల్లోనే చర్చ కొనసాగుతుంది.
గ్రంథాలయ చైర్మన్ పదవి ఇప్పించుకొని తమ ఆధిపత్యం చూపించుకొని పై చేయి నిరూపించుకునే ప్రయత్నములో చైర్మెన్ పదవి నియామకం డోలాయ మానం లో పడింది. జగిత్యాల గ్రంధాలయ చైర్మన్ పదవి ఎవరిని వరిస్తుందని గాంధీ భవన్ వర్గాల మాటగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు గుస గుస లాడుతున్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
బృందావనం ఫ్యామిలీ రిసార్ట్లో ఘనంగా లలితా సహస్రనామ పారాయణం
కొండగట్టు ఆగస్టు 16 (ప్రజా మంటలు)మల్యాల మండలం కొండగట్టు బృందావనం ఫ్యామిలీ రిసార్ట్ లో ఆదివారం శ్రావణమాసం పర్వదినాన్ని పురస్కరించుకొని ఇంటింటా లలిత పారాయణ కార్యక్రమం నిర్వహించారు.
కార్యక్రమంలో భాగంగా కలశ గణాధిపతి గౌరీ పూజ తొలతగా నిర్వహించి అమ్మవారి విగ్రహానికి పల రసాలు పంచామృతాలతో అభిషేకం చేసి వివిధ రకాలైన పుష్పాలతో అమ్మవారిని... 22-ఏ జాబితాలోని భూముల హక్కుదారులు ఆందోళన చెందొద్దు: సీఎం రేవంత్రెడ్డి
హైదరాబాద్, ఆగస్టు 15 (ప్రజా మంటలు): నిషేధిత జాబితా (22-ఏ)లో చేరిన భూముల హక్కుదారులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి ఎ. రేవంత్రెడ్డి భరోసా ఇచ్చారు. కోర్టు వివాదాల్లో ఉన్న భూములను మినహాయించి, మిగిలిన భూములకు సర్వే నంబర్లకు బై-నంబర్లు కేటాయించి హక్కుదారుల సమస్యలను పరిష్కరిస్తామని స్పష్టం చేశారు.
హైదరాబాద్లోని కూకట్పల్లి కేపీహెచ్బీ... ఘనంగా చిలుకమర్రి పరాంకుశాచార్య సంస్మరణ వేడుక
రాయికల్ ఆగస్టు 15 (ప్రజా మంటలు)రాయికల్ శ్రీ సరస్వతి శిశు మందిర్ లో చిలుకమర్రి పరాంకుశాచార్య సంస్మరణ సమావేశం జరిగింది, ఈ కార్యక్రమంలో పరాంకుశ ఆచార్య తనయుడు అడ్వకేట్ మదన్మోహన్ రాయికల్ సరస్వతి శిశు మందిర్ పునర్నిర్మాణానికి తన వంతు విరాళంగా రూ. 1,11,111/- భవన నిర్మాణ కమిటీకి అందజేయడం జరిగింది.
ఈ సందర్భంగా... హరిహరాలయంలో మాతలచే శ్రీ లలిత సహస్రనామ పారాయణం ఉంజల్ సేవ
జగిత్యాల ఆగస్టు 14లోక కళ్యాణార్థం పట్టణంలోని బ్రాహ్మణ వీధి హరిహరాలయంలో పవిత్ర శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని శ్రీ లలితా సహస్రనామ సామూహిక పారాయణం ఊంజల్ సేవా కార్యక్రమం నిర్వహించారు.
అంతకుముందు గణపతి గౌరీ దేవతల పంచామృత అభిషేకము నిర్వహించి శ్రీ లలిత అమ్మవారి విగ్రహానికి పంచామృతాలతో షోడశ ఉపచార పూజలు నిర్వహించారు. శ్రీ సూక్త... పెన్షన్లకు దరఖాస్తులు తీసుకోవడమే తప్ప పెన్షన్లు ఇవ్వడం లేదు తొలి జడ్పీ చైర్పర్సన్ దావా వసంత
జగిత్యాల ఆగస్టు 14 (ప్రజా మంటలు)రేవంత్ రెడ్డి ప్రభుత్వం పెన్షన్లకు పలుమార్లు దరఖాస్తులు తీసుకోవడమే తప్ప ఇవ్వడం లేదని ఆరోపించారు జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావా వసంత శుక్రవారం సారంగాపూర్ మండల కేంద్రంలో బి ఆర్ఎస్ నాయకులతో కలిసి విలేకరులతో ఆమె మాట్లాడారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాల పూర్తయిందని... ఎన్నికల ప్రణాళికలో గీత కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి
జగిత్యాల ఆగస్టు 14 (ప్రజా మంటలు) కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికలో గీతా కార్మికులకు ఇచ్చిన హామీల అమలు చేయాలని రాష్ట్ర కల్లుగీత కార్మిక సంఘం నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం జిల్లా కేంద్రానికి అమరుల యాదిలో గీతన్నల చైతన్య బస్సుయాత్ర చేరుకుంది. జగిత్యాల జిల్లా గౌడ సంఘం అధ్యక్షులు డాక్టర్ చంద్రశేఖర్ గౌడ్ బస్సు... పవిత్రమైన శ్రావణమాసాన్ని పురస్కరించుకొని పరమశివునికి పంచామృత అభిషేకాలు
జగిత్యాల ఆగస్ట్ 13( ప్రజా మంటలు)పవిత్రమైన శ్రావణమాసాన్ని పురస్కరించుకొని పరమశివుని మూల విగ్రహానికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని బ్రాహ్మణ వీధి హరిహరాలయంలో ప్రతి ఏటా లాగే శ్రావణమాసం సందర్భంగా ఆలయాన్ని సంప్రదాయపద్ధంగా సర్వాంగ సుందరంగా అలంకరించారు.
తొలుతగా గణపతి ఉపనిషత్తులతో గణపతి పూజ, అనంతరం నారాయణ ఉపనిషత్తులతో శ్రీ సీతారామచంద్రుల పరివార... వెల్గటూర్లో 80 మంది లబ్ధిదారులకు రూ.25.56 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులు
వెల్గటూర్, ఆగస్టు 13 (ప్రజా మంటలు):
వెల్గటూర్ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో గురువారం ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్ఎఫ్) చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొని 80 మంది లబ్ధిదారులకు రూ.25.56 లక్షల విలువైన చెక్కులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అనారోగ్యం,... హిందూ–ముస్లింలు నాకు రెండు కళ్లలాంటి వారు: సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్, ఆగస్టు 13:
హిందూ–ముస్లింల మధ్య తనకు ఎలాంటి వ్యత్యాసం లేదని, ఇరువర్గాలు తనకు రెండు కళ్లలాంటి వారని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, ప్రభుత్వ ఉద్యోగాల్లో నియమితులైన యువత తెలంగాణ రైజింగ్ కోసం పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.
హైదరాబాద్ బంజారాహిల్స్లోని కొమురం భీమ్... బీర్ పూర్ లో ఎసిబి దాడులు - రెడ్ హ్యాండెడ్ గా చిక్కిన గిర్ధావర్
బీర్ పూర్ / జగిత్యాల జిల్లా ప్రతినిధి, ప్రజా మంటలు, ఆగస్ట్ 13:
జగిత్యాల జిల్లా బీర్ పూర్ మండల రెవెన్యూ కార్యాలయంలో గురువారం అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు నిర్వహించారు.లంచం తీసుకుంటున్న రెవెన్యూ శాఖ గిర్ధావర్ రాహుల్ ను రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు.
బాధితురాలికి సంబంధించిన 12 గుంటల భూమిని సాదాబైనామా ద్వారా... కరీంనగర్ డైరీ లో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
జగిత్యాల ఆగస్టు 13 : ప్రతినిధి, ప్రజా మంటలు,
జగిత్యాల పట్టణంలోనీ కరీంనగర్ డైరీ లో ఫుడ్ సేఫ్టీ అధికారులు గురు వారం తనిఖీలు చేశారు. 600 ఐస్ క్రీములు ఏప్రిల్ మాసంలోని తేదీ తయారీ ఉండగా ఫ్రీజర్ సరిగా పనిచేయక ఐస్ క్రీములు ఫంగస్ తో పాటు మెల్ట్ కావటంతో డైరీ నిర్వాహకులను ప్రశ్నించారు.... అర్హులైన ప్రతి ఒక్కరికీ నూతన పెన్షన్లు - మంత్రి అద్లూరి
జగిత్యాల, ఆగస్టు 13 (ప్రజా మంటలు):
అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ నూతన పెన్షన్లు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. నూతన రేషన్ కార్డులు, నూతన పెన్షన్లపై గురువారం జగిత్యాల కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్... 