హైకోర్టులో కేవియట్ వేసి బీసీ రిజర్వేషన్ల ఆర్డినెన్స్ ఇవ్వాలి - ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

ఫూలే, అంబేద్కర్ విగ్రహాలకు నివాళులు - జాగృతి బైక్ ర్యాలీని అడ్డుకునేందుకు పోలీసుల ప్రయత్నం

On
హైకోర్టులో కేవియట్ వేసి బీసీ రిజర్వేషన్ల ఆర్డినెన్స్ ఇవ్వాలి - ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

రిజర్వేషన్ల పెంపు బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలిపి ఆర్డినెన్స్ ఇవ్వాలి
- ఆర్డినెన్స్ పాస్ చేసేలా బీజేపీ రాష్ట్ర నేతలు చొరవ తీసుకోవాలి
- తాత్కాలికంగా రైల్ రోకో వాయిదా- ఆర్డినెన్స్ జారీలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే ఉద్యమం ఉధృతం చేస్తాం
- తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

హైదరాబాద్ జూలై 11:

బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న చిత్తశుద్ధి రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటే హైకోర్టులో కేవియట్ దాఖలు చేసి ఆర్డినెన్స్ జారీ చేయించాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. తెలంగాణ జాగృతి, యునైటెడ్ ఫూలే ఫ్రంట్ నాయకులతో కలిసి శుక్రవారం హైదరాబాద్ లోని తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న డిమాండ్ తో తెలంగాణ జాగృతి రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమించిందన్నారు. యూపీఎఫ్ తో కలిసి అన్ని కుల సంఘాలను కలుపుకొని రౌండ్ టేబుల్ సమావేశాలు, ఐక్య ఉద్యమాలు చేసి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచామన్నారు. కాంగ్రెస్ పార్టీ వంద రోజుల్లోనే కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలు చేస్తామని హామీ ఇచ్చి తుంగలో తొక్కిందని.. తమ ఉద్యమాలకు దిగివచ్చి రాష్ట్ర శాసనసభ, శాసన మండలిలో రెండు బిల్లులు ప్రవేశ పెట్టిందన్నారు.

IMG-20250711-WA0009

అసెంబ్లీ, కౌన్సిల్ పాస్ చేసిన బిల్లుల ఆమోదం కోసం కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ఒత్తిడి తీసుకురాలేదన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ ఈనెల 17న రైల్ రోకోకు పిలుపునిచ్చామని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచేందుకు ఢిల్లీకి వెళ్లి ప్రెస్ మీట్ పెట్టి కాంగ్రెస్, బీజేపీల వైఖరిని ఎండగట్టామన్నారు. తమ ఒత్తిడికి తలొగ్గే రాష్ట్ర కేబినెట్ బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రాజకీయ రిజర్వేషన్లు కల్పిస్తూ చట్ట సవరణ చేసిందన్నారు. ఇది నూటికి నూరుపాళ్లు తెలంగాణ జాగృతి సాధించిన విజయమన్నారు. సవరణ బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలిపి ఆర్డినెన్స్ జారీ తన మర్యాదను నిలబెట్టుకోవాలన్నారు.  వెంటనే ఆమోదం తెలిపేలా రాష్ట్ర బీజేపీ నాయకులు గవర్నర్ పై ఒత్తిడి పెంచాలన్నారు.

కాంగ్రెస్ పార్టీకి బీసీ రిజర్వేషన్ల అమలుపై చిత్తశుద్ధి ఉంటే 18 నెలలు ఎందుకు ఆగారో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. బీసీ రిజర్వేషన్లపై ఆర్డినెన్స్ తెస్తామన్న ప్రభుత్వ ప్రకటనతో తాము పిలుపునిచ్చిన రైల్ రోకోను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నామని ప్రకటించారు. గవర్నర్ సవరణ బిల్లుకు ఆమోదం తెలిపి ఆర్డినెన్స్ జారీ చేయకపోతే మళ్లీ ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కేబినెట్ సమావేశంలో స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే ప్రతిపాదన మాత్రమే చేశారని, విద్య, ఉద్యోగాల్లోనూ రిజర్వేషన్లు కల్పించే వరకు ఉద్యమాలు కొనసాగిస్తామన్నారు. రిజర్వేషన్ల పెంపు ప్రతిపాదనలకు ఆమోదం తెలిపేలా బీజేపీ నేతలు కృషి చేయాలన్నారు. లేనిపక్షంలో కాంగ్రెస్ తో పాటు బీజేపీ నేతలు ప్రజల ముందు దోషులుగా నిలబడాల్సి వస్తుందని హెచ్చరించారు. 

బీసీ రిజర్వేషన్ల బిల్లుకు ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత కేంద్ర మంత్రి బండి సంజయ్ తీసుకోవాలన్నారు. షెడ్యూల్ 9లో బీసీ రిజర్వేషన్లను చేర్పించి రాజ్యాంగ పరమైన భద్రత కల్పించాలన్నారు. అప్పుడే ఎస్సీ, ఎస్టీల మాదిరిగా బీసీలకు రిజర్వేషన్లు అమలవుతాయన్నారు. బీసీ రిజర్వేషన్ల ఆర్డినెన్స్ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏమి చేస్తుందా అని వారం రోజుల పాటు ఒక కంట కనిపెడుతామన్నారు. గవర్నర్ ఆర్డినెన్స్ కు ఆమోదం తెలుపుతారని ఆశిస్తున్నానని.. లేనిపక్షంలో మళ్లీ ఉద్యమాలు కొనసాగిస్తామన్నారు. అనేక రాష్ట్రాల్లో గవర్నర్ వ్యవస్థ న్యూట్రల్ గా వ్యవహరించడం లేని విషయం అందరికీ తెలిసిందేనన్నారు. బీసీ రిజర్వేషన్లపై ఆర్డినెన్స్ జారీ చేస్తే దానిని ఎవరైనా వ్యతిరేకిస్తే వారి ఇండ్ల ముందు చావు డప్పు కొడుతామని యూపీఎఫ్ కన్వీనర్ బొల్లా శివశంకర్ హెచ్చరించారు. సమావేశంలో తెలంగాణ జాగృతి ప్రధాన కార్యదర్శి నవీన్ ఆచారి, నాయకులు రూప్ సింగ్, వరలక్ష్మీ, లలితా యాదవ్, సంపత్ గౌడ్, కొట్టాల యాదగిరి, నరేందర్ యాదవ్, నరేశ్ తదితరులు పాల్గొన్నారు.IMG-20250711-WA0011

*జాగృతి నాయకులను అడ్డుకునే ప్రయత్నం చేసిన పోలీసులు*

మింట్ కాంపౌండ్ లోని మహాత్మా జ్యోతిరావు ఫూలే, సావిత్రిబాయి ఫూలే, ట్యాంక్ బండ్ పై గల డాక్టర్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాల వేసేందుకు వెళ్తోన్న తెలంగాణ జాగృతి నాయకులను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ర్యాలీ అనుమతి లేదని.. ట్యాంక్ బండ్ పైకి వెళ్లొద్దని ఆంక్షలు విధించారు. దీంతో పోలీసులతో జాగృతి నాయకులు వాగద్వానికి దిగారు. రిజర్వేషన్ల పెంపు బీసీల దశాబ్దాల ఆకాంక్ష అని.. రాష్ట్ర కేబినెట్ గతంలో చేసిన చట్టాన్ని సవరిస్తూ తీర్మానం చేసిన నేపథ్యంలో మహనీయులకు నివాళులర్పించే అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం ఎమ్మెల్సీ కవిత నివాసం నుంచి ట్యాంక్ బండ్ కు ర్యాలీగా బయల్దేరి వెళ్లారు.

Tags

More News...

Local News 

గాజుల పోచమ్మ ఆలయంలో ఘనంగా గోరింటాకు ఉత్సవాలు

గాజుల పోచమ్మ ఆలయంలో ఘనంగా గోరింటాకు ఉత్సవాలు    జగిత్యాల  జూలై 11 ( ప్రజా మంటలు) ఆషాడమాసం శుక్రవారం సందర్భంగా పట్టణం లోని పురాణిపేట  శ్రీ లోకమాత (గాజుల) పోచమ్మ తల్లి ఆలయంలో మహిళలు గోరింటాకు సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. ఈ  కార్యక్రమంలో మహిళలు పాల్గొని గోరింటాకు సంబరాలు  జరుపుకొని అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపి అమ్మవారి  ఆశీస్సులు కరుణాకటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని  కోరుకున్నారు....
Read More...
Local News 

ఓల్డ్ మల్కాజ్‌గిరిలో, సర్దార్ పటేల్ నగర్ లలో సీసీ రోడ్డు ప్యాచ్ పనులు ప్రారంభం: కార్పొరేటర్ శ్రవణ్

ఓల్డ్ మల్కాజ్‌గిరిలో, సర్దార్ పటేల్ నగర్ లలో సీసీ రోడ్డు ప్యాచ్ పనులు ప్రారంభం: కార్పొరేటర్ శ్రవణ్    మల్కాజ్‌గిరి, జూలై 11 (ప్రజా మంటలు) మల్కాజ్‌గిరి సమగ్ర అభివృద్ధి ప్రణాళికలో భాగంగా శుక్రవారం ఓల్డ్ మల్కాజ్‌గిరిలో మరియు సర్దార్ పటేల్ నగర్ లలో సీసీ రోడ్ల ప్యాచ్ పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా మల్కాజ్‌గిరి కార్పొరేటర్ శ్రావణ్ మాట్లాడుతూ, ఈ ప్రాంతంలో సీసీ రోడ్లు, నాలా (డ్రైనేజీ) పనులు, అలాగే పెద్ద ఎత్తున ప్యాచ్...
Read More...
Local News 

జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో జనాభా దినోత్సవ వారోత్సవాలు ప్రారంభం

జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో జనాభా దినోత్సవ వారోత్సవాలు ప్రారంభం   జగిత్యాల జమంటలు11 (ప్రజా మంటలు)జిల్లా వైద్య, మరియు ఆరోగ్యశాఖ వారి ఆధ్వర్యంలో ప్రపంచ జనాభా దినోత్సవం వారోత్సవాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి ఐఎంఏ భవన్ వరకుఈ యాత్ర కొనసాగింది  . ఈ నాటి  కార్యక్రమంలో డిఎంహెచ్ఓ ప్రమోద్ కుమార్, డిప్యూటీ డి ఎం హెచ్ ఓ.ఎన్ శ్రీనివాస్, ప్రోగ్రాం ఆఫీసర్...
Read More...
Local News 

జిల్లా ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గాన్ని అభినందించిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

జిల్లా ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గాన్ని అభినందించిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్    జగిత్యాల జులై 11 ( ప్రజా మంటలు) మోతే రోడ్డు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నూతనంగా ఎన్నికైన జగిత్యాల జిల్లా ప్రెస్ క్లబ్  కార్యవర్గ సభ్యులు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ని మర్యాదపూర్వకంగా కలిసి పుష్ప గుచ్చన్ని అందజేశారు.ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులను అభినందించి శుభాకాంక్షలు తెలిపిన జగిత్యాల శాసనసభ్యులు...
Read More...
Local News 

నెంబర్ ప్లేట్స్ లేని వాహనాలపై ప్రత్యేక డ్రైవ్: 316 వాహనాలు సీజ్: జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్ 

నెంబర్ ప్లేట్స్ లేని వాహనాలపై ప్రత్యేక డ్రైవ్: 316 వాహనాలు సీజ్: జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్  జగిత్యాల జులై 11 ( ప్రజా మంటలు) జిల్లా ఎస్పీ అశోక్ కుమార్  ఆదేశాల మేరకు  జిల్లా వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ నంబర్ లేని, నంబర్ ప్లేట్ దాచి,కొన్ని నంబర్లు తొలగించిన వాహనాలను గుర్తించేందుకు పోలీస్ అధికారులు, సిబ్బంది వివిధ టీంలు గా ఏర్పడి ఏక  కాలంలో ముమ్మర తనిఖీ లు చేసారు. వాహనాల తనిఖీ చేయగా...
Read More...
Local News 

అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు లారీలు సీజ్ 

అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు లారీలు సీజ్  గొల్లపల్లి జూలై 11 (ప్రజా మంటలు): గొల్లపల్లి మండలం లోని చిల్వర్ కోడూర్ గ్రామ శివారులో బసంత్ నగర్ నుండి నిజామాబాద్ కు ప్రభుత్వం నుండి ఎలాంటి అనుమతి లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తున్న రెండు టిప్పర్ సీజ్ చేసి కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ ఎం.కృష్ణ సాగర్ రెడ్డి తెలిపారు
Read More...
Local News 

ప్రభుత్వ విద్యను బలోపేతం చేద్దాము.. తపస్

ప్రభుత్వ విద్యను బలోపేతం చేద్దాము.. తపస్ జగిత్యాల జులై 11(ప్రజా మంటలు) ప్రభుత్వ విద్యను బలోపేతం చేద్దామని ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణే  ధ్యేయంగా పనిచేద్దామని తపస్ జిల్లా అధ్యక్షుడు బోనగిరి దేవయ్య రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు ఐల్నేని నరేందర్ రావు పిలుపునిచ్చారు.. శుక్రవారం అర్బన్ మండలంలోని వివిధ పాఠశాలల్లో ఆ సంఘ సభ్యత్వాన్ని నిర్వహించి మాట్లాడారు.. ప్రస్తుత ప్రభుత్వ పాఠశాలలు సుశిక్షితమైన ఉపాధ్యాయులతో...
Read More...
Local News  State News 

స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలుపై ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం.- తెలంగాణ జన సమితి

స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలుపై ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం.- తెలంగాణ జన సమితి హైదరాబాద్ జూలై 11: స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలుపై ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని కె.ధర్మార్జున్,పల్లె వినయ్ కుమార్, తెలంగాణ జన సమితి పార్టి  ప్రధాన కార్యదర్శులు అన్నారు. ఎన్నో పోరాటాల ఫలితంగా సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో అదేస్పూర్తితోటి సామాజిక తెలంగాణ దిశగా అడుగులు వేయుట కొరకు రాష్ట్రంలోని వివిధ సామాజిక శక్తులు...
Read More...
Local News  State News 

హైకోర్టులో కేవియట్ వేసి బీసీ రిజర్వేషన్ల ఆర్డినెన్స్ ఇవ్వాలి - ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

హైకోర్టులో కేవియట్ వేసి బీసీ రిజర్వేషన్ల ఆర్డినెన్స్ ఇవ్వాలి - ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రిజర్వేషన్ల పెంపు బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలిపి ఆర్డినెన్స్ ఇవ్వాలి - ఆర్డినెన్స్ పాస్ చేసేలా బీజేపీ రాష్ట్ర నేతలు చొరవ తీసుకోవాలి - తాత్కాలికంగా రైల్ రోకో వాయిదా- ఆర్డినెన్స్ జారీలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే ఉద్యమం ఉధృతం చేస్తాం - తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హైదరాబాద్ జూలై...
Read More...
Local News 

మల్లన్నపేట పాఠశాలలో ఆషాఢ మాస గోరింటాకు పండగ

మల్లన్నపేట పాఠశాలలో ఆషాఢ మాస గోరింటాకు పండగ గొల్లపల్లి జూలై 11 (ప్రజా మంటలు)  గొల్లపల్లి మండలం లోని మల్లన్నపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థినిలు ఉపాధ్యాయురాళ్లు ఆషాఢమాస గోరింటాకు పండగను ఘనంగా జరుపుకున్నారు.ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు అమర్ నాథ్ రెడ్డి విద్యార్థులతో మాట్లాడుతూ, ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవడం మన సాంప్రదాయం అలాగే దీని వెనుక ఆరోగ్యపరమైన కారణాలు...
Read More...
Local News 

నిరంతర ప్రజాసేవకుడు బండి సంజయ్ కుమార్ పుట్టినరోజు ఘనంగా నిర్వహణ

నిరంతర ప్రజాసేవకుడు బండి సంజయ్ కుమార్ పుట్టినరోజు ఘనంగా నిర్వహణ నిరంతర ప్రజాసేవకుడు బండి సంజయ్ కుమార్ పుట్టినరోజు ఘనంగా నిర్వహణ భీమదేవరపల్లి మండలంలో కేక్ కట్, పండ్ల పంపిణీ, సామాజిక సేవ కార్యక్రమాలు ప్రజామంటలు, ముల్కనూర్:కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి, భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ బండి సంజయ్ కుమార్ జన్మదినాన్ని భీమదేవరపల్లి మండలంలో ఘనంగా నిర్వహించారు. ఈ...
Read More...
Local News 

గౌరెల్లి ప్రాజెక్టు కెనాల్ భూ నిర్వాసితులతో సదస్సు*  

గౌరెల్లి ప్రాజెక్టు కెనాల్ భూ నిర్వాసితులతో సదస్సు*   *గౌరెల్లి ప్రాజెక్టు కెనాల్ భూ నిర్వాసితులతో సదస్సు*   ప్రజా మంటలు వేలేరు.  గౌరెల్లి ప్రాజెక్టు కెనాల్లో భాగంగా రైతులతో తుది సదస్సు ఆర్డీవో రమేష్ రాథోడ్ మాట్లాడుతూ రైతులకు ఏవైనా సమస్యలు ఉన్నట్టయితే  అర్జీ రూపేనా మాకు సమర్పించండి. వాటిని ఒక కొలిక్కి తీసుకువచ్చి భూ నిర్వాసితులకు క్రమబద్ధీకరించగలము. రైతులు వారి వారి పాసుబుక్ 
Read More...