బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై ఆర్డినెన్స్ నిర్ణయంపై ప్రభుత్వంకు కృతజ్ఞతలు.
-టీబీసీ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్.
జగిత్యాల జులై 12:
విద్యా,ఉద్యోగ,స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై ఆర్డినెన్స్ జారీకి రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించడం పట్ల టీ బీసీ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు.ఆదివారం జిల్లా కేంద్రంలో టీ బీసీ జేఏసీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వంకు కృతజ్ఞతలు తెలుపుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,బీసీ సంక్షేమ మంత్రి పొన్నం ప్రభాకర్, రాష్ట్ర ఎస్సీ,ఎస్టీ,సీనియర్ సిటీజేన్స్ సంక్షేమ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్,జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్,మాజీ మంత్రి టీ.జీవన్ రెడ్డిల ఫ్లెక్సీ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు.
ఈ సందర్భంగా హరి ఆశోక్ కుమార్ మాట్లాడుతూ ఇది బీసీ లు సాధించిన విజయమేనని, రిజర్వేషన్ల పెంపునకు అన్ని పార్టీలు సహకరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో జగిత్యాల జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్,సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు చిలుక రమేష్,రాష్ట్ర ఉపాధ్యక్షులు సింగం భాస్కర్,వెల్ముల ప్రకాష్ రావు,మహిళా అధ్యక్షురాలు కస్తూరి శ్రీమంజరి,తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
మాజీ మంత్రి రాజేశం గౌడ్ మనమరాలి జన్మదిన సందర్భంగా వాల్మీకి ఆవాసంలో విద్యార్థులకు విందు భోజనం ఏర్పాటు

బోనాల పండుగ నిర్వహణకు చెక్కుల పంపిణీ

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై ఆర్డినెన్స్ నిర్ణయంపై ప్రభుత్వంకు కృతజ్ఞతలు.

హత్య కేసులో నిందితుల అరెస్ట్ - రిమాండ్ కి తరలింపు - సీఐ,రామ్ నరసింహ రెడ్డి

మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి - వేలేరు ఎస్ఐ సురేష్

గౌరెల్లి ప్రాజెక్టు కెనాల్ భూ నిర్వాసితులతో సదస్సు

గాజుల పోచమ్మ ఆలయంలో ఘనంగా గోరింటాకు ఉత్సవాలు

ఓల్డ్ మల్కాజ్గిరిలో, సర్దార్ పటేల్ నగర్ లలో సీసీ రోడ్డు ప్యాచ్ పనులు ప్రారంభం: కార్పొరేటర్ శ్రవణ్

జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో జనాభా దినోత్సవ వారోత్సవాలు ప్రారంభం

జిల్లా ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గాన్ని అభినందించిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
.jpg)
నెంబర్ ప్లేట్స్ లేని వాహనాలపై ప్రత్యేక డ్రైవ్: 316 వాహనాలు సీజ్: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు లారీలు సీజ్
.jpeg)