ఈదురు గాలులు, వర్షాలు కురుస్తున్న సందర్బంగా జగిత్యాల జిల్లా లో ఎలక్ట్రిసిటీ సమస్యలు తెలపడానికి 24 గంటలు పనిచేసే కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు.

On
ఈదురు గాలులు, వర్షాలు కురుస్తున్న సందర్బంగా జగిత్యాల జిల్లా లో ఎలక్ట్రిసిటీ సమస్యలు తెలపడానికి 24 గంటలు పనిచేసే కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు.

(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113). 

 

జగిత్యాల మే 08 (ప్రజా మంటలు). 

ఈదురు గాలులు, వర్షాలు కురుస్తున్న సందర్బంగా జగిత్యాల జిల్లా లో ఎలక్ట్రిసిటీ సమస్యలు తెలపడానికి 24 గంటలు పనిచేసే కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేయబడినవి.

విద్యుత్ సంబంధిత సమస్యలకు & ఫిర్యాదులు తెలియజేయడానికి మొబైల్ నంబర్లను సంప్రదించాలి. 

  • జిల్లా కేంద్రం లోని జగిత్యాల సర్కిల్ కంట్రోల్ రూమ్ --- 7901628366,
  • జగిత్యాల డివిజన్ పరిధిలోని కంట్రోల్ రూమ్ --- 9440811398,
  • మెట్టుపల్లి డివిజన్ పరిధిలోని కంట్రోల్ రూమ్ --- 7901678208,

అలాగే టోల్ ఫ్రీ నెంబరు.1800 4250028 కు లేదా 1912 ఫోన్ చేయగలరని మనవి.

రైతులు, విద్యుత్ వినియోగదారులకు ఈ క్రింది విద్యుత్ ప్రమాదాల నివారణ సూచనలు అనుసరించాలని జి. సత్యనారాయణ - ఎస్.ఈ, టి ఎస్ఎన్ పిడిసి ఎల్, జగిత్యాల విజ్ఞప్తి చేశారు: 

  1. మీ దగ్గరలో కాని, మీ ఇంట్లోగాని తడి చేతులతో విద్యుత్ పరికరాలను మరియు తీగలను ముట్టుకోకండి. ముఖ్యంగా బట్టలు ఆరేసే దండెంలకు విద్యుత్ వైర్లు తాకకుండా చూసుకోండి,
  2. విద్యుత్ ప్రవహిస్తున్న సర్వీస్ వైర్లకు ఎలాంటి అతుకులు లేకుండా చూసుకోండి, ఒక వేళ అలాంటి అతుకుల ఉన్న వైర్లను వెంటనే అనుభవం ఉన్న ఎలక్ట్రీషియన్ తో సరి చేయించండి/ మార్పించండి.
  3. ఆరుబయట విద్యుత్ స్తంభాలను తాకకండి.
  4. వర్షాలు కురుస్తున్నప్పుడు, రైతులు ట్రాన్స్ఫార్మర్ల దగ్గరికి వెళ్లకండి, మీ యొక్క స్టార్టర్ డబ్బాలను నీటిలో తడవకుండా పైకి ఏర్పాటు చేసుకోగలరు.
  5. వోల్టేజ్లో హెచ్చు తగ్గలు ఉన్నా, ట్రాన్స్ఫార్మర్ల వద్ద శబ్దం వస్తున్నా వెంటనే విద్యుత్ శాఖ వారికి తెలియజేయాలి.
  6. వర్షాల వల్ల చెట్లు లేక చెట్ల కొమ్మలు విద్యుత్ వైర్లకు తాకి షాక్ వచ్చే ప్రమాదం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలి, వాటిని తాకకుండా విద్యుత్ శాఖ వారికి తెలియజేయాలి.
  7. తెగిపడిన, వేలాడుతున్న, వదులుగా మరియు తక్కువ ఎత్తులో ఉన్న విద్యుత్ తీగలను తాకరాదు, మరియు వెంటనే సంబందిత విద్యుత్ సిబ్బందికి తెలియచేయగలరు.
  8. ఎవరికైనా పొరపాటున కరెంట్ షాక్ సంభవిస్తే దగ్గరలోని వ్యక్తులు షాక్ గురైన వ్యక్తిని రక్షించాలన్న ఆతృతతో ప్రమాదం సంభవించిన వ్యక్తిని ముట్టుకోరాదు.షాక్ గురైన వ్యక్తిని వేరు చేయడానికి విద్యుత్ ప్రవహించని కర్ర లేదా ప్లాస్టిక్ లాంటి వస్తువులను వాడడమే సరియైన పరిష్కారం.
  9. ముఖ్యంగా రైతు సోదరులు తమ వ్యవసాయ అవసరాల నిమిత్తం, వ్యవసాయ పంపు సెట్లను వాడుతున్నప్పుడు కరెంటు మోటార్లను కాని,ఇనుప పైపులను కాని, ఫుట్ వాల్వులను కాని ఏమర పాటుతో తాకకూడదు.
  10. వ్యవసాయ పంపుసెట్లను మరియు స్టార్టర్లను విధిగా ఎర్త్ చేయవలెను. విద్యుత్ ప్రమాదాలు ఎర్త్ చేయబడని పరికరాల వల్లే జరుగుతాయి. ఎర్త్ చేయబడని మోటార్లు, స్టార్టర్లు, జి.ఐ. పైపులు మరియు ఫుట్ వాల్వ్ లు తాకడం అత్యంత ప్రమాదకరం.
  11. డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ల వద్ద అనధికారంగా ఫ్యూజులు మార్చడం, రిపేరుచేయడం, ఎబి స్విచ్లు ఆపరేట్ చేయడం మరియు కాలిన తీగలను సరిచేయడం ప్రమాదకరం.
  12. మోటారు మరియు పంపుసెట్లకు, ఇంటి లోని విద్యుత్ పరికరాలు, ఏదైనా సాంకేతిక లోపం తలెత్తితే స్వంతంగా సరిచేద్దామని ప్రయత్నిస్తే ప్రాణనష్టం/హాని జరగవచ్చు.
  13. రైతులు/వినియోగదారులు విద్యుత్ స్తంభాలు, విద్యుత్ తీగలు, ట్రాన్స్ఫార్మర్లు మరియు సర్విస్ వైర్ల పట్ల అప్రమత్తంగా ఉండాలి, వాటిని తాకకుండా దూరంగా నడవాలి.

పై సూచనలతో అందరూ  వినియోగదారులు తమ పరిధిలోని క్షేత్ర స్థాయి విద్యుత్ సిబ్బందికి, జూనియర్ లైన్మెన్, లైన్ మెన్ , లైన్ ఇన్స్పెక్టర్, సీనియర్ లైన్ ఇన్స్పెక్టర్, ఫోర్ మెన్, సబ్ఇంజనీర్, సెక్షన్ ఆఫీసర్ గార్లను సంప్రదించి వారి సేవలను వినియోగించుకోవాలి అని ఎస్ ఈ సూచించారు.

 

Tags
Join WhatsApp

More News...

National 

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఎయిర్ ఇండియా ఫ్లైట్ డ్రామా

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఎయిర్ ఇండియా ఫ్లైట్ డ్రామా ప్రయాణికులకు అర గంట వేచి ఉండమన్న ఎయిర్‌లైన్ – భద్రతా లోపాలపై ప్రశ్నలు హైదరాబాద్  డిసెంబర్ 06 (ప్రజా మంటలు): శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఢిల్లీ–హైదరాబాద్ మధ్య నడిచే ఎయిర్ ఇండియా AI–2879 ఫ్లైట్ శుక్రవారం రాత్రి అనూహ్య పరిస్థితులను ఎదుర్కొంది. ల్యాండింగ్ పూర్తైన వెంటనే, విమానం చుట్టూ ఫైరింజన్లు, భద్రతా సిబ్బంది...
Read More...
National  Filmi News  State News 

‘అఖండ 2’ రిలీజ్‌పై నిర్మాణ సంస్థ కొత్త ప్రకటన

‘అఖండ 2’ రిలీజ్‌పై నిర్మాణ సంస్థ కొత్త ప్రకటన కొత్త విడుదల తేదీ త్వరలో!ప్రకటిస్తారు? హైదరాబాద్ డిసెంబర్ 06 (ప్రజా మంటలు):  బాలకృష్ణ–బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న భారీ యాక్షన్ చిత్రం ‘అఖండ 2’ రిలీజ్‌పై నిర్మాణ సంస్థ కీలక అప్‌డేట్ ఇచ్చింది. చిత్ర విడుదల కోసం చివరి దశ పనులు పూర్తిచేస్తున్నామని, కొత్త విడుదల తేదీని త్వరలో ప్రకటించబోతున్నట్టు తెలిపింది. నిర్మాణ సంస్థ...
Read More...
State News 

పంచాయతీ బరిలో చంద్రబాబు – జగన్!

పంచాయతీ బరిలో చంద్రబాబు – జగన్! కొత్తగూడెం డిసెంబర్ 06 (ప్రజా మంటలు): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం గుండ్లరేవు గ్రామంలోని పంచాయతీ ఎన్నికల్లో ఒక ఆసక్తికర సంఘటన జరిగింది. సాధారణంగా రాష్ట్ర స్థాయి రాజకీయాల్లో ప్రత్యర్థులుగా నిలిచే చంద్రబాబు – జగన్ పేర్లు ఈసారి గ్రామ సర్పంచి బరిలో కనిపించడంతో గ్రామంలో చర్చనీయాంశమైంది. అయితే వారు మీరు అనుకునే రాజకీయ...
Read More...
State News 

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌ — డిసెంబర్ 8 నుంచి భారత్ ఫ్యూచర్ సిటీలో

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌ — డిసెంబర్ 8 నుంచి భారత్ ఫ్యూచర్ సిటీలో హైదరాబాద్ డిసెంబర్ 06 (ప్రజా మంటలు): డిసెంబర్ 8 నుంచి భారత్ ఫ్యూచర్ సిటీలో జరగబోయే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ పూర్తిగా ఆర్థిక సదస్సు అని ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి చెప్పారు. రాష్ట్ర భవిష్యత్తు అభివృద్ధి దిశను తెలిపే ‘తెలంగాణ రైజింగ్ 2047’ విజన్ డాక్యుమెంట్ ఈ సదస్సులో ఆవిష్కరించడం ప్రధాన లక్ష్యమని...
Read More...
Local News 

రాష్ర్టంలో పెరిగిన వీధి కుక్కల బెడద  : జాతీయ మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు

రాష్ర్టంలో పెరిగిన వీధి కుక్కల బెడద  : జాతీయ మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు సికింద్రాబాద్, డిసెంబర్ 05 (ప్రజామంటలు) : తెలంగాణలో వీధికుక్కల బెడద మితిమీరిందని, రాష్ట్రవ్యాప్తంగా కుక్కలు మనుషులపై దాడులు, కరవడం, ప్రాణాలు తీసే ఘటనలు పెరుగుతున్నా, అధికార యంత్రాంగం నిర్లక్ష్యం కొనసాగుతుంద‌ని ప్రముఖ మానవ హక్కుల న్యాయవాది రామా రావు ఇమ్మానేని ఆరోపించారు. సుప్రీం కోర్టు ఈ విషయమై ఎన్ని సార్లు మొట్టికాయలు వేసిన అధికారులు తమ...
Read More...

గాంధీలో చికిత్స పొందుతూ సాయి ఈశ్వర్ చారి మృతి

గాంధీలో చికిత్స పొందుతూ సాయి ఈశ్వర్ చారి మృతి బీసీ సంఘాల ఆందోళనతో గాంధీ ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత *ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు – పలు పోలీస్ స్టేషన్లకు తరలించిన నిరసనకారులు
Read More...

పిఎంఓ లో రాజకీయ అలజడి సృష్టించిన హిరెన్ జోషి

పిఎంఓ లో రాజకీయ అలజడి సృష్టించిన హిరెన్ జోషి హిరేన్ జోషి, ప్రో హిమానీ దూద్, నవనీత్ సెహగల్ లు ఎందుకు ఈరోజు ఢిల్లీ వర్గాల్లో చర్చనీయంగా మారారు? హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పదకోశం జరుగుతున్న పోటీయే దీనికి ప్రధాన కారణమా? బెట్టింగ్ అప్ కంపెనీని నిర్వహిస్తున్న సెహగల్ కొడుకు వల్లన పీఎంఓ కు వీటి సంబంధాలు బయటకు రావడం కారణమా? పూర్తిగా చదవండి.
Read More...
State News 

జోగులాంబ అమ్మవారి ఆలయ అభివృద్ధికి ₹347 కోట్ల ప్రణాళిక - చిన్నారెడ్డి

జోగులాంబ అమ్మవారి ఆలయ అభివృద్ధికి ₹347 కోట్ల ప్రణాళిక - చిన్నారెడ్డి హైదరాబాద్ డిసెంబర్ 05 (ప్రజా మంటలు): తుంగభద్ర నది ఒడ్డున ఆలంపూర్‌లో కొలువైన పవిత్ర శక్తిపీఠం జోగులాంబ అమ్మవారి ఆలయం అభివృద్ధికి ప్రభుత్వం భారీ ప్రణాళికను సిద్ధం చేసింది. మొత్తం ₹347 కోట్లతో ఆలయాన్ని ఆధునికంగా, భక్తులకు అనుకూలంగా తీర్చిదిద్దే కార్యక్రమం రూపొందించారు. తక్షణ పనులకు ₹35 కోట్లు అవసరం బాలాలయం నిర్మాణం, వజ్రలేపనం, కుంభాభిషేకం...
Read More...
National  Comment 

ఇండిగో విమాన రద్దుల వెనుక అసలు కథ ఏమిటి?

ఇండిగో విమాన రద్దుల వెనుక అసలు కథ ఏమిటి? గత నాలుగు రోజులుుగా జరుగుతున్న ఇండిగో విమాన రద్దులపై, ప్రచారంలో ఉన్న సమాచారాన్ని ఆధారంగా తీసుకుని, కార్పొరేట్ పోరాటం కోణంలో ఒక సమగ్ర విశ్లేషణాత్మక కథనం. దేశవ్యాప్తంగా నాలుగు రోజులుగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇండిగో సంస్థకు చెందిన అనేక విమానాలు అకస్మాత్తుగా రద్దు కావడం, కొన్ని గంటల తరబడి ఆలస్యంగా నడవడం, ప్రయాణికులు...
Read More...
National  International   State News 

అమెరికా బర్మింగ్‌హామ్‌లో భారీ అగ్నిప్రమాదం – ఇద్దరు తెలుగు విద్యార్థుల విషాద మరణం

అమెరికా బర్మింగ్‌హామ్‌లో భారీ అగ్నిప్రమాదం – ఇద్దరు తెలుగు విద్యార్థుల విషాద మరణం బర్మింగ్‌హామ్ (అలబామా) డిసెంబర్ 05 (ప్రజా మంటలు): అమెరికా అలబామా రాష్ట్రంలోని బర్మింగ్‌హామ్ నగరంలో గురువారం ఉదయం జరిగిన భారీ అగ్నిప్రమాదం ఇద్దరు తెలుగు విద్యార్థుల ప్రాణాలు తీసింది. స్థానిక అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లో అకస్మాత్తుగా చెలరేగిన మంటలు కాసేపటికే భవనం మొత్తం వ్యాపించడంతో విద్యార్థులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అక్కడ నివాసముంటున్న మొత్తం 13 మంది...
Read More...

సోమాజిగూడలో అగ్నిప్రమాదం – శ్రీకన్య కంఫర్ట్ రెస్టారెంట్‌లో మంటలు

సోమాజిగూడలో అగ్నిప్రమాదం – శ్రీకన్య కంఫర్ట్ రెస్టారెంట్‌లో మంటలు హైదరాబాద్‌, డిసెంబర్ 05 (ప్రజా మంటలు): నగరంలోని సోమాజిగూడలో మంగళవారం సాయంత్రం పెద్ద అగ్నిప్రమాదం సంభవించింది. భవనం ఐదో అంతస్తులో ఉన్న శ్రీకన్య కంఫర్ట్ రెస్టారెంట్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. కిచెన్‌ ప్రాంతం నుంచి భారీగా పొగలు ఎగసిపడటంతో అక్కడి సిబ్బంది, భవనం నివాసితులు ఆందోళనకు గురయ్యారు.సమాచారం అందుకున్న వెంటనే ఫైర్‌ డిపార్ట్‌మెంట్‌కు...
Read More...
State News 

హన్మకొండ అడిషనల్ కలెక్టర్ ఏసీబీ వలలో

హన్మకొండ అడిషనల్ కలెక్టర్ ఏసీబీ వలలో హనుమకొండ, డిసెంబర్ 05 (ప్రజా మంటలు): హనుమకొండ అడిషనల్ కలెక్టర్‌గా, అలాగే ఇన్‌చార్జ్ డీఈవోగా పనిచేస్తున్న వెంకట్ రెడ్డి ఎసీబీ వలలో చిక్కారు. పుత్తూరు హైస్కూల్ అనుమతి పునరుద్ధరణ కోసం రూ.60,000 లంచం స్వీకరిస్తుండగా అతడిని అవినీతి నిరోధక శాఖ అధికారులు ట్రాప్ చేసినట్లు సమాచారం. వెంకట్ రెడ్డితో పాటు జూనియర్ అసిస్టెంట్ మనోజ్‌ను కూడా...
Read More...