విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు కన్నుమూత.

On
విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు కన్నుమూత.

హైదరాబాద్ జూలై 13:

విలక్షణ నటుడు, 750 చిత్రాలలో నటించిన కోట శ్రీనివాస్ రావు (1942 జులై 10 - 2025 జులై 13) కన్నుమూశారు.. 

కృష్ణా జిల్లా కంకిపాడులో 1942, జులై 10న జన్మించిన కోట శ్రీనివాసరావు.. 1978లో ప్రాణం ఖరీదు సినిమాతో సినీరంగ ప్రవేశం చేసిన కోట శ్రీనివాసరావు.. ఆహా నా పెళ్లంట సినిమాతో తిరుగులేని నటుడిగా కొనసాగిన కోట.. ప్రతిఘటన చిత్రంలో విలన్గా మంచి గుర్తింపు పొందిన కోట శ్రీనివాసరావు..

సినిమాల్లోకి రాకముందు స్టేట్ బ్యాంకులో పని చేసిన కోట శ్రీనివాసరావు.. 1999లో విజయవాడ ఈస్ట్ ఎమ్మెల్యేగా ఎన్నికైన కోట.. 2015లో కోట శ్రీనివాసరావుకు పద్మశ్రీ పురస్కారం.. 9 నంది అవార్డులు అందుకున్న కోట.. నాలుగు దశాబ్దాల సినీ ప్రయాణంలో ఎన్నో విలక్షణ పాత్రలు పోషించిన కోట శ్రీనివాసరావు.


 పద్మశ్రీ అవార్డు గ్రహీత శ్రీ కోట శ్రీనివాసరావు జులై 10, 1942న తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు.ఇతని తండ్రి, కృష్ణా జిల్లా కంకిపాడుకు చెందిన కోట సీతారామాంజనేయులు వైద్యుడు.

కోట శ్రీనివాసరావు గారు 83 ఏళ్ల వయస్సులో 2025 జులై 13న హైదరాబాదులో తుదిశ్వాస విడిచాడు.

కోటగారి గురించి కొన్ని జీవిత విశేషాలు: 
అతను తమిళం, హిందీ, కన్నడ, మలయాళంలో కూడా కొన్ని చిత్రాలలో నటించాడు. మాజీ రాజకీయవేత్తగా, శ్రీనివాసరావు 1999 నుండి 2004 వరకు భారతదేశంలోని ఆంధ్ర ప్రదేశ్‌లోని విజయవాడ తూర్పు నుండి ఎమ్మెల్యేగా పనిచేశారు. అతను 1978లో ప్రాణం ఖరీదు అనే తెలుగు సినిమాతో తన అరంగేట్రం చేసాడు.అతను 750కి పైగా చలన చిత్రాలలో నటించాడు. ప్రతినాయకుడు, క్యారెక్టర్ యాక్టర్, సహాయ నటుడు వంటి వివిధ విభాగాల్లో తొమ్మిది రాష్ట్ర నంది అవార్డులు అందుకున్నాడు. 2012లో కృష్ణం వందే జగద్గురుమ్ చిత్రానికి గానూ SIIMA అవార్డును అందుకున్నారు.

2015లో, అతను భారతీయ సినిమాకి చేసిన కృషికి భారతదేశపు నాల్గవ అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీని అందుకున్నాడు.

అతను S/O సత్యమూర్తి (2015), అత్తారింటికి దారేది (2013), రక్త చరిత్ర (2010), లీడర్ (2010), రెడీ (2008), పెళ్లైన కొత్తలో (2006), సర్కార్ (2006) వంటి చిత్రాలలో తన విభిన్న పాత్రలకు విస్తృత విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు., బొమ్మరిల్లు (2006), ఛత్రపతి (2005), అతడు (2005), ఆ నలుగురు (2004), మల్లీశ్వరి (2004), ఇడియట్ (2002), పృధ్వి నారాయణ (2002), చిన్నా (2000), గణేష్ (1998), అనగనగా ఒక రోజు (1997), లిటిల్ సోల్జర్స్ (1996), ఆమె (1994), హలో బ్రదర్ (1994), తీర్పు (1994), గోవింద గోవింద (1993), గాయం (1993), డబ్బు (1993), శత్రువు (1990), శివ (1989), అహ నా పెళ్లంట (1987), ప్రతిఘటన (1986),, రేపాటి పౌరులు (1986). 2003లో, అతను సామితో తమిళ పరిశ్రమలో ఒక విలన్‌గా అరంగేట్రం చేశాడు.

జీవిత విషయాలు:
అతను కృష్ణా జిల్లా కంకిపాడుకు చెందిన కోట శ్రీనివాసరావు తండ్రి కోట సీతారామాంజనేయులు కంకిపాడులో వైద్యుడు. కోట 1942, జులై 10న తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. బాల్యము నుండి కోటకు నాటకాలంటే చాలా ఆసక్తి ఉండేది. సినిమాలలో రాకముందు ఇతను స్టేట్ బ్యాంకులో పనిచేసేవాడు. 1966లో ఈయనకు రుక్మిణితో వివాహమయ్యింది. వీరికి ఇద్దరు కూతుర్లు, ఒక కుమారుడు. సినిమా నటుడైన అతని కుమారుడు కోట ప్రసాద్ (1969-2010) 2010 జూన్ 21 లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించాడు. ప్రసాద్ జె.డి.చక్రవర్తి దర్శకత్వంలోని సినిమా సిద్ధంలో నటించాడు. 2010లో గాయం - 2 లో తన తండ్రితో పాటు నటించాడు.

కోట శ్రీనివాసరావు విజయవాడ తూర్పు శాసనసభా నియోజకవర్గం నుండి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎన్నికయ్యాడు. 2015 లో ఇతనికి భారత ప్రభుత్వము పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించింది. ఐదు నంది పురస్కారాలు అందుకున్నాడు.

కోటశ్రీనివాసరావు సోదరుడు కోటశంకరరావు కూడా సినిమా నటుడు. అతను జాతీయ బ్యాంకులో పనిచేసేవాడు. సోప్ ఒపేరాస్ లో కూడా నటించాడు.

అవార్డ్స్ :
పద్మశ్రీ పురస్కారం - 2015: 37 సంవత్సరాలుగా తెలుగు చిత్ర పరిశ్రమలో విజయవంతమైన నటుడిగా కొనసాగుతున్న ఈయన్ని పద్మ అవార్డులలో భాగంగా పద్మశ్రీతో భారత ప్రభుతం సత్కరించింది.
నంది ఉత్తమ విలన్- గణేష్ (1998),
నంది ఉత్తమ విలన్ - చిన్న (2000),
నంది ఉత్తమ సహాయ నటుడు- పృథ్వీ నారాయణ (2002),
నంది ఉత్తమ సహాయ నటుడు - ఆ నలుగురు (2004)అయో
నంది ఉత్తమ సహాయ నటుడు - పెళ్లైన కొత్తలో (2006).images (12)

సినీరంగ ప్రవేశం: 
బాల్యం నుండి నాటకరంగములో ఆసక్తి ఉన్న కోట సినిమాలలో రంగప్రవేశము చేసేనాటికి రంగస్థలముపై 20 యేళ్ళ అనుభవం గడించాడు. 1978-79లో ప్రాణం ఖరీదు నాటకం వేస్తుండగా ఆ ప్రదర్శన చూసిన సినిమా దర్శక నిర్మాత క్రాంతికుమార్ ఆ నాటకాన్ని సినిమాగా తీయాలనుకున్నాడు. మర్యాద పూర్వకముగా ఆ నాటకములో నటించిన నటీనటులందరినీ సినిమాలో కూడా తీసుకున్నారు. అలా కోట శ్రీనివాసరావు సినీరంగ ప్రవేశం జరిగింది. అంతవరకు ఎప్పుడూ సినీ నటుడవ్వాలని ప్రయత్నించని కోట 1986 వరకు సినిమాలను సీరియస్ తీసుకోలేదు.

అహ నా పెళ్ళంట సినిమాలో కథానాయిక తండ్రిగా చేసిన పిసినిగొట్టు పాత్ర చాలా పేరు తెచ్చింది. కోట శ్రీనివాసరావు ప్రతినాయక పాత్ర పోషించారు. యోగి సినిమాలో ప్రతినాయక పాత్ర పోషించారు. తరువాత వెంకటేష్ హీరోగా నటించిన ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు సినిమాలో వెంకటేష్ తండ్రిగా నటించారు. జూనియర్ ఎన్టీఆర్ నటించిన రాఖి సినిమాలో ఎన్టీఆర్కు తాతగా నటించారు మరొక సినిమా బృందావనంలో కూడా ఎన్టీఆర్కు తాతగా నటించారు. కోట శ్రీనివాసరావు గబ్బర్ సింగ్ లో శ్రుతిహాసన్ కు తండ్రిగా నటించారు. కోట శ్రీనివాసరావు బాబు మోహన్ తో కలిసి చాలా సినిమాలలో జోడిగా నటించారు. కోట శ్రీనివాసరావు రాజేంద్రప్రసాద్ కీలకపాత్రలో నటించిన ఆ నలుగురు సినిమాలో కోట శ్రీనివాసరావు కీలకపాత్రలో నటించారు. కోటా శ్రీనివాసరావు ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న హరిహర వీరమల్లులో ప్రతి నాయకుడిగా నటిస్తున్నాడు.

కోట శ్రీనివాసరావుగారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుణ్ణి కోరుతూ వారి కుటుంబానికి పలువురు ప్రముఖులు ప్రగాఢ సానుభూతి తెలియజేసారు.

 

Tags

More News...

National  Filmi News  State News 

విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు కన్నుమూత.

విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు కన్నుమూత. హైదరాబాద్ జూలై 13: విలక్షణ నటుడు, 750 చిత్రాలలో నటించిన కోట శ్రీనివాస్ రావు (1942 జులై 10 - 2025 జులై 13) కన్నుమూశారు..  కృష్ణా జిల్లా కంకిపాడులో 1942, జులై 10న జన్మించిన కోట శ్రీనివాసరావు.. 1978లో ప్రాణం ఖరీదు సినిమాతో సినీరంగ ప్రవేశం చేసిన కోట శ్రీనివాసరావు.. ఆహా నా పెళ్లంట...
Read More...
Local News 

మాజీ మంత్రి రాజేశం గౌడ్  మనమరాలి జన్మదిన సందర్భంగా వాల్మీకి ఆవాసంలో  విద్యార్థులకు విందు భోజనం ఏర్పాటు

మాజీ మంత్రి రాజేశం గౌడ్  మనమరాలి జన్మదిన సందర్భంగా వాల్మీకి ఆవాసంలో  విద్యార్థులకు విందు భోజనం ఏర్పాటు జగిత్యాల జులై 12(ప్రజా  పట్టణంలో శ్రీ వాల్మీకి ఆవాసం సేవ భారతి లో మాజీ మంత్రివర్యులు రాజేశం గౌడ్  మనుమరాలు సమీరా 8వ పుట్టినరోజు వేడుకల సందర్భంగా ఆవాసం విద్యార్థులకు ఒక రోజు భోజనం వసతి కల్పించగా ముఖ్య అతిథిగా హాజరై   ఆవాసం విద్యార్థులకు భోజనం వడ్డించిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ ఈ...
Read More...
Local News 

బోనాల పండుగ నిర్వహణకు చెక్కుల పంపిణీ

బోనాల పండుగ నిర్వహణకు చెక్కుల పంపిణీ సికింద్రాబాద్ జూలై 12 (ప్రజామంటలు): బోనాల పండుగను పురస్కరించుకుని తెలంగాణ ప్రభుత్వం అందించే ఆర్థిక సహాయం కింద సికింద్రాబాద్  నియోజకవర్గం  పరిధిలోని 212  దేవాలయాలకు రూ కోటి 12  లక్షల రూపాయలను ప్రభుత్వం చెక్కుల రూపంలో అందజేసింది ఈ మేరకు శనివారం  సీతాఫల్మండి లోని మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్ లో ప్రభుత్వ సలహాదారుడు వేం...
Read More...
Local News 

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై ఆర్డినెన్స్ నిర్ణయంపై ప్రభుత్వంకు కృతజ్ఞతలు.  

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై ఆర్డినెన్స్ నిర్ణయంపై ప్రభుత్వంకు కృతజ్ఞతలు.     -టీబీసీ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్.    జగిత్యాల జులై 12: విద్యా,ఉద్యోగ,స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై ఆర్డినెన్స్ జారీకి రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించడం పట్ల  టీ బీసీ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు.ఆదివారం జిల్లా కేంద్రంలో టీ బీసీ జేఏసీ జిల్లా శాఖ...
Read More...
Local News 

హత్య కేసులో నిందితుల అరెస్ట్ - రిమాండ్ కి తరలింపు - సీఐ,రామ్ నరసింహ రెడ్డి 

హత్య కేసులో నిందితుల అరెస్ట్ - రిమాండ్ కి తరలింపు - సీఐ,రామ్ నరసింహ రెడ్డి  గొల్లపల్లి (ధర్మపురి) జూలై 12 (ప్రజా మంటలు): ధర్మపురి మండలం ధోనూర్ చెందిన గొల్లెన రవి, గొల్లెన నాగరాజుల కుటుంబాలు గత కొన్ని సంవత్సరాలు నుండి పక్క పక్కన నివసిస్తున్నాయి. రెండు కుటుంబాల మధ్య ఇంటి స్థలం గెట్టు  విషయంలో గొడవలు జరుగుతున్నప్పటికీ ఈమధ్య మృతుడు గోల్లెన రవి, కొత్త ఇంటి  ఇంటి నిర్మాణం  చేపట్టి...
Read More...
Local News 

మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి - వేలేరు ఎస్ఐ సురేష్

మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి - వేలేరు ఎస్ఐ సురేష్ మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి - వేలేరు ఎస్ఐ సురేష్ ఒంటరిగా ఉన్న మహిళ ఇంటిపై దాడి – బంగారం, నగదు అపహరణ వేలేరు, జూలై 11 (ప్రజా మంటలు)నెక్కొండ మండలంలోని పనికర గ్రామం అవతల ఒంటరిగా ఉన్న మహిళ ఇంటిలో శుక్రవారం ఉదయం 11:30 గంటల సమయంలో గుర్తుతెలియని ఇద్దరు దుండగులు దొంగతనానికి...
Read More...

గౌరెల్లి ప్రాజెక్టు కెనాల్ భూ నిర్వాసితులతో సదస్సు

గౌరెల్లి ప్రాజెక్టు కెనాల్ భూ నిర్వాసితులతో సదస్సు    గౌరెల్లి ప్రాజెక్టు కెనాల్ భూ నిర్వాసితులతో సదస్సు వేలేరు, ప్రజామంటలు:గౌరెల్లి ప్రాజెక్టు కెనాల్లో భాగంగా భూ నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి సంబంధించి తుది సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో ప్రధాన అతిథిగా పాల్గొన్న ఆర్డీవో రమేష్ రాథోడ్ మాట్లాడుతూ, భూ నిర్వాసితులకు ఎదురవుతున్న ఏవైనా సమస్యలు ఉంటే, అవి అర్జీ రూపంలో సమర్పించాలని తెలిపారు....
Read More...
Local News 

గాజుల పోచమ్మ ఆలయంలో ఘనంగా గోరింటాకు ఉత్సవాలు

గాజుల పోచమ్మ ఆలయంలో ఘనంగా గోరింటాకు ఉత్సవాలు    జగిత్యాల  జూలై 11 ( ప్రజా మంటలు) ఆషాడమాసం శుక్రవారం సందర్భంగా పట్టణం లోని పురాణిపేట  శ్రీ లోకమాత (గాజుల) పోచమ్మ తల్లి ఆలయంలో మహిళలు గోరింటాకు సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. ఈ  కార్యక్రమంలో మహిళలు పాల్గొని గోరింటాకు సంబరాలు  జరుపుకొని అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపి అమ్మవారి  ఆశీస్సులు కరుణాకటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని  కోరుకున్నారు....
Read More...
Local News 

ఓల్డ్ మల్కాజ్‌గిరిలో, సర్దార్ పటేల్ నగర్ లలో సీసీ రోడ్డు ప్యాచ్ పనులు ప్రారంభం: కార్పొరేటర్ శ్రవణ్

ఓల్డ్ మల్కాజ్‌గిరిలో, సర్దార్ పటేల్ నగర్ లలో సీసీ రోడ్డు ప్యాచ్ పనులు ప్రారంభం: కార్పొరేటర్ శ్రవణ్    మల్కాజ్‌గిరి, జూలై 11 (ప్రజా మంటలు) మల్కాజ్‌గిరి సమగ్ర అభివృద్ధి ప్రణాళికలో భాగంగా శుక్రవారం ఓల్డ్ మల్కాజ్‌గిరిలో మరియు సర్దార్ పటేల్ నగర్ లలో సీసీ రోడ్ల ప్యాచ్ పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా మల్కాజ్‌గిరి కార్పొరేటర్ శ్రావణ్ మాట్లాడుతూ, ఈ ప్రాంతంలో సీసీ రోడ్లు, నాలా (డ్రైనేజీ) పనులు, అలాగే పెద్ద ఎత్తున ప్యాచ్...
Read More...
Local News 

జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో జనాభా దినోత్సవ వారోత్సవాలు ప్రారంభం

జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో జనాభా దినోత్సవ వారోత్సవాలు ప్రారంభం   జగిత్యాల జమంటలు11 (ప్రజా మంటలు)జిల్లా వైద్య, మరియు ఆరోగ్యశాఖ వారి ఆధ్వర్యంలో ప్రపంచ జనాభా దినోత్సవం వారోత్సవాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి ఐఎంఏ భవన్ వరకుఈ యాత్ర కొనసాగింది  . ఈ నాటి  కార్యక్రమంలో డిఎంహెచ్ఓ ప్రమోద్ కుమార్, డిప్యూటీ డి ఎం హెచ్ ఓ.ఎన్ శ్రీనివాస్, ప్రోగ్రాం ఆఫీసర్...
Read More...
Local News 

జిల్లా ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గాన్ని అభినందించిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

జిల్లా ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గాన్ని అభినందించిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్    జగిత్యాల జులై 11 ( ప్రజా మంటలు) మోతే రోడ్డు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నూతనంగా ఎన్నికైన జగిత్యాల జిల్లా ప్రెస్ క్లబ్  కార్యవర్గ సభ్యులు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ని మర్యాదపూర్వకంగా కలిసి పుష్ప గుచ్చన్ని అందజేశారు.ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులను అభినందించి శుభాకాంక్షలు తెలిపిన జగిత్యాల శాసనసభ్యులు...
Read More...
Local News 

నెంబర్ ప్లేట్స్ లేని వాహనాలపై ప్రత్యేక డ్రైవ్: 316 వాహనాలు సీజ్: జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్ 

నెంబర్ ప్లేట్స్ లేని వాహనాలపై ప్రత్యేక డ్రైవ్: 316 వాహనాలు సీజ్: జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్  జగిత్యాల జులై 11 ( ప్రజా మంటలు) జిల్లా ఎస్పీ అశోక్ కుమార్  ఆదేశాల మేరకు  జిల్లా వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ నంబర్ లేని, నంబర్ ప్లేట్ దాచి,కొన్ని నంబర్లు తొలగించిన వాహనాలను గుర్తించేందుకు పోలీస్ అధికారులు, సిబ్బంది వివిధ టీంలు గా ఏర్పడి ఏక  కాలంలో ముమ్మర తనిఖీ లు చేసారు. వాహనాల తనిఖీ చేయగా...
Read More...