ఈదురు గాలులు, వర్షాలు కురుస్తున్న సందర్బంగా జగిత్యాల జిల్లా లో ఎలక్ట్రిసిటీ సమస్యలు తెలపడానికి 24 గంటలు పనిచేసే కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు.

On
ఈదురు గాలులు, వర్షాలు కురుస్తున్న సందర్బంగా జగిత్యాల జిల్లా లో ఎలక్ట్రిసిటీ సమస్యలు తెలపడానికి 24 గంటలు పనిచేసే కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు.

(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113). 

 

జగిత్యాల మే 08 (ప్రజా మంటలు). 

ఈదురు గాలులు, వర్షాలు కురుస్తున్న సందర్బంగా జగిత్యాల జిల్లా లో ఎలక్ట్రిసిటీ సమస్యలు తెలపడానికి 24 గంటలు పనిచేసే కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేయబడినవి.

విద్యుత్ సంబంధిత సమస్యలకు & ఫిర్యాదులు తెలియజేయడానికి మొబైల్ నంబర్లను సంప్రదించాలి. 

  • జిల్లా కేంద్రం లోని జగిత్యాల సర్కిల్ కంట్రోల్ రూమ్ --- 7901628366,
  • జగిత్యాల డివిజన్ పరిధిలోని కంట్రోల్ రూమ్ --- 9440811398,
  • మెట్టుపల్లి డివిజన్ పరిధిలోని కంట్రోల్ రూమ్ --- 7901678208,

అలాగే టోల్ ఫ్రీ నెంబరు.1800 4250028 కు లేదా 1912 ఫోన్ చేయగలరని మనవి.

రైతులు, విద్యుత్ వినియోగదారులకు ఈ క్రింది విద్యుత్ ప్రమాదాల నివారణ సూచనలు అనుసరించాలని జి. సత్యనారాయణ - ఎస్.ఈ, టి ఎస్ఎన్ పిడిసి ఎల్, జగిత్యాల విజ్ఞప్తి చేశారు: 

  1. మీ దగ్గరలో కాని, మీ ఇంట్లోగాని తడి చేతులతో విద్యుత్ పరికరాలను మరియు తీగలను ముట్టుకోకండి. ముఖ్యంగా బట్టలు ఆరేసే దండెంలకు విద్యుత్ వైర్లు తాకకుండా చూసుకోండి,
  2. విద్యుత్ ప్రవహిస్తున్న సర్వీస్ వైర్లకు ఎలాంటి అతుకులు లేకుండా చూసుకోండి, ఒక వేళ అలాంటి అతుకుల ఉన్న వైర్లను వెంటనే అనుభవం ఉన్న ఎలక్ట్రీషియన్ తో సరి చేయించండి/ మార్పించండి.
  3. ఆరుబయట విద్యుత్ స్తంభాలను తాకకండి.
  4. వర్షాలు కురుస్తున్నప్పుడు, రైతులు ట్రాన్స్ఫార్మర్ల దగ్గరికి వెళ్లకండి, మీ యొక్క స్టార్టర్ డబ్బాలను నీటిలో తడవకుండా పైకి ఏర్పాటు చేసుకోగలరు.
  5. వోల్టేజ్లో హెచ్చు తగ్గలు ఉన్నా, ట్రాన్స్ఫార్మర్ల వద్ద శబ్దం వస్తున్నా వెంటనే విద్యుత్ శాఖ వారికి తెలియజేయాలి.
  6. వర్షాల వల్ల చెట్లు లేక చెట్ల కొమ్మలు విద్యుత్ వైర్లకు తాకి షాక్ వచ్చే ప్రమాదం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలి, వాటిని తాకకుండా విద్యుత్ శాఖ వారికి తెలియజేయాలి.
  7. తెగిపడిన, వేలాడుతున్న, వదులుగా మరియు తక్కువ ఎత్తులో ఉన్న విద్యుత్ తీగలను తాకరాదు, మరియు వెంటనే సంబందిత విద్యుత్ సిబ్బందికి తెలియచేయగలరు.
  8. ఎవరికైనా పొరపాటున కరెంట్ షాక్ సంభవిస్తే దగ్గరలోని వ్యక్తులు షాక్ గురైన వ్యక్తిని రక్షించాలన్న ఆతృతతో ప్రమాదం సంభవించిన వ్యక్తిని ముట్టుకోరాదు.షాక్ గురైన వ్యక్తిని వేరు చేయడానికి విద్యుత్ ప్రవహించని కర్ర లేదా ప్లాస్టిక్ లాంటి వస్తువులను వాడడమే సరియైన పరిష్కారం.
  9. ముఖ్యంగా రైతు సోదరులు తమ వ్యవసాయ అవసరాల నిమిత్తం, వ్యవసాయ పంపు సెట్లను వాడుతున్నప్పుడు కరెంటు మోటార్లను కాని,ఇనుప పైపులను కాని, ఫుట్ వాల్వులను కాని ఏమర పాటుతో తాకకూడదు.
  10. వ్యవసాయ పంపుసెట్లను మరియు స్టార్టర్లను విధిగా ఎర్త్ చేయవలెను. విద్యుత్ ప్రమాదాలు ఎర్త్ చేయబడని పరికరాల వల్లే జరుగుతాయి. ఎర్త్ చేయబడని మోటార్లు, స్టార్టర్లు, జి.ఐ. పైపులు మరియు ఫుట్ వాల్వ్ లు తాకడం అత్యంత ప్రమాదకరం.
  11. డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ల వద్ద అనధికారంగా ఫ్యూజులు మార్చడం, రిపేరుచేయడం, ఎబి స్విచ్లు ఆపరేట్ చేయడం మరియు కాలిన తీగలను సరిచేయడం ప్రమాదకరం.
  12. మోటారు మరియు పంపుసెట్లకు, ఇంటి లోని విద్యుత్ పరికరాలు, ఏదైనా సాంకేతిక లోపం తలెత్తితే స్వంతంగా సరిచేద్దామని ప్రయత్నిస్తే ప్రాణనష్టం/హాని జరగవచ్చు.
  13. రైతులు/వినియోగదారులు విద్యుత్ స్తంభాలు, విద్యుత్ తీగలు, ట్రాన్స్ఫార్మర్లు మరియు సర్విస్ వైర్ల పట్ల అప్రమత్తంగా ఉండాలి, వాటిని తాకకుండా దూరంగా నడవాలి.

పై సూచనలతో అందరూ  వినియోగదారులు తమ పరిధిలోని క్షేత్ర స్థాయి విద్యుత్ సిబ్బందికి, జూనియర్ లైన్మెన్, లైన్ మెన్ , లైన్ ఇన్స్పెక్టర్, సీనియర్ లైన్ ఇన్స్పెక్టర్, ఫోర్ మెన్, సబ్ఇంజనీర్, సెక్షన్ ఆఫీసర్ గార్లను సంప్రదించి వారి సేవలను వినియోగించుకోవాలి అని ఎస్ ఈ సూచించారు.

 

Tags
Join WhatsApp

More News...

Local News 

ప్రధాని సంసద్ ఖేల్ మహోత్సవం–2026ను విజయవంతం చేయాలి :

ప్రధాని సంసద్ ఖేల్ మహోత్సవం–2026ను విజయవంతం చేయాలి : సికింద్రాబాద్, జనవరి 7 (ప్రజామంటలు): ప్రధానమంత్రి సంసద్ ఖేల్ మహోత్సవం–2026 ను సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో విజయవంతం చేయాలని బీజేపీ సికింద్రాబాద్ పార్లమెంట్ కన్వీనర్ టి. రాజశేఖర్ రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం బోయిగూడలోని గొల్ల కొమురయ్య కాలనీలో బీజేపీ బన్సీలాల్‌పేట్ డివిజన్ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. .నియోజకవర్గంలో జరుగుతున్న...
Read More...

డ్రగ్స్‌, మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ భాగస్వాములవ్వాలి – జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్ 

డ్రగ్స్‌, మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ భాగస్వాములవ్వాలి – జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్  రాయికల్ జనవరి 7 ( ప్రజా మంటలు)డ్రగ్స్‌, మాదకద్రవ్యాల మహమ్మారిని సమాజం నుండి పూర్తిగా నిర్మూలించి భావితరాలకు ఆరోగ్యకరమైన, సురక్షితమైన భవిష్యత్తును అందించాలనే లక్ష్యంతో జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థులకు నిరంతరం అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోందని జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్  తెలిపారు.   రాయికల్ ఈ...
Read More...
Local News 

సైబర్ నేరాలపై అవగాహన సదస్సు 

సైబర్ నేరాలపై అవగాహన సదస్సు  ఇబ్రహీంపట్నం జనవరి 7 (ప్రజా మంటలు దగ్గుల అశోక్):   జగిత్యాల అశోక్ కుమార్ ఆదేశాల మేరకు బుధవారం రోజున ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలోని కస్తూర్బా పాఠశాల (కేజీబీవీ) విద్యార్థులకు సైబర్,డ్రగ్స్, ట్రాఫిక్ మరియు ఉమెన్ ట్రాఫికింగ్ లాంటి పలు అంశాల పైన అవగాహన సదస్సు ను ఇబ్రహీంపట్నం ఎస్సై అనిల్ గారి ఆధ్వర్యంలో నిర్వహించారు.
Read More...
Local News 

సర్పంచ్, ఉప సర్పంచ్,వార్డ్ సభ్యులకు శాలువాతో సన్మానం

సర్పంచ్, ఉప సర్పంచ్,వార్డ్ సభ్యులకు శాలువాతో సన్మానం గొల్లపల్లి జనవరి 07  (ప్రజా మంటలు):   కథలాపూర్ మండల కేంద్రంలో  పద్మశాలి కమ్యూనిటీ  భవనంలో బుధవారం జగిత్యాల్ జిల్లా పద్మశాలి కమ్యూనిటీ కార్యవర్గ సభ్యుడు పులి హరిప్రసాద్  ఆధ్వర్యంలో కథలాపూర్ మండలంలోని ఆయా గ్రామాలలోని సర్పంచ్  ఉప సర్పంచులు వార్డు సభ్యులు  పద్మశాలి కమ్యూనిటీ  సభ్యులను శాలువాతో ఘనంగా సన్మానించారు   ఈ కార్యక్రమంలో కథలాపూర్ మండల...
Read More...

జగిత్యాల మున్సిపల్ పీఠంపై గులాబీ జెండా ఎగరవేయాలి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ 

జగిత్యాల మున్సిపల్ పీఠంపై గులాబీ జెండా ఎగరవేయాలి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్     జగిత్యాల జనవరి 7 ( ప్రజా మంటలు)  జగిత్యాల మున్సిపల్ పీఠంపై గులాబీ జెండా ఎగుర వేయాలని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. జిల్లా బి ఆర్ యస్ పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రివర్యులు కొప్పుల ఈశ్వర్, జిల్లా బి ఆర్ యస్ అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు , జిల్లా తొలి జడ్పీ...
Read More...
State News 

నేచురల్, ఆర్గానిక్ వ్యవసాయం రైతుకు లాభదాయకం : డా. జీ. చిన్నారెడ్డి

నేచురల్, ఆర్గానిక్ వ్యవసాయం రైతుకు లాభదాయకం : డా. జీ. చిన్నారెడ్డి హైదరాబాద్, జనవరి 07 (ప్రజా మంటలు): నేచురల్, ఆర్గానిక్ వ్యవసాయం వల్ల ప్రజల ఆరోగ్యం మెరుగుపడడమే కాకుండా భూమి సారవంతంగా మారి రైతుకు మేలు జరుగుతుందని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జీ. చిన్నారెడ్డి తెలిపారు. లక్డికాపూల్‌లోని ఫ్యాప్సీ కాన్ఫరెన్స్ హాల్‌లో రాష్ట్ర వ్యవసాయ అధికారుల సంఘం డైరీలు, క్యాలెండర్లు, పాకెట్ డైరీలను...
Read More...

బి ఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్ష పదవికి గట్టు సతీష్ రాజీనామా

బి ఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్ష పదవికి గట్టు సతీష్ రాజీనామా   జగిత్యాల జనవరి 7 ( ప్రజా మంటలు) 2014 నుండి దాదాపు దశాబ్ద కాలం తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో బిఆర్ఎస్ పార్టీ (టిఆర్ఎస్) పార్టీ కార్యకర్తగా, జగిత్యాల పట్టణ అధ్యక్షునిగా బాధ్యతలు నిర్వహించిన గట్టు సతీష్ వ్యక్తిగత కారణాలతో అధ్యక్ష పదవికి రాజీనామా చేసినట్లు ఓ ప్రకటనలో తెలిపారు. బిఆర్ ఎస్ పార్టీ కుటుంబ...
Read More...

భగవద్గీతే నిజమైన విద్యకు పునాది., సిద్దార్థ విద్యా సంస్థల ఎస్ ఎస్ సి  విద్యార్థులకు దేవనాథ జీయర్ స్వామీజీ బోధ

భగవద్గీతే నిజమైన విద్యకు పునాది., సిద్దార్థ విద్యా సంస్థల ఎస్ ఎస్ సి  విద్యార్థులకు దేవనాథ జీయర్ స్వామీజీ బోధ    జగిత్యాల జనవరి 7(ప్రజా మంటలు)పట్టణం లోని సిద్ధార్థ విద్యాసంస్థ ఆధ్వర్యంలో మానస స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ పాఠశాలలో సూర్య గ్లోబల్ స్కూల్, జ్యోతి హై స్కూల్, మానస హై స్కూల్ విద్యార్థుల భవిష్యత్తును దిశానిర్దేశం చేసే ఉద్దేశంతో 10వ తరగతి విద్యార్థులకోసం “ఎగ్జామ్ ఛాలెంజెస్– మోటివేషనల్ సెషన్ ” అనే ప్రేరణాత్మక కార్యక్రమాన్ని  నిర్వహించారు. ...
Read More...

కవిత ఎమ్మెల్సీ పదవికి రాజీనామా ఆమోదం

కవిత ఎమ్మెల్సీ పదవికి రాజీనామా ఆమోదం హైదరాబాద్ జనవరి 07 (ప్రజామంటలు):    నిజామాబాద్ స్థానిక సంస్థల శాసన మండలి సభ్యత్వానికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చేసిన రాజీనామాను శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆమోదించారు. ఈ మేరకు లెజిస్లేటివ్ సెక్రటరీ అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేశారు. కల్వకుంట్ల కవిత  2021లో నిజామాబాద్ స్థానిక సంస్థల కోటా నుంచి...
Read More...

కొండగట్టు క్షేత్రానికి భారీగా తరలివచ్చిన భక్తులు

కొండగట్టు క్షేత్రానికి భారీగా తరలివచ్చిన భక్తులు    కొండగట్టు జనవరి 6 (ప్రజా మంటలు) జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో మంగళవారం భక్తుల రద్దీ నెలకొంది. తెల్లవారుజామున నుంచే వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. ముందుగా బేతాళ స్వామి ఆలయాన్ని దర్శించుకున్న భక్తులు అనంతరం ఆంజనేయ స్వామివారి దర్శనం చేసుకున్నారు. టెంకాయ మొక్కులు చెల్లించి తమ...
Read More...

మంగళవారం కొండగట్టులో ట్రాఫిక్ రద్దీ.. పార్కింగ్ కొరతతో భక్తుల ఇబ్బందులు

మంగళవారం కొండగట్టులో ట్రాఫిక్ రద్దీ.. పార్కింగ్ కొరతతో భక్తుల ఇబ్బందులు కొండగట్టు జనవరి 6 (ప్రజా మంటలు)   బొజ్జనపెల్లి గణేష్ కొండగట్టు కొండగట్టు ఆలయముకు మంగళవారం సందర్భంగా వాహనాల్లో వచ్చిన భక్తుల రద్దీతో తీవ్ర ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. గుట్టపై సరైన పార్కింగ్ సదుపాయం లేకపోవడం ప్రధాన సమస్యగా మారింది. అధిక సంఖ్యలో వాహనాలు రావడంతో తరచూ ఇలాంటి పరిస్థితి నెలకొంటోందని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు....
Read More...

మంగళవారం కొండగట్టులో ట్రాఫిక్ రద్దీ.. పార్కింగ్ కొరతతో భక్తుల ఇబ్బందులు

మంగళవారం కొండగట్టులో ట్రాఫిక్ రద్దీ.. పార్కింగ్ కొరతతో భక్తుల ఇబ్బందులు    కొండగట్టు జనవరి 6 ( ప్రజా మంటలు)బొజ్జన పెల్లి గణేష్ (కొండగట్టు)   కొండగట్టు ఆలయముకు మంగళవారం సందర్భంగా వాహనాల్లో వచ్చిన భక్తుల రద్దీతో తీవ్ర ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. గుట్టపై సరైన పార్కింగ్ సదుపాయం లేకపోవడం ప్రధాన సమస్యగా మారింది. అధిక సంఖ్యలో వాహనాలు రావడంతో తరచూ ఇలాంటి పరిస్థితి నెలకొంటోందని భక్తులు ఆవేదన...
Read More...