ఎవరిది గ్రంథాలయ చైర్మన్ పీఠం"?
"
జగిత్యాల జిల్లా గ్రంధాలయం చైర్మన్ పదవి ఎవరికో అని జగిత్యాల ప్రజలు గుస గుస లాడుతున్నారు. మాజీ మంత్రి జీవన్ రెడ్డి పీసీసీ కార్యదర్శి బండ శంకర్ పేరు సిపారసు చేయగా, ఇటీవలే కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సైతం తన వర్గం నుండి పీసీసీ సభ్యులు గిరి. నాగ భూషణం పేరు సిపారసు చేసినట్టు వినికిడి. ధర్మ పురి నుండి విప్ అడ్లూరి. లక్ష్మన్ కుమార్ అనుచరుడు సంగనబట్ల. దినేష్ సైతం చైర్మన్ పదవి కోసం గట్టిగానే ప్రయత్నం చేస్తున్నట్లు కార్యకర్తలు, ప్రజలు బహిరంగమూగనే అనుకుంటున్నారు.
వీరందరి మధ్యలో మాజీ ఎన్ ఎస్ యు ఐ నాయకుడు, ప్రస్తుత పీసీసీ సేవాదళ్ కార్యదర్శి బీసీ సామాజిక వర్గానికి చెందిన
బోగోజీ. ముకేశ్ ఖన్నా సైతం గ్రంధాలయ చైర్మన్ పధవి కోసం గట్టిగానే ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. ఈ మధ్య నే సీఎం రేవంత్ రెడ్డి ని,పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్,
మాజీ ఎన్ ఎస్ యు ఐ అధ్యక్షులు బల్మూరి. వెంకట్ ని కలిసి అధిష్టానం దృష్టిలో తాను సైతం చైర్మన్ రేసు లో ఉన్నట్టు చెప్పకనే చెప్పినట్టు సమాచారం. 2007 నుండి ఎన్ ఎస్యూ ఐ లో జాతీయ, రాష్ట్ర స్థాయిలో విద్యార్థి ఉద్యమం లో పాల్గొని ఎన్నో కేసులు సైతం ఎదుర్కొని, అప్పటి టీ ఆర్ ఎస్ ప్రభుత్వం మీద పోరాటం చేసి జైలుకు వెళ్లి కొట్లాడిన నాయకుడి గా మంచి గుర్తింపు సైతం ఉండటంతో ముకేశ్ ఖన్నా పేరు కూడా పరిశీలనలో ఉన్నట్టు సమాచారం.
ఏది ఏమైనా చివరకు జీవన్ రెడ్డి ఆశీస్సులు ఎవరికీ ఉంటాయో వారికా ?ప్రస్తుతం ఎమ్మెల్యే గా కాంగ్రెస్ లో కొనసాగుతున్న డా సంజయ్ కుమార్ వర్గీయునకా ? అన్న చర్చ కొనసాగుతున్నది. అంతే కాకుండా ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ కు అన్నిటాతానై ఉన్న సంగనభట్ల దినేష్ కు అవకాశం లేక పోలేదని చర్చలు కొనసాగుతున్నాయి.
ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలోకి ప్రవేశించిన దరిమిలా ఆయనతోనే ఉంటూ పలు కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్న గిరినాగ భూషణంకు పార్టీలకు అతీతంగా గతంలో ఆయన మున్సిపల్ చైర్మన్గా వ్యవహరించిన తీరు అంతేగాక సౌమ్యుడుగా మంచి పేరు ఉన్న గిరి నాగభూషణం గ్రంథాలయ చైర్మన్ పదవికి ప్రత్యక్షంగా ఆయన ప్రయత్నాలు చేయనప్పటికీ ఎమ్మెల్యే సంజయ్ దృష్టిలో మొదటి నుండి గిరి నాగభూషణంకు అవకాశం కల్పించాలన్న ఆలోచన ఉన్నట్లు పలువురు చర్చించుకుంటున్నారు.
ఇకపోతే యువజన కాంగ్రెస్ లో ఎన్నో సంవత్సరాలుగా జీవన్ రెడ్డికి నిరంతరం అందుబాటులో ఉంటూ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న బండ శంకర్ కు సైతం అవకాశాలు ఉంటాయని కాంగ్రెస్ శ్రేణుల్లోనే చర్చ కొనసాగుతుంది.
గ్రంథాలయ చైర్మన్ పదవి ఇప్పించుకొని తమ ఆధిపత్యం చూపించుకొని పై చేయి నిరూపించుకునే ప్రయత్నములో చైర్మెన్ పదవి నియామకం డోలాయ మానం లో పడింది. జగిత్యాల గ్రంధాలయ చైర్మన్ పదవి ఎవరిని వరిస్తుందని గాంధీ భవన్ వర్గాల మాటగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు గుస గుస లాడుతున్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
మెట్టుగూడలో కాంగ్రెస్ మహా పాదయాత్ర ; GHMC ఎన్నికల్లో గెలుపే లక్ష్యం
సికింద్రాబాద్, జనవరి 11 (ప్రజా మంటలు):
సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలోని మెట్టుగూడ డివిజన్లో ఆదివారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహా పాదయాత్ర నిర్వహించారు. నియోజకవర్గ ఇంచార్జ్, కాంగ్రెస్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే అదం సంతోష్ కుమార్ నాయకత్వంలో జరిగిన ఈ పాదయాత్ర GHMC ఎన్నికల్లో విజయం లక్ష్యంగా సాగింది.
పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపడం, ప్రభుత్వ పథకాలను... సూరారం ఆటో యూనియన్ నూతన కమిటీ ఎన్నిక
ఎల్కతుర్తి డిసెంబర్ 11 ప్రజా మంటలు
ఎల్కతుర్తి మండలంలోని సూరారం గ్రామంలో ఆటో యూనియన్ నూతన కమిటీని కమిటీని ఆదివారం అధికారికంగా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా యూనియన్ సభ్యులు ఎల్కతుర్తి సర్కిల్ ఇన్స్పెక్టర్ పులి రమేష్ ఎల్కతుర్తి స్టేషన్ ఎస్ ఐ అక్కినేపల్లి ప్రవీణ్ కుమార్లను మర్యాదపూర్వకంగా కలిసి అభివాదం చేశారు.ఈ సమావేశంలో... నేరెళ్ల గ్రామంలో యువకుని ఆదృశ్యం
గొల్లపల్లి జనవరి 11 (ప్రజా మంటలు ):
ధర్మపురి మండలం నేరెళ్ల గ్రామానికి చెందిన మంద నరేష్ (35) నేరెళ్లలో కుటుంబంతో సోమవారం మధ్యాహ్నం భార్యతో కిరాణా షాపుకు వెళ్తున్నాను అని చెప్పి ఇంటి నుండి వెళ్ళి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు చుట్టుపక్కల ఎంత వెతికినా ఆచూకీ లభించకపోవడంతో తల్లి మంద శంకరమ్మ నిజాంపేట్ ఫేజ్–3లో సంక్రాంతి కానుకల పంపిణీ
సికింద్రాబాద్, జనవరి 11 (ప్రజా మంటలు):
మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ గారు నిజాంపేట్ ఫేజ్–3లో నిర్వహించిన సంక్రాంతి కానుకల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని మహిళలకు చీరలను అందజేశారు. ఈ కార్యక్రమాన్ని పద్మ ప్రసాద్ ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు సమన్వయంతో నిర్వహించారు.ఈ సందర్భంగా నిజాంపేట్ బీజేపీ అధ్యక్షులు ఎం. బిక్షపతి యాదవ్, ఓబీసీ నిజాంపేట్... హైదరాబాద్లో స్కై ఫౌండేషన్ 292వ అన్నదాన కార్యక్రమం
సికింద్రాబాద్, జనవరి 11 (ప్రజా మంటలు):
స్కై ఫౌండేషన్ ఆధ్వర్యంలో నగరంలో రోడ్ల పక్కన జీవనం సాగిస్తున్న అనాథలు, నిరాశ్రయులు, నిరుపేదలకు 292వ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. వాహనంలో నగరమంతా సంచరిస్తూ ఆకలితో ఉన్నవారిని గుర్తించి ఒక్కపూట భోజనం అందించారు.ఈ కార్యక్రమంలో ఫౌండర్ & ప్రెసిడెంట్ డా. వై. సంజీవ కుమార్, వైస్ ప్రెసిడెంట్... మేడిబావిలో ఆర్యసమాజ్ రంగవల్లిక పోటీలు
సికింద్రాబాద్, జనవరి 11 (ప్రజా మంటలు):
మేడిబావి ఆర్యసమాజ్ ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహించిన రంగవల్లిక పోటీలకు 50కిపైగా మంది పాల్గొన్నారు. విజేతలకు బహుమతులు అందజేశారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఆర్యసమాజ్ ప్రెసిడెంట్ ఎం.ఆర్. రవీందర్ మాట్లాడుతూ పండుగలు మన సంస్కృతికి ప్రతీకలని, ప్రతి ఒక్కరూ సంక్రాంతి పండుగను ఆనందంగా జరుపుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్యసమాజ్ సభ్యులు... బతికుండగానే సమాధి నిర్మించుకున్న నక్క ఇంద్రయ్య మృతి – సంతాపం
జగిత్యాల, జనవరి 11 (ప్రజా మంటలు):
జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన సీనియర్ సిటిజన్, జగిత్యాల రూరల్ మండల సీనియర్ సిటిజెన్స్ అధ్యక్షుడు నక్క ఇంద్రయ్య శనివారం రాత్రి మృతి చెందారు. ఆయన బతికుండగానే స్వయంగా నిర్మించుకున్న సమాధిలోనే ఆదివారం ఆయన భౌతిక కాయాన్ని భూస్థాపితం చేశారు. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని... తొలగించిన IAS పూజా ఖేడ్కర్ తల్లిదండ్రులు సహా ఐదుగురు అచేతనం
పుణే, జనవరి 11:పదవి నుంచి తొలగించబడిన IAS ట్రైనీ అధికారి పూజా ఖేడ్కర్ తల్లిదండ్రులు సహా మరో ముగ్గురు పుణేలోని వారి బంగ్లాలో అచేతన స్థితిలో కనిపించడం కలకలం రేపింది. బానెర్–ఆంధ్ ప్రాంతంలోని నివాసంలో జరిగిన ఈ ఘటనలో నిద్ర మందులు కలిపి వారిని అచేతనం చేసి దొంగతనం చేసినట్లు అనుమానం వ్యక్తమవుతోంది.
సమాచారం... ఇరాన్ లో ఇంటర్నెట్ సేవలు బంద్: ప్రపంచంతో తెగిన సంబంధాలు
టెహ్రాన్ జనవరి 11:
నిరసనలు తీవ్రమవుతున్న తరుణంలో, ఇరాన్ ప్రపంచంతో సంబంధాలను తెంచుకుంది.ఆర్థిక వ్యవస్థపై నిరసనలు వ్యాపిస్తున్న నేపథ్యంలో ఇరాన్లో ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి.
ఇరాన్లో ఆర్థిక సంక్షోభం కారణంగా ప్రారంభమైన నిరసనలు నేషన్లవైడ్ స్థాయిలో విస్తరుతూ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులను సృష్టిస్తున్నాయి. ప్రభుత్వం ఇంటర్నెట్, టెలిఫోన్ నెట్వర్క్లను పూర్తిగా నిలిపివేయడం వంటి చర్యలు... వడ్డే ఓబన్న జయంతి కార్యక్రమాల్లో మాజీ మంత్రి జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్
జగిత్యాల, జనవరి 11 (ప్రజా మంటలు):
జగిత్యాల జిల్లా కేంద్రంలో వడ్డే ఓబన్న జయంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమాల్లో మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి, జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ వేర్వేరు ప్రాంతాల్లో పాల్గొన్నారు.
గోవింద్పల్లె సమీపంలో నిర్వహించిన జయంతి ఉత్సవాల్లో మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ, వడ్డే... మంత్రి వాకిటి శ్రీహరి తో ముదిరాజ్ నేత భేటి
సికింద్రాబాద్, జనవరి 11 (ప్రజా మంటలు):
తెలంగాణ రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి ముదిరాజ్ ను ఆదివారం జాతీయ ముదిరాజ్ సమాజ్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ పొట్లకాయల వెంకటేశ్వర్లు మర్యాదపూర్వకంగా కలిశారు. దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న ముదిరాజ్ రిజర్వేషన్ల అంశాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని మంత్రి కి విజ్ఞప్తి చేశారు. అలాగే మంత్రి... జగిత్యాల మున్నూరు కాపు వర్తక–వ్యాపార సంఘం 2026 క్యాలెండర్ ఆవిష్కరణ
వేములవాడ, జనవరి 11 (ప్రజా మంటలు):
జగిత్యాల మున్నూరు కాపు వర్తక–వ్యాపార సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన 2026 సంవత్సర క్యాలెండర్ను వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ శ్రీ ఆది శ్రీనివాస్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ మున్నూరు కాపు కులబాంధవులందరికీ నూతన సంవత్సరం, సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. సంఘం అభివృద్ధికి... 