ఎవరిది గ్రంథాలయ చైర్మన్ పీఠం"?

On
ఎవరిది గ్రంథాలయ చైర్మన్ పీఠం

"

జగిత్యాల  జిల్లా గ్రంధాలయం చైర్మన్ పదవి ఎవరికో అని జగిత్యాల ప్రజలు గుస గుస లాడుతున్నారు. మాజీ మంత్రి జీవన్ రెడ్డి పీసీసీ కార్యదర్శి బండ శంకర్ పేరు సిపారసు చేయగా, ఇటీవలే కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సైతం తన వర్గం నుండి పీసీసీ సభ్యులు గిరి. నాగ భూషణం పేరు సిపారసు చేసినట్టు వినికిడి. ధర్మ పురి నుండి విప్ అడ్లూరి. లక్ష్మన్ కుమార్ అనుచరుడు సంగనబట్ల. దినేష్ సైతం చైర్మన్ పదవి కోసం గట్టిగానే ప్రయత్నం చేస్తున్నట్లు కార్యకర్తలు, ప్రజలు బహిరంగమూగనే అనుకుంటున్నారు.

వీరందరి మధ్యలో మాజీ  ఎన్ ఎస్ యు ఐ నాయకుడు, ప్రస్తుత పీసీసీ సేవాదళ్ కార్యదర్శి బీసీ సామాజిక వర్గానికి చెందిన 
బోగోజీ. ముకేశ్ ఖన్నా సైతం గ్రంధాలయ చైర్మన్ పధవి కోసం గట్టిగానే ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. ఈ మధ్య నే   సీఎం రేవంత్ రెడ్డి ని,పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్,
మాజీ ఎన్ ఎస్ యు ఐ అధ్యక్షులు బల్మూరి. వెంకట్ ని కలిసి అధిష్టానం దృష్టిలో తాను సైతం చైర్మన్ రేసు లో ఉన్నట్టు చెప్పకనే చెప్పినట్టు సమాచారం. 2007 నుండి   ఎన్ ఎస్యూ ఐ లో జాతీయ, రాష్ట్ర స్థాయిలో విద్యార్థి ఉద్యమం లో పాల్గొని ఎన్నో కేసులు సైతం ఎదుర్కొని,  అప్పటి టీ ఆర్ ఎస్ ప్రభుత్వం మీద పోరాటం చేసి జైలుకు వెళ్లి కొట్లాడిన నాయకుడి గా మంచి గుర్తింపు సైతం ఉండటంతో ముకేశ్ ఖన్నా పేరు కూడా పరిశీలనలో ఉన్నట్టు సమాచారం.

ఏది ఏమైనా చివరకు జీవన్ రెడ్డి ఆశీస్సులు ఎవరికీ ఉంటాయో వారికా ?ప్రస్తుతం ఎమ్మెల్యే గా  కాంగ్రెస్ లో కొనసాగుతున్న డా సంజయ్ కుమార్ వర్గీయునకా ? అన్న చర్చ కొనసాగుతున్నది. అంతే కాకుండా   ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ కు అన్నిటాతానై ఉన్న సంగనభట్ల దినేష్ కు అవకాశం లేక పోలేదని చర్చలు కొనసాగుతున్నాయి. 
ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలోకి ప్రవేశించిన దరిమిలా ఆయనతోనే ఉంటూ పలు కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్న గిరినాగ భూషణంకు పార్టీలకు అతీతంగా గతంలో ఆయన మున్సిపల్ చైర్మన్గా వ్యవహరించిన తీరు అంతేగాక సౌమ్యుడుగా మంచి పేరు ఉన్న గిరి నాగభూషణం గ్రంథాలయ చైర్మన్ పదవికి ప్రత్యక్షంగా ఆయన ప్రయత్నాలు చేయనప్పటికీ ఎమ్మెల్యే సంజయ్ దృష్టిలో మొదటి నుండి గిరి నాగభూషణంకు అవకాశం కల్పించాలన్న ఆలోచన ఉన్నట్లు పలువురు చర్చించుకుంటున్నారు.
ఇకపోతే యువజన కాంగ్రెస్ లో ఎన్నో సంవత్సరాలుగా జీవన్ రెడ్డికి నిరంతరం అందుబాటులో ఉంటూ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న బండ శంకర్ కు సైతం అవకాశాలు ఉంటాయని కాంగ్రెస్ శ్రేణుల్లోనే చర్చ కొనసాగుతుంది.

గ్రంథాలయ చైర్మన్ పదవి ఇప్పించుకొని తమ ఆధిపత్యం చూపించుకొని పై చేయి   నిరూపించుకునే ప్రయత్నములో చైర్మెన్ పదవి నియామకం డోలాయ మానం లో పడింది. జగిత్యాల గ్రంధాలయ చైర్మన్ పదవి ఎవరిని వరిస్తుందని గాంధీ భవన్ వర్గాల మాటగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు గుస గుస లాడుతున్నారు.

Tags
Join WhatsApp

More News...

Local News 

హనుమాన్ చాలీసా భక్త బృందం వారిచే విద్యార్థులకు పురస్కారాల ప్రధానం

హనుమాన్ చాలీసా భక్త బృందం వారిచే విద్యార్థులకు పురస్కారాల ప్రధానం జగిత్యాల జూన్ 7(ప్రజా మంటలు)జిల్లా కేంద్రంలోని బ్రాహ్మణ వీధి హరిహరాలయంలో గత తొమ్మిది సంవత్సరాలుగా హనుమాన్ చాలీసా భక్త బృందం వారిచే సామూహిక పారాయణం నిర్వహించబడుచున్నది. కాగా ఈ సంవత్సరము నుండి నూతనంగా ఎస్  ఎస్ఎస్సి ,ఇంటర్మీడియట్, డిగ్రీ నందు 90% పైబడి మార్కులు సాధించిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేయడానికి శ్రీకారం చుట్టారు....
Read More...
Crime  State News 

₹80 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్

₹80 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ జగిత్యాల, జూన్ 04 (ప్రజా మంటలు): జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలోని అటవీశాఖ కార్యాలయంలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ మొయినుద్దీన్ ₹80 వేల లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఏసీబీ డీఎస్పీ విజయ్ కుమార్ నేతృత్వంలో గురువారం ఈ దాడి నిర్వహించారు....
Read More...
Local News  Crime  State News 

నందికొండ మున్సిపల్ అధికారుల తీరుపై టీఆర్ఎస్ ఆగ్రహం

నందికొండ మున్సిపల్ అధికారుల తీరుపై టీఆర్ఎస్ ఆగ్రహం నాగార్జునసాగర్, జూన్ 4 (ప్రజా మంటలు): నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని నందికొండ మున్సిపల్ అధికారులు పైలాన్ క్రాస్‌రోడ్డు వద్ద ఉన్న తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) జెండా గద్దెను కూల్చివేయడంపై ఆ పార్టీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇతర పార్టీల జెండా గద్దెలను వదిలి టీఆర్ఎస్ గద్దెను మాత్రమే తొలగించడం వివక్షపూరిత చర్య అని...
Read More...
Local News 

కన్నాపూర్ లో కాలిన ఈత - తాటి వనం సందర్శించిన మాజీ జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్

కన్నాపూర్ లో కాలిన ఈత - తాటి వనం  సందర్శించిన మాజీ జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్    జగిత్యాల  జూన్2- ( ప్రజా మంటలు)జగిత్యాల రూరల్ మండలం కన్నాపూర్ గ్రామంలో గత 5 రోజుల క్రితం ప్రమాదవశాత్తు కాలిపోయిన 500 ఈత - తాటి చెట్లను  జిల్లా తొలి జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్ మంగళ వారం పరిశీలించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ...కన్నాపూర్ గ్రామంలోని దాదాపు 27...
Read More...
Local News 

మల్యాల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రవేశాల పెంపు కోసం ప్రచారo 

మల్యాల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రవేశాల పెంపు కోసం ప్రచారo  మల్యాల జూన్ 2 (ప్రజా మంటలు) ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ప్రవేశాలను పెంచడం మరియు ప్రైవేట్, కార్పొరేట్ కళాశాలలతో పోటీని ఎదుర్కొనే దృష్టితో, మల్యాల ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ఎం శివరామకృష్ణ మరియు అధ్యాపకులు ఇంటింటికీ ప్రచారం చేపట్టారు. ఈ ప్రచారంలో ఎస్.ఎస్.సి. పాసైన ప్రతి విద్యార్థిని మరియు వారి తల్లిదండ్రులను కలిసి, కళాశాల...
Read More...
Local News 

ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు

ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు   జగిత్యాల జూన్ 2 (ప్రజా మంటలు) జిల్లా కేంద్రంలోని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో మంగళవారం తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా టౌన్ సిఐ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ప్రారంభించి శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్ఐ మల్లేష్ ,ట్రాఫిక్ కానిస్టేబుళ్ళు ,టౌన్ ఎస్సై తదితరులు పాల్గొన్నారు.
Read More...
Local News 

జగిత్యాల పోలీసులకు రాష్ట్ర స్థాయి గౌరవం.. 10 మంది పోలీస్ అధికారులకు సేవా పథకాలు

జగిత్యాల పోలీసులకు రాష్ట్ర స్థాయి గౌరవం.. 10 మంది పోలీస్ అధికారులకు సేవా పథకాలు జగిత్యాల జూన్ 2 (ప్రజా మంటలు)ఎంపికైన అధికారులను అభినందించిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్  తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని   రాష్ట్ర ప్రభుత్వం  ప్రకటించిన ప్రతిష్టాత్మకమైన “సేవా పథకం”లకు ఎంపికైన జగిత్యాల జిల్లా పోలీస్ అధికారులను జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్  అభినందించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ విధి నిర్వహణలో నిబద్ధత,...
Read More...
Local News 

జగిత్యాల జిల్లా గ్రంథాలయ సంస్థలో రాష్ట్రావిర్భావ వేడుకు

జగిత్యాల జిల్లా గ్రంథాలయ సంస్థలో రాష్ట్రావిర్భావ వేడుకు జగిత్యాల జూన్ 02 (ప్రజా మంటలు): తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు సంఘనభట్ల దినేష్  జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.అనంతరం తెలంగాణ ఆవిర్భావం, రాష్ట్ర సాధనలో జరిగిన ఉద్యమాల ప్రాముఖ్యతపై విద్యార్థులకు వివరించారు. కార్యక్రమంలో స్థానిక విద్యార్థిని, విద్యార్థులు...
Read More...
State News 

మానవహక్కుల కమీషన్ లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

మానవహక్కుల కమీషన్ లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు TGHRCలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు | జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమంMeta Description:.SEO Tags:  Telangana, Telangana News, Hyderabad Newsవార్త:హైదరాబాద్, జూన్ 02 (ప్రజా మంటలు):తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ మానవ హక్కుల కమిషన్ (TGHRC) కార్యాలయంలో మంగళవారం వేడుకలు నిర్వహించారు.కమిషన్...
Read More...
Local News 

జర్నలిస్టు సంక్షేమానికి ప్రభుత్వం కృషి :ఎమ్మెల్యే సంజయ్ కుమార్

జర్నలిస్టు సంక్షేమానికి ప్రభుత్వం కృషి :ఎమ్మెల్యే సంజయ్ కుమార్ జగిత్యాల, జూన్ 01 (ప్రజా మంటలు): జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని సంజయ్ కుమార్ పేర్కొన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని విరుపాక్షి గార్డెన్లో నిర్వహించిన ప్రెస్ క్లబ్ జగిత్యాల నూతన కార్యవర్గ పరిచయ, ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడుతూ జర్నలిస్టులు ప్రభుత్వం–ప్రజల...
Read More...
State News 

తెలంగాణ అస్తిత్వ పరిరక్షణ కోసం పోరాటం కొనసాగిస్తాం: కల్వకుంట్ల కవిత

తెలంగాణ అస్తిత్వ పరిరక్షణ కోసం పోరాటం కొనసాగిస్తాం: కల్వకుంట్ల కవిత హైదరాబాద్, జూన్ 1 (ప్రజా మంటలు): తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలు–సాధన రౌండ్ టేబుల్ సమావేశంలో టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత పాల్గొని . తెలంగాణ అస్తిత్వం, హక్కుల పరిరక్షణ కోసం తమ పార్టీ పోరాటం కొనసాగిస్తుందని పేర్కొన్నారు.తెలంగాణ ఉద్యమంలో అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ సభ ప్రారంభించిన కవిత, ఉద్యమకారుల కుటుంబాలకు ఇంకా పూర్తి స్థాయిలో...
Read More...
Local News 

ఆచార్య కలువకుంట రామకృష్ణ కు అఖిల భారత బ్రాహ్మణ ఐక్య వేదిక  వారిచే అవార్డు ప్రదానం 

ఆచార్య కలువకుంట రామకృష్ణ కు అఖిల భారత బ్రాహ్మణ ఐక్య వేదిక  వారిచే అవార్డు ప్రదానం  కరీంనగర్ మే 31(ప్రజా మంటలు)ప్రముఖ సాహితీ వేత్త, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్, ప్రొఫెసర్ కలువకుంట రామ కృష్ణ కు ఆదివారం నెల్లూరు లో జరిగిన అఖిల భారత బ్రాహ్మణ ఐక్య వేదిక, బ్రాహ్మణ ఘోష సభలో  'ఆచార్య కళా ప్రపూర్ణ' పురస్కారాన్నిఅవధానం సాయి కుమార్ , తదితరులు ప్రదానం చేశారు. అఖిల భారత...
Read More...