ఈదురు గాలులు, వర్షాలు కురుస్తున్న సందర్బంగా జగిత్యాల జిల్లా లో ఎలక్ట్రిసిటీ సమస్యలు తెలపడానికి 24 గంటలు పనిచేసే కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు.
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
జగిత్యాల మే 08 (ప్రజా మంటలు).
ఈదురు గాలులు, వర్షాలు కురుస్తున్న సందర్బంగా జగిత్యాల జిల్లా లో ఎలక్ట్రిసిటీ సమస్యలు తెలపడానికి 24 గంటలు పనిచేసే కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేయబడినవి.
విద్యుత్ సంబంధిత సమస్యలకు & ఫిర్యాదులు తెలియజేయడానికి మొబైల్ నంబర్లను సంప్రదించాలి.
- జిల్లా కేంద్రం లోని జగిత్యాల సర్కిల్ కంట్రోల్ రూమ్ --- 7901628366,
- జగిత్యాల డివిజన్ పరిధిలోని కంట్రోల్ రూమ్ --- 9440811398,
- మెట్టుపల్లి డివిజన్ పరిధిలోని కంట్రోల్ రూమ్ --- 7901678208,
అలాగే టోల్ ఫ్రీ నెంబరు.1800 4250028 కు లేదా 1912 ఫోన్ చేయగలరని మనవి.
రైతులు, విద్యుత్ వినియోగదారులకు ఈ క్రింది విద్యుత్ ప్రమాదాల నివారణ సూచనలు అనుసరించాలని జి. సత్యనారాయణ - ఎస్.ఈ, టి ఎస్ఎన్ పిడిసి ఎల్, జగిత్యాల విజ్ఞప్తి చేశారు:
- మీ దగ్గరలో కాని, మీ ఇంట్లోగాని తడి చేతులతో విద్యుత్ పరికరాలను మరియు తీగలను ముట్టుకోకండి. ముఖ్యంగా బట్టలు ఆరేసే దండెంలకు విద్యుత్ వైర్లు తాకకుండా చూసుకోండి,
- విద్యుత్ ప్రవహిస్తున్న సర్వీస్ వైర్లకు ఎలాంటి అతుకులు లేకుండా చూసుకోండి, ఒక వేళ అలాంటి అతుకుల ఉన్న వైర్లను వెంటనే అనుభవం ఉన్న ఎలక్ట్రీషియన్ తో సరి చేయించండి/ మార్పించండి.
- ఆరుబయట విద్యుత్ స్తంభాలను తాకకండి.
- వర్షాలు కురుస్తున్నప్పుడు, రైతులు ట్రాన్స్ఫార్మర్ల దగ్గరికి వెళ్లకండి, మీ యొక్క స్టార్టర్ డబ్బాలను నీటిలో తడవకుండా పైకి ఏర్పాటు చేసుకోగలరు.
- వోల్టేజ్లో హెచ్చు తగ్గలు ఉన్నా, ట్రాన్స్ఫార్మర్ల వద్ద శబ్దం వస్తున్నా వెంటనే విద్యుత్ శాఖ వారికి తెలియజేయాలి.
- వర్షాల వల్ల చెట్లు లేక చెట్ల కొమ్మలు విద్యుత్ వైర్లకు తాకి షాక్ వచ్చే ప్రమాదం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలి, వాటిని తాకకుండా విద్యుత్ శాఖ వారికి తెలియజేయాలి.
- తెగిపడిన, వేలాడుతున్న, వదులుగా మరియు తక్కువ ఎత్తులో ఉన్న విద్యుత్ తీగలను తాకరాదు, మరియు వెంటనే సంబందిత విద్యుత్ సిబ్బందికి తెలియచేయగలరు.
- ఎవరికైనా పొరపాటున కరెంట్ షాక్ సంభవిస్తే దగ్గరలోని వ్యక్తులు షాక్ గురైన వ్యక్తిని రక్షించాలన్న ఆతృతతో ప్రమాదం సంభవించిన వ్యక్తిని ముట్టుకోరాదు.షాక్ గురైన వ్యక్తిని వేరు చేయడానికి విద్యుత్ ప్రవహించని కర్ర లేదా ప్లాస్టిక్ లాంటి వస్తువులను వాడడమే సరియైన పరిష్కారం.
- ముఖ్యంగా రైతు సోదరులు తమ వ్యవసాయ అవసరాల నిమిత్తం, వ్యవసాయ పంపు సెట్లను వాడుతున్నప్పుడు కరెంటు మోటార్లను కాని,ఇనుప పైపులను కాని, ఫుట్ వాల్వులను కాని ఏమర పాటుతో తాకకూడదు.
- వ్యవసాయ పంపుసెట్లను మరియు స్టార్టర్లను విధిగా ఎర్త్ చేయవలెను. విద్యుత్ ప్రమాదాలు ఎర్త్ చేయబడని పరికరాల వల్లే జరుగుతాయి. ఎర్త్ చేయబడని మోటార్లు, స్టార్టర్లు, జి.ఐ. పైపులు మరియు ఫుట్ వాల్వ్ లు తాకడం అత్యంత ప్రమాదకరం.
- డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ల వద్ద అనధికారంగా ఫ్యూజులు మార్చడం, రిపేరుచేయడం, ఎబి స్విచ్లు ఆపరేట్ చేయడం మరియు కాలిన తీగలను సరిచేయడం ప్రమాదకరం.
- మోటారు మరియు పంపుసెట్లకు, ఇంటి లోని విద్యుత్ పరికరాలు, ఏదైనా సాంకేతిక లోపం తలెత్తితే స్వంతంగా సరిచేద్దామని ప్రయత్నిస్తే ప్రాణనష్టం/హాని జరగవచ్చు.
- రైతులు/వినియోగదారులు విద్యుత్ స్తంభాలు, విద్యుత్ తీగలు, ట్రాన్స్ఫార్మర్లు మరియు సర్విస్ వైర్ల పట్ల అప్రమత్తంగా ఉండాలి, వాటిని తాకకుండా దూరంగా నడవాలి.
పై సూచనలతో అందరూ వినియోగదారులు తమ పరిధిలోని క్షేత్ర స్థాయి విద్యుత్ సిబ్బందికి, జూనియర్ లైన్మెన్, లైన్ మెన్ , లైన్ ఇన్స్పెక్టర్, సీనియర్ లైన్ ఇన్స్పెక్టర్, ఫోర్ మెన్, సబ్ఇంజనీర్, సెక్షన్ ఆఫీసర్ గార్లను సంప్రదించి వారి సేవలను వినియోగించుకోవాలి అని ఎస్ ఈ సూచించారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
అటుకుల్లో బొద్దింక..
కొత్తకొండ వైన్స్ సిట్టింగ్ రూమ్లో ఘోరం.. సాహితీవేత్త ఎం.వి. నరసింహారెడ్డి కన్నుమూత
జగిత్యాల, జూన్ 08 (ప్రజా మంటలు):
జగిత్యాల పట్టణానికి చెందిన ప్రముఖ సాహితీవేత్త, రచయిత, విద్యావేత్త, ఎస్కేఎల్ఎన్ రావు బీఈడీ కళాశాల కరెస్పాండెంట్ ఎం.వి. నరసింహారెడ్డి సోమవారం రాత్రి, తన నివాసంలో కన్నుమూశారు. ఆయన మృతి సాహితీ, విద్యా రంగాలకు తీరని లోటుగా భావిస్తున్నారు.ఎం.వి. నరసింహారెడ్డి తెలుగు సాహిత్యానికి విశేష సేవలందించారు. నాలుగు వేదాలను... వరి కొయ్యలు కాల్చి పలువురి ప్రమాదానికి కారణమైన వారిపై ప్రజావాణిలో ఫిర్యాదు
జగిత్యాల జూన్ 8 (ప్రజా మంటలు)
జగిత్యాల రూరల్ మండలం తక్కలపల్లి గ్రామ శివారులో తుమ్మచెట్టు కు నిప్పంటుకొని అదే మార్గంలో వస్తున్న బైరి వేణు ,కడారి భరత్ లు గాయాలపాలు అయినారు. ఇట్టి విషయంపై జిల్లా కేంద్రం విజయపురి కాలనీకి చెందిన సంబుమహేష్( 29) తండ్రి మల్లయ్య సోమవారం తుమ్మచెట్టు కాలడానికి కారకులైన
మిట్టపల్లి... ఎంవి నరసింహారెడ్డి అస్తమయం
జగిత్యాల జూన్ 8 (ప్రజా మంటలు)జగిత్యాల ఎస్ కె ఎల్ ఎన్ రావు బిఈడి కళాశాల కరెస్పాండెంట్, రచయిత ఎం.వి నరసింహారెడ్డి ఈరోజు సోమవారం సాయంత్రం 7 గంటలకు జగిత్యాలలో ఆయన నివాసంలో మృతి చెందారు. ఆయన నాలుగు వేదాలు మరియు ఉపనిషత్తులు జోక్స్ బ్యాంక్ జోక్స్ టానిక్ లాంటి హాస్య రచనల పుస్తకాలు,... మమతా కాంగ్రెస్ గూటికి చేరితే... బీజేపీ వ్యూహానికి అతిపెద్ద ఎదురుదెబ్బ?
న్యూ డిల్లీ జూన్ 08 :
భారత రాజకీయాల్లో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు ఒక కొత్త రాజకీయ పునర్వ్యవస్థీకరణకు సంకేతాలిస్తున్నాయా? ఢిల్లీలో జరిగిన INDIA కూటమి సమావేశం తర్వాత రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న చర్చలను పరిశీలిస్తే ఈ ప్రశ్నకు అవుననే సమాధానం వినిపిస్తోంది.
దేశవ్యాప్తంగా బీజేపీకి ప్రత్యామ్నాయంగా నిలవాలంటే ప్రతిపక్ష శక్తుల ఐక్యత తప్పనిసరి అనే... మారుతి స్నేహ మండలి వారిచే ప్రతిభా పురస్కారాల వితరణ
జగిత్యాల జూన్ 7( ప్రజా మంటలు)జిల్లా కేంద్రంలో మారుతి స్నేహ మండలి వారిచే ప్రతిభా పురస్కారాలు అందజేయబడినవి. 2025 26 విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియట్ యందు 1000 మార్కులకు గాను 982 ఎంపీసీ విభాగం నందు సాధించిన జి సుప్రీత్, ఎస్ ఎస్ సి నందు పి . హాసినిశర్మ 600/578 మార్కులు సాధించగా... హనుమాన్ చాలీసా భక్త బృందం వారిచే విద్యార్థులకు పురస్కారాల ప్రధానం
జగిత్యాల జూన్ 7(ప్రజా మంటలు)జిల్లా కేంద్రంలోని బ్రాహ్మణ వీధి హరిహరాలయంలో గత తొమ్మిది సంవత్సరాలుగా హనుమాన్ చాలీసా భక్త బృందం వారిచే సామూహిక పారాయణం నిర్వహించబడుచున్నది. కాగా ఈ సంవత్సరము నుండి నూతనంగా ఎస్ ఎస్ఎస్సి ,ఇంటర్మీడియట్, డిగ్రీ నందు 90% పైబడి మార్కులు సాధించిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేయడానికి శ్రీకారం చుట్టారు.... ₹80 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్
జగిత్యాల, జూన్ 04 (ప్రజా మంటలు):
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలోని అటవీశాఖ కార్యాలయంలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ మొయినుద్దీన్ ₹80 వేల లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఏసీబీ డీఎస్పీ విజయ్ కుమార్ నేతృత్వంలో గురువారం ఈ దాడి నిర్వహించారు.... నందికొండ మున్సిపల్ అధికారుల తీరుపై టీఆర్ఎస్ ఆగ్రహం
నాగార్జునసాగర్, జూన్ 4 (ప్రజా మంటలు):
నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని నందికొండ మున్సిపల్ అధికారులు పైలాన్ క్రాస్రోడ్డు వద్ద ఉన్న తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) జెండా గద్దెను కూల్చివేయడంపై ఆ పార్టీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇతర పార్టీల జెండా గద్దెలను వదిలి టీఆర్ఎస్ గద్దెను మాత్రమే తొలగించడం వివక్షపూరిత చర్య అని... కన్నాపూర్ లో కాలిన ఈత - తాటి వనం సందర్శించిన మాజీ జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్
జగిత్యాల జూన్2- ( ప్రజా మంటలు)జగిత్యాల రూరల్ మండలం కన్నాపూర్ గ్రామంలో గత 5 రోజుల క్రితం ప్రమాదవశాత్తు కాలిపోయిన 500 ఈత - తాటి చెట్లను జిల్లా తొలి జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్ మంగళ వారం పరిశీలించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ...కన్నాపూర్ గ్రామంలోని దాదాపు 27... మల్యాల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రవేశాల పెంపు కోసం ప్రచారo
మల్యాల జూన్ 2 (ప్రజా మంటలు)
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ప్రవేశాలను పెంచడం మరియు ప్రైవేట్, కార్పొరేట్ కళాశాలలతో పోటీని ఎదుర్కొనే దృష్టితో, మల్యాల ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ఎం శివరామకృష్ణ మరియు అధ్యాపకులు ఇంటింటికీ ప్రచారం చేపట్టారు.
ఈ ప్రచారంలో ఎస్.ఎస్.సి. పాసైన ప్రతి విద్యార్థిని మరియు వారి తల్లిదండ్రులను కలిసి, కళాశాల... ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు
జగిత్యాల జూన్ 2 (ప్రజా మంటలు) జిల్లా కేంద్రంలోని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో మంగళవారం తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా టౌన్ సిఐ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ప్రారంభించి శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్ఐ మల్లేష్ ,ట్రాఫిక్ కానిస్టేబుళ్ళు ,టౌన్ ఎస్సై తదితరులు పాల్గొన్నారు. 